loader
iqonic-blog

దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.

iqonic-blog

ఆస్ట్రేలియ‌న్ బ్యాడ్మింట‌న్ ఓపెన్ టోర్నీలో హైద‌రాబాదీ ప్లేయ‌ర్ పీవీ సింధు ఇవాళ సెమీఫైన‌ల్లో ఓటమి చ‌వి చూసింది. జ‌పాన్‌కు చెందిన మేటి ప్లేయ‌ర్ అకేన్ య‌మ‌గుచి చేతిలో ఆమె వ‌రుస గేమ్స్‌లో ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్న‌ది. 20-22, 12-21 స్కోరుతో య‌మ‌గుచి విజ‌యం సాధించింది. మూడో నెంబ‌ర్ ర్యాంక్‌తో జ‌ప‌నీస్ ప్లేయ‌ర్ ఈ టోర్నీలో ఆడారు. కేవ‌లం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. సింధు ఓట‌మితో బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ 500 టోర్న‌మెంట్‌లో భార‌తీయ క్రీడాకారుల […]

iqonic-blog

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. రావల్కోట్ సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛ కోసం నినాదాలు చేశారు. నిరసనకారులు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి, PoK ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

iqonic-blog

ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్ కలిసి ఓ మెగా స్కామ్ రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు.ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది అని వైఎస్ జగన్ […]

iqonic-blog

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి ఆచూకి కనిపెట్టడంతో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క హటాత్తుగా ఇవాళ మరణించినట్టు తెలుస్తోంది. చిన్నారి ఆచూకి తెలుసుకునేందుకు ఇటీవల అధికారులు కుక్కకు ట్రాకర్ అమర్చి బయటకు వదలగా ఇప్పుడు అది మరణించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

iqonic-blog

పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 911.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,673 కోట్లు) భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో గతంలో 910.9 మిలియన్ డాలర్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో అగ్రస్థానంలో ఉన్న ‘బోహేమియన్ రాప్సోడి’ని ఇది వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మ‌రోవైపు 2022లో వచ్చిన ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ ‘ఎల్విస్’ రికార్డులను కూడా ఈ చిత్రం బద్దలు కొట్టింది.

iqonic-blog

ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్గిన వ్య్తక్తి సిఎం రేవంత్ రెడ్డి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆయనే సాధించినట్లు మాట్లాడుతున్నారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలయిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ఉందామని, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటామని సూచించారు. SIR కార్యక్రమం పట్ల శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

iqonic-blog

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఓ ఆగంత‌కుడు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. పోలీసుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అనుమానిత షూట‌ర్ హ‌త‌మ‌య్యాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున వెస్ట్ టెక్సాస్ మిడ్‌లాండ్‌ ఆయిల్ సిటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ షూట‌ర్‌ను త‌రిమే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఓ వెట‌ర్న‌రీ క్లినిక్‌లోకి ప్ర‌వేశించిన దుండ‌గుడిని చుట్టుముట్టి కాల్చేశారు. నిందిత వ్య‌క్తిని 45 ఏళ్ల విక్ట‌ర్ మాతా విల్లారియ‌ల్‌గా గుర్తించారు.

iqonic-blog

గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్‌ జాతీయులను అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా వీరు అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులకు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకుని విచారించగా భారతదేశంలో ఉండేందుకు ఎలాంటి పాస్‌పోర్టులు, వీసాలు ,ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు తెలిపారు . భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని […]

iqonic-blog

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ.. దానికి ముందు భాగంలో ల్యాప్‌టాప్‌ను అమర్చుకుని, రోడ్డుపై వెళ్తూనే ఆఫీస్ పనులు, కోడింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే… ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది.కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON