loader
iqonic-blog

ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభించింది. మన్యం ప్రాంతాలకు చెందిన సంప్రదాయ థింసా నృత్యం వేలాది మంది గిరిజన బాలికల సమిష్టి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 13 వేల మంది గిరిజన బాలికలు ఒకేసారి లయబద్ధంగా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. నిర్ణీత నిబంధనల ప్రకారం జరిగిన ఈ భారీ ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

iqonic-blog

భారత్ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. 4 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్ట్ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్ గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇది భారత్ కు ఐదో స్వర్ణం […]

iqonic-blog

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న ప్రారంభం కానుంది. ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. దాదాపు 2,203 ఎకరాల్లో రూ. 4,592 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు.

iqonic-blog

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ శనివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల మధ్య టెర్మినల్‌ భవనం నుంచి ఓపెన్ టాప్‌ జీప్‌లో బహిరంగ సభా వేదికకు ప్రధాని చేరుకుంటారు. పదకొండున్నర నుంచి 12 గంటల 55 నిమిషాల మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగసభలో ప్రధాని ప్రసంగం […]

iqonic-blog

మాజీ మంత్రి అంటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో మంగళగిరి సీఐడీ ఆఫీస్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, అంబటి రాంబాబు మధ్య కొద్ది రోజులుగా తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పెమ్మసాని చేతికి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోను అంబటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ టీడీపీ నేత ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదైంది.

iqonic-blog

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రేపు (ఆగస్టు 1) దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్ట్ పనుల పురోగతిని ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయానికి ప్రతీక అయిన ‘థింసా’ నృత్యాన్ని ప్రారంభోత్సవ వేదికపై కళ్లుచెదిరే రీతిలో ప్రదర్శించాలని సూచించారు.

iqonic-blog

డ్యాన్స్ రిహార్సల్స్ సమయంలో రష్మిక మందన్న గాయపడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలుకు, నడుముకు గాయాలయ్యాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై రష్మిక లేదా ఆమె బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఓ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఆమెకు ప్రమాదం జరిగినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

iqonic-blog

మహిళా ఎస్సైతో అనుచితంగా ప్రవర్తించిన వైకాపా నేతల పై ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటనలో బూర్జ ఎస్సై ప్రవల్లికపై ఆమదాలవలస వైకాపా ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్, ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించి దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలో మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతాడ రవికుమార్ ను ఏ1గా పేర్కొన్నారు.

iqonic-blog

సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో సీదిరి అప్పలరాజు కుమారుడి బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. ఈ కేసులో కుమారుడిని రక్షించేందుకు ఆయన సాక్ష్యాలు తారుమారు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

iqonic-blog

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. 48 కిలోల మహిళల జూడో విభాగంలో అస్మిత దే స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ పోరులో కెనడాకు చెందిన హైడి క్వాచ్ను 2-1 తేడాతో ఆమె ఓడించింది. కామన్వెల్త్ గేమ్స్ భారత్ జూడోలో స్వర్ణం సాధించడం ఇదే  తొలిసారి. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు ఇది నాలుగో స్వర్ణ పతకం. దీంతో మొత్తం పతకాల సంఖ్య 18కి చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON