loader
iqonic-blog

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పవన్, నాదెండ్ల అంశంపై నాగేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. పవన్, నాదెండ్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి బేషజాలు గానీ, ఎలాంటి శషబిషలు లేకుండా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే తాను వాటిని అలాగే చెప్పానని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడితో […]

iqonic-blog

ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి.. ఖమ్మం జిల్లా ఏడూళ్ల బయ్యారంలో 46.2 […]

iqonic-blog

తెలంగాణలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వరంగల్ రూ.4,674 కోట్లతో వరంగల్ నగరంలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ, రూ.840 కోట్లతో కరీంనగర్ మోడల్ రోడ్లు, ఇతర నిర్మాణాలు, రూ.166 కోట్లతో ఖమ్మం- వరంగల్- కరీంనగర్ కారిడార్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.5681.04 కోట్లు కాగా, కేంద్రం 25 శాతం నిధులు రూ.1420.26 కోట్లను విడుదల చేసింది.

iqonic-blog

బెంగళూరుకు చెందిన క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో త్వరలో భారత స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.11,000 కోట్ల నిధులను ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్విక్ కామర్స్ రంగంలో జెప్టో వ్యూహం ఇతర కంపెనీలతో పోలిస్తే భిన్నంగా ఉందని బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రస్తుతం జెప్టో దేశవ్యాప్తంగా 61 నగరాల్లో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో నగరంలో సగటున 21 స్టోర్ల సాంద్రత ఉండటం […]

iqonic-blog

కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన వజ్రసహిత సువర్ణ కిరీటం కిరీటం మాయమైంది.అయితే ఈ కిరీటాన్ని అక్రమంగా తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని, అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉంటే దేవుడి వజ్రకిరీటాన్ని తనఖాకు పెట్టుకున్న బంగారం తాకట్టు వ్యాపారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఖాతాకు తాకట్టు పెట్టిన డబ్బులు తిరిగి జమ చేస్తేనే తాను […]

iqonic-blog

పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన కెనడా క్రికెట్‌లో మరో అలజడి మొదలైంది. అప్పుడు సెలెక్టర్లను బెదిరించిన గ్యాంగ్‌స్టర్లు.. ఈసారి ఏకంగా కొత్తగా ఎన్నికైన బోర్డు అధ్యక్షుడి నివాసంపై కాల్పులకు తెగబడ్డారు. ఇటీవలే కెనడా క్రికెట్ చీఫ్‌గా ఎంపికైన అర్విందర్ ఖోసా ఇంటిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతిపై విచారణ జరుగుతున్న ఈ సమయంలో బోర్డు అధ్యక్షుడిని భయపెట్టాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిగినట్టు సమాచారం.

iqonic-blog

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన నాల్గో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ మే 28 నుంచి మే 31 వరకు […]

iqonic-blog

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఓ టీవీ ఛానల్ డిబేట్ షోలో పాల్గొన్న నాగేశ్వర్ జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు టెంపరరీ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ అమిత్ షా అన్నాడని కామెంట్‌ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

iqonic-blog

ప్రస్తుతం ఓకొత్త రాజకీయ పార్టీ దేశంలో మారుమోగిపోతోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ… వినడానికి పేరు వింతగా ఉన్నా ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. బీజేపీని సైతం సీజేపీ దాటిందంటే దాని క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం సీజేపీ ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాను బ్లాక్ చేయించింది. కానీ కొద్ది సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీ మరో అకౌంట్ తో అందరి ముందుకు వచ్చింది. దీనికి నిమిషాల వ్యవధిలోనే ట్వీట్లు, రీ […]

iqonic-blog

భారతదేశాన్ని కుదిపేసిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా CRPF జవాన్ల వీరమరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో మే 21న గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి  కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతూ, ఎంతోమంది యువతను తప్పుదోవ పట్టించిన ఈ కరడుగట్టిన ఉగ్రవాది మరణం..కోలుకోలేని దెబ్బ అని భారత భద్రతాధికారులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON