loader

అదానీ పవర్ ‘పవర్’ఫుల్ రికార్డు.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను వెనక్కి నెట్టి మరీ భారీ జంప్

భారతీయ స్టాక్ మార్కెట్‌లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ సంచలన రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల దిగ్గజమైన ఇన్ఫోసిస్ కంపెనీని వెనక్కి నెట్టి ప్రస్తుత 2026 సంవత్సరంలోనే అదానీ పవర్ షేర్ల విలువ ఏకంగా 68 శాతం మేర లాభపడింది.ఈ భారీ షేర్ల ర్యాలీతో అదానీ పవర్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.85 లక్షల కోట్లకు చేరుకుంది.ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 4.72 లక్షల […]

సివిల్స్ ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదల

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వైబ్‌సైట్ https://upsc.gov.in ద్వారా కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా IAS, IFS, IPS వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల భర్తీ కోసం ఈ నెల రెండు దశల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా యూపీఎస్‌సీ చరిత్రలో పరీక్ష జరిగిన వెంటనే తాత్కాలిక సమాధానాల కీ ని ప్రకటించడం ఇదే తొలిసారి.

సామ్‌సంగ్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక్కొక్కరికీ రూ.3.25 కోట్ల బోనస్..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. గత త్రైమాసికంలో సామ్‌సంగ్ ఆదాయం 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో చిప్ విభాగానికి చెందిన ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.3 కోట్లు) అందించనుంది. సంస్థ చిప్ విభాగం ఉద్యోగులు చేపట్టిన సమ్మె  బోనస్‌కు […]

భారత్‌ను దాటేసిన తైవాన్.. 2 కోట్ల జనాభాతోనే రికార్డులు బ్రేక్!

భారత్‌కు మరో భారీ షాక్ తగిలింది. చాలా చిన్న దేశమైన.. తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ భారత్‌ను అధిగమించి ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ బూమ్ సహా సెమీ కండక్టర్ల డిమాండ్ కారణంగా తైవాన్ కంపెనీల మార్కెట్ వాల్యూ భారీగా పెరుగుతూ వెళ్తోంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్ల నుంచి తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద చిప్ మేకర్ TSMC షేర్లు భారీగా రాణించడంతోనే తైవాన్ స్టాక్ […]

స్పేస్‌ఎక్స్ ఐపీఓతో ఎలాన్ మస్క్ సంచలనం…

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఐపీఓ కోసం అధికారికంగా దరఖాస్తు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎలాన్ మస్క్ నాయకత్వంలో ఉన్న ఈ కంపెనీ, ఐపీఓ ద్వారా దాదాపు 75 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్‌ఎక్స్ కంపెనీ మొత్తం విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని సమాచారం. కంపెనీలో మొత్తం ఓటింగ్ పవర్‌లో 85.1 శాతం నియంత్రణ మస్క్ చేతుల్లోనే ఉంది.

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 789.74 పాయింట్లు లేదా 1.06 శాతం లాభంతో 75,478.15 వద్ద, నిఫ్టీ 277.00 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 23,689.60 వద్ద నిలిచాయి. బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, , మోడీ నాచురల్స్ లిమిటెడ్, అమైన్స్ & ప్లాస్టిసైజర్స్ లిమిటెడ్, PNB గిల్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ […]

తెలంగాణలో జియో 5జీ ఆధిపత్యం… ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా వేగం, వాయిస్ నాణ్యత, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదు కాగా కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ […]

కుప్పకూలుతున్న మార్కెట్‌లు.. ఈ భారీ పతనానికి కారణాలు ఏంటంటే?

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ ఒత్తిడిలో ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారుల వరుస అమ్మకాలు, అలాగే రూపాయి బలహీనత కలిసి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్‌ 1,215 పాయింట్లకు పైగా క్షీణించి 76,280 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 50 366 పాయింట్లు పడిపోయి 23,811 వద్దకు చేరింది. ఈ పతనం ఒకే రంగానికి పరిమితం కాలేదు. ఆటో, బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఎఫ్‌ఎంసిజి వంటి దాదాపు […]

RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 24న కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకు కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా సాగినట్లు, అలాగే లైసెన్స్ నిబంధనలను పాటించలేదని RBI వెల్లడించింది. RBI ఉత్తర్వుల ప్రకారం, 2026 ఏప్రిల్ 24 వ్యాపార సమయం ముగిసిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు అందించడానికి అనుమతి […]

స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్… 500 మందికి షాక్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి దశలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. సంస్థలో ప్రస్తుతం దాదాపు 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  గతంలో సంస్థ వద్ద సుమారు 50 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 13 విమానాలు మాత్రమే ఉన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON