loader

షూ ఫ్యాక్ట‌రీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 28 మంది మృతి!

 చైనాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 28 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. జియాంగ్ లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. షూ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 35 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్ల నగదు విడుదల చేసిన ఆర్బీఐ..

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదును విడుద‌ల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్‌ (Variable Rate Repo) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది. జీఎస్టీ (GST) చెల్లింపుల కారణంగా వ్యవస్థలో ఏర్పడిన నగదు కొరతను అధిగమించేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది. ఇటీవలి జీఎస్టీ చెల్లింపుల వలన బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు  బయటకు వెళ్లింది. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత ఒక్కసారిగా పడిపోయింది.

కుప్పకూలిన స్పేస్‌ఎక్స్ షేర్లు

స్పేస్‌ఎక్స్ షేర్ల ధరల పతనం పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎలోన్ మస్క్ సారథ్యంలోని ఈ అంతరిక్ష సంస్థ స్టాక్ మార్కెట్లో వరుసగా మూడు రోజులు నష్టాలను చవిచూసింది. గత మూడు రోజుల్లో కంపెనీ తన మార్కెట్ విలువలో సుమారు 600 బిలియన్ డాలర్లను కోల్పోయింది. ప్రస్తుతం మార్కెట్ ముగిసే సమయానికి షేరు ధర 154.60 డాలర్ల వద్ద ఉంది.ఇది కంపెనీ లిస్టింగ్ అయినప్పటి నుండి అత్యంత కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు.

భారత్ చరిత్రలోనే అతిపెద్ద IPO?.. జియో IPO తేదీ, ధరలపై భారీ అప్‌డేట్!

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ తన ప్రతిష్టాత్మక ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,700 కోట్లు) సమీకరించడం లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూ  రూపొందిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.ఈ భారీ లిస్టింగ్ విజయవంతమైతే, ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.

యాక్సెంచుర్ షాక్‌.. కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్లు.. 1.35 ల‌క్ష‌ల కోట్లు ఆవిరి

భార‌తీయ ఐటీ దిగ్గజ కంపెనీలు ఇవాళ అనూహ‌మైన షాక్‌కు గుర‌య్యాయి. సుమారు 1.35 ల‌క్ష‌ల కోట్ల విలువైన స్టాక్స్ కుప్ప‌కూలిన‌ట్లు తెలుస్తోంది. గ్లోబ‌ల్ ఐటీ క‌న్స‌ల్టెన్సీ యాక్సెంచుర్ కంపెనీ ఇచ్చిన రెవ‌న్యూ రిపోర్టు.. భార‌తీయ ఐటీ కంపెనీలను తీవ్రంగా షేక్ చేసింది. శుక్ర‌వారం ట్రేడింగ్‌లో ఐటీ కంపెనీల స్టాక్స్ దారుణంగా ప‌డిపోయాయి. ఇన్ఫోసిస్ కంపెనీలో 8.5 శాతం ట్రేడింగ్ త‌గ్గిపోయింది. టెక్ మ‌హేంద్ర షేర్లు 7 శాతం, TCS 6.52, HCL 6 శాతం, విప్రో షేర్లు […]

హైదరాబాద్‌లో కల్తీ పనీర్‌ ముఠాపై పోలీసుల దాడులు

హైదరాబాద్‌లో కల్తీ పనీర్‌ ముఠాపై పోలీసులు దాడులు జరిపారు. 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు చేసి 825 కిలోల అనుమానాస్పద పనీర్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో చీజ్ అనలాగ్‌ను పనీర్‌గా విక్రయిస్తున్న ముఠాల బండారం బట్టబయలు అయింది. లో ఫ్యాట్”, “ఫ్రెష్ పనీర్” పేర్లతో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ..  స్టార్చ్, అధిక నీరు, నాన్-మిల్క్ ఫ్యాట్స్ కలిపి కల్తీ పనీర్ తయారు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్

ప్రపంచప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ టెస్లా, హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో తన అధికారిక కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించింది.హైటెక్ సిటీలో ఈ సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా టెస్లా విస్తరించిన నెట్‌వర్క్‌లో ఇది ఐదో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్ ద్వారా టెస్లా కార్ల అత్యాధునిక ఫీచర్లు, వినూత్న సాంకేతికత మరియు వాటి లగ్జరీ డిజైన్‌ను నేరుగా చూసి అనుభవించే వీలుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కంపెనీ తన లేటెస్ట్ 2026 Model Y సిరీస్‌ను కస్టమర్ల సందర్శనార్థం […]

రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్’ మెగా ఐపీఓ ద్వారా కంపెనీలో పనిచేసే సుమారు 4,400 మంది సాధారణ ఉద్యోగులు ఒకేసారి మల్టీ-మిలియనీర్లు కాబోతున్నారు. గతంలో 2 డాలర్లకే లభించిన ఈ షేర్ల విలువ 135 డాలర్లకి చేరింది. కంపెనీలోని వైట్-కాలర్ ఇంజనీర్లతో పాటు క్యాంటీన్ కార్మికులు, క్లీనింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, సుమారు 400 మంది ఉద్యోగుల ఆస్తి విలువ ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు అంటే […]

భారతీయ ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్

అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ Opendoor భారతదేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్‌లో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. తమ వ్యాపార పరివర్తన వ్యూహంలో భాగంగా, ఆపరేషనల్ విధులను అమెరికాలోని తమ కస్టమర్లకు మరింత దగ్గరగా తరలించడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బృందాల వినియోగాన్ని విస్తరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

సంక్షోభంలో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 350 పాయింట్లు ఢమాల్

కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఢమాల్. గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పడిపోయి ఒత్తిడిని సూచిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పడిపోయి 23,087 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు అమెరికా మార్కెట్లలో శుక్రవారం జరిగిన భారీ అమ్మకాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIs) నిరంతర అమ్మకాలు.ప్రస్తుతానికి గ్లోబల్ బలహీన సంకేతాల కారణంగా భారత్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని అంచనా.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON