loader
iqonic-blog

సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ల వివాహం గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ తమిళ సినిమా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండో వారంలో ఈ క్రేజీ జోడీ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం. ఈ క్రేజీ వెడ్డింగ్ రూమర్స్‌పై మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు […]

iqonic-blog

 రెస్టారెంట్లు, హోటల్స్‌పై కొరడా ఝుళిపించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది.  దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అపరిశుభ్రమైన వంటశాలలు, సురక్షితం కాని ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించని ఆహార తయారీ కేంద్రాలు లేదా విక్రయ కేంద్రాలు కనిపిస్తే, వెంటనే తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పౌరులకు పిలుపునిచ్చింది. ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ యాప్ ద్వారా అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరుతోంది

iqonic-blog

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికల నిర్వహణ, కొత్త సభ్యత్వాల జారీ అంశాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ల మధ్య నేరుగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నుండి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే.. అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య అయిన సుమలత బై-ఎలక్షన్ నిర్వహణకు సిద్ధం కావడమే […]

iqonic-blog

శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో శనివారం పవన్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. పవన్‌ కల్యాణ్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పపన్ సతీమణి అన్నా లెజినోవాతోనూ మాట్లాడారు. పవన్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్లు వైద్యులు తెలిపారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

iqonic-blog

ప్రముఖ దిగ్గజ గాయని, ‘గానకోకిల’ ఎస్. జానకి అంత్యక్రియలు కర్ణాటకలోని మైసూర్ నగరంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిన్న ఆమె హఠాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోలీసులు ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత అత్యంత విషాదకర వాతావరణంలో, అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. ఈ మహోన్నత గాయనిని కడసారి చూసేందుకు వేలాది మంది […]

iqonic-blog

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ వేలు చూపిస్తూ సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ, గిల్‌తో వేలు చూపిస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు, గిల్, కోహ్లీకి ఏదైన విషయంలో కోపం తెప్పించాడా? లేక సరదాగా అలా మాట్లాడుతున్నాడా అర్థం కాక క్రికెట్ అభిమానులు టెన్షన్ అవుతున్నారు.

iqonic-blog

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ అంటూ మండిపడ్డారు. ఇంకా తీరలేదా మీ రక్తదాహం ? 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా.. సరిపోలేదా? తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు అంటూ కాంగ్రెస్ నాయకులపై […]

iqonic-blog

వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యారు. గుంటూరులోని ఇంటికి వెళ్లి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తామని పోలీసులు చెప్పారని నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసులం అంటూ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.

iqonic-blog

విజయవాడ ఆటోనగర్‌లోని ఒక వాహన మరమ్మతు కేంద్రం (మెకానిక్ షెడ్) లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్యారేజీలో రిపేర్ కోసం ఉంచిన ఒక బస్సుకు వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న ఇతర బస్సులకు కూడా వేగంగా విస్తరించాయి. ప్రమాద స్థలం నుండి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

iqonic-blog

తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు, కృష్ణ బేసిన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా, తాగునీటి, సాగునీటికి పెను గండంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. జలాశయంలో 513 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ స్టోరేజ్ 510 అడుగులు అంటే మరో మూడు అడుగుల నీరు కిందికి వెళితే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిని వాడుకోవడానికి వీలుండదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON