loader
iqonic-blog

ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలోకి ఎక్కిన అనంతరం లోపల ఏసీ పని చేయలేదు. విమానంలో గాలి సరిగా లేకపోవడంతో లోపల ఉన్ 150 మంది ప్రయాణీకులు చెమటతో తడిసి ముద్దయ్యారు. విమానంలో గాలి ఆడక పరిస్థితి విషమిస్తున్నప్పటికీ.. పైలట్లు విమానాన్ని రన్‌వే వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.పరిస్థితి చేయిదాటిపోవడంతో రన్‌వేపై టేకాఫ్ ను నిలిపివేయడంతో పాటు ప్రయాణీకులను విమానం నుంచి కిందకు దింపేశారు. చివరకు సాంకేతిక బృందం వచ్చి పరీశీలించిన తర్వాత ప్రయాణీకులను తెల్లవారుజామున […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబు చేతుల మీదుగా గురువారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అయితే ఇలాంటి కీలకమైన ప్రారంభోత్సవాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం‌ను మంత్రి నారాయణ, బుధవారం రోజు కలిశారు. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అయితే విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు డిప్యూటీ సీఎంవో వెల్లడించింది.

iqonic-blog

ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ ఈరోజు(బుధవారం) హాజరయ్యారు. ఈ కేసులో జత్వానీ సోదరుడు, తల్లిదండ్రులు పేర్లు తొలగించటంపై లిఖిత పూర్వకంగా తన అభ్యంతరాలను సీఐడీ కోర్టుకు విద్యాసాగర్ అందజేశారు. కొంత డబ్బును జత్వానీ తల్లి ఆశా జత్వానీ అకౌంట్‌కు బదిలీ చేశానని  తెలిపారు. కొన్నిసార్లు జత్వానీ తల్లి ఫోన్ చేసి తన కుమార్తె చెప్పినట్లుగా చేయాలని లేకపోతే ఇబ్బంది పడతావని బెదిరించిందని అన్నారు

iqonic-blog

సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడిన ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంపై సికింద్రాబాద్‌లోని KIMS ఆసుపత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.డాక్టర్ పూర్ణచంద్ర నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకొని, సాధారణ స్థితికి చేరుకోవడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుందని హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశారు.

iqonic-blog

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన డేటా సెంటర్ల స్థాపనపై వస్తున్న పుకార్లకు ముఖ్యమంత్రి తెరదించారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటయ్యే డేటా సెంటర్ల అవసరాలకు కేవలం 3.5 టీఎంసీల (TMC) నీరు సరిపోతుందని స్పష్టం చేశారు. పరిశ్రమల వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందంటూ కొందరు కావాలని అపహాస్యాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆధునిక డేటా సెంటర్లు పర్యావరణహితమైన సాంకేతికతతో పనిచేస్తాయని సీఎం వివరించారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని […]

iqonic-blog

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం పరిధిలోకి వచ్చే ఉప్పాడ గ్రామానికి సముద్ర కోత ముప్పు సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన పవన్ .. ఉప్పాడ తీర రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ ఇవాళ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ రక్షణ కోడ నిర్మించేందుకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ -మద్రాస్‌కు ప్రభుత్వం అప్పగించింది.

iqonic-blog

ఉత్తర కొరియా సైనిక చర్యలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా జపాన్‌పైకి ఉత్తర కొరియా ఒక బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర కొరియా తన తీర ప్రాంతం నంచి జపాన్‌పైకి ఒక మిస్సైల్‌ను పరీక్షించింది. వోన్సమ్ ప్రాంతంలోని ఉత్తర తీరం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్.. జపాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ సమీపంలో పడ్డట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కూడా ఉత్తర కొరియా.. జపాన్‌పైకి దాడికి […]

iqonic-blog

ఏపీలో గత కొద్దిరోజులుగా అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి.ధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో వన్ టౌన్ కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ పైనే దాడి చేయడంతోపాటు, కత్తులతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

iqonic-blog

దేశ రాజకీయాల్లో మళ్లీ ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ సెగలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గాల విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన మంత్రి ఆధవ్ అర్జున్, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు కాదని, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునే హక్కుల పోరాటమని స్పష్టం చేశారు.గతంలో మూపనార్ వంటి నాయకులకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో దక్షిణాది నుంచి, ముఖ్యంగా తమిళనాడు నేల నుంచే దేశ ప్రధాని రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

iqonic-blog

అమిత్‌ షా ప్రతిపాదనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయనతో చర్చించడానికి మాకేం భయం లేదని అన్నారు. ఆయన చెప్పే ఉపన్యాసాలు వినడానికి ప్రతిపక్షానికి ఆసక్తి లేదని, విద్యార్థులపై కాల్పులు ఎవరు జరిపారు. మేకులు ఉన్న లాఠీలతో ఎవరు కొట్టించారు అని రాహుల్‌ ప్రశ్నించారు. వీటిపై సమాధానాలు చెప్పేందుకు 20 రోజులుగా అమిత్‌ షా కనిపించకుండా పోయారని, సమాధానం చెప్పే ధైర్యం లేక సభకు రావడం లేదని అన్నారు. ఏ విషయంలోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON