loader
iqonic-blog

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం కొత్తగా ఎన్నికైన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్‌ను కలిసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి వ్యక్తిగత అభినందన లేఖను అందజేశారు. భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఓం బిర్లా రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఓం బిర్లా భారతదేశ శుభాకాంక్షలు తెలియజేసి, దేశాన్ని సందర్శించమని ఆహ్వానించారు.

iqonic-blog

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు చెందిన సిబ్బందికి మాత్రమే ఈ సడలింపు వర్తించదు. ప్రార్థనల కోసం సమయం దొరకేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

iqonic-blog

బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్(60) ప్రమాణ స్వీకారం చేశారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. సాంప్రదాయానికి భిన్నంగా బంగభవన్‌కు బదులు జతియా సంసద్ సౌత్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహమాన్ చేత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు.రెహమాన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా, దివంగత అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్‌ల కుమారుడు. ప్రమాణ స్వీకారానికి ముందు రెహమాన్‌ను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్‌పి) ఎంపిలు పార్లమెంటరీ పార్టీ […]

iqonic-blog

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదా కు కారణంగా తెలుస్తోంది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటి షన్ దాఖలు చేశారు. యాదగిరిని గురువారం తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం […]

iqonic-blog

దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. భారీ క్యూలైన్లు, జనం రద్దీతో సదస్సు లోపలికి వెళ్లడం చాలా ఆలస్యం కావడంతో సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ఐటీ అండ్‌ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం అతిధులకు క్షమాపణలు చెప్పారు.

iqonic-blog

ఇళయరాజా సినిమాల్లో 134 సినిమాల నిర్మాతలు తమ సినిమాల్లో పాటల హక్కులను ‘సరిగమ’ సంస్థకు విక్రయించారు. అది కూడా శాశ్వత ప్రాతిపదికన. అయితే ఆ సినిమాల్లో పాటలు ఉపయోగించుకోవచ్చని కొన్ని మ్యూజికల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇళయరాజా అనుమతి ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘సరిగమ’ సంస్థ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. నిర్మాతల నుంచి రైట్స్ తీసుకున్న ‘సరిగమ’ సంస్థకు పూర్తి హక్కులు ఉంటాయని, ఆ పాటలు తుది తీర్పు వచ్చే వరకు వాడుకోవడానికి వీల్లేదని ఢిల్లీ […]

iqonic-blog

సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఊరట లభించింది. నిరుడు నవంబర్ 16 నుంచి అతడు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ హైకోర్టు మంగళవారం రవికి షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లొద్దని, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని అతడికి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇంటర్నెట్ ఉపయోగించవద్దని.. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని రవికి తెలియజేసింది.

iqonic-blog

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో మంగళవారం ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఇటీవలే రెండో విడతగా రూ. 387 కోట్ల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON