loader
iqonic-blog

సీజేఐకి వ్యతిరేకంగా నల్సార్ వర్సిటీ విద్యార్థుల ప్రవర్తనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ నుంచి పట్టాలు అందుకోబోమని ఇటీవల నల్సార్ విద్యార్థులు వీసీకి లేఖ రాశారు. ఈ ఘటనపై ఆగస్టు 19లోపు నివేదిక ఇవ్వాలని వర్సిటీ వీసీని బీసీఐ ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా విద్యార్థులపై చర్యలు ఉంటాయని పేర్కొంది. అప్పటి వరకు నల్సార్ విద్యార్థులు ఏ బార్ కౌన్సిల్లోనూ నమోదు చేసుకోవద్దని బీసీఐ స్పష్టం చేసింది.

iqonic-blog

పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా, బ్యాంకుల మధ్య ఆస్తుల వివాదానికి ఇక స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఒక‌ ముగింపు తీసుకురావాలని తెలిపింది. వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ ఆర్థికవ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తన ఆస్తులను వినియోగించుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుబడుతూ విజయ్ మాల్యా 2020లో సవాల్ చేశారు

iqonic-blog

మధ్యప్రదేశ్‌లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మచ్ఛుర్దా, అడోరి, బొండరి, కోర్కా, కుండెకాస గ్రామాల పిల్లలు గత 40 రోజులుగా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, ఫంగల్, చర్మ వ్యాధులు, గజ్జి, తట్టు, జ్వరం, జలుబు, దగ్గు, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో […]

iqonic-blog

రాష్ట్రంలో SIR‌ ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్ అని కొందరు చెబుతున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్రలు ఫలించకూడదని అన్నారు. కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొని […]

iqonic-blog

జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిని వైద్య సహాయం అందించేందుకు, ఎమర్జెన్సీ స్పందన విషయంలో జాప్యాన్ని నివారించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం, NHలపై ప్రమాదం జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్స్ సమాచారం అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి తప్పనిసరిగా చేరుకోవాలి. ఆలస్యం చేసినా, కాల్స్‌ను తిరస్కరించినా ఆపరేటర్లపై రూ.10,000 (ఒక్కో ఘటనకు) జరిమానా విధిస్తారు. దూరం పెరిగితే సమయం దామాషా […]

iqonic-blog

పశ్చిమబెంగాల్‌లో ఓ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల – ఆసుపత్రిలోని వాష్‌రూమ్‌లో ఆమె విగత జీవిగా కనిపించారు. అక్కడున్న సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగలకొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల వయసున్న ఓ నర్సు.. ఇక్కడి గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె.. రాత్రి 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్లారు. ఎంతకూ బయటకు రాకపోవడం..సిబ్బంది తలుపులు పగలకొట్టారు. అక్కడే నేలపై […]

iqonic-blog

పిల్లల్ని కనేందుకు అమెరికా వచ్చే వారిపై ట్రంప్ యంతాంగ్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ‘బర్త్ టూరిజం’పై ఉక్కుపాదం మోపుతోంది. కేవలం గత నెల రోజుల్లోనే వివిధ దేశాల నుంచి తొమ్మిదో నెల గర్భంతో అమెరికాకు వచ్చిన 600 మంది వీసాలను రద్దు చేసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి వీటిని రద్దు చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు. కొన్ని ఆర్గనైజింగ్ నెట్‌వర్క్‌లు కోచింగ్ ఇస్తూ, ట్రావెల్, వసతి […]

iqonic-blog

ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ సమయంలో జైలు లోపల తనను అవమానించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కావాలనే జైలు గ్రిల్స్ వెనుక నిలబెట్టి, జైలు సిబ్బందితో ఫొటోలు తీయించారని. దీనిపై సిబ్బందిని ప్రశ్నిస్తే, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నామని సమాధానం ఇచ్చినట్టు జగన్ చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.చంద్రబాబు తప్పుడు విత్తనాలే రేపు విషవక్షాలపై […]

iqonic-blog

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో పర్యటించారు. జైలులో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించారు. జైలులో తనను కూడా అవమానించేలా ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే వందల మంది పోలీసులను ఆయన ఇంటిపైకి పంపించారని కిటికీలు, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, సీదిరి అప్పలరాజు, ముస్తాఫా, కారుమారి సునీల్ వంటి నేతపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది చంద్రబాబు […]

iqonic-blog

వర్షాలు పడొద్దని బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణపై చేతబడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అఘోరాలతో పూజలు చేస్తున్నారని.. పదేళ్లు పాలించిన వ్యక్తులు ఇలాగేనా చేసేది.. అని ప్రశ్నించారు. తన వైపే దేవుడు ఉన్నాడని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పమే తనను కాపాడుతుంటుందన్నారు. చేతబడి తిరగబడితే అష్ట దిగ్బంధనం చేస్తుందన్నారు. ఇప్పటికే ఫాంహౌస్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నారని కేసీఆర్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON