loader
iqonic-blog

తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు.. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది […]

iqonic-blog

సిరివెన్నెల సీతారామశాస్త్రి గా పేరు గాంచిన చేంబోలు సీతారామశాస్త్రి (మే 20, 1955 – నవంబరు 30, 2021) తెలుగు సినీ గీతరచయిత.ఈయన సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.

iqonic-blog

టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు […]

iqonic-blog

పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు దాడి అక్కడ దొరికిన ఆధారాలు పోలీసులను విస్మయానికి గురి చేశాయి. ఈ హత్యాయత్నం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు నాటకమని చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలు స్పష్టం చేశాయి. ఈ దాడి అసలు జరగనే లేదు. కేవలం సానుభూతి పొందడం కోసం లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభినయ్ దర్శన్ ఈ పథకాన్ని రచించారు. వైద్యుల నివేదికలను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ ఎటాక్ […]

iqonic-blog

దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్రలోని విదర్భలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగి, వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

iqonic-blog

తెలంగాణ పాలనా విభాగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ‘ఫేమ్ ఇండియా- షియా పోస్ట్ సర్వే 2026’ దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో ఉత్తమ సేవలందించిన టాప్-100 ఐఏఎస్ (IAS) అధికారుల జాబితాను విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ కేడర్‌కు చెందిన కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్న దాసరి హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, మరియు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.

iqonic-blog

గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, స్మశానవాటికలు, పశువుల మేత మైదానాలు పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ సర్వే నివేదికలు ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై భేటీలో చర్చించారు.

iqonic-blog

HMWSSB-జలమండలి జనరల్ మేనేజర్‌ ఎస్ఏఎల్ కుమార్‌ దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ బృందాలు గుర్తించాయి. ఈ స్థాయిలో అక్రమాస్తులను సంపాదించేందుకు రోజుకు రూ. 50 వేలు టార్గెట్‌గా పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టుగా సమాచారం. వాటర్ ట్యాంకర్లను అధిక ధరకు అమ్మి రోజుకు రూ. 50,000 సంపాదించేవారని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్ల కోసం ఒక్కో ట్యాంకర్‌కు రూ. 5000 వసూలు చేసేవారని… ఇందులో చాలా ట్యాంకర్లు అనధికారికంగా బుక్ చేసినట్టుగా సమాచారం.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఇలాంటి పరిస్థితుల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. రహదారిపై వెళ్తున్న టిప్పర్ లారీలను అడ్డుకుని డ్రైవర్లను నడిరోడ్డుపైనే ప్రశ్నించారు. ఇక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఊరుకోను అంటూ […]

iqonic-blog

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సామాజిక మాధ్యమాల దిగ్గజం ‘మెటా’ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రేపే (మే 20న) సంస్థలో పనిచేస్తున్న దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం అన్ని చర్యలను పూర్తి చేసింది. ప్రస్తుతం మెటా సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 77,986 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో దాదాపు 10 శాతం మందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON