loader
iqonic-blog

కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం చేస్తున్న అధికారులు, మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వాట్సాప్ మెసేజ్ లపై పెడుతున్న శ్రద్ధ.. ఫైళ్ల క్లియరెన్స్ పై ఎందుకు చూపించడం లేదంటూ తన కేబినెట్లోని ముగ్గురు మంత్రులతో పాటు పలు శాఖల అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ఫోన్లు లేకుండా కొన్ని గంటలు కూడా ఉండలేకపోతున్నారా అని అసహనం వ్యక్తం చేశారు.కలెక్టర్ల సదస్సుకు రాని అధికారులపైనా మండిపడ్డారు. కలెక్టర్ల సదస్సుకు గైర్హాజరు కావడానికి వారికి ఎంత […]

iqonic-blog

రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అలాగే ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. విద్యుత్ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ లోపాలను సరిదిద్దకపోతే భవిష్యత్తులో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ చేయడం కష్టమవుతుందని ఆయన తెలిపారు.

iqonic-blog

మద్యం మత్తులో ఓ యువతీ, యువకుడు వీరంగం సృష్టించి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు 14లో వోక్స్‌వ్యాగన్ కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను కారుతో ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. రంజనా రాయ్ (32) అనే మహిళకు తీవ్రంగా గాయపడడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో మహిళ స్వల్ప గాయపడినట్టు సమాచారం. పోలీసులు స్థలానికి చేరుకొని యువతీ, యువకుడిని అదుపులోకి […]

iqonic-blog

ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫైల్స్‌ క్లియరెన్స్‌కు మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ అధిక సమయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఇంప్రూవ్‌ కావాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కొందరు మంత్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

iqonic-blog

2024 ఎన్నికల సమయంలో 21 సీట్లకు పరిమితమైన జనసేన స్థానిక ఎన్నికల్లో నాటి ఫార్ములా అమలు కాదని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. పార్టీ నేతల సమావేశంలో జనసేన నేత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 15న పవన్ వస్తారని.. స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహిస్తారు అని చెప్పారు. పార్టీ ప్రతిపాదనల పైన ముఖ్య నేతలతో చర్చించిన తరువాత ఈ నెల 16న సీఎం చంద్రబాబుతో పవన్, మాధవ్ సమావేశం ఉంటుందని […]

iqonic-blog

శ్రీకాకుళం జిల్లాలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 75 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. . గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావు (75) బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు అందింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కోటబొమ్మాళి పోలీసులు BNSలోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(m) రెడ్ విత్ 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

iqonic-blog

భారతదేశంలోని ఒడిశా రాష్ట్రం, బాలాసోర్ జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో ఐదు ఒరాంగుటాన్ పిల్లలు లభ్యం కావడంపై అటవీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. 5 ఒరంగుటాన్‌లు అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా అయి ఉండవచ్చు అని ఇండోనేషియా ఆందోళన వ్యక్తం చేసింది. ఒరంగుటాన్‌లు కేవలం ఇండోనేషియా మరియు మలేషియాకు మాత్రమే చెందినవి కాబట్టి, భారతదేశంలో వాటి ఉనికి చాలా అసాధారణమైనదని ఇండోనేషియా పేర్కొంది.

iqonic-blog

హైదరాబాద్లోని శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడలో ఎనిమీ ప్రాపర్టీస్‌ భూములను కొందరు అక్రమార్కులు కొద్ది రోజులుగా మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేద్దామని సుమారు నాలుగెకరాల్లో ఏకంగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఫంక్షన్‌ హాళ్లు, షెడ్లు నిర్మించేందుకు వీలుగా చకచకా పిల్లర్లను వేస్తున్నారు. 1962లో భారత్‌పై చైనా దండయాత్ర, 1965-71 వరకు జరిగిన ఇండో-పాక్‌ యుద్ధం తర్వాత భారతీయుల్లో వందల మంది దేశాన్ని వదిలేసి వెళ్లి పాకిస్థాన్, చైనా దేశాల్లో స్థిరపడిన వారి ఆస్తులను ‘ఎనిమీ […]

iqonic-blog

అమెరికాలో జరిగిన భయానక 9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బాధితులను స్మరించుకున్నారు. శుక్రవారం వారికి నివాళులర్పిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని అమాయకుల ప్రాణాలను బలిగొందని మోదీ పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్‌ దశాబ్దాలుగా బాధిత దేశంగా ఉందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం పోరాడుతోందని, ఉగ్రవాద ముప్పు రూపాలు, పద్ధతులు మారుతున్నప్పటికీ.. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలన్న భారతదేశ సంకల్పంలో ఎలాంటి మార్పు […]

iqonic-blog

పుతిన్‌తో పాటు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ మరియు వియత్నాం ప్రధానమంత్రి లె మిన్ హంగ్ ఈ సదస్సుకు హాజరవుతున్న అగ్ర నాయకులు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON