loader
iqonic-blog

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్’ మెగా ఐపీఓ ద్వారా కంపెనీలో పనిచేసే సుమారు 4,400 మంది సాధారణ ఉద్యోగులు ఒకేసారి మల్టీ-మిలియనీర్లు కాబోతున్నారు. గతంలో 2 డాలర్లకే లభించిన ఈ షేర్ల విలువ 135 డాలర్లకి చేరింది. కంపెనీలోని వైట్-కాలర్ ఇంజనీర్లతో పాటు క్యాంటీన్ కార్మికులు, క్లీనింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం, సుమారు 400 మంది ఉద్యోగుల ఆస్తి విలువ ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు అంటే […]

iqonic-blog

భారత రక్షణ రంగాన్ని స్వదేశీ సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ సంస్థ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. భారత సైన్యంతో కుదుర్చుకున్న రూ. 72 కోట్ల భారీ కాంట్రాక్ట్‌లో భాగంగా, మొదటి విడత కింద 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ (JK 250E) డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి విజయవంతంగా అందజేసింది. సరిహద్దుల రక్షణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ సరికొత్త డ్రోన్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగురుతూ నిఘా […]

iqonic-blog

2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించక పోయినా రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని కేటీఆర్‌ హెచ్చరించారు.

iqonic-blog

ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోని ఎంఐఏం ఇప్పుడు మరోసారి విపక్ష కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్దమని ఓవైసీ ప్రకటించారు.

iqonic-blog

ఇథియోపియాలో ఘోర రోడ్డు చోటుచేసుకుంది. ఇథియోపియాలోని అంహార రీజియన్‌లో జరిగిన రోడ్డు   ప్రమాదంలో 31 మంది మృతి చెందారు. చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.డెస్సీ నుంచి అడీస్‌ అబాబాకు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అంబులెన్స్ సేవలు లేకపోవడంతో క్షతగాత్రులను ప్రజా రవాణా వాహనాల్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు.  పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.

iqonic-blog

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.

iqonic-blog

జైపూర్‌లోని అమరవీరుల స్మారక మందిరం (శహీద్ స్మారక్) సమీపంలో ఒక భారీ ధర్నాను చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనడానికి అభిజీత్ దీప్కే వేదికపైకి రాగానే, అక్కడే మాటువేసిన ఒక గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా ఆయనపై భౌతిక దాడికి దిగాడు. దీంతో పార్టీ కార్యకర్తలు అభిజిత్ ను కొట్టిన వారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం, ఘర్షణ చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

iqonic-blog

ఒక పబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పబ్‌ యజమానితో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఒక రెస్టో పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి.  పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని  మంటలను అదుపు చేశారు. డార్జిలింగ్‌కు చెందిన 26 ఏళ్ల సాహిన్, నేపాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రకాష్‌గా […]

iqonic-blog

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని కాక్రోచ్‌ కార్యకర్తలు చితక బాదారు. సీజేపీ ఆధ్వర్యంలో ఈ ఉదయం జైపూర్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

iqonic-blog

ముక్కోణ‌పు వ‌న్డే టోర్నీలో ఇండియా-ఏతో ఇవాళ జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర మ్యాచ్‌లో శ్రీలంక‌-ఏ జ‌ట్టు సూప‌ర్ ఓవ‌ర్‌లో విక్ట‌రీ కొట్టింది. తొలుత ఇద్ద‌రి మ‌ధ్య మ్యాచ్ టై కాగా, ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ ఆడారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో ఏడు ర‌న్స్ తేడాతో ఇండియా ఓడింది. తొలి మూడు బంతుల‌ను షెడ్జ్ ఆడ‌గా, చివ‌రి మూడు బంతుల‌ను సూర్య‌వంశీ ఆడారు. కానీ అత‌ను కేవ‌లం 5 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత శ్రీలంక ప్లేయ‌ర్లు, సూర్య‌వంశీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON