loader
iqonic-blog

సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రఫుల్ హింగే బౌలింగ్లో ఔటయ్యాడు.క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ను (30 బంతుల్లో సెంచరీ) అధిగమించే అవకాశాన్ని కోల్పోయాడు. 8వ ఓవర్లో వైభవ్ మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు బాదడంతో మొత్తంగా 29 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

iqonic-blog

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు (వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు) పళనిస్వామి తో భేటీ అయ్యారు. పళనిస్వామితో భేటీ అనంతరం వేలుమణి మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో చీలిక లేదని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పళనిస్వామికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రులు వేలుమణి, సీవీ షణ్ముగం నాయకత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే అధిష్ఠానంపై తిరుగుబాటు చేశారు. టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు.

iqonic-blog

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2026 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ ని బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వైబ్‌సైట్ https://upsc.gov.in ద్వారా కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా IAS, IFS, IPS వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల భర్తీ కోసం ఈ నెల రెండు దశల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా యూపీఎస్‌సీ చరిత్రలో పరీక్ష జరిగిన వెంటనే తాత్కాలిక సమాధానాల కీ ని ప్రకటించడం ఇదే తొలిసారి.

iqonic-blog

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో సమీక్షా సమావేశంలో మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చోవడంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అలీ హజారీ మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పి ఇద్దరూ పరస్పరం దూషించుకుంటూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. మంత్రులు, ఇతర నేతలు వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగింది.

iqonic-blog

సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేశ్, వారి మిత్రపక్షాలకు ఒక్కటే తెలుసు…ప్రధాని నరేంద్ర మోడీ కనిపిస్తే ఒంగిపోవటం, పవన్ కల్యాణ్ కనిపిస్తే ఒంగి నమస్కారాలు చేయటం మాత్రమే తెలుసు’అంటూ మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారని మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. “జగన్ 175 మంది నేతలతో సమావేశం పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా?’ అని మాజీమంత్రి కొడాలి నాని ఎద్దేవా […]

iqonic-blog

టాలీవుడ్‌లో కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెంటల్, పర్సంటేజీ వివాదానికి తెరపడింది. రాం చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన పెద్ది సినిమాను రెంటల్ పద్దతిలోనే ప్రదర్శించనున్నారు. అయితే.. టికెట్ ధరలు పెంచితే 75 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. చిరంజీవీ జోక్యం చేసుకోవడంతో.. పర్సంటేజీకి పట్టుపట్టిన తెలంగాణ ఎగ్జిబిటరల్స్ సంఘం రెంటల్‌కు అంగీకరించింది. జూన్ 30 నుంచి విడుదలయ్యే సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలను ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం

iqonic-blog

తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం ఆయన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌ను సందర్శించారు. అక్కడ ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

iqonic-blog

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని ఇప్పటికే వార్తలు రాగా.. కొత్త ముఖ్యమంత్రి మే 30న ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కర్ణాటకలో సీఎం సిద్ధు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఎప్పటినుంచో పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి మనసూ నొప్పించకుండా ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కృషి చేస్తోందని పార్టీ […]

iqonic-blog

ఆఫ్రికా దేశాల ను వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్‌కు తమ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ఈ కీలక ప్రకటన చేశారు. తమ దేశ పరిశోధకులు తయారు చేసిన కొత్త టీకా ఈ అరుదైన బుండిబుగ్యో వేరియంట్‌ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆఫ్రికా దేశాలకు ఎబోలా నిర్ధారణ కిట్లు, అవసరమైన వైద్య సాయాన్ని కూడా అందిస్తామని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.

iqonic-blog

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. గత త్రైమాసికంలో సామ్‌సంగ్ ఆదాయం 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో చిప్ విభాగానికి చెందిన ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.3 కోట్లు) అందించనుంది. సంస్థ చిప్ విభాగం ఉద్యోగులు చేపట్టిన సమ్మె  బోనస్‌కు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON