loader
iqonic-blog

ప్రపంచవ్యాప్తంగా బెంగాలీ సంస్కృతి, కళలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు స్వీడన్ దేశంలో కూడా మన భారతీయ బెంగాలీ సంస్కృతి తన ప్రత్యేక ముద్రను చాటుకుంది. స్వీడన్లో నిర్వహించిన ఒక ప్రత్యేక ఘన స్వాగత (రిసెప్షన్) కార్యక్రమంలో అక్కడి ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో బెంగాలీ సంస్కృతికి సంబంధించిన అద్భుతమైన, వైభవవంతమైన సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ప్రదర్శించారు.

iqonic-blog

స్వీడన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా స్వీడన్ ప్రభుత్వం మోదీని తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్’ (Royal Order of the Polar Star, Commander Grand Cross) పేరుతో పిలిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డును […]

iqonic-blog

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి వైమానిక దళం భారీ రక్షణ కల్పించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం స్వీడన్ గగనతలంలోకి చేరుకోగానే,  ఆ దేశంలోని అత్యున్నత రక్షణ విమానాలైన గ్రిపెన్ జెట్స్ ఎస్కార్ట్‌గా వచ్చాయి. ఈ విమానాలు స్వీడన్‌ ఫైటర్జె ట్లలో కీలకమైనవి. మోదీ విమానం స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌ చేరుకునే వరకు ఈ విమానాలు రక్షణగా ఉన్నాయి. ఆదివారం ఆయన స్వీడన్‌లో అడుగుపెట్టారు.

iqonic-blog

సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ Thailand Open 2026లో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఆగింది. బ్యాంకాక్ లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఇండోనేషియా ద్వయం లియో రోలి కర్నాడూ, డానియల్ మార్టిన్ జోడీ చేతిలో 21-12, 25-23 తేడాతో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది. 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో రెండో గేమ్ చివరి వరకు భారత జోడీ పోరాడినా, టైటిల్ మాత్రం చేజారింది.

iqonic-blog

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, బాధితురాలైన మైనర్ బాలికను తప్పుబడుతూ కంటెంట్ క్రియేట్ చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు. చట్టప్రకారం మైనర్ల హక్కులను ఉల్లంఘించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ చర్య ద్వారా గట్టి […]

iqonic-blog

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రజలకు సూచించిన పాలసీపై ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు చేశారు. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం పిల్లల్ని కనమంటున్నారు సరే, ఆ పిల్లలకు 20 ఏళ్లు వచ్చాక ఉద్యోగం వస్తుందని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. వారి చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా అని నిలదీశారు. ఆ పిల్లల తిండి, మందులు, వారిని పెంచడానికి అయ్యే ఖర్చలును ప్రభుత్వం […]

iqonic-blog

కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్‌భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. సతీశన్ మంత్రివర్గంలో రమేష్ చెన్నితాల, కె.మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జెసెఫ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది.

iqonic-blog

అమెరికాలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా చెరువుగట్టుకు చెందిన జి.శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె నవ్య (24) షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉన్నత చదువుల కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె.. ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో.. వెనక నుంచి దూసుకొచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

iqonic-blog

భారీ సంఖ్యలోని డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి చేసింది. భారతీయ కార్మికుడితో సహా నలుగురు మరణించారు. మరో ముగ్గురు భారతీయ కార్మికులు, మరి కొందరు గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి జరిగిన ప్రదేశాన్ని అధికారులు సందర్శించారని, గాయపడిన కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు ఉక్రెయిన్‌ పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోలోని కొన్ని ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.

iqonic-blog

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం ప్రధాని మోదీ పొదుపు చర్యలలో ఇప్పటికే ప్రభుత్వఆఫీసులకు వారంకు రెండు రోజులు వర్క్ ఫ్రమ్, కార్ పూలింగ్ పాటించాలని సూచించింది. ఇక తాజాగా ఢిల్లీ సర్కారు.. ప్రైవేటు కంపెనీలకు సైతం వారంలో రెండు రోజులు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, కార్ పూలింగ్ పై ప్రచారం నిర్వహించి పాటించేలా చూడాలని కోరింది. రిమోట్ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఐటీ కంపెనీలు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం టెకీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON