loader
iqonic-blog

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దిల్లీ పర్యటనలో భాగంగా నేడు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన జరగనున్న భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రత్యేక భేటీ సందర్భంగా ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను సీఎం చంద్రబాబు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.

iqonic-blog

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ మహేహ్‌ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది.  కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ గాంధీ భవన్‌ను ముట్టడించడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు.దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ దాడిలో ఓ రిపోర్టర్ తలకు గాయమవడంతో హాస్పిటల్‌కు తరలించారు.

iqonic-blog

భారత్‌లో తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ విడుదలకు  కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రముఖ జపానీస్‌ ఔషధ తయారీ సంస్థ ‘తకేడా’ ఈ టీకాను అభివృద్ధి చేసింది. 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని కంపెనీ తెలిపింది. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఏ ముందస్తు రక్తపరీక్షలు లేకుండా దీనిని వేయించుకోవచ్చు. 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి […]

iqonic-blog

కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమితాతో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీజేపీ ఆందోళనతో పార్లమెంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్లమెంట్ లోపల విపక్షాలు సైతం పేపర్ లీకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ […]

iqonic-blog

పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం చేపట్టిన ఆందోళనలో కీలక పరిణామం జరిగింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరవధిక నిరాహార దీక్షను సోమవారం విరమించారు. ప్రస్తుతం దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం […]

iqonic-blog

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

iqonic-blog

హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ లో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, తీవ్ర వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విచారణలో భాగంగా ఈ ఆరోపణలపై 8 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఉదయ్‌కి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

iqonic-blog

రాహుల్ గాంధీ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారంటూ ముగ్గురు పిల్లలు, మరో మహిళతో ఉన్న ఓ వీడియోను పార్లమెంట్ సమావేశాల వేళ నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు. వీడియోలో తప్పేముందని, లేనిపోని అవాస్తవాలు ఆరోపణలను ప్రచారం చేయవద్దని కొట్టిపారేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియోలో ఉన్నది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడి కుటుంబానికి చెందిన వారని చెప్తున్నారు

iqonic-blog

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వచ్చిన ఒక ట్రక్కు, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఇథనాల్‌ లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.

iqonic-blog

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలోపార్లమెంట్ పై పోలీసులు, భద్రతా దళాలు లాఠీ ఝులిపించారు. పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేస్తూ కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు.అప్పటికే భారీగా మోహరించిన భద్రతా దళాలు లాఠీలతో కాక్రోచ్ పార్టీ మద్దతుదారులపై విరుచుకుపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON