loader
iqonic-blog

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం రాత్రి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడి పర్యవేక్షణలో ఈ క్రతువును నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6.21 గంటలకు మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

iqonic-blog

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లక్ష్యంగా చేసుకుని ఓ పాకిస్థానీ సోషల్ మీడియా యూజర్ ఆమె ముఖాన్ని చూడటానికి తన ఫోన్ బ్రైట్‌నెస్‌ను 100 శాతానికి పెంచుకోవాల్సి వచ్చిందంటూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యపై భారతీయ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. “ఆమె భారతదేశ ప్రథమ పౌరురాలు, సాయుధ దళాల సుప్రీం కమాండర్” అంటూ ఓ భారతీయ యూజర్ ఇచ్చిన కౌంటర్ […]

iqonic-blog

సినీ నటి సమంత సీమంత వేడుక శ్రీవిద్య సంప్రదాయంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా శ్రీవిద్య పద్ధతికి చెందిన అత్యంత పవిత్రమైన ‘శ్రీకల్పం’ (కాలా ఆవరణ) పూజా కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. శ్రీవిద్య విశిష్టతను తెలియజేస్తూ, ఈ పవిత్రమైన వేడుక ద్వారా కాబోయే తల్లిని సాక్షాత్తు పరాశక్తి రూపిణిగా, దేవతగా ఆరాధిస్తారని ఆమె పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డకు దివ్యమైన ఆధ్యాత్మిక రక్షణ కల్పించడానికి ఈ కాలా ఆవరణ […]

iqonic-blog

ఇరాన్ యుధ్దం కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సౌదీ అరేబియాకు భారీ జాక్‌పాట్ త‌గిలింది. సౌదీ అరేబియాలో 110 ట‌న్నుల ముడి యురేనియం నిల్వ‌లు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. మెదీనా ప్రాంతంలో యురేనియం స‌హా ప‌లు అరుదైన ఖనిజాలు బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లు సౌదీ అరేబియాకు చెందిన ఎన‌ర్జీ మినిస్ట‌ర్ ప్రిన్స్ అబ్దులాజిజ్ బిన్ స‌ల్మాన్ అన్నారు. ఇరాన్ యుద్ధం కార‌ణంగా ప్ర‌స్తుతం సౌదీ చాలా ఇబ్బందులు ప‌డుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం నిల్వ‌లు బ‌య‌ట‌ప‌డ‌టం ఆ దేశానికి భారీ ఊర‌ట‌నిచ్చేదే.

iqonic-blog

ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాక్ తీసుకున్న చర్యలను సమీక్షించేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తున్నామి చెప్పేందుకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్‌ను పట్టించిన వారికి 70 లక్షల రూపాయల రివార్డును పెంచింది. ఈ సమీక్షలో పాక్ విఫలమైతే మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరాల్సి ఉంటుంది. దీంతో, అంతర్జాతీయ సంస్థల నిఘా పెరిగి పాక్‌కు ఆర్థిక లావాదేవీలు జరపడం మరింత కష్టంగా […]

iqonic-blog

తమిళనాడు CM విజయ్ పై లండన్ టూర్, అజిత్ కారు రేసింగ్స్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజులో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన టీమ్ స్వయంగా ట్వీట్లు చేస్తోంది. డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు 7,000 ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేస్తున్న దాదాపు ₹11,000 కోట్ల పెట్టుబడి కోసం సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్,స్వీడన్‌కు చెందిన సిగ్మా టెక్నాలజీ గ్రూప్, గైడెన్స్ తమిళనాడుతో ఒక అవగాహన […]

iqonic-blog

వినాయక చవితి వేడుకల వేళ భాగ్యనగరం భక్తిశ్రద్ధలతో ముస్తాబైంది. నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌ పరిధిలోని ఫీల్‌ఖానా ప్రాంతంలో కొలువుదీరిన సుమారు 48 కిలోల బరువుతో అరుదైన శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఈ విగ్రహాన్ని సుమారు 3.83 లక్షలకు పైగా మెరిసే అమెరికన్ డైమండ్స్‌తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీనికి అదనంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూతను ప్రయోగించడంతో, స్వామివారు దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు.

iqonic-blog

సౌతాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్ టాక్సీలు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లోని ఎన్ 1 హైవేపై జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రిన్స్ ఆల్బర్ట్ అలాగే లీయూ- గమ్కా ప్రాంతాల మధ్య ఈ ఘటన జరిగింది. సౌతాఫ్రికాలో మిని బస్సు ట్రాన్స్ పోర్టు సర్వీసులు సాధారణ ప్రజలకు […]

iqonic-blog

బ్రిక్స్ సదస్సులో ఒక అన్‌సీన్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఎంతో సన్నిహితంగా కనిపిస్తున్నారు. ముగ్గురు నేతలు కలిసి సరదాగా ముచ్చటిస్తూ, నవ్వులు చిందిస్తూ కనిపించిన దృశ్యాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దౌత్యపరమైన గంభీరతను పక్కనపెట్టి ప్రపంచ దిగ్గజాలు పరస్పరం ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ, చేతులు పట్టుకుని మాట్లాడుకున్న క్షణాలు ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

iqonic-blog

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేసేలా, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సక్రమంగా నెరవేర్చేలా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఆ విఘ్నేశ్వరుడు సరైన ‘సద్బుద్ధి’ని ప్రసాదించాలని తాను స్వామివారిని వేడుకున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. పండుగ వేళ ప్రజల ఆశలను నిజం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON