loader

సుభాష్ చంద్రకు బిగ్ షాక్- దేశవ్యాప్త విమర్శలతో NCLT యూటర్న్..!

ఎస్సెల్ గ్రూప్ తరఫున తీసుకున్న రుణాలు, రుణ హామీలకు సంబంధించి గ్యారంటీర్ గా ఉన్న సుభాష్ చంద్ర చెల్లించాల్సిన 22 వేల కోట్లకు బదులుగా దివాళా ప్రక్రియ కింద రూ.6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని NCLT సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ కేసును విచారిస్తున్న ముగ్గురు సభ్యులు ఇచ్చిన ఉత్తర్వులలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. దివాలా కేసులో ఎన్సీఎల్టీ ఆగస్టు 25న ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వుపై యూటర్న్ తీసుకుంది. […]

ఫోన్‌పే కొత్త ఫీచర్.. నెట్ లేకుండానే పేమెంట్స్..!

డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థ PhonePe కీలకమైన కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే UPI చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించే ‘PhonePe UPI 123Pay’ సేవను ఆగస్టు 31, 2026న ప్రారంభించింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, SMS ఆధారిత టెక్నాలజీ ద్వారా UPI లావాదేవీలు నిర్వహించుకునేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. తక్కువ 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులో ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు బిగ్‌షాక్! సెప్టెంబర్ 1 డెలివరీ ఛార్జీలు పెంపు!

 పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ మరింత ఖరీదైనదిగా మారవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎక్స్‌ప్రెస్ షిప్‌మెంట్‌లపై సర్ఫేస్ షిప్‌మెంట్‌లపై అదనపు రుసుమును వసూలు చేయనుంది. ఎక్స్‌ప్రెస్ షిప్‌మెంట్‌లపై ₹4, సర్ఫేస్ షిప్‌మెంట్‌లపై ₹2 అదనపు ఛార్జీ విధిస్తారు. ముఖ్యంగా 500 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న ప్యాకేజీలకు, డెలివరీ ఖర్చులు సుమారుగా 5% నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ కొత్త ఛార్జీలు ఇప్పటికే ఉన్న డెలివరీ ఫీజులకు అదనంగా విధిస్తారు.

UPIకి 10 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం..

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో దశాబ్దం క్రితం ప్రారంభమైన UPI, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని గణనీయంగా మార్చింది. ముఖ్యంగా QR కోడ్ ఆధారిత చెల్లింపుల విస్తరణతో చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు సాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో UPI సాధించిన స్థాయి, దేశవ్యాప్తంగా దాని విస్తృతి ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ సాధించిన పురోగతికి UPI ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

శంషాబాద్ విమానాశ్రయానికి తగ్గిన విదేశీ ప్రయాణికుల రద్దీ

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి. యుద్ధ ప్రభావం కారణంగా,ఇంధన సర్​ఛార్జితో విమాన టికెట్ల ధరల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గతేడాది జూన్‌ నెలలో 4.42లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించగా, జూన్‌ నెలలో 4.30లక్షల మంది మాత్రమే ప్రయాణించడం గమనార్హం. మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుల్లో వృద్ధిరేటు మైనస్‌లలోకి పడిపోయింది. గతేడాది త్రైమాసికంలో 11.37లక్షల విదేశీ ప్రయాణికులు ప్రయాణిస్తే ఈ ఏడాది 11.20 లక్షలు […]

మందుబాబుల జోరు.. నిమిషానికి 5,200 బాటిళ్ల అమ్మకాలు

తెలంగాణలో మందుబాబులు బాటిళ్లను భారీగా ఖాళీ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రాష్ట్రంలో ప్రతీ నిమిషానికి సగటున సుమారు 3,600 బాటిళ్లు మద్యం.. మరో 1,600 బాటిళ్లు బీర్‌లు అమ్ముడైనట్లు గణాంకాల ఆధారంగా వెల్లడైంది. ఈ 4 నెలల వ్యవధిలో తెలంగాణలో బీర్‌, ఐఎంఎఫ్‌ఎల్‌ కలిపి సుమారు 3.5 కోట్ల కేసుల విక్రయాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.14,668 కోట్లు. ఇందులో బీర్‌లు సుమారు 2.21 కోట్ల కేసులు, ఐఎంఎఫ్‌ఎల్‌ […]

టాటా సన్స్ ఛైర్మన్ రేసులో నరేంద్రన్?

టాటా సన్స్ ఛైర్మన్‌గా తాజాగా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) & CEO టి.వి. నరేంద్రన్ పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ 1988లో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి, దాదాపు 38 ఏళ్లుగా ఈ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి టాటా స్టీల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, ఉక్కు రంగంలో అంతర్జాతీయంగా వచ్చిన అనేక హెచ్చుతగ్గులను తట్టుకొని సంస్థను సమర్థవంతంగా ముందుకు […]

మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!

ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన టెక్ దిగ్గజం.. మలివిడత లేఆఫ్స్ పై దృష్టి సారించింది. సెప్టెంటర్ మొదటి లేదా రెండో వారంలో మరో విడతలో భారీగా టెక్కీలను తొలగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఒరాకిల్.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లేఆఫ్స్ లిస్టును కూడా ప్రిపేపర్ చేయాలంటూ వివిధ విభాగాల మేనేజర్లను యాజమాన్యం ఆదేశించినట్లు సమాచారం. సెప్టెంబర్ 1 కంటే ముందే ఈ లేఆఫ్స్ ప్రక్రియ పూర్తి కావచ్చని ఈ కథనం పేర్కొంది.

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా.. షేర్లు భారీ పతనం!

ఉదయం ఊహించని వార్త షేర్ మార్కెట్‌ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్‌ 2.5 శాతం, టాటా మోటార్స్‌ 3.2 శాతం, టాటా పవర్‌ 2.9శాతం మేర నష్టపోయాయి.

కోకాపేటలో ట్రంప్‌ టవర్స్‌

కోకాపేటలో ‘ట్రంప్ హైదరాబాద్ టవర్స్’ను నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. 65 అంతస్తులతో నిర్మించనున్న ఈ ట్రంప్ టవర్స్లోలో అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పటికే దీని నిర్మాణానికి రెరా అనుమతులిచ్చింది. మూడేళ్లలో టవర్స్ పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు తెలిపాయి. త్వరలో జరగనున్న భూమిపూజలో ట్రంప్ కుటుంబసభ్యులు పాల్గొంటారని చెప్పాయి. ట్రంప్ పేరుతో దేశంలో పుణె, ముంబయి, కోలకతా, గురుగ్రామ్ నాలుగు ప్రాజెక్టుల పూర్తి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON