loader

నేలరాలిన సిరిమల్లె పువ్వు…

1.ఎస్. జానకి చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన ఆసక్తి . ఎలాంటి అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణ లేకుండానే తన సహజ ప్రతిభతో గాన ప్రపంచంలో అడుగుపెట్టడం విశేషం. 2. 1957లో విడుదలైన ఓ తమిళ చిత్రంతో సినీ గాయనిగా ఆమె ప్రయాణం ప్రారంభమై,తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. 3.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, సింహళం, కొంకణి వంటి 17కు పైగా భాషల్లో […]

ప్రపంచంలోనే తొలిసారి.. రోబోలతో లైవ్‌ సర్జరీ సక్సెస్‌

ప్రపంచంలోనే తొలిసారి రెండు హ్యుమనాయిడ్ రోబోలు వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించాయి. జీవులపై శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో ఇంజినీర్లు, సర్జన్లు ఈ ప్రయోగం చేపట్టారు. ఓ శస్త్రచికిత్సను వైద్యుడి సాయంతో రోబో చేయగా, మరొక శస్త్రచికిత్సను రెండు రోబోలు కలిసి విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. రోబోలకు ‘సర్జీ’గా పేరుపెట్టారు. ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ ఇప్పుడే మనుషులపై ప్రయోగించలేమని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ఇటీవల […]

ఖమేనీ మరణానికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం – లీడర్ మొజ్ఝబా ఖమేనీ

తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి త్వరలోనే అత్యంత కఠినమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఒక లిఖితపూర్వక సందేశాన్ని విడుదల చేస్తూ.. శత్రువుల దాడుల్లో అమరులైన నాయకుల త్యాగాలు వృథా పోవని, ఈ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నదే ఇరాన్ ప్రజల ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. నేరస్థులు, హంతకులు పడకలపై ప్రశాంతంగా ప్రాణాలు వదిలే పరిస్థితి రానివ్వబోమని, వారిని ఖచ్చితంగా మట్టికరిపిస్తామని మొజ్ఝబా ఖమేనీ హెచ్చరించారు.

సంగీత ప్రపంచంలో మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం: చిరంజీవి

ప్రముఖ గాయని ఎస్. జానకి మరణవార్త తన హృదయాన్ని కలచివేసిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. ఎస్. జానకి మృతి పట్ల సినీనటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధురమైన గళంతో జానకమ్మ సంగీత  అభిమానులను అలరించారని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

తరాలు మారినా చెదరని మ్యాజిక్.. ఎస్. జానకి

1938 ఏప్రిల్ 13 గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. మూడు సంవత్సరాల వయసు నుంచే సంగీతం పట్ల ఆ చిన్నారికున్న అభిలాషను గుర్తించి తల్లితండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి ప్రోత్సహించారు. 19 వయసులో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో తన మొదటి పాటను రికార్డు చేశారు. ఆ సినిమా పేరు విదియన్ విలయట్టు. టి చలపతిరావు సంగీతం అందించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంతో స్వంత సీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం […]

మూగబోయిన జానకమ్మ గాత్రం

60 ఏళ్ల పాటు తన గాత్రంతో భారతీయులను అలరించిన ఎస్ జానకి (88) శనివారం మృతి చెందారు.  సిరిమల్లె పువ్వు నేలరాలినా.. ఆ పుష్పం వెదజల్లిన సువాసన అజరామరం. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  తన అమృత గాత్రంతో ఒక వెలుగు వెలిగిన దిగ్గజ గాయని ఎస్. జానకమ్మ స్వర ప్రయాణం అసాధారణమైనది.

ఒకే పాట.. నాలుగు గొంతులు.. గానకోకిల జానకమ్మ అద్భుతం..

భారతీయ సంగీత ప్రపంచంలో గానకోకిల జానకమ్మ స్థానం అద్వితీయం. కేవలం పాట పాడటమే కాదు, ఆ పాటలోని పాత్రలకు అనుగుణంగా తన స్వరాన్ని మార్చడం జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “రావమ్మ దుర్గమ్మ” (Ravamma Durgamma) అనే ప్రైవేట్ భక్తి గీతంలో జానకమ్మ ఏకంగా నాలుగు విభిన్న గొంతులతో (4 Voices) పాడి శ్రోతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ వీడియో […]

వియ‌త్నాం బోటు ప్ర‌మాదం.. మృతుల వివ‌రాలు విడుద‌ల‌

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడటంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు 10 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు, కేరళకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) మరణించిన 15 మంది వివరాలను అధికారికంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మృతులు నల్లపేట […]

తెలంగాణలో పెట్టుబడులకు ఎమిరేట్స్ ఆసక్తి..

హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడానికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా, నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ విమానయాన సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎమిరేట్స్ ఏ-380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు సంస్థ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని […]

లెజండరీ సింగర్ ఎస్ జానకి మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి మృ తుదిశ్వాస విడిచారు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON