loader
iqonic-blog

క్విట్ ఇండియా ఉద్యమం (భారత్ విడిచి పో ఉద్యమం) అనేది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, 1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన రాజకీయ ఉద్యమం. దీని ప్రధాన లక్ష్యం భారతదేశంపై బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని డిమాండ్ చేయడం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ పేర్కొన్న “భారతదేశం నుండి బ్రిటిష్ వారు క్రమబద్ధంగా వైదొలగాలి” అనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సామూహిక నిరసన ఉద్యమాన్ని ప్రారంభించింది.

iqonic-blog

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) విధానంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విధానం పేరిట ప్రభుత్వం సామాన్య ప్రజల జేబుల్లోంచి నేరుగా డబ్బులను దొంగిలిస్తోందని ఆయన ఆరోపించారు. E20 ఇంధనం వల్ల వాహనదారులకు మైలేజ్ తగ్గడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని ఇది అత్యంత తీవ్రమైన అంశమని, దీనిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాన్ని […]

iqonic-blog

డాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్రెసిడెంట్‌ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్‌ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్‌ ఆరోపిస్తుంది. మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా సహాయం ఉండదని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది.

iqonic-blog

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఉంచాలని విద్యాశాఖ సూచించింది. అలాగే పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో కూడా ఫీజుల వివరాలను నమోదు […]

iqonic-blog

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ (SBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 1500కు పైగా జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్టు అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద ఏపీలోని అమరావతి సర్కిల్లో 88 పోస్టులు ఉండగా.. తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్లో 32 పోస్టులు ఉన్నాయి. https://ibpsreg.ibps.in/sbijasrdjl26/

iqonic-blog

అక్టోబర్ నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అమరావతి సచివాలయంలో విలేకర్లతో మాట్లాడిన తమీమ్ అన్సారియా.. డీఎస్సీ 2025పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించామన్నారు. అయినప్పటికీ డీఎస్సీ 2025పై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని.. ఆందోళనకు గురికావద్దని సూచించారు.

iqonic-blog

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి కిందకు వస్తున్న ఓ కారు అదుపుతప్పి, 22వ మలుపు వద్ద ఉన్న పిట్టగోడను బలంగా ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భక్తులలో కర్ణాటకకు చెందిన సతీష్ కుమార్‌ ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా వుంది, అలాగే కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి […]

iqonic-blog

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉభయులు భేటీ అయ్యారు.సమావేశం వివరాలు వెల్లడి కానప్పటికీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాత మిత్రపక్షాలు మళ్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోచేతులు కలిపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.సాగు చట్టాల అంశంపై ఆరేళ్ల క్రితం ఎన్డీయే నుంచి ‘సాద్’ వైదొలిగింది. ఎన్డీయేలో 20 ఏళ్లుగా సాద్ కొనసాగింది.

iqonic-blog

పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.’మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరిట మూడు దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి.సౌదీ లోని మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లు సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశారు.

iqonic-blog

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ఫ్లాట్స్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అడ్మిన్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, ఆ కళాశాల మహిళ ప్రిన్సిపాల్‌తో కొంత కాలంగా కళాశాలోని అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ప్రవర్తన రోజు రోజుకు శృతిమించడంతో కార్యాలయంలో సిసి కెమెరాను ఏర్పాటు చేయడంతో వీరి భాగోతం బట్టబయలైంది. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి కార్యకలాపాలు కళాశాలలో నిర్వహిస్తే పిల్లలకు ఏం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON