loader
iqonic-blog

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తనపై వస్తున్న ఆరోపణలను పుట్టా మహేశ్ తోసిపుచ్చారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో.. “నేను ఎలాంటి తప్పు చేయలేదు. కొందరు మిత్రులు ఆహ్వానిస్తేనే ఆ డిన్నర్‌కు వెళ్ళాను. ఏలూరు ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న […]

iqonic-blog

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల (2027) కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం ఆదివారం (మార్చి 15, 2026) నుండి ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి గౌరవించేందుకు పౌరులు తమ నామినేషన్లను పంపవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

iqonic-blog

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహాభాగం ఇచ్చి అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు […]

iqonic-blog

మర్రి ప్రశాంత్(35),శ్రావణి (33),కుమారుడు సహస్రన్ (10)తో కలిసి ఆదివారం మేడిపల్లిలోని చుట్టాల ఇంటికి వస్తుండగా స్పార్క్ హాస్పిటల్ దగ్గరలో వెనుక నుండి వచ్చిన కారు కియా సోనెట్ (టిఎస్08హెచ్ హెచ్ 6363) అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొనడంతో మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య శ్రావణి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.వారి కుమారుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. కారు నడిపిన వ్యక్తి రామయ్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు […]

iqonic-blog

కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

iqonic-blog

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో పట్టుబడిన ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది . పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌ కేసులో మహేష్‌ పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని వెల్లడించారు. డ్రగ్స్‌ వంటి ఘటనల్లో ఎవరూ ఉన్నా […]

iqonic-blog

ఎల్పీజీ కొరత దేశమంతా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై కూడా పడింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీ (గోల్‌గప్పా)లు వడ్డించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  టీచర్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో  మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. […]

iqonic-blog

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి సమీపంలోని పంపా రిజర్వాయర్ పరిసరాల్లో పెద్దపులి ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అన్నవరం పంపా రిజర్వాయర్ సమీప ప్రాంతంలో అది సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు మరియు స్థానిక ప్రజలకు అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON