loader
iqonic-blog

భారత 80వ స్వాతంత్య్ర వేడుకలు అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఈ  సందర్భంగా న్యూజెర్సీలో జరిగిన ప్రత్యేక వేడుకల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. క్వీన్స్‌లో  జరిగిన ‘ఇండియా డే పరేడ్’లో న్యూయార్క్ నగర భారతీయ మూలాలున్న మేయర్ జోహ్రాన్ మమ్దానీ పాల్గొన్నారు. న్యూజెర్సీలోని పార్సిప్పనీలో  వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’ విభాగంలో గిన్నిస్ వరల్ రికార్డు నమోదైంది. భారత 80వ స్వాంతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

iqonic-blog

అమెరికాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సైనికులను చంపినా లేదా పట్టించినా.. 30 వేల డాలర్ల (సుమారు రూ.28లక్షలు) రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్యం వెల్లడించింది. ఒకవేళ ఇదే పనిని ఇరాన్ మహిళలు చేస్తే.. వారికి దీనికి రెట్టింపు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు మేరకే ఈ ప్రణాళికను రూపొందించినట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ వెల్లడించారు.

iqonic-blog

భారత ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ ‘ఎన్‌టీపీసీ లిమిటెడ్’ (NTPC)అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం డిప్యూటీ మేనేజర్ (E-4 గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 పోస్టుల్లో విభాగాలు, ఎలక్ట్రికల్: 40 పోస్టులు,మెకానికల్: 55 పోస్టులు, సి అండ్ ఐ (C&I): 40 పోస్టులు 60% మార్కులతో ఫుల్-టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి,ఆగస్టు 26 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. https://careers.ntpc.co.in  ద్వారా మాత్రమే […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజుల పాటు జరుగనున్న అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. జగన్‌ అసెంబ్లీకి వస్తే డీఎస్సీతో సహా పలు అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. అర్హత లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేనని స్పష్టం చేశారు.

iqonic-blog

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో కేటీఆర్ తన సొంత చెల్లినే ఇంటి నుంచి బయటకు గెంటేశాడని సీఎం రేవంత్ ఆరోపించారు. ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, సొంత చెల్లికే న్యాయం చేయలేని నాయకుడు రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని నిలదీశారు. బిఆర్ఎస్ నేతల కుటుంబ రాజకీయాలు, వ్యక్తిగత ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, […]

iqonic-blog

ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్‌పై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె హిందూ మతం మరియు ఆచారాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మతపరమైన భావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని  వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర రూపం దాల్చడంతో రెండు రోజుల క్రితమే అనసూయ తన […]

iqonic-blog

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ అటవీ శాఖ.. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వంతారా సహకారంతో కచ్ లోని ప్రసిద్ధ బన్ని గడ్డిభూముల్లోకి 20 కృష్ణజింకలను వదిలిపెట్టారు. ఇందులో 5 మగ, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. గుజరాత్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, సెంట్రల్ జూ అథారిటీ (CZA) నిబంధనల మేరకు సమగ్ర పశువైద్య పరీక్షలు, క్వారంటైన్, సురక్షిత రవాణా ప్రోటోకాల్స్ పాటిస్తూ జామ్ నగర్ లోని వంతారా కేంద్రం […]

iqonic-blog

జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక టీడీపీ నేత వివాహ వేడుకలో సంజీవరెడ్డి సోదరుడైన మిద్దె శ్రీరామ్‌ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు. వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని’ డిమాండ్ చేశారు.   ఇరువర్గాల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.   జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డికి చెందిన పలు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడి ధ్వంసం చేశారని బాధితులు   ఆరోపిస్తున్నారు. పెళ్లిలో కూడా రాజకీయాలు, రౌడీయిజం చేయడం […]

iqonic-blog

హంగేరీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎమ్ 3 మోటర్ వే, మేజోకెర్జ్సెట్ లో జరిగింది. టూరిస్టు బస్సు నైరేగిజాహా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు హంగేరియన్ పోలీసులు తెలిపారు. ఈ బస్సు రోడ్డు భాగాన్ని వదిలి లోయలో పడినట్లు వివరించారు.డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

iqonic-blog

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి వనదేవతల ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  మేడారం గద్దెల వద్ద సమ్మక్క-సారలమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం, చీరె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ రూ.868 కోట్ల విలువైన పంచాయతీరాజ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON