loader
iqonic-blog

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగాపనిచేసారు ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు

iqonic-blog

ఆగస్టు 1న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ విమానం భోగాపురంలోనే ల్యాండ్ అవుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. అదే రోజు ఏఎస్ఐపీ సెమీకండక్టర్ పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.భోగాపురం వెళ్లడానికి ప్రయాణ సమయం తగ్గేలా పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లు తొలగించామన్నారు.

iqonic-blog

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్ కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 24వ తేదీన నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ ప్రకటన విడుదల చేసింది. ఆయా పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో చెబుతామని పేర్కొంది. జేఎన్టీయూ పరిధిలోనూ 24న జరగాల్సిన […]

iqonic-blog

నీట్ 2026 పరీక్షకు సంబంధించిన వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రముఖుల మద్దతు క్రమంగా పెరుగుతోంది. బాలీవుడ్ నటీనటుల తర్వాత తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, విద్యా వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని పేర్కొన్నారు. నీట్ వంటి అత్యంత పోటీ పరీక్షల కోసం సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమయ్యే విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనిశ్చితి బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.

iqonic-blog

నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. దాంతో, భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 23, గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్‌ నుంచి ఒటిన్నర (1.5 కి.మీ) కిలోమీటర్ల వరకూ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అర్ధ రాత్రి 12 గంటల వరకు ఆ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు […]

iqonic-blog

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో రసాబాస చోటుచేసుకుంది. సమావేశం కొనసాగుతుండగా కోదండరాం, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లతో మహిళా ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఉద్యమకారులకు కమిటీ అన్యాయం చేస్తోందని మహిళా ఉద్యమకారులు ఆరోపించారు. మహిళా ఉద్యమకారులను అద్దంకి దయాకర్ వారించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

iqonic-blog

గురువారం దేశీయ మార్కెట్లో క్రూడ్ ఫ్యూచర్స్ ధర దాదాపు 6 శాతం పెరిగింది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని తిరిగి చేరుకోవడంతో ఈ పెరుగుదల వచ్చింది. దీని ప్రభావం భారత్‌లోని కమోడిటీ మార్కెట్‌తో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లపైనా కనిపించింది. న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (నైమెక్స్)లో సెప్టెంబర్ కాంట్రాక్ట్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ధర 4.22 డాలర్లు పెరిగి, 5 శాతం లాభంతో బ్యారెల్‌కు 91.05 డాలర్లకు చేరుకుంది.

iqonic-blog

హీరో నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెనన్ ఏఐజీ ఆసుపత్రి విడుదల చేసింది. ఎడమ కాలులోని క్వాడ్రిసెప్స్ టెండన్ (తొడ కండరాన్ని మోకాలి చిప్పతో కలిపే ప్రధాన కణజాలం) పూర్తిగా విరిగిపోయిందని.. పలు చోట్ల చీలికలు వచ్చినట్లు పేర్కొంది. దీంతో సుమారు 3 గంటల పాటు డాక్టర్ల బృందం శ్రమించి, విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు వివరించింది.కోలుకోవడానికి మరికొంత సమయం.. గాయమైన ప్రదేశం అత్యంత సున్నితమైందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి పేర్కొన్నారు.

iqonic-blog

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని రాహుల్‌ గాంధీ చెప్పారు.మొదట ఇండియా గేట్‌ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థులు ఒంటరివారు కాదన్న రాహుల్ వారితో తామంతా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించారు.మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాహుల్‌ గాంధీ నివాసం చుట్టుపక్కల బందోబస్తు పెంచారు.

iqonic-blog

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా ఆసుపత్రిలో  విషం సేవించిన ఓ యువకుడికి సాధారణ సెలైన్‌కు బదులుగా రెండు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ నుంచి డ్రిప్ ఇస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈ ఆరోపణలను దిండోరి చీఫ్  ఆఫీసర్ డాక్టర్ మనోజ్ పాండే ఖండించారు.రోగికి మినరల్ వాటర్‌ను డ్రిప్ రూపంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎలుకల విషం సేవించిన తర్వాత గ్యాస్ట్రిక్ లావేజ్ (కడుపును శుభ్రపరిచే ప్రక్రియ) నిర్వహించామని, ఆ ప్రక్రియలో ఉపయోగించిన బాటిల్ మాత్రమే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON