loader
iqonic-blog

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.70 నుంచి రూ.80 వరకు చేరింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి క్వింటాల్ ధర రూ.5,200 నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవుతోందని, రోజుకు సుమారు 5,200 నుంచి 6,000 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

iqonic-blog

 ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ హోదా పొందిన సుమారు 9.09 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఫ్రీహోల్డ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని  ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ హోదా  పొందిన 7.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1.36 లక్షల ఎకరాల గ్రామసేవా ఇనాం భూముల యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించింది.

iqonic-blog

కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు.. కన్ని మాస పూజల కోసం ఈ సాయంత్రం తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5: 30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు మేల్‌శాంతి ఈడీ ప్రసాద్ నంబూద్రి, ప్రధాన తంత్రి బ్రహ్మదత్తన్ సమక్షంలో గర్భగుడి తలుపులను శాస్త్రోక్తంగా తెరిచి దీపారాధన చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు కన్ని మాస పూజలు ముగిసిన అనంతరం ఈ నెల 21వ తేదీ ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేయనున్నారు.

iqonic-blog

భారత క్రికెట్ జట్టు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ త్వరలోనే వివాహ బంధంలోకి  అడుగుపెట్టబోతున్నారు. వీరిద్దరి పెళ్లి తేదీ ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని హోటల్‌ రమడలో ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. చాలాకాలంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ వార్తలపై విస్తృతంగా చర్చ సాగింది.

iqonic-blog

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మంగళవారం రోజున మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. నకిలీ మద్యం కేసులో వీరికి ముందస్తు బెయిల్ లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. కోర్టు వీరిద్దరికీ సెప్టెంబర్ 28 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

iqonic-blog

తెలంగాణలోని నిషేధిత జాబితాలో నమోదైన భూముల సమస్యల (22A Land Issue)కు శాశ్వత పరిష్కారం దిశగా, భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏళ్లుగా సాగుతున్న అసైన్డ్  భూముల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, పరిష్కరించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ, బాధ్యతలు స్వీకరించిన 30 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

iqonic-blog

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కారు బస్సును ఢీకొట్టిన రోడ్డు ప్రమాదాన్ని లైవ్ కవరేజ్ చేయడానికి వెళ్లిన వార్తా సంస్థ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది.   ఆ దృశ్యాలను గగనతలం నుంచి కవర్ చేయడానికి KNBC-TV సంస్థకు చెందిన న్యూస్ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది.   అయితే, కవరేజ్ అందిస్తున్న సమయంలో హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రెండు వ్యాపార సముదాయల మధ్యలో హెలికాప్టర్ పడిపోయింది. దీంతో క్షణాల్లోనే అది పేలిపోయి పెద్ద ఎత్తున […]

iqonic-blog

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ ప్రముఖుడు విజయ్ క్రేజ్ సరిహద్దులు దాటి లండన్ వీధుల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు, ఎన్ఆర్‌ఐలు లండన్‌లోని ప్రసిద్ధ ‘ది షార్డ్’ భవనం వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే, ఊహించని విధంగా భారీగా జనం తరలిరావడం, అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా బ్రిటన్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి […]

iqonic-blog

ట్యాంక్ బండ్‌పై ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధించారు. GHMC, హైదరాబాద్ పోలీస్ శాఖ కలసి సంయుక్తంగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్ వెంబడి భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలవడంతో ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా నిర్మించిన ఘాట్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ఇక భారీ విగ్రహాల కోసం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా సమీపంలో ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు, క్రేన్లను సిద్ధం చేస్తున్నారు.

iqonic-blog

ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో తొలిసారిగా వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ అయ్యాయి. సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. సెప్టెంబర్ 15న మక్కాకు దక్షిణంగా వచ్చిన ఓ హౌతీ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే ముందే  కూల్చివేసినట్లు సమాచారం. అయితే మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను హౌతీలు ఖండించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON