loader
iqonic-blog

ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల వేళ, ఇరాన్ సైన్యం వాషింగ్టన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. “ఏ అమెరికన్ సైనిక సిబ్బంది అయినా ఇరాన్‌లో అడుగుపెడితే, మేము వారిని అడ్డుకుంటాము, నరికేస్తాం” అని ఆయన అన్నారు. శత్రువు చేపట్టే ఎలాంటి చర్యకైనా గట్టిగా, సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్‌లోకి ప్రవేశించే ఏ విదేశీ సైనిక దళానికైనా తక్షణమే, కఠినంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్ సైన్య భూతల దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహి ఆదివారం […]

iqonic-blog

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత అనుమతులు లేవన్న కారణం అధికారులు దానిని తొలగించినట్లు సమాచారం. రాత్రివేళ గద్దెను కూల్చివేసిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు గద్దె నిర్మిస్తే రాత్రి సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు.

iqonic-blog

ఎల్ నినో ఎఫెక్ట్ కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసి, రైతాంగం, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో వరుణయాగాన్ని చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఈ జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున యాగాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

iqonic-blog

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియబోతుండగా.. అనూహ్యంగా మరో ఏడాది కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, రాహుల్ నవీన్ 2027, ఆగస్ట్ 13వ తేదీ వరకు డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు… తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈయన డైరెక్టర్ బాధ్యతల్లో […]

iqonic-blog

ప్రపంచ రవాణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం ఇరాన్, పాకిస్థాన్ ఓడరేవు వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రష్యా, భారతదేశాల మధ్య మల్టీ-మోడల్ మార్గం ద్వారా రైలు సరుకు రవాణా సాధ్యమవుతుంది. అయితే ఇది ఇంకా తుదిరూపు దాల్చలేదని, ప్రతిపాదన మాత్రమేనని, రష్యా ప్రభుత్వం దీని సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ‘టాస్’ వార్తా సంస్థ పేర్కొంది.

iqonic-blog

తాను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండబోదని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ అంశంలో ట్రంప్ ప్రతిపాదనను కూడా నెతన్యాహు తిరస్కరించారు. ఇది ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. గాజాపై ఇజ్రాయెల్ చాలాకాలంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 అంశాల ప్రణాళికతో ఒక రోడ్‌మ్యాప్ ప్రకటించారు. హమాస్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలన్నది వాటిలో ఒకటి. […]

iqonic-blog

అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జెట్టివారిపాలెం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ప్రమాదంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. దిలీప్ కుమార్ అకాల మరణంపై తీవ్ర […]

iqonic-blog

మాజీ మంత్రి బాలినేనిపై కరపత్రాలు ముద్రిస్తే పుస్తకాలు సరిపోవని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా ఆయన మాట్లాడుతున్నారని ఆయన కూటమిలో ఉన్నారని మౌనంగా ఉన్నాం.బార్ షాపులు సిండికేట్ చేసి తండ్రీకుమారులు రూ.కోట్లు వసూలు చేశారు. గత ప్రభుత్వంలో మాపై 79 కేసులు పెట్టించారు. బాలినేని పార్టీ మారారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే తండ్రీకుమారులను లోపల వేసేవాళ్లం. గత ప్రభుత్వంలో చేసినట్లు రౌడీయిజం చేస్తామంటే కుదరదు. జనసేనను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలకు పనిచేస్తున్నారని […]

iqonic-blog

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

iqonic-blog

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పతకాలతో దేశ కీర్తిని చాటిన విజేతలను ప్రధాని నేరుగా కలిసి అభినందనలు తెలిపారు. భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి టోర్నమెంట్‌లో ఏకంగా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అథ్లెట్లను ప్రధాని అభినందించి సత్కరించడం పట్ల క్రీడాకారులు తీవ్ర […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON