loader

బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం!

తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్‌ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్‌-టెక్‌ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేకమైన AI ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఉద్యోగి పనితీరును కనీసం 12 మంది సహోద్యోగుల అంచనా, వారి రేటింగ్‌లతో పాటు రాతపూర్వక ఫీడ్‌బ్యాక్‌ను కూడా AI వ్యవస్థకు అందిస్తారు. అనంతరం ఉద్యోగి పనితీరుపై ఒక […]

UPIకి 10 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం..

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో దశాబ్దం క్రితం ప్రారంభమైన UPI, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని గణనీయంగా మార్చింది. ముఖ్యంగా QR కోడ్ ఆధారిత చెల్లింపుల విస్తరణతో చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు సాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో UPI సాధించిన స్థాయి, దేశవ్యాప్తంగా దాని విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన పురోగతికి UPI ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

భారత అంతరిక్షంలో సరికొత్త విప్లవం..ప్రైవేట్ దండయాత్ర!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తొలిసారిగా అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద నిర్మిస్తున్న నూతన స్పేస్ పోర్ట్‌ను భారత ప్రభుత్వ సంస్థ అయిన IN-SPACeకు అప్పగించింది. దేశ వాణిజ్య సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో, ఈ లాంచ్ ప్యాడ్ కేంద్రాన్ని టెండర్ల ద్వారా ప్రైవేటీకరించి ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. కులశేఖరపట్నంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 950 కోట్ల వ్యయంతో ఇస్రో చేపట్టిన రెండవ రాకెట్ […]

ఏఐతో భారీగా ఉద్యోగాల సృష్టి : జుకర్‌బర్గ్‌

మెటా 8,000 మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాల తర్వాత, ఏఐ పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ఏఐ భారీ నిరుద్యోగానికి కారణం కాకుండా, పుష్కలంగా ఉద్యోగాలను సృష్టిస్తుందని జుకర్బర్గ్ విశ్వాసం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఏఐతో చిన్న బృందాలే పెద్ద వ్యాపారాలను నడుపుతాయన్నారు. విస్తృత పునర్నిర్మాణంలో భాగంగా మెటా ఇటీవల ఉద్యోగులను తొలగించిన కొన్ని వారాలకే ఈ వ్యాఖ్యలను బ్లాగ్ పోస్ట్ చేయడం గమనార్హం.

ఇన్స్టాలో లైంగిక వేధింపుల కంటెంట్..మెటాకు NHRC నోటీసులు

మెటా కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇన్స్టా ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ని వ్యాప్తి చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మెటా సహా దేశంలోని 8 రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)లకు నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్ లో పోక్సో ఉల్లంఘనల కిందకు వచ్చే అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అటువంటి ప్రకటనలను గుర్తించి, తొలగించడానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాల్‌ క్వాలిటీ బాగోలేదా.. రేటింగ్‌ ఇవ్వొచ్చు

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ‘మై కాల్’ యాప్ను అప్డేడేట్ చేసింది. ఇప్పుడు కాల్ మాట్లాడటం పూర్తవగానే కాలింగ్ ఎక్స్పీరియన్స్పై ఇన్స్టంట్ రేటింగ్ ఇవ్వొచ్చు. మధ్యలోనే కాల్ కట్ అవ్వటం వంటి ఇతర సమస్యలపై కూడా యాప్లో నేరుగా ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు. ఇది టెలికాం కంపెనీలు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు, నెట్ వర్క్ సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు దోహదపడుతుందని ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు.

స్పేస్ నుంచి సురక్షితంగా యూఎస్-రష్యా వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 8 నెలల కాలం పూర్తి చేసుకున్న అమెరికా-రష్యా వ్యోమగాములు ఆదివారంనాడు సురక్షితంగా కజకిస్థాన్ భూభాగానికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు సెర్గీ కుద్-స్వెర్చ్‌కోవ్, సెర్గీ మిఖాయేవ్‌లు సోయుజ్ ఎంఎస్-28 నౌక ద్వారా దిగారు. అంతరిక్షంలో 241 రోజలు పాటు వీరు గడిపారు. ఇది విలియమ్స్, విఖాయేవ్‌లకు తొలి అంతరిక్ష మిషన్ కాగా, కుద్-స్వెర్చ్‌కోవ్‌కు రెండవది.

ఇక దేశమంతా శాటిలైట్ ఇంటర్నెట్.. జియో భారీ ప్లాన్‌కు అనుమతి..

భారత అంతరిక్ష రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ప్రయోగించాలన్న రిలయన్స్ జియో ప్రణాళికకు, భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ అయిన IN-SPACe నుండి సాంకేతిక ఆమోదం లభించినట్లు సమాచారం. జియో శాటిలైట్ నెట్‌వర్క్ భవిష్యత్తులో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ టవర్లకు బ్యాక్‌హాల్ సేవలు, మొబైళ్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ వంటి సేవలను అందించగలదు. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 20 నుండి 22 గ్రౌండ్ స్టేషన్లను నిర్మించాలని […]

భారత్‌లో క్లాడ్‌ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్రకటించిన ఆంథ్రోపిక్‌

ఆంథ్రోపిక్ భారత్లో తన క్లాడ్ ఏఐ సబ్స్క్రిప్షన్ ధరలను ప్రకటించింది. ఇకపై డాలర్లకు బదులుగా రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. భారత్ క్లాడ్ ప్రో, మ్యాక్స్, టీమ్ పేరిట మూడు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. క్లాడ్ ప్రో సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.2000గా నిర్ణయించింది. క్లాడ్ మ్యాక్స్ ధర నెలకు రూ.11,999 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ఠంగా రూ.23,999 వరకు ఉంటుంది. క్లాడ్ టీమ్ ధర నెలకు రూ.2,399 నుంచి మొదలై రూ.11,999 వరకు ఉంటుంది.

మెటాకు బిగ్ షాక్.. ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా ???

పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై అమెరికాలో మెటా మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల రూపకల్పన పిల్లలను ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేలా ఉందని ఆరోపిస్తూ నాలుగు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా కోరాయి. ఈ డిమాండ్ మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండటంతో కేసు ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎండ్‌లెస్ ఫీడ్, నోటిఫికేషన్లు, లైక్‌లు, పిల్లల దృష్టిని నిలిపివేయడానికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON