loader
iqonic-blog

భారత జట్టు, ఆఫ్ఘాన్‌తో లక్నో వన్డేలో 170 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్, 3 మ్యాచుల సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 403 పరుగుల లక్ష్యఛేదనలో 44.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు, 232 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ కలిసి మూడో వికెట్‌కి 140 బంతుల్లో 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. శుభ్‌మన్ గిల్ 77 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

iqonic-blog

ప్రస్తుతం మనకు వచ్చే మెసేజ్‌లపై కేవలం ‘ఫార్వార్డెడ్’ అనే కనిపిస్తుంది. కానీ, కొత్త అప్‌డేట్ ప్రకారం.. ఒక మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసినప్పుడు, దానిని మొదట సృష్టించిన వ్యక్తి పేరు, వారి ఫోన్ నంబర్ కూడా అవతలి వారికి తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం వల్ల తప్పుడు సమాచారం, స్కామ్‌లు మరియు ఫేక్ న్యూస్‌ల వ్యాప్తిని అరికట్టవచ్చు.పేరు, ఫోన్ నంబర్ అందరికీ తెలిసిపోవడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే […]

iqonic-blog

ప్రపంచప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ టెస్లా, హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో తన అధికారిక కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించింది.హైటెక్ సిటీలో ఈ సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా టెస్లా విస్తరించిన నెట్‌వర్క్‌లో ఇది ఐదో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్ ద్వారా టెస్లా కార్ల అత్యాధునిక ఫీచర్లు, వినూత్న సాంకేతికత మరియు వాటి లగ్జరీ డిజైన్‌ను నేరుగా చూసి అనుభవించే వీలుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కంపెనీ తన లేటెస్ట్ 2026 Model Y సిరీస్‌ను కస్టమర్ల సందర్శనార్థం […]

iqonic-blog

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొస్తూ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఈ సరికొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయబోతోంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో 2, విశాఖపట్నం తీరంలో 2 బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు, అంటే.. బీర్, వైన్ , రెడీ-టు-డ్రింక్ పానీయాలు మాత్రమే ఇక్కడ […]

iqonic-blog

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు కోసం, ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT Board) బోర్డు సభ్యులను  యమించింది. ఈ మేరకు EHCT బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా సమావేశమై, EHS అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను, ఆరోగ్య కార్డుల జారీకి రూపొందించాలని ప్రభుత్వం మండలిని ఆదేశించారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.

iqonic-blog

సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ భేటీలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని సీఎం […]

iqonic-blog

వనపర్తి జిల్లా దేవరకద్రలో బుధవారం వడగండ్ల గాలి వాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానతో సంత మొత్తం అస్తవ్యస్తం కాగా, పోచమ్మ ఆలయం ముందు సగం మేరకు చెట్లు, వ్యాపార సముదాయలు నెలకొరిగాయి. వర్ష బీభత్సానికి దేవరకద్ర అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ముందు విషాద ఘటన చోటుచేసుకుంది. గాలివాన బీభత్సానికి బ్యాంకు సమీపంలోని ఓ ఇంటిపై నిర్మాణం చేపడుతున్న ప్రహరీ గోడ కూలి పక్కనే ఉన్న కారుపై పడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు […]

iqonic-blog

తమిళనాడు CM జోసెఫ్ విజయ్‌ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు హీరోయిన్ సమంత రూత్ ప్రభు.విజయ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. “నేను చెన్నైలో అడుగు పెట్టినప్పుడు మన ముఖ్యమంత్రిని కలవబోతున్నాననే సంతోషం  లిగింది. విజయ్ గారు వెండితెరపై హీరోగా మాత్రమే ఉండవలసిన వ్యక్తి కాదని నాకు ఎప్పుడూ అనిపించేది. ప్రజలు ఆయనకు ఇచ్చే గౌరవం, ఆయన పవర్ చూస్తుంటే… పెద్ద మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అనిపిస్తుంది” అని సమంత పేర్కొన్నారు.

iqonic-blog

ఉత్తర కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడి బందిపోరా జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గురేజ్ కంట్రోల్ పరిధి, తులైల్ వ్యాలీలో ఉన్న తార్టెయి కిలో అనే గ్రామంలో బుధవారం ఉన్నట్లుండి కుండపోత వర్షం కురిసింది. మేఘ విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. పలు చెట్లు కూలిపోగా, ఇండ్లు ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు నీట మునిగాయి. పిల్లలతోసహా స్తానికులు ఇండ్లను విడిచిపెట్టి సురక్షిత, ఎత్తైన […]

iqonic-blog

గాదె సాయికృష్ణ మరణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులే సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారని, ఆపై నిజాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని మాయం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇంతటి అమానుషమైన లాకప్ డెత్ ఎక్కడా జరిగి ఉండదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, మానవతా దృక్పథంతో ఆలోచించి, వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON