loader

కందుకూరి వీరేశలింగం పంతులు

కందుకూరి వీరేశలింగం (1848 ఏప్రిల్ 16 – 1919 మే 27 ) సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసారంగమ్లో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు […]

స్టాక్‌ మార్కెట్లపై మళ్లీ యుద్ధం దెబ్బ.. భారీగా నష్టపోతున్న సూచీలు

స్టాక్‌ మార్కెట్ల పై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 76,134 పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌.. ఏకంగా 1,415 పాయింట్లు కోల్పోయింది. అదేవిధంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 479 పాయింట్లు కోల్పోయి 23,571 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

2,946 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 2,946 పాయింట్ల లాభంతో 77,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 874 పాయింట్లు లాభపడి 23,997 వద్ద ట్రేడయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించడంతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.15 లక్షల కోట్లు పెరిగింది. 2,946 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌ |

RBI గుడ్ న్యూస్: వడ్డీ రేట్లలో మార్పు లేదు. లోన్ EMI పెరగదు

కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ఆరంభంలోనే బ్యాంకింగ్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఊరటనిచ్చింది. బుధవారం ముగిసిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర బ్యాంక్, పాలసీ రెపో రేటును 5.25% వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా మీ ఈఎంఐ (EMI)లు పెరగవు అనే స్పష్టత వచ్చింది. రెపో రేటు: 5.25% (మార్పు లేదు), స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF): 5%, MSF & బ్యాంక్ రేటు: 5.5%

ట్రంప్ కాల్పుల విరమణ.. దూసుకెళ్లిన మార్కెట్లు

అమెరికా, ఇరాన్ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్ను మొదలు పెట్టాయి. సెన్సెక్స్ 2,700 పాయింట్లకి పైగా, నిఫ్టీ 800 పాయింట్లకి పైగా లాభపడ్డాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 77,315 స్థాయి వద్ద, నిఫ్టీ 23,915 వద్ద కదలాడుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద కొనసాగుతోంది.

ట్రంప్‌ ప్రసంగంతో మార్కెట్లు కుదేల్‌

ఇరాన్‌తో యుద్ధం ఇంకా తీవ్రతరం కానుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు పతనం అయ్యాయి. ట్రంప్‌ ప్రసంగానికి ముందు 100 పాయింట్ల లాభంలో ఉన్న గిఫ్ట్‌ నిఫ్టీ.. 7.53 గంటలకు 496 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్లపై ఈప్రభావం గణనీయంగా పడనుంది. భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే సెన్సెక్స్‌ 1,800కి పైగా, నిఫ్టీ 550కి పైగా పాయింట్ల లాభాల్లోకి వెళ్లాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73,780 స్థాయి వద్ద, నిఫ్టీ 22,890 స్థాయి వద్ద కదలాడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతోంది.

ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా అంతర్జాతీయ విమానయాన రంగ నిపుణుడు విలియం వాల్ష్‌ను నియమించింది. మంగళవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్’ (IATA) డైరెక్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. విలియం వాల్ష్ రాకతో ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వారంతపు తొలి రోజైన సోమవారం (మార్చి 30) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచే ప్రతికూల సంకేతాలతో ప్రారంభమైన ట్రేడింగ్, సమయం గడిచేకొద్దీ మరింత బలహీనపడి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు (2.22%) పతనమై 71,947.55 వద్ద స్థిరపడగా, నేడు మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ (Nifty) 488.20 పాయింట్లు (2.14%) నష్టంతో 22,331.40 వద్ద ముగిసింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో […]

రేమండ్ గ్రూప్‌ చైర్మన్‌ విజయ్‌పత్‌ సింఘానియా మృతి

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త , విమానయాన నిపుణుడు రేమండ్ గ్రూప్‌ను ఒక ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమను దిగ్గజంగా మలిచిన రేమండ్ గ్రూప్‌ చైర్మన్‌ విజయ్‌పత్‌ సింఘానియా(87) మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమారుడు గౌతం సింఘానియా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. కాగా, ఆయన పద్మభూషణ్ (2006), టెన్జింగ్ నోర్గే జాతీయ సాహస పురస్కారం (2003) అందుకున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON