loader
iqonic-blog

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వే సిరీస్‌లో ఆడిన 8 మందిని ప్లేయర్లను పక్కన పెట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. జట్టు నుంచి బయటకు వెళ్లిన 8 మందిలో యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఉన్నాడు. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల నుంచి కోలుకుని మళ్లీ […]

iqonic-blog

పోలవరం జిల్లా  ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడంతో 54 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక బాలిక మృతిచెందగా, మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ తెలిపారు. బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

iqonic-blog

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 – 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు.2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది.

iqonic-blog

కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు .

iqonic-blog

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, వాటికి న్యాయపరమైన భరోసా కల్పించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సెప్టెంబర్ 5న నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఉపసంహరించుకుంటున్నట్లు సిజెపి సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరై, సంస్థ తరఫున ఆయన ఈ ప్రకటన చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు అమలవుతాయని ఆశిస్తున్నామని, ఈ నిర్ణయానికి సహకరించిన న్యాయస్థానానికి, ఇరుపక్షాల న్యాయవాదులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొనసాగించబోమన్న హామీలను కేంద్రం గౌరవిస్తుందని స్పష్టం […]

iqonic-blog

హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాల వేళ కొత్త వివాదం రాజుకుంటోంది. తాము అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతించబోమని హైడ్రా (HYDRAA) తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ సూచించిన చెరువులు, జల వనరుల్లో మాత్రమే నిమజ్జనం చేసుకోవాలని చెబుతోంది. దీనిపై గణేశ్ ఉత్సవ సమితి అభ్యంతరం చెబుతోంది. నిమజ్జనాన్ని అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఎలా అయితే చేశామో.. ఇప్పుడు కూడా నిమజ్జన ప్రక్రియ అలాగే ఉంటుందని చెబుతోంది.

iqonic-blog

పులివెందులలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క స్థానంలోనూ అధికార కూటమి ఏకగ్రీవమయ్యేందుకు అవకాశం ఇవ్వకూడదని, ప్రతి పంచాయతీ, వార్డు మరియు మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా బరిలో నిలవాలని ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని లేదా పోలీసులను ఉపయోగించి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడితే వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఏ నాయకుడు లేదా కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

iqonic-blog

రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ ఐస్ క్రీమ్ వ్యాపారంలోకి అధికారికంగా  అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ‘బాంబే క్రీమెరీ’ (Bombay Creamery) బ్రాండ్ పేరుతో ప్రీమియం కేటగిరీ ఐస్ క్రీమ్‌లను  మార్కెట్లోకి తేనున్నట్లు వెల్లడించింది. స్వచ్ఛమైన పాలు, అత్యుత్తమ  నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచ స్థాయి ఐస్ క్రీమ్ అనుభూతిని భారతీయులకు అందిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ సంస్థ రూ. 10 ప్రారంభ ధరకే ఈ ఐస్ క్రీమ్‌లను అందుబాటులోకి తేస్తుండటం విశేషం.

iqonic-blog

అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‌కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎంపిక బుధవారం జరగనుంది. ఇందుకోసం ఎంపిక కమిటీ రూపొందించిన ముగ్గురు సభ్యుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. బుధవారం జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో సీఈఓతో పాటు ప్యానెల్‌లోని ఇద్దరు సభ్యులు, జనరల్ సెక్రటరీ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

iqonic-blog

మమితా బైజు బాక్సాఫీస్ వద్ద అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్నారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన   మూడు విభిన్న చిత్రాలు ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాయి. ఒకే కథానాయిక నటించిన మూడు వరుస చిత్రాలు ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి. రూ.300 కోట్ల ‘జననాయగన్’ రూ.240 కోట్లు రాబట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’,  రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రాలతో సరికొత్త రికార్డుగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON