loader
iqonic-blog

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజును చెల్లించేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులకు ఏప్రిల్‌ 30 నుంచి మే 15 వరకు అవకాశం ఇచ్చారు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బుధవారం రెండోదశ పోలింగ్ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటగంటకే 61.11 శాతం పోలింగ్ నమోదైంది. హావ్రా ఉత్తర్లో 63.16 శాతం ఓటింగ్ రికార్డయింది. బారకుర్లో 61 శాతం మందికిపైగా ఇప్పటివరకు ఓటేశారు. డైమండ్ హార్బర్, భవానీపుర్, సందేశాలి, దమ్హమ్లోనూ 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

iqonic-blog

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా, మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,200 కోట్లు (సుమారు $260 మిలియన్లు) వసూలు చేసింది. ఇండియాలోనూ 4 రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా రానున్న రోజుల్లో రూ. 5,000 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల […]

iqonic-blog

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఓబుల్ రెడ్డి పేటలో మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రి పిరాన్ భాషను మైనర్ బాలుడైన పదవ తరగతి విద్యార్థి పదునైన ఆయుధంతో కొట్టాడు.. అది తగలరాని చోట తగిలి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. చంపాలి అనే ఉద్దేశం లేకపోయినా తన తల్లిని వేధిస్తున్న సమయంలో అడ్డుపడి తల్లికి రక్షణగా నిలవాలనుకున్నాడు. అయితే అదే సమయంలో చేతికి దొరికిన పదునైన ఆయుధంతో తన తండ్రిని కొట్టడంతో అతను మరణించినట్లు […]

iqonic-blog

భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గంగా మాత ఆశీర్వాదంతో ఎక్స్‌ప్రెస్‌‌వే ప్రాజెక్ట్ సాకారమైందని అన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌‌వేను యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా ఆయన అభివర్ణించారు.సుమారు 36,230 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే ఇదే కావటం విశేషం.

iqonic-blog

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేశారు. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే టాప్‌ మార్కులు సాధించారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bse.telangana.gov.in లింక్‌లో డైరెక్ట్‌గా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

iqonic-blog

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. పంట కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల, ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈ నేపథ్యంలో నెల్లికొండ మార్కెట్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వెంటనే స్పందించిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ రణరంగంగా మారింది. ఫల్తా నియోజకవర్గంలోని బూత్ నంబర్ 177 వద్ద బీజేపీ ఓటింగ్ బటన్‌ను టేపుతో కప్పివేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దేబన్షు పాండా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈవీఎంను తనిఖీ చేయడానికి అధికారులు అనుమతి నిరాకరించడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం, ఒకవేళ ఈ ఫిర్యాదులో నిజమున్నట్లు తేలితే సదరు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON