loader

తెలంగాణలో సర్‌ సర్వే గడువు మరో 10 రోజులు పొడిగింపు

రాష్ట్రంలో కొనసాగుతున్న  SIR ప్రక్రియను మరో పది రోజులు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్యూమరేషన్‌ పత్రాలను బీఎల్‌వోలకు అందించే గడువును ఆగస్టు 3 వరకు పెంచింది. మునుపటి షెడ్యూల్‌ ప్రకారం ఈ గడువు జులై 24 వరకు మాత్రమే ఉంది.ఆగస్టు 3న పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతారు. ముసాయిదా జాబితాను  ఆగస్టు 10న ప్రకటిస్తారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వారు, చిరునామా మార్పుల కోసం ఫారం-6, ఫారం-8లు ఆగస్టు 10 తర్వాత […]

మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలేదు.. అరెస్ట్ కాలేదు : ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి

మా అబ్బాయి భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు మంగళ్ హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మా అబ్బాయి డ్రగ్స్ తీసుకున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం.. అవాస్తవం. ఈ రోజు ఉదయం మంగళ్ హాట్ పోలీసులు మా ఇంటికి వచ్చి డ్రగ్స్ కు సంబంధించిన కేసు విచారణ జరుపుతున్నామని, విచారణకు సహకరించాలని కోరారు. పోలీస్ విచారణలో నా కుమారుడు డ్రగ్స్ […]

హిందూ విద్యార్థులకు కల్మా హోంవర్క్?: బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థికి ‘కల్మా’ను హోంవర్క్ ఇవ్వడంపై కేంద్ర  సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో బరితెగించి బలవంతంగా విరుచుకుపడ్డారు. కొందరు బలుపెక్కి, హిందూ సంస్కృతిపై దాడులకు దిగుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులతో  కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సమాజంలో ఉండే సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని బండి […]

స్వగ్రామానికి ముద్రగడ పద్మనాభం పార్థివదేహం

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్లో కన్నుమూసిన ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి అభిమానులు, కాపు సామాజికవర్గ నేతలు, రాజకీయ ప్రముఖులు కిర్లంపూడి నివాసానికి భారీగా తరలివస్తున్నారుశోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులసమక్షంలో ఈరోజు సాయంత్రానికే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ- టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై సీబీఐ ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టు విషయంల టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణల్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్లింగ్ కాంట్రాక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును రాజకీయంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.కాంట్రాక్టు విలువ రూ.300 కోట్లని పత్రికల్లో వచ్చిన  క్లిప్పింగ్స్ […]

6 సార్లు ఎమ్మెల్యే, ఒక‌సారి ఎంపీ..రాజకీయాల్లో ప్రత్యేక స్థానం

1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్​ కేబినెట్​లో మంత్రిగా పని చేశారు. ప్రత్తిపాడు నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్​కు వెళ్లారు.

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలోనామినేషన్ వేశారు. పీకే ప్రకటించిన లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ వంద కోట్లు దాటింది. ఆయనకు 105 కోట్ల రూపాయల ఆస్తులు, 5.78 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇందులో చరాస్తుల విలువే 22.20 కోట్లుగా చూపించారు. అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్ డాక్టర్, సీనియర్ అడ్వైజర్ ఆయన భార్య జాహ్నవి దాస్ పేరు మీదే 112 కోట్ల […]

ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే నాకిచ్చే గిఫ్ట్ ఇదేనా?: యార్లగడ్డ వెంకట్రావ్

కెఎమ్ వి సంస్థకు ఎయిర్ పోర్టు టెర్మినల్ పై అభ్యంతరం ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. గన్నవరంలో తన హక్కుల విషయంలో రాజీ పడనని, ప్రోటోకాల్ ప్రకారం తనకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఊరుకోనని అన్నారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే తనకిచ్చే గిఫ్ట్ ఇదేనా? అని ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు? అని తన రెక్కల కష్టం ఖర్చు చేస్తే తమరు తనను అవమానాల పాలు చేస్తారా? అని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రశ్నించారు. కూటమి […]

పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై భార్య అన్నా భావోద్వేగ పోస్ట్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘పవన్ తన జీవితంలో శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను, కష్టాలను మోశారు. ఎంతటి బాధ ఉన్నా ఎప్పుడూ ఫిర్యాదు చేయని ఆయన, ఆ నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తన బాధను బయటపెడతారు’’ అని అన్నా కొణిదెల భావోద్వేగంగా పేర్కొన్నారు ప్రస్తుతం తన దృష్టంతా పవన్‌ ఆరోగ్యంపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు

ఈనెల 18వ తేదీన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన రాజకీయ ప్రకటన చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. అమరావతి వేదికగా సర్క్యులేట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేశారు. జూలై 18న జరగబోయే కార్యక్రమం పూర్తిగా సేవా దృక్పథంతో కూడినదని అసోసియేషన్ వెల్లడించింది. ‘మా ఊరు వాడ’ అనే పేరుతో చేపట్టబోయే కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON