loader

ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపాడు రామాలయ పునర్నిర్మాణం అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత కొన్ని రోజులుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన ఈ వివాదంపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన కట్టడాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఏ మతపరమైన నిర్మాణం చేపట్టాలన్నా జిల్లా కలెక్టర్ , మున్సిపల్ కమిషనర్ అనుమతులు తప్పనిసరని కోర్టు వెల్లడించింది. అనుమతులు లభించే వరకు ప్రస్తుతం ఉన్న […]

జగన్‌ మాజీ CPRO పూడి శ్రీహరి అరెస్టు

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్‌వోగా వ్యవహరించిన పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా శ్రీహరి పోస్టులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి యానిమేషన్‌ పోస్టింగ్‌లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి ప్రస్తుతం వైకాపా మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు

బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి – డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు

బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని తమ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేడీయూ కోటాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వారిలో ఒకరు నితీష్ కుమారుడు ఉండనున్నారు.

మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..!

వైయ‌స్ జ‌గ‌న్ మావిగ‌న్ ప్ర‌తిపాద‌నను ఎందుకు తిర‌స్క‌రిస్తున్నారో ఇంత‌వ‌ర‌కు కూట‌మి నాయకులు చెప్ప‌లేక‌పోయారన్నారు. నేరుగా స‌మాధానం చెప్పుకోలేక మంత్రుల‌కు బూతు పాఠాలు రాసిచ్చి, ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పించి వైయ‌స్ జ‌గ‌న్ పై వ్య‌క్తిత్వ హ‌న‌నం చేశారన్నారు. మావిగ‌న్ అంశాన్ని డైవ‌ర్టు చేస్తున్నామ‌నే భ్ర‌మ‌ల్లో బూతులు, అబ‌ద్ధాల‌తోనే కూట‌మి నాయ‌కులంతా మావిగ‌న్ కాన్సెప్టును ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారన్నారు. ఆ విధంగానే ఇన్నాళ్లూ వాళ్లు చేసిన పాపాల‌ను క‌డుక్కునే ప్ర‌య‌త్నం చేశారన్నారు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర‌ రాష్ట్రాన్ని చంద్ర‌బాబు […]

కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..!

కేరళలో పోలింగ్ ముగిసిపోయి నాలుగు రోజులవుతున్నా ఇంకా ఈసీ వివరాలు బయటపెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ ఎన్నికల సంఘానికి ఇవాళ లేఖ రాశారు. ఇందులో ఆయన.. శాసనసభ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, పోలింగ్ శాతం, పోస్టల్ ఓటింగ్ స్టేటస్ కు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలని కూడా వీడీ సతీషన్ […]

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంపై దాడి : సోనియాగాంధీ

లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ‘రాజ్యాంగంపై దాడి’ గా అభివర్ణించారు. అదేవిధంగా ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ కు సవరణను ప్రవేశపెట్టిన సమయంపై కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు

స్కామ్ వివాదంతో అసలు ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి నన్ను లాగారు అని మంగ్లీ  కన్నీరు మున్నీరు అయ్యారు. సుబ్బారావు అనే న్యాయవాది సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలు అంటే పిచ్చి. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాడు అంటూ మంగ్లీ తీవ్ర ఆరోపణలు చేసింది.

టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో రాజకీయ, పరిపాలనా అంశాలపై చర్చించారు. టీడీపీని ‘క్లీన్ పాలిటిక్స్‌’కు చిరునామాగా మార్చాలని పిలుపునిచ్చారు.రాజకీయాన్ని ప్రజలకు సేవ చేసే వేదికగా చూడాలి తప్ప, జీవనోపాధిగా ఎంచుకోకూడదని హితవు పలికారు.

తప్పుడు మాటలు మాట్లాడితే.. చెప్పు తెగుతది: సీతక్క

అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందన్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతదని హెచ్చరించారు. ములుగులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు రూ.11,650కు ఫోన్లు కొంటే.. రూ.14వేలు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం పునర్నిర్మాణం పనుల్లో అవినీతికి తావులేదన్న సీతక్క.. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. అవసరమైతే సీబీఐ విచారణ జరపాలన్నారు.

మోదీ, రాహుల్ ముచ్చట్లు.. ఒకే ఫ్రేమ్ అగ్రనేతలు !

రాజకీయంగా ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లు తలపడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పార్లమెంట్ ఆవరణలోని ‘ప్రేరణా స్థల్’ ఈ ఆసక్తికర సన్నివేశానికి వేదికగా నిలిచింది. మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడటమే కాకుండా, కాసేపు సరదాగా ముచ్చటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.  ఒకరిని ఒకరు పలకరించుకుని, చిరునవ్వుతో సంభాషించుకున్న వీడియోలు, ఫోటోలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON