loader

పవన్ కు సతీమణి విషెస్

తన భర్త, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ క్యూట్ ఫొటో పంచుకున్న ఆమె.. ఆకట్టుకునే క్యాప్షన్ రాశారు. “ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్ధనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్ డే” అంటూ లవ్ […]

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపులు

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు చిరాగ్‌ను చంపేస్తారంటూ ఆ పోస్ట్‌లో ఉంది. దీనిపై చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ బెదిరింపు పోస్ట్‌పై విచారణ జరపాలని, మంత్రి భద్రతను సమీక్షించాలని ఫిర్యాదులో కోరింది. ‘‘త్వరలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారు’’ అంటూ ఆ లేఖలో ఉంది. ఈ లేఖలో మొబైల్ నెంబర్లు కూడా ఉన్నాయి.

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ.. కేబినెట్​ మార్పుపై కీలక చర్చ..!

కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్,వేణుగోపాల్ తో కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా నడుస్తున్న మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ కు సంబంధించిన పరిణామాలపైనా కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విజయసాయిని సజ్జల కొట్టింది నిజమే. మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తి, మాటామాటా పెరిగి కొట్టింది వాస్తవమే. విజయసాయి రెడ్డి 72 అవమానాలు జరిగాయని చెప్పారు. నాకు ఒక్కడికే తెలిసి మరో ఘోర అవమానం జరిగింది. తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు.. కాకుపల్లి సెంటర్లో వంద వాహానాలతో ఘనంగా స్వాగతం పలికారు. దానిపై విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారు. ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను” అని […]

వెలిగొండకు కృష్ణా జలాల తరలింపు..రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన మండిపడ్డారు. ఎలాంటి వరద నీరు లేకపోయినా, అధికారిక కేటాయింపులు కూడా లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం వెలిగొండ ద్వారా నీటిని యథేచ్ఛగా తరలించుకుపోతోందని […]

కోమటిరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి

జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకపడ్డారు. అనంతరం మంత్రి ఆఫీసును తగలబెట్టే యత్నం చేశారు. తమ పార్టీ ఆఫీసుపైకి వస్తే ప్రతిఘటన తప్పదని బీజేపీ శ్రేణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు సైతం దాడికి తెగబడ్డారు. నల్లగొండ బీజేపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత […]

ఏం తప్పు చేశానని నన్ను జైలులో పెట్టారు?.. కన్నీళ్లు పెట్టుకున్న కవిత

సొంత కుటుంబమే తనను బయటకు పంపిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ.. జిల్లాలో బిఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి కుట్ర చేసి తనను ఓడగొట్టారని అన్నారు. “ఏం తప్పు చేశానని నన్ను తీహాడ్ జైలులో పెట్టారు?. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి కర్కశంగా నన్ను బయటకు పంపారు. అమ్మ ఇంటివాళ్లు నిర్దాక్ష్యణ్యంగా తరిమేస్తే అత్తింటి వాళ్లు కన్న బిడ్డలా […]

తమన్‌కు రూ.10 లక్షలు ఇవ్వలేదు.. కోర్టులో సీఎం విజయ్ అఫిడవిట్

విజయ్ తన ఎన్నికల ఖర్చుల పరిమితిని మించారని, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల ప్రచార గీతం ‘తని ఒరువన్ వెడిచ్చు వరాన్’ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌కు రూ.10 లక్షలు ముట్టచెప్పారంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ఖర్చుల పరిమితి రూ.40 లక్షలు దాటిపోయిందన్న వాదనల్లో కూడా ఎలాంటి నిజం లేదని విజయ్ స్పష్టం చేశారు. అలాగే, సోషల్ మీడియా ఖాతాలను విదేశాల నుంచి ఎవరైనా నిర్వహించినంత మాత్రాన విదేశీ విరాళాలు స్వీకరించినట్లు […]

చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టిన వైసీపీ

గత ప్రభుత్వ హయాంలో మతమార్పిడులను ప్రోత్సహించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై YCP తీవ్రంగా మండిపడింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు తెరలేపుతోందని పార్టీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం సాధించిన విఫలాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.భార్యాభర్తల వ్యక్తిగత, అంతర్గత వివాదాలను తీసి రాజకీయ పార్టీకి, మతానికి ముడిపెట్టి స్వార్థ ప్రయోజనాలు పొందాలని చూడటం […]

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఎంఐఎం ఎమ్మెల్సీని చితకబాదిన స్థానికులు

మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది సీరియస్‌గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. సస్పెన్షన్‌కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON