loader
iqonic-blog

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఓరుగల్లు రాజకీయాలు హీటెక్కాయి. కొండా సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అని పోస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకపక్క సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించినా, తనను తానూ ప్రకటన చేసుకోవటంతో వచ్చే ఎన్నికల్లో కొండా సుస్మిత పోటీ చేయటం పక్కా అన్న సంకేతాన్ని […]

iqonic-blog

తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు   ప్రతి అభ్యర్థికి ప్రత్యేకమైన యూనిక్ ఐడీని కేటాయిస్తోంది.   దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థి ఎదుర్కొనే ప్రతి దశకు సంబంధించిన  సమాచారాన్ని ఈ ఐడీలో నమోదు చేయనున్నారు. ఇందులో ఫామ్-ఏ, ఫామ్-బీతో కూడిన ప్రత్యేక ప్రొఫార్మాను సిద్ధం చేస్తున్నారు.   ప్రతి దశలో అభ్యర్థి సాధించిన మార్కులు, శారీరక సామర్థ్యం, అర్హతలు తదితర వివరాలను యూనిక్ ఐడీతో అనుసంధానం […]

iqonic-blog

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్‌‌లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత, తన కుమారుడితో కలిసి సత్కరించారు. రాధన్‌ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ కవితను కలవడంపై చర్చనీయాంశమైంది. కవిత ఆయన్ను పిలపించారా.. ఆయనే ఇక్కడికి వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. కవిత తన రాజకీయ భవిష్యత్ గురించి ఏదైనా ఆరా తీశారా అనే చర్చ మొదలైంది.

iqonic-blog

స్కూల్ విద్యార్థులే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది రెండు తండాలకు చెందిన విద్యార్థులు హత్య చేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సదరు విద్యార్థులు గంజాయి తీసుకుంటుండగా ఆమె ఫొటోలు తీయడంతో పాటు వీడియోలు కూడా తీసిందనే అనుమానంతోనే ఆమెను చంపినట్టు తెలుస్తోంది. గంజాయి సేవిస్తుండగా విద్యార్థులను పిలిచి రూపారెడ్డి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీంతోనే విద్యార్థులు రూపారెడ్డిని హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

iqonic-blog

బీహార్‌లోని నలంద జిల్లా నూర్ సరాయ్ పరసి మిడిల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో ఉప్పుకు బదులుగా సర్ఫ్ కలపడంతో 40 మంది పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోయాబీన్ కూరలో ఉప్పు తక్కువగా ఉండటంతో సిబ్బంది ఉప్పు డబ్బా అనుకుని పొరపాటున డిటర్జెంట్ పౌడర్‌ను కూరలో కలిపి విద్యార్థులకు వడ్డించారు. ఆ ఆహారాన్ని తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడి కళ్లు తిరిగి పడిపోయారు.

iqonic-blog

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.  పెంపు ద్వారా వచ్చే అదనపు రాబడిలో నిర్దిష్ట మొత్తాన్ని చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమం  కోసం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సరిగ్గా 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) నిర్వహించే ప్రత్యేక సంక్షేమ విరాళంగా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

iqonic-blog

భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు మానవ్ సుతార్ అదరగొట్టేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్.. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 206 పరుగులకే కుప్పకూలిపోయింది.

iqonic-blog

తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ తో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలంటూ గతంలో పంపిన విద్యాశాఖ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లువిద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి స్పష్టం చేశారు.

iqonic-blog

రాష్ట్రంలో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ పంచాయతీ సమయంలో రికార్డైన వీడియోలు, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన భార్యతో మాట్లాడిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీరి ఫ్యామిలీ పంచాయితీ పైనే ఉంది. వీడియోలు బయటకు రావడంతో జోగి రమేష్ కుటుంబం ఇబ్బందికర పరిస్థితిలో పడింది. ఇరువైపుల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రాజీవ్ తన తండ్రిపై తీవ్రంగా మండిపడ్డారు. జోగి రమేష్ సహా 11మంది కుటుంబ సభ్యులపై కేసు […]

iqonic-blog

ఈశాన్య ఆఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (CAR) పశ్చిమ ప్రాంతంలో మంగళవారం దారుణ దుర్ఘటన   చోటుచేసుకుంది.  నానా-మాంబెరే (Nana-Mambere) ప్రిఫెక్చర్‌లోని అబ్బా (Abba) ప్రాంతంలో చిన్న తరహా బంగారు గని ఒక్కసారిగా కూలిపోవడంతో కనీసం 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కూలిపోయిన గని శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON