loader
iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై తేదీ ఖరారైంది. జులై 13 నుంచి ఉద్యోగాల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై నిషేధం అమలు చేయనుంది. బదిలీలు, డిప్యుటేషన్, ప్రమోషన్లతో పాటుగా కొత్త నియామకాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం స్థానిక కేడర్ల కేటాయింపు పూర్తయ్యే వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వు-2025 అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

iqonic-blog

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో డిఎస్పి భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు మరియు ఇతర అనుబంధ ప్రాంతాల్లో ఎసిబి అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఎసిబి వెల్లడించింది.

iqonic-blog

మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.1 శాతం ఈ ఉద్యోగాల కోతలో ఎక్స్‌బాక్స్ గేమింగ్ విభాగం నుంచి ఎక్కువ మంది ఉంటారు. అలాగే నాలుగు గేమింగ్ స్టూడియోలు కూడా మైక్రోసాఫ్ట్ నుంచి విడిపోతాయి. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం, కంపెనీ పనితీరును కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత జరుగుతోంది.

iqonic-blog

రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి టికి సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. పాప అదృశ్యమైన రోజు సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో ఒక కియా కారు అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు తాజాగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే కారు నర్సీపట్నం సమీపంలో జ్ఞానేశ్వరి తాతతో పాటు ఇతర బంధువులను కూడా బలంగా ఢీకొట్టినట్లు స్పష్టమైన సమాచారం బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో పాప కిడ్నాప్‌కు, ఆ ప్రమాదానికి ఏమైనా నేరుగా సంబంధం ఉందా […]

iqonic-blog

మణిపుర్ లో అనుమానిత మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉబ్రూల్ జిల్లాలో సైనికుల కాన్వాయ్ పై మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒకరు వారెంట్ ఆఫీసర్ కాగా.. మరొకరు డ్రైవర్ గా గుర్తించారు. జవాన్లు అస్సాం రైఫిల్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తిరిగివెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

iqonic-blog

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులను పరిశీలించడానికి కమిషన్ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించింది. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని 569 దరఖాస్తులను గుర్తించింది. రూల్స్‌ బ్రేక్ చేసిన వారి ఫారాలన్నింటినీ తిరస్కరించింది. ఏఐ (AI) సహాయంతో, ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించడం, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువసార్లు ప్రయత్నించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తును నింపడం వంటి కేసులను గుర్తించారు. ధృవీకరణ పూర్తైన తర్వాత, అటువంటి దరఖాస్తులన్నింటినీ […]

iqonic-blog

నిజామాబాద్ న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అతని భార్య సంధ్య, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుండి తిరిగి రావడంతో సంధ్య తన ప్రియుడు, భర్త ప్రశాంత్‌కు మందు తాగించి భవనంపై నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన భర్తకు ఎవరూ లేని సమయం చూసి బాత్రూమ్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా అతని నరాల్లోకి ఎక్కించింది.ప్రశాంత్ […]

iqonic-blog

వివాదాస్పద ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై వాట్సాప్ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసులపై స్పందించి, వివరణ ఇచ్చేందుకు కేంద్రం అదనపు సమయాన్ని ఇచ్చింది. మూడు రోజుల పాటు అదనపు సమయాన్ని కేటాయించింది. గత శుక్రవారం నాటికి కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే, అదే రోజు వాట్సాప్ మాతృసంస్థ మెటా నుంచి ఓ బృందం ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులను కలిసింది. అయితే, చర్చలు పూర్తయ్యే వరకూ భారత్‌లో ఆ […]

iqonic-blog

విశాఖతీరంలో అలజడి నెలకొంది చేపల వేట కోసం వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా, వారిలో ఒకరైన కారె చిన్నయ్యను సురక్షితంగా బయటపడ్డాడని విశాఖపట్నంలోని మత్స్యకార నాయకుడు రాజేష్ తెలిపారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్ , భారత నేవీ, మెరైన్ పోలీసులు యుద్ధప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నారు అని అన్నారు. ప్రతికూల వాతావరణం, అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో బోటుకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో బోటుతో సంబంధాలు తెగిపోవడంతో వెంటనే సహాయక […]

iqonic-blog

ఫాతిమా కళాశాల అంశాన్ని తెరపైకి తెచ్చి తమను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ తాము ఎలాంటి అక్రమాలకు లేదా అవినీతికి పాల్పడలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ వస్తున్న బెదిరింపులకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ సంస్థలను ఎలా రక్షించుకోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు. “మాదొక్క విద్యాసంస్థను కూల్చేస్తే.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మరో వంద విద్యాసంస్థలను నిర్మించి చూపిస్తాం” అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON