loader
iqonic-blog

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం యూకేలోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా వైమానిక దళానికి చెందిన బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ఒకటి బయలుదేరినట్లు సమాచారం. ఈ విమానం ఆయుధాలతో కూడి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఒక ప్రధాన సైనిక సంకేతంగా పరిగణిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు . తన షరతులను ఇరాన్ నెరవేర్చకపోతే, ఈ రాత్రే […]

iqonic-blog

లిబియా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోవడంతో 80 మందికిపైగా వలసదారులు గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి వలస సంస్థ (ఐఓఎం) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర పశ్చిమ లిబియాలోని తజౌరా పట్టణం నుంచి సుమారు 120 మంది ప్రయాణికులతో ఈ పడవ బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు బాలేకపోవడంతో పడవలోకి నీరు చేరడంతో అది మునిగిపోయినట్లు ఐఓఎం పేర్కొంది.

iqonic-blog

అగ్నిమాపకశాఖ నూతన వాహనాలు, పరికరాలను అమరావతి పరేడ్ గ్రౌండ్లో   ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.ఇందులో భాగంగా రూ. 33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసింది. రూ.10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంప్లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లెటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ […]

iqonic-blog

ఆస్ట్రేలియాలో విదేశీ దరఖాస్తుదారుల నుంచి వచ్చిన వీసా అభ్యర్ధనలను రికార్డు స్థాయిలో తిరస్కరించింది. ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులు నిజంగా చదువుకోవాలనుకుంటున్నారో? లేదో? నిర్ధారించుకోవడానికి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో దాదాపు 40% మంది భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నారు ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫ్రేమ్‌వర్క్ కింద భారతీయ దరఖాస్తుదారులను ఎవిడెన్స్ లెవల్ 2 (EL2) నుంచి ఎవిడెన్స్ లెవల్ 3 (EL3)కి మార్చారని, దీనివల్ల విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు కూడా పెరుగుతాయని కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది.

iqonic-blog

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని కీలక సూచన జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై పెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ […]

iqonic-blog

హైదరాబాద్ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు నగరంలో చిలకలగూడ,ఆదిభట్ల, సనత్నగర్లో మూడు చోట్లు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. ఈ మూడు కేసుల్లో ఒక అంతర్‌రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు స్థానిక డ్రగ్‌ పెడ్లర్‌, ముగ్గురు సబ్‌ పెడ్లర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.

iqonic-blog

ఆర్టెమిస్‌-2 మిషన్‌లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు.. తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చందమామ అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫొటోను ‘నాసా’ విడుదల చేసింది. దీన్ని వైట్‌హౌస్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేసింది. ‘‘జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫొటో ఇది’’ అని పేర్కొంది.

iqonic-blog

ఇరాన్‌కు అత్యంత కీలకమైన చమురు కేంద్రంగా భావించే ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు జరిపింది. రహదారులతో పాటు ఓ రైల్వే వంతెనను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అమెరికా దళాలు దీవిలోని కనీసం 50 సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు జరగడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ దీవి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON