loader

రాహుల్‌కు కూడా తెలంగాణ‌కు వ‌చ్చే అర్హ‌త లేదా?: బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్‌

పవన్ కల్యాణ్ పై పొన్నం వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో పుట్టిన పవన్ కల్యాణ్ కు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ప్రకారం ఈ దేశంలో జన్మించని సోనియా గాంధీ, ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో పుట్టిన ఖర్గేలకు కూడా తెలంగాణలోకి వచ్చే అర్హత లేదంటావా అంటూ ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగం అమలవుతుందా? […]

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్

భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు.

బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తిరస్కరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం తమిళనాడు బీజేపీలో చర్చనీయాంశంగా మారగా, ఆయన త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా […]

జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్ లో సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. సమావేశం నిర్వహణకు పోలీసులు ఇప్పటికే నిరాకరించిన నేపథ్యంలో.. జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి చుక్కెదురైంది. దీనిని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత ఇందులో లేదంటూ పిటిషన్ ను తిరస్కరించింది.

తెలంగాణ సీఎం అంటే ఎందుకంత చిన్నచూపు?: రేవంత్‌రెడ్డి

తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు లేఖ రాసినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన నుంచి ఇప్పటివరకు స్పందన లేదని చెప్పారు. కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘సమస్య పరిష్కారానికి కిషన్‌రెడ్డి దూతగా వ్యవహరించాలి. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 గ్రామాలను ఏపీలో కలపలేదా? మహారాష్ట్ర నుంచి 2 వేల ఎకరాలు మాత్రమే అడుగుతున్నాం. తెలంగాణ సీఎం అంటే మహారాష్ట్ర సీఎంకు ఎందుకంత చిన్నచూపు’’ అని […]

తెలంగాణ‌లో స‌భకు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌.. జ‌న‌సేన రియాక్ష‌న్‌

రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసుకునేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అర్థరహితమని పార్టీ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. సంధ్య కన్వెన్షన్ హాల్లో నిత్యం అనేక రాజకీయ, సాంస్కృతిక, కార్పొరేట్ సమావేశాలు జరుగుతుంటాయని, కేవలం జనసేన సభకు మాత్రమే పార్కింగ్ సమస్యను సాకుగా చూపడం సరికాదని జనసేన నేతలు విమర్శించారు. శాంతియుతంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకునే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌లో జన సేన సభకు అనుమతి నిరాకరణ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి భారీ షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే రేపు (జూన్ 2) హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్ చేశారు. ఐతే.. కొన్ని కారణాలతో పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది హాట్ టాపిక్ అవుతోంది.

భారతదేశంలో అత్యంత ధనిక సీఎం కానున్నడీకే శివకుమార్… టాప్ 3లోనే చంద్రబాబు, విజయ్‌లు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లు. ఇదివరకు దేశంలో అత్యంత ధనవంతులైన సీఎంల జాబితాలో నంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.తాజాగా ఆ జాబితాలో డీకే శివకుమార్ టాప్ ప్లేస్‌కు చేరనున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం… AP CM చంద్రబాబు (రూ. 931 కోట్లు), తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ […]

ఇసుక దందా నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: అడ్లూరి

ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కురిసిన ఆకాల వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వకాలంలో జోరుగా ఇసుక దందాసాగిందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరేళ్ల గ్రామం నుంచి మానేరు ఇసుకను రోజు వందల లారీల్లో రవాణా చేసే వారని […]

రైతు డిస్కం వెనుక ప్రైవేట్ కుట్ర: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత

రైతు డిస్కం ఏర్పాటు వెనుక మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు రహస్యంగా ఉంచి నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రైతు డిస్కం ఏర్పాటు విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని, వినియోగదారులైన రైతుల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON