తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించిన వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరును, ‘ఫుట్ బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఎన్వెలప్’ (Envelope) గుర్తును రాబోయే ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం తాత్కాలిక నిర్ణయాన్ని వెలువరించింది.
- Posted on
- By Admin
భారత్లో iPhone 18 అమ్మకాల తొలిరోజే ఢిల్లీ ఆపిల్ స్టోర్ వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక కొనుగోలుదారు తన భార్యకు బహుమతిగా ఇవ్వడం కోసం iPhone 18 Pro Burgundy రంగు ఫోన్ను కొనుగోలు చేయడానికి వచ్చానని తెలిపారు. తన భార్య ఇప్పటివరకు ఐఫోన్ ఉపయోగించలేదని, ఆమెకు కొత్త అనుభూతిని ఇవ్వడం కోసమే బంగారం అమ్మి మరి ఈ ఫోన్ కొంటున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త Pro సిరీస్లో ‘Burgundy’ రంగు నెట్టింట, వినియోగదారులలో […]
- Posted on
- By Admin
మాదాపూర్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిఎంఏవై-జి (PMAY-G) ఇండ్ల కేటాయింపు, ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. పిఎంఏవై-జి పథకంలో భాగంగా మొదటి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
- Posted on
- By Admin
పెట్రోల్ పంప్ యజమానుల డీలర్ కమీషన్ ఇప్పటికే చాలా తక్కువగా ఉండటంతో, ప్రతి పెద్ద లావాదేవీపై రూ.5 UPI ఛార్జీ చెల్లించడం తమకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వాపోతోంది. తమ నిర్దేశిత మార్జిన్ దెబ్బతింటుందని, ముంబై సహా పలు నగరాల్లోని బంకు యజమానులు UPI సేవలను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంధనం ధర నిర్ణయం, కమీషన్లు అన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతున్నందున, ఈ అదనపు భారాన్ని భరించడం తమకు సాధ్యం […]
- Posted on
- By Admin
బిఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కీలక నాయకుడు మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ విధమైన ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తన ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారని క్రిషాంక్ మద్దతుదారులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులను ఈ విధంగా భయబ్రాంతులకు గురిచేసి ఏడిపించడం విచారకరమని పేర్కొన్నారు.
- Posted on
- By Admin
ఫార్ములా ఈ-రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఒక సంచలన ఆఫర్ విసిరారు. “మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వమే తీసుకుని, దానికి ప్రతిఫలంగా మాకు కేవలం రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. మిగిలిన రూ. 99,000 కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను […]
- Posted on
- By Admin
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రెండోరోజూ అధికారులు సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై ఆరా తీశారు. ఆ సర్వేనంబర్ లో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో శాటిలైట్ సర్వే చేస్తున్నారు. సర్వేనంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఈ వివరాలను మర్కూక్ రెవెన్యూ అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.ఎర్రవల్లి, వెంకటాపూర్, […]
- Posted on
- By Admin
నాగార్జునసాగర్ బీసీ గురుకుల బాలుర పాఠశాల నిరంతర నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి మరోసారి నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం పాఠశాల హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 6వ తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వరుస ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, ప్రమాదాలను బయటకు రాకుండా […]
- Posted on
- By Admin
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్కు సంబంధించిన స్టిల్స్ లీక్ కావడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
- Posted on
- By Admin
విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడంపై మరోసారి ఆలోచించాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. తమిళనాడులో హిందీని పూర్తిగా మినహాయించలేమని, ఢిల్లీలో ఉన్నవారికి ప్రజలు దూరమవ్వకూడదని కోర్టు అభిప్రాయపడింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధనను అనుమతించమనే “వైఖరి”ని ఆ రాష్ట్రం మార్చుకోవాలని జస్టిస్ నాగరత్న అన్నారు. అంతేకాకుండా, భాషా పరమైన అంశంపై కేంద్రంతో తమిళనాడు చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు. చెన్నై ప్రజలు ఢిల్లీకి, అలాగే ఢిల్లీ వారు చెన్నైకి దూరమవ్వకూడదు,” అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.
- Posted on
- By Admin
- Business270
- District30
- Entertainment738
- General16363
- Health81
- Politics2027
- Sports541
- Technology308
- Uncategorized2
- World1518
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District