తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.1976లో విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా జీవీ నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, సహచర నటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
- Posted on
- By Admin
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు మళ్లీ మొదలయ్యాయి. సాగర్ కుడికాలువ గేట్లను ఎత్తి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు చేపట్టిన యత్నాన్ని తెలంగాణ ఇంజనీర్లు తీవ్రంగా ప్రతిఘటించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేదా ఆదేశాలు లేకుండా గేట్లు ఎలా తెరుస్తారంటూ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- Posted on
- By Admin
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు దగ్గర విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు చనిపోయారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నారు.. ప్రమాదంలో చనిపోయినవారిని చిలకలూరిపేట మండంల వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వేలూరు వెళ్తుండగా […]
- Posted on
- By Admin
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం మరోసారి న్యాయస్థానం ముందుకు వెళ్లింది. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తై, తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా వార్డు వారీ ఓటర్ల జాబితాలను తుది SIR జాబితా ఆధారంగానే రూపొందించాలని అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరినట్లు సమాచారం.
- Posted on
- By Admin
చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల ( ₹1.72 లక్షల కోట్లు) పరిహారాన్ని అమెరికా రాష్ట్రాలకు, యూఎస్ ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలకు చెల్లించేందుకు అంగీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీనేజర్లు, చిన్నారులు సోషల్ మీడియాకు బానిసయ్యేలా ఇస్టా, ఫేస్బుక్ వేదికలను మెటా సంస్థ నిర్వహించిందని,చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పడే ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అమెరికా రాష్ట్రాలు కేసు వేసిన విషయం తెలిసిందే.
- Posted on
- By Admin
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. దాదాపు 23 రోజుల తరువాత మత్స్యకారుల ఆచూకీ లభించిందని జిల్లా కలెక్టర్ బుధవారం వెల్లడించారు. దాదాపు మూడు వారాల తరువాత మత్స్యకారులు ఎలా ఉన్నారు అనేది తెలిసేసరికి కుటుంబసభ్యులకు ప్రాణాలు లేచొచ్చినట్లు అనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్ తీరంలో ఉన్న కోనసీమ మత్స్యకారులను సురక్షితంగా ఏపీకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Posted on
- By Admin
హెచ్-1బీ వర్క్ వీసాలపై ప్రతిపాదించిన 1,03,265 డాలర్ల అదనపు రుసుము అమెరికాలోని ఉద్యోగాలను విదేశాలకు తరలించే పరిస్థితి తీసుకురావచ్చని భారతీయ-అమెరికన్ సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (ఫియిడ్స్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత భారీ రుసుము వల్ల కంపెనీల చట్టబద్ధమైన నియామకాలు కూడా ఆర్థికంగా భారంగా మారతాయి. ఫలితంగా అధిక విలువ కలిగిన ఉద్యోగాలను అమెరికా వెలుపల ఏర్పాటు చేసేలా సంస్థలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఫియిడ్స్ పేర్కొంది.
- Posted on
- By Admin
నేపాల్ ప్రధాని బాలెన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు.
- Posted on
- By Admin
ఆపరేషన్ ఉడాన్ లో భాగంగా గజపతి పోలీసులు ఐదుగురు మైనర్ బాలికలకు విముక్తి కలిగించారు. రాయగడ-కంధమాల్-గజపతి సరిహద్దు ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నేపథ్యంలో ఠాణా ఇన్స్పెక్టర్ నళిని కోరో ఓ బృందంతో హైదరాబాద్ వెళ్లి పలు ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను రక్షించినట్లు తెలిపారు. ఐదుగురు మైనర్ బాలికలను హైదరాబాద్ నుంచి మంగళవారం గజపతి జిల్లాకు తీసుకుని వచ్చినట్లు వెల్లడించారు. ముఖ్య సూత్రధారి అయిన నిందితుడు రాజ్ కుమార్ బాస్తారాయన్ను అరెస్టు […]
- Posted on
- By Admin
నేపాల్ ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది.ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో అత్యవసరం సమావేశం నిర్వహించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.బిహార్ లోని డ్యామ్ లు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని అధికారులను అప్రమత్తం చేశారు.ఈ వరదల కారణంగా గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
- Posted on
- By Posts Admin
- Business254
- District30
- Entertainment717
- General15567
- Health80
- Politics1938
- Sports529
- Technology301
- Uncategorized2
- World1447
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District