loader
iqonic-blog

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని పిఠాపురానికి తరలించినట్లు సమాచారం. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో రావణ్ తరఫు న్యాయవాదులు, మద్దతుదారులు, పలు దళిత  సంఘాల నాయకులు, జై భీంరావ్ పార్టీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అక్కడ  […]

iqonic-blog

ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్ మొరాకో చేతిలో ఓడిపోయిన నెదర్లాండ్స్ జట్టుకు ఆన్ లైన్లో లో ఘోర అవమానం ఎదురైంది. పెనాల్టీ షూటౌట్లో తప్పు చేసిన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసహ్యకరమైన రేసిజం వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన చర్యను డచ్ ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ రేసిజం వ్యాఖ్యలపై ఆన్లైన్ వివక్ష  నిరోధక విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బోర్డు తెలిపింది.

iqonic-blog

ఇళయరాజా మ్యూజిక్ అందించి 1976 నుంచి 2001 మధ్య కాలంలో రిలీజైన 134 మూవీల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్ తాము ఆ మూవీల ప్రొడ్యూసర్లతో అఫీషియల్‌గా ఒప్పందాలు కుదుర్చుకున్నామని కోర్టును ఆశ్రయించింది.ప్రపంచవ్యాప్తంగా తమకే పర్మినెంట్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని సరిగమ వాదిస్తోంది. గతంలోనే ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఇళయరాజా కోరగా, కోర్టు దానికి నిరాకరిస్తూ పైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు పాత […]

iqonic-blog

హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి, మాజీ చైల్డ్ ఆర్టిస్ట్ డేవీ చేస్ (35) లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఆసుపత్రిలో జూన్ 16న కన్నుమూశారు. డేవీ చేస్ ప్రమాదకరమైన ఎయిడ్స్ (AIDS) వ్యాధి బారిన పడి, దాని తీవ్రత వల్ల తలెత్తిన మెనింజైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో నిర్ధారించారు. డేవీ చేస్ తన 13 ఏళ్ల […]

iqonic-blog

భారత్‌లో వాట్సాప్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని మెటాను కేంద్రం ఆదేశించింది. అలాగే, ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను విడుదల చేయవద్దని స్పష్టమైన సూచనలు […]

iqonic-blog

ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇరాన్ ఆహ్వానించింది. ఈ నెల 4న ఖమేని అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రధాన కార్యక్రమాలు జూలై 5 నుంచి 9 వరకు జరుగుతాయి. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో అయతొల్లా ఖమేని (86)తోపాటు పలువురు అతడి కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.

iqonic-blog

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియా చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని వదిలేస్తుంటే చేతకానివారిలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే విమర్శలకు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. ఇలాంటి వాటి కోసం తన ఆఫీస్‌లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

iqonic-blog

దేశంలో అక్రమ వలసలు, అసాధారణ కారణాల వల్ల సంభవిస్తున్న జనాభా మార్పుల పై క్షేత్ర స్థాయి అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ మేరకు ఈ అత్యున్నత స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్లేకర్ (రిటైర్డ్) నేతృత్వంలోని బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తమ వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై వివరాలను అమిత్ షా కు తెలియజేసింది. రాష్ట్ర ఈ కమిటి […]

iqonic-blog

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ)-2.0 నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.750 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.1,600 కోట్లతో మోటార్ సైకిళ్ల కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2018లో ఇక్కడ శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ అద్భుతంగా రాణిస్తోందన్నారు. 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ తయారయ్యాయని తెలిపారు. దేశంలో 25 శాతం పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందని చెప్పారు.

iqonic-blog

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుల ఇళ్ల నుంచి రూ.70,25,000 నగదును సీజ్ చేశారు. అత్యధిక శాతం నగదు నిందితుడు అవినాశ్ శుక్లా ఇంట్లో లభించింది. అతడి ఇంట్లో రూ.20 లక్షలను సీజ్ చేశారు. కరుణేశ్ పాండే ఇంటి నుంచి మరో రూ.18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనుకల్ప్ మిశ్రా ఇంట్లో రూ.16 లక్షలు లభించాయి. అవినాశ్ శుక్లా ఇంట్లో 1,121 యూఎస్ డాలర్స్ కూడా లభించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON