loader

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ఆట చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. 1954 నుంచి 1974 వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించిన సోబర్స్, తన కెరీర్‌లో మొత్తం 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. ఇందులో 26 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో ఆయన నమోదు […]

ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం..

ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. టోర్నీ ప్రారంభం నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న లియోనెల్ మెస్సీ సేన.. హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి సగర్వంగా ఫైనల్స్ చేరింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, అర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాళ్లు సృష్టించిన ఒత్తిడిని ఇంగ్లాండ్ రక్షణ శ్రేణి (డిఫెన్స్) అడ్డుకోలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, లౌటారో మార్టినెజ్‌ల మధ్య కుదిరిన అద్భుతమైన సమన్వయం మ్యాచ్‌ను అర్జెంటీనా వైపు తిప్పేసింది.

సౌదీపై హౌతీల ప్రతీకారం- అభా విమానాశ్రయంపై అటాక్​-

అమెరికా- ఇరాన్ పరస్పర ఘర్షణలతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగిపోతుండగా, ఇప్పుడు హౌతీలు దాడుల చేయడం ప్రారంభించాయి. యెమెన్​లోని ఇరాన్​ మద్దతుగల ఈ హౌతీ తిరుగుబాటులు  సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు హౌతీలు ప్రకటించారు. మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులపై సైనిక చర్యలు ప్రారంభించే ముందు అమెరికాను సౌదీ మద్దతు కోరినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది.

లార్డ్స్‌లో రికార్డ్.. ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం

లార్డ్స్ భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలి మహిళల టెస్టులో ఇంగ్లండ్ 270 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. నాలుగో రోజు విజయానికి నాలుగు వికెట్లు మాత్రమే అవసరమైన భారత్… ఇంగ్లండ్ ను 186 పరుగులకు ఆలౌట్ చేసింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. ఇంగ్లండ్ చేత భారత్ కు చివరి ఓటమి 1995లో ఎదురైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ […]

కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు వేలు చూపిస్తూ మాట్లాడిన కోహ్లీ!

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ వేలు చూపిస్తూ సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ, గిల్‌తో వేలు చూపిస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు, గిల్, కోహ్లీకి ఏదైన విషయంలో కోపం తెప్పించాడా? లేక సరదాగా అలా మాట్లాడుతున్నాడా అర్థం కాక క్రికెట్ అభిమానులు టెన్షన్ అవుతున్నారు.

మూడొందల మ్యాచ్‌లో మంధాన దూకుడు..

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయంగా అతి పిన్న వయస్సులో 300 మ్యాచులు ఆడిన బ్యాటర్ నిలిచింది. 29ఏళ్ల స్మృతి ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తం 10వేలకు పైగా పరుగులు చేసింది. ఇందులో 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున 2013లో స్మృతి మంధాన అరంగేట్రం చేసింది.

గాఫ్‌పై సంచలన విజయం‌.. తొలిసారి వింబుల్డన్ ఫైనల్లో ముచోవా..!

 వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో కరోలినా ముచోవా సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఏడో సీడ్ కొకో గాఫ్‌ను చిత్తు చేసిన ముచోవా తొలిసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం హోరాహోరీగా  జరిగిన మ్యాచ్‌లో గాఫ్‌పై ఆధిపత్యం చెలాయించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో గెలుపొందింది. దాంతో, మొదటిసారి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న అమెరికా స్టార్ గాఫ్ కల చెదిరింది.

క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రౌండ్16 చివరి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ పెనాల్టీ షూటౌట్‌లో 43 గోల్స్ తేడాతో కొలంబియాను ఓడించి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. మూడు సెషన్‌లలో ఒక్క గోల్ కూడా రాలేదు. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో స్విట్జర్లాండ్ నాలుగు గోల్స్ సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ధోని బర్త్‌డేకు.. ఎన్టీఆర్ జిల్లాలో 77 అడుగుల భారీ కటౌట్..!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎంఎస్ ధోని 45వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని అంబారుపేట గ్రామంలో ధోని అభిమానులు ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ కటౌట్‌ను ప్రతిష్ఠించడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

పోర్చుగల్ బాధాకర ఓటమి- రొనాల్డో కన్నీరు మున్నీరు: చెదిరిన కల

అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫిఫా వరల్డ్ కప్ కల విషాదాంతమైంది. అర్లింగ్టన్‌లో జరిగిన హోరాహోరీ రౌండ్ ఆఫ్ 16 పోరులో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది. 1-0 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమితో ఆ జట్టు కేప్టెన్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కేరీర్ కు తెరపడింది. 41 ఏళ్ల రొనాల్డో బాధాకర ఓటమితో తన ఆరో, చివరి ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించాడు. ఈ మ్యాచ్ కు ముందురోజే అతను […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON