loader
iqonic-blog

ఇన్‌స్టాగ్రామ్‌లో నాగార్జునతో కలిసి దిగిన స్పెషల్ ఫొటోను షేర్ చేసిన అఖిల్.. “హ్యాపీ బర్త్‌డే మై ముఫాసా. మా కోసం మీరు చేసే ప్రతిదానికీ, మాపై చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు లేకుండా మాకు ఏదీ సాధ్యం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా నాకు మంచి తండ్రిగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ నాన్న.. ఎప్పుడూ సంతోషంగా ఉండండి” అంటూ రాసుకొచ్చారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ అఖిల్ పెట్టిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.

iqonic-blog

తెలంగాణలోని Bi.P.C స్ట్రీమ్ విద్యార్థులకు బి.ఫార్మసీ, ఫార్మ్-డి (Pharm-D), బయో-టెక్నాలజీ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ వ్యవధిలో తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు నిర్ణీత కేంద్రాల్లో  సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

iqonic-blog

 ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బంది ఏకకాలంలో బంజారాహిల్స్‌లోని చట్నీస్, స్పైస్ 6, ఓహ్రీస్.. జూబ్లీహిల్స్‌లోని ది స్పైసీ వెన్యూ.. టోలిచౌకిలోని ఫోర్ సీజన్స్ మల్టీకుజీన్, షా గౌస్.. గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేపట్టాయి. వంటగదుల్లో పురుగుల బెడద ఉండటంతో పాటు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నట్లు తేలింది. ఆహారాన్ని నిల్వ చేసే విధానంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడం, వంటల్లో కుళ్లిపోయిన కూరగాయలను వాడటం లాంటి తీవ్రమైన ఉల్లంఘనలను అధికారులు గమనించారు.

iqonic-blog

గత ప్రభుత్వ హయాంలో మతమార్పిడులను ప్రోత్సహించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై YCP తీవ్రంగా మండిపడింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు తెరలేపుతోందని పార్టీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం సాధించిన విఫలాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.భార్యాభర్తల వ్యక్తిగత, అంతర్గత వివాదాలను తీసి రాజకీయ పార్టీకి, మతానికి ముడిపెట్టి స్వార్థ ప్రయోజనాలు పొందాలని చూడటం […]

iqonic-blog

మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ అత్యాచారం చేశాడన్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం నగరంలో కలకలం రేపింది సీరియస్‌గా పరిగణించిన ఎంఐఎం పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై వేటు విధించడం నగరంలో సంచలనం సృష్టించింది. సస్పెన్షన్‌కు సరైన కారణాలను పార్టీ వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకున్న స్థానికులు సదరు ఎమ్మెల్సీని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు […]

iqonic-blog

పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో నడిబొడ్డున ఉన్న చెర్లోపల్లి గ్రామంలో నిత్యం జరుగుతున్న అక్రమ గ్రానైట్ క్వారీ బ్లాస్టింగ్‌ ల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం గ్రామానికి చెందిన ఈశ్వర్ యాదవ్ అనే రైతు తన పొలంలో ట్రాక్టర్‌ తో దుక్కి దున్నుతుండగా.. సమీపంలో అక్రమ బ్లాస్టింగ్ జరిపారు.ఆ పేలుడు ధాటికి భారీ క్వారీ రాయి తీవ్రమైన వేగంతో వచ్చి.. పొలం దున్నుతున్న రైతు పక్కనే పడి పెద్ద గుంత పడటంతో, కొద్దిలో ప్రాణాలు పోయేవని […]

iqonic-blog

ఒంగోలు పౌరుషానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు జాతి గిత్తకు 12 అడుగుల భారీ విగ్రహాన్ని నగర శివారులో ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ శిల్పి లక్కు వర్మ జీవం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. కండలు తిరిగిన దేహంతో,ఒంగోలు గిత్త కళ్లు, వాడి కొమ్ములు, దర్పం ఉట్టిపడేలా ముఖ కవళికలను అద్భుతంగా చెక్కారు.

iqonic-blog

నీట్‌ పీజీకి సన్నద్దమవుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో అపరాజిత హాస్టల్లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యశ్విత శనివారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్విత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతుంది. పరీక్షల మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

iqonic-blog

నేపాల్ వరదల్లో 97 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించారు. నువాకోట్ జిల్లా టుపే ప్రాంతంలోని ఓ సంరక్షణ గృహంలో గుణ మాయా బొహారా అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆమె ఉంటున్న భవనం కొట్టుకుపోయింది. మట్టి దిబ్బగా మారిన ఆ నివాసంలో అనేక మంది చనిపోగా.. మాయ మాత్రం బురదలో కూరుకుపోయి సజీవంగా కనిపించారు. నాలుగు గంటలపాటు శ్రమించిన రెస్క్యూ బృందాలు.. ఆమెను సురక్షితంగా కాపాడాయి.

iqonic-blog

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, డీఏల సాధనతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సెప్టెంబర్ నెలలో పలు ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGCPSEU) నిర్ణయించింది. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1ను సీపీఎస్ విద్రోహ దినంగా పాటించాలని జేఏసీ నిర్ణయించిందని తెలిపారు. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON