loader
iqonic-blog

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ లు కూడా బీజేపీలో చేరారు. ఇటీవల రాఘవ్ చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.  పలు సార్లు ఆయన ఆప్ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. రాజ్య సభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. కాగా, హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్సింగ్ ఠాకూర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారం జస్టిస్ లీసాగిల్ ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించనున్నారు. దీంతో ఏపీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రకెక్కనున్నారు.

iqonic-blog

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలో రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. రైతు వేదిక ముందు ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టిన రైతులు ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే పురుగుల మందు తాగుతామని చెప్పారు. ధాన్యం క్వాలిటీ పేరుతో గ్లాసుల్లో ధాన్యం తీసుకున్న అగ్రికల్చర్ అధికారిపై తిరగబడ్డ రైతులు అగ్రికల్చర్ అధికారిని,PACS అధికారులను సైతం రైతువేదికలో పెట్టి తలుపులు వేశారు రైతులు. రైతుల గోస పట్టించుకోకపోవడం వల్లే ఈస్థాయిలో తిరగబడాల్సి వచ్చిందని తమ […]

iqonic-blog

శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టారు. పోలీసులు అంగీకరించకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆర్టీసీ సంఘాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒత్తిడితో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో 22 ఏళ్లపాటు సేవలందించారు. శంకర్ గౌడ్ ను కడసారి చూసుకుని నివాళులు అర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు వేచి చూస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శంకర్ గౌడ్ ను కడసారి చూసేందుకు కార్మికులు భారీసంఖ్యలో […]

iqonic-blog

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతంలో గురుకులానికి వెళ్తున్న 11 ఏళ్ల దివ్యాంశ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. బాలుడి శరీరంపై 42 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అతని వీపు, చేతులు, కాళ్లు, ఛాతీపై లోతైన కమిలిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, అతని శరీరంపై 11 సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. దివ్యాంశ్ మేనమామ అయిన సౌరభ్ మిశ్రా అలియాస్ కన్హయ్య ఆ పాఠశాలను నడుపుతున్నాడు.

iqonic-blog

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “దీదీ పోవడం ఖాయం.. బీజేపీ రావడం తథ్యం” అంటూ ప్రజల్లో ఉత్సాహం నింపేలా నినాదాలు చేశారు. తొలి దశ ఎన్నికల్లో ఓటర్లు ఎన్నడూ లేనివిధంగా భారీ సంఖ్యలో తరలిరావడం చూస్తుంటేనే తృణమూల్ కాంగ్రెస్ శకానికి తెరపడిందని స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. మొదటి విడత పోలింగ్ ట్రెండ్స్ చూసిన తర్వాత, తాము కచ్చితంగా 110 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ఆయన జోస్యం చెప్పారు.

iqonic-blog

నన్ను ఓడించే సత్తా మీకు లేదు.. బెంగాల్ గడ్డపై మరోసారి జెండా ఎగురవేస్తా. తనకు వ్యక్తిగతంగా అధికారంపై ఆశ లేదని, కానీ బీజేపీని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని “బెంగాల్‌లో విజయం సాధించిన వెంటనే అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తాను. ఢిల్లీని వశం చేసుకుంటాను. నాకు కుర్చీ అవసరం లేదు, కానీ దేశం నుంచి బీజేపీ పతనం కావాలి. బెంగాల్‌లో వారిని నాశనం చేసి, ఢిల్లీలో కూడా అధికారం నుంచి తరిమికొడతాను” అని పశ్చిమ […]

iqonic-blog

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతల మధ్య మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూపాలపల్లి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ అనే కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పటికే ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా, తాజాగా జరిగిన ఈ ఘటన కార్మిక వర్గాల్లో మరింత కలకలం రేపింది. వరంగల్‌లోని ఎంజీఎం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు, ఇటు తోటి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON