loader
iqonic-blog

ఆదివారం ఎడ్జ్బస్టన్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో చేతులు కలపలేదు. దీంతో ‘నో హ్యాండ్ షేక్’ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సాధారణంగా టాస్ అనంతరం ప్రత్యర్థి కెప్టెన్లు ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు. కానీ ఈ మ్యాచ్ అలాంటి దృశ్యం కనిపించలేదు. ఇద్దరు కెప్టెన్లు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నప్పటికీ, చేతులు మాత్రం కలపలేదు.

iqonic-blog

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీని భారత్ లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం” అని […]

iqonic-blog

మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. స్మృతి మంధాన 524 పరుగులతో మూడో […]

iqonic-blog

తమిళనాడులో AIADMK పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ ఆమె వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఆదివారంనాడు తన రాజీనామా లేఖను పంపారు. సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన గౌతమి రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. బిజెపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ […]

iqonic-blog

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. సీఎం అందరినీ పలకరించి వారితో ఫొటోలు దిగారు. పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమిట్)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు.

iqonic-blog

పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ తో ఫోన్ ద్వారా ప్రమాద వివరాలు, సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా […]

iqonic-blog

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వర్షాలు, వరద ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షం పడే సమయంలో ఫీల్డ్ లో ఉండని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని.. అవసరం అయితే తాను కూడా రోడ్డు మీదకు […]

iqonic-blog

“అది నకిలీ వీడియో, అది నా గొంతు కాదు..” అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి నోటీసు అందుకున్న షబ్బీర్ అలీ 24 గంటల లోపే పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి, బలహీనపరిచేందుకు జరిగిన కుట్ర అని ఆయన ఆరోపించారు. తప్పుడు ఆడియో రికార్డులను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలూ నమ్మవద్దని […]

iqonic-blog

ఉత్తరప్రదేశ్ లోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరం ప్రాంగణంలోని డొనేషన్ బాక్సుల (హుండీల) లో భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగదు కొన్ని రోజులుగా క్రమబద్ధంగా మాయమవుతోందంటూ వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. SP అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పవిత్రమైన రామాలయ విరాళాలలో అక్రమాలు జరగడం అత్యంత విచారకరమని మండిపడ్డారు. హుండీల నుంచి దాదాపు రూ. 7 కోట్ల విరాళాలు మాయమయ్యాయని నేతలు ఆరోపణలు చేస్తూ,దర్యాప్తు జరపాలని డిమాండ్ […]

iqonic-blog

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోలాపూర్ జిల్లాలో తాండుల్వాడి సమీపంలో పికప్ ట్రక్కు బావిలో పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సాగర్ చౌగులే తన కుటుంబ సభ్యులతో కలిసి పికప్ ట్రక్కులో దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మస్వద్ నుంచి పండరూర్ వెళుతుండగా దారిలో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON