loader
iqonic-blog

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై జరిగిన పోలీసుల దాడిలో ఇంటి కింద అత్యంత విలాసవంతమైన రహస్య భూగర్భ ప్యాలెస్‌ను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ రహస్య గదిలో ఏకంగా ఒక బంగారు మంచాన్ని అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల విలువైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో కూడిన గదులు ఉన్నాయి. షమీమ్ అహ్మద్ తన భార్య పేరిట ఈ ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్రమ ఆస్తుల సంపాదన, ఆర్థిక అక్రమాల […]

iqonic-blog

మధ్యప్రదేశ్‌ దేవాస్‌ జిల్లా‌లో ఘోర విషాదం జరిగింది. జిల్లాలో టోంక్ కాలాన్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంలో క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు

iqonic-blog

కెనడా ప్రయాణం చేయాలనుకునే భారతీయ పౌరులకు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) మే 14, 2026 నాటి తాజా నివేదిక ప్రకారం, ఇప్పుడు విజిటర్ వీసా  ప్రాసెసింగ్ కేవలం 27 రోజుల్లోనే పూర్తవుతోంది. 2026 ఫాల్ (సెప్టెంబర్) సెషన్ కోసం సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులకు కూడా IRCC కీలక సూచనలు చేసింది. అడ్మిషన్ల రద్దీ పెరగకముందే స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా […]

iqonic-blog

కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి.. నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జరిగాసింగ్ అని చెప్పారు. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌లలో బంగారు షాపులపై ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాగీరా సింగ్ సహా ప్రద్యుమన్, మెహతాబ్ ఖాన్‌లను అరెస్ట్‌ చేశామని సీపీ తెలిపారు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఆస్తుల ధ్వంసంపై దాఖలైన పిటిషన్లపై కలకత్తా హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ కేసులో విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారని, పలువురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వేలాది మంది నిరాశ్రయులయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది.

iqonic-blog

తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి చెందిన కోనేటి మమత (36), బుధవారం సౌదీలోని జుబేల్‌లో తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ధృవీకరించారు. తిరుపతిలోని కుటుంబ ఆస్తుల వివాదం కారణంగా గత కొంతకాలంగా మమత తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం

iqonic-blog

వి.డి. సతీషన్ పూర్తి పేరు వడస్సెరి దామోదరన్ సతీషన్. కొచ్చిలోని నాయర్ కుటుంబంలో 1964లో జన్మించిన సతీషన్.. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. NSUI సెక్రటరీగా పని చేశారు. 1996లో పరావూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సతీషన్.. సీపీఐ అభ్యర్థి పి.రాజు చేతిలో ఓడిపోయారు 2001లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన చీఫ్ విప్‌గా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత […]

iqonic-blog

ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ ‘సిస్కో’.. మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇది మొత్తం సిబ్బందిలో 5 శాతం కంటే తక్కువని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన రంగాల వైపు పెట్టుబడులను మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు ఉన్నాయని సీఈవో చక్ రాబిన్స్ వివరించారు. మరోవైపు.. మూడో త్రైమాసికంలో 12 శాతం శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON