loader
iqonic-blog

డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఆయనికి ఉద్యోగం ఇవ్వకుండా, ఆయన లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారని నిలదీశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయిస్తున్నారని అన్నారు. లీకేజీ ఆయనతోనే ఆగిపోయిందా ఆయన ద్వారా ఇంకా ఎవరికైనా చేరిందా అనేది తేలాలని డిమాండ్ చేశారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?” […]

iqonic-blog

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఖ్యాతిగాంచిన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు సరికొత్త మైలురాయిని అధిగమించింది. తొలిసారిగా ఈ బ్రిడ్జిపై రైలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కత్రా-బనిహాల్ రైలు మార్గంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కిలోమీటర్లకు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వేగంతో రైలు విజయవంతంగా నడిచింది. జమ్మూ-కశ్మీర్‌లోని చీనాబ్ రైల్ బ్రిడ్జి నదీ మట్టానికి ఏకంగా 359 మీటర్లు (1,178 అడుగులు) […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు “డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్‌ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు.

iqonic-blog

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి వల్ల తాను చాలా కోల్పోయానని… వాఖ్యలపై అదితి శర్మ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశా. ఆమె కామెంట్స్‌పై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందిని ధైర్యంగా పంచుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయితీ ఉంది. ఎవరినీ నిందించడం అనుపమ ఉద్దేశం కాదు. ఆమె పంచుకున్న అనుభవం అవగాహన కలిగించేలా ఉంది. అనుపమలా ఓపెన్‌గా మాట్లాడడం వల్ల అలాంటి వారికి ఓ స్పష్టత […]

iqonic-blog

తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా స్పష్టత వస్తుందని జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ వ్యవహారశైలిని ఉద్దేశిస్తూ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనే విషయం అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పులను అంగీకరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని […]

iqonic-blog

తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో HMDA అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను 22A జాబితాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల (JUDA) ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు, సమ్మె గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన స్టైపెండ్ పెంపును జూడాల సంఘం ముక్తకంఠంతో తిరస్కరించింది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

iqonic-blog

క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మోడెర్నా, మెర్క్ సంస్థలు కలిసి తయారు చేస్తున్న వ్యక్తిగతీకరించిన ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్‌పై నిర్వహించిన కీలక దశ క్లినికల్ ట్రయల్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌ తగ్గించడంలో ఈ చికిత్స ఉపయోగపడే అవకాశాలు కనిపించాయి. ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి రోగి క్యాన్సర్‌కు అనుగుణంగా, రోగి నుంచి తొలగించిన ట్యూమర్‌ను పరిశీలించి, అందులోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటిని […]

iqonic-blog

గత కొంతకాలంగా ఈ జంటల ఇళ్లలో, కుటుంబ జీవితంలో ఊహించని కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు వరుసగా ఎదురవుతూ వస్తున్నాయి. గతంలో వీరు వివాహం చేసుకున్న ముహూర్తాల్లో ఉన్న తీవ్రమైన గ్రహ దోషాలే కారణం అని మళ్లీ పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు ఆనందపురం నారాయణమూర్తి సూచించారు. మొత్తం తొమ్మిది జంటలు..సత్యదేవుని సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భార్య మెడలో భర్త మరోసారి పసుపుతాడుతో మంగళసూత్రం కట్టి దంపతులుగా సరికొత్తగా ప్రమాణాలు స్వీకరించారు.

iqonic-blog

ఉత్తరాఖండ్ హల్ద్వానీలో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ లోని పలువురు నేతలు బహిరంగంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. అయితే ఖర్గే ఎవరినీ ప్రత్యేకంగా పేరుపెట్టి విమర్శించలేదని సమాచారం. కొందరు సీనియర్‌ నేతలు ఈ ఘటనపై గట్టిగా స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమావేశంలో వ్యవహరించిన తీరును బట్టి తెలుస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON