loader
iqonic-blog

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. ఇటీవలనే ఏకే 47 తుపాకులు సహా.. పలు పిస్టోళ్ల చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే..

iqonic-blog

ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నట్లు తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

iqonic-blog

మీడియా కథనాల ప్రకారం.. ‘బిగ్ బాస్’ 20వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు సల్మాన్ ఖాన్ సుమారు రూ.120 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. మొదట్లో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్న సల్మాన్, సీజన్ సీజన్‌కు తన పారితోషికం పెంచుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ 18 నాటికి ఆయన రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు చేరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. సల్మాన్ రెమ్యునరేషన్ గురించి నిర్మాత రిషి నేగిని అడగ్గా.. నటీనటులతో కాంట్రాక్టులు వ్యక్తిగత విషయమని, వాటిని బయటపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

iqonic-blog

అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక డాలర్ నాణెం బుధవారం నుంచి విక్రయానికి రానుంది. అయితే ఈ నాణెం ప్రత్యేకత ఏంటంటే.. నాణేనికి ఒక వైపు ట్రంప్ ముఖచిత్రం, మరో వైపు అమెరికా గ్రేట్ సీల్ (జాతీయ అధికారిక ముద్ర) ఉండేలా డిజైన్ చేశారు. ట్రంప్ నియమించిన సభ్యులతో కూడిన అమెరికా ఫైన్ ఆర్ట్స్ కమిషన్ ఈ ఏడాదే ఈ డిజైన్‌కు ఆమోదముద్ర వేసింది. ట్రంప్ ముఖచిత్రంతో నాణెం విడుదల చేయడంపై కొంతమంది విమర్శలు […]

iqonic-blog

చిన్న చితక కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ, టెక్నాలజీ, మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. తాజాగా ఫేమస్ అంతర్జాతీయ క్యాబ్ సేవల కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ సంస్థని నమ్ముకొని ఉన్న కొన్నివేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పదిశాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. అంటే సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ […]

iqonic-blog

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్లాట్లకు బహిరంగం వేలం నిర్వహించగా రికార్డు ధరలకు అమ్ముడయ్యాయని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. కెపిహెచ్‌బి 7 ఫేజ్ లోని 16 ఎంఐజి ప్లాట్లకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా ఒక చదరపు గజం భూమిని రూ.2.70 లక్షలకు కొనుగోలు చేశారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వేలంలో మొత్తం 19 మంది కొనుగోలు దారులు పోటీ పడ్డారని.. చదరపు గజం సగటు ధర రూ.1.79 లక్షలు పలికిందని […]

iqonic-blog

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, యూపీలో కీలక నేతగా ఉన్న సయ్యద్ అసిమ్ వకార్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిజెపి, దాని సిద్ధాంతాలను ఎదుర్కొంటామని ఎంఐఎం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల వంటి లౌకిక శక్తులకు విఘాతం కలిగించేలా […]

iqonic-blog

గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ సినిమా మౌత్ టాక్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని రీమేక్ హక్కులను నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకృష్ణుడి పాత్రను చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్ పోషిస్తే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ వస్తుందని, ఆయన ఇమేజ్‌కు ఈ తరహా ఆధ్యాత్మిక, భావోద్వేగభరితమైన పాత్ర కొత్త కోణాన్ని జోడిస్తుందని […]

iqonic-blog

ఒక వంశంలో 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఇంటి వరకు తల్లీ, బిడ్డను ప్రత్యేక రథంలో ఊరేగించారు. డప్పులు, మేళ తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా అహ్మద్‌పూర్ తాలూకాలోని కోల్‌వాడి గ్రామానికి చెందిన లింబాజీ దహిఫలే వంశంలో గత ఐదు తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం సమీపంలో ఉన్న జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన వసతి గృహాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. సుమారు 1,600 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.70 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక హాస్టల్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON