loader
iqonic-blog

గంటల వ్యవధిలో శాంతి ఒప్పందం ప్రచారం దశలోనే గల్ఫ్‌లో తిరిగి యుద్ధవాతావరణం రగులుకుంది. తమ గగనతలంలో క్షిపణి, డ్రోన్ల దాడులు జరిగాయని కువైట్ గురువారం తెలిపింది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్ తరచూ సైనిక దాడులకు దిగుతోంది. ఇరాక్‌లో ఇరాన్ మద్దతు గల షియా మిలిటెంట్లు నుంచి కూడా కువైట్ పై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పూర్తిగా ఫలించి ఏ క్షణంలో అయినా ఒప్పందం కుదురుతుందనే వార్తల […]

iqonic-blog

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని కొడాలి నాని గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ.. ముందు ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా సమావేశాలు పెట్టడం కాకుండా, దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం గుడివాడలో నానికి రాజకీయ స్థానం లేకుండా […]

iqonic-blog

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని మైత్రీవనం కూడలిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ కుమారులు మోహనకృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటుడు మంచు మనోజ్ తో పాటు కాంగ్రెస్ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

iqonic-blog

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ జడివానకు తోడు ఈదురు గాలులు, గాలి దుమారం రేగడంతో పాటు వడగండ్ల వాన కూడా కురవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ గాలివాన బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడటంతో పాటు స్తంభాలు కూడా […]

iqonic-blog

వైకాపా హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్ బాగ్ ఈడీ కార్యాలయంలో ఏడున్నర గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు, “కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్ చేసిన మొబైల్ ఫోన్లలోని వివరాలను సేకరించారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. నేను ఎవరి పేర్లూ చెప్పలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ […]

iqonic-blog

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. సిద్దరామయ్య తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కార్యాలయంలో అందజేశారు. సిద్దరామయ్య మాట్లాడుతూ… ‘‘గవర్నర్ కార్యాలయం నా రాజీనామాను సమర్పించాను. లోక్‌భవన్‌లో గవర్నర్ అందుబాటులో లేరు. నేను ఆయన కార్యాలయంలో రాజీనామా లేఖను అందజేశాను’’ అని తెలిపారు. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ జూన్ 1వ తేదీన […]

iqonic-blog

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కీర్తన కార్పొరేట్ స్టైల్ తరహా రీల్స్ చేస్తున్నారు. పాత సాంప్రదాయ ప్రసంగాలు పక్కన పెట్టి కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పెట్టుబడులను తీసుకురావడం కోసం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు మంత్రి కీర్తన. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలతలను మంత్రి కీర్తన ఇంగ్లీష్ లో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త […]

iqonic-blog

కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌కు చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. ఈ నెల 15 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. విధి మేఘ కోసం వెతుకుతుండగా కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది.

iqonic-blog

ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రైతుల ఇబ్బందులు నానాటికి పెరిగి పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ ఓ రైతు తోపుడు బండిపై ధాన్యం తరలించి వినూత్న నిరసన తెలిపారు.లారీల కొరతతో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో కందాడి మహిపాల్ రెడ్డి(అనే రైతు ఆలేరు మండలం కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డుకు కాలికి చెప్పులు లేకుండా ధాన్యాన్ని తోపుడు బండిపై తరలించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.

iqonic-blog

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై తొలిసారి సిద్దరామయ్య స్పందించారు.సిఎం పదవికి మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో మంత్రులను సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. హైకమాండ్‌, తనను సిఎం పదవికి రాజీనామా చేయమని కోరిందని తెలిపారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నానని..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON