ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే సూచనలు ఉన్నాయని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అప్రమత్తత ప్రకటించాయి.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు […]
- Posted on
- By Admin
చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణ ను కాపాడు కోవలసిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలంగాణను అవమానించిన తెలంగాణ ద్రోహి బక్కని నరసింహులని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి , బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ […]
- Posted on
- By Admin
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రవేశం వేళ మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నాయి. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందన్నారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
- Posted on
- By Admin
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వయోభారం కారణంగా.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో, 1994లో పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి ,2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొంది.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి,వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లోమంత్రిగా పని చేశారు.
- Posted on
- By Admin
పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్లో ఈ నెల 26న 102 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్లో మొత్తం 1,977 వార్డులకు ఎన్నికలు జరగగా 1,735 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 850 స్థానాలకుపైగా ఆప్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో కాంగ్రెస్ 342, శిరోమణి అకాళీదర్ 165, బీజేపీ 131, ఇండిపెండెంట్లు 241 సీట్లు దక్కించుకున్నాయి.
- Posted on
- By Admin
కర్ణాటక రాజకీయ పరిణామాల ప్రభావంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు ఒక్కసారిగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. డీకే శివకుమార్ కుటుంబానికి కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఉన్న బంధం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను […]
- Posted on
- By Admin
సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడినందుకు ఐక్యరాజ్యసమితి (UN) వార్షిక నివేదికలో రష్యా, ఇజ్రాయెల్ దళాలను బ్లాక్లిస్ట్లో చేర్చడం వివాదాస్పదంగా మారింది. ఈ నివేదికపై రెండు దేశాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల కారణంగా రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఐరాస నివేదికలో ఇజ్రాయెల్ దళాలను తొలిసారి చేర్చారు.
- Posted on
- By Admin
హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి రక్షిస్తున్న హైడ్రా విభాగంలో ట్రాన్స్ జెండర్లు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తమకు లభించిన ఉద్యోగాలతో సమాజంలో గౌరవాన్ని పొందుతూ, ఆర్థిక భరోసాతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్ జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరికి ‘హైడ్రా ఈగల్ టీమ్’ గా ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా యూనిఫామ్ ధరించడం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని స్పష్టం […]
- Posted on
- By Admin
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు ఇద్దరి మధ్య మంత్రాంగం సాగింది. రాష్ట్ర రాజకీయాల పైన చర్చ జరిగింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని షర్మిల కోరినట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం…ఆ దిశగా కసరత్తు చేస్తోంది. కర్ణాటక లేదా ఢిల్లీ కోటాలో షర్మిలకు రాజ్యసభ దక్కే అవకాశం […]
- Posted on
- By Admin
సీఎం విజయ్ ఇవాళ రాష్ట్రంలోని పలువురు ఉన్నతాధికారుల్ని కలుసుకున్నారు. వీరిలో కొత్తగా నియామకాలు పొందిన వారు కూడా ఉన్నారు. వీరితో కలిసి విజయ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో తమిళనాడు సంప్రదాయ పంచె కట్టులో కనిపించారు. ఎప్పుడూ బ్లేజర్ లో కనిపించే విజయ్.. ఇలా పంచె కట్టులో కనిపించే సరికి అధికారులు కూడా కొత్తగా చూస్తున్నట్లు ఇందులో కనిపించింది. గతంలో తమిళనాడును ఏలిన ప్రతీ ముఖ్యమంత్రి ఇలా సంప్రదాయ పంచె కట్టునే కొనసాగించారు.
- Posted on
- By Admin
- Business228
- District28
- Entertainment646
- General12825
- Health64
- Politics1686
- Sports442
- Technology279
- Uncategorized2
- World1271
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District