loader
iqonic-blog

బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం ఘనంగా దావత్ -ఎ -ఇఫ్తార్ నిర్వహించారు.  కెటిఆర్ పాల్గొని మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఏ విధంగా వంచించిందో శాసనసభ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇమామ్, మౌజమ్‌లకు రంజాన్ కానుక ప్రకటించింది. ఇమామ్‌, మౌజమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించి.. వాటిని ముస్లిం వర్గాల సంక్షేమానికి […]

iqonic-blog

పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ బదిలీలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనా, డీజీపీ మరియు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ చర్యపై స్పందించిన మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

iqonic-blog

సరదాగా ఈత కొడదామని వెళ్ళిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన గండిపేట మండలం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన గోవర్ధన్ (26) గోవర్ధన్ తమ్ముడు కార్తీక్ (19), బంధువు వెంకటేష్ (19) ఆదివారం గండిపేట్ జలాశయం బ్యాక్ వాటర్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ముగ్గురిలో ఒకరు నీట మునిగి పోతుంటే కాపాడే క్రమంలో ముగ్గురు మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

iqonic-blog

టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసు లో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోయాడు. నాంపల్లి కోర్టులో సోమవారం అతడు సరెండర్ అయ్యాడు. 24 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న అతడు.. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయాడు. ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి, ఆమె కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. చికిత్స పొందుతూ ప్రత్యూష 2022 ఫిబ్రవరి 23న మరణించగా.. సిద్దార్ధ్ ప్రాణాలతో బయటపడ్డాడు. తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్య అని ఆమె తల్లి […]

iqonic-blog

ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిద్ధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రధానం చేస్తారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్‌గా పని చేశారు.

iqonic-blog

ఎయిర్ ఇండియాలో కొత్త మోసం,  దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఎయిర్ ఇండియాలోని సుమారు 4,000 మంది ఉద్యోగులు ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత ఈ భారీ […]

iqonic-blog

తొలిసారి ఐసీసీ ఛాంపియన్లుగా చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లను BCCI ఘనంగా సత్కరించింది. ఆదివారం కన్నులపండువగా జరిగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ప్రత్యేక మెడల్స్‌ ప్రదానం చేశారు అధికారులు. భారత మహిళల క్రికెట్‌ జట్టును అందని ద్రాక్షలా ఊరించిన ఐసీసీ ట్రోఫీని 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కొల్లగొట్టింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీశ్ శుక్లా, జాయింట్ సెక్రటరీ ప్రభుతేజ్ సింగ్ భాటియా మెడల్స్ బహుకరించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON