‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్గా ప్రియాంకా మోహన్!
నటి ప్రియాంకా మోహన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఆమె తాజా చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం సాధించిన అద్భుతమైన సక్సెస్ తర్వాత, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ప్రియాంకా మోహన్ను ‘కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్’ గా అధికారికంగా నియమించింది. తనకు ఈ అవకాశం కల్పించిన కొరియా ప్రభుత్వానికి మరియు కొరియా టూరిజం ఆర్గనైజేషన్కు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది

