loader
iqonic-blog

ప్రపంచ ప్రసిద్ధ నెల్లూరు రొట్టెల పండుగలో ఈసారి ఒక అత్యంత ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే రొట్టె’ను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వర్ణాల చెరువులో గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే కావాలనే’ రొట్టెను స్వయంగా అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతులు మాట్లాడుతూ.. గిరిధర్ రెడ్డిని తమ బిడ్డలతో సమానంగా చూస్తామని, వచ్చే ఎన్నికల్లో అతను ఎమ్మెల్యే కావాలనేదే తమ […]

iqonic-blog

రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.మానసికంగా సమస్యతో ఉన్న వ్యక్తి నేలపై పడిపోయి ఉండగా, ఓ  మహిళా వార్డ్ ఇన్‌చార్జ్ అతడిని కాలితో ముఖంపై తన్నుతూ దుర్భాషలాడింది. ఒక మనిషిని ఇంతగా ముఖంపై, వీపుపై చెప్పుతో తన్నడం ఎంత దారుణం అంటూ కామెంట్లు వస్తున్నాయి. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పటికీ ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు  దారితీస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

iqonic-blog

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని , అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని,  ప్రచారమవుతున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇదంతా నిరాధార ప్రచారమని తోసి పుచ్చింది. వేట,  పశువుల మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం స్థానికులు ఉపయోగించే ప్రదేశాల్లో రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించారని  ఆరోపించింది. చైనా కార్యకలాపాలు విస్తరించకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ వినతి […]

iqonic-blog

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత 22 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర రూపం  దాల్చాయి. LOC సమీపంలోని రావల్‌కోట్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమంలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు. ‘పీవోకే అసలు పాకిస్థాన్‌లో భాగం కాదు. మాకు పాకిస్థాన్ అవసరమే లేదు. వారికి మా అవసరం ఉంది’ అని స్పష్టంగా హెచ్చరించారు. పాక్  ప్రభుత్వం ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ‘ఇతర మార్గాలు’ (భారత్‌తో సన్నిహిత […]

iqonic-blog

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్  సిటిజన్‌షిప్‌ను రద్దుచేస్తూ వెలువరించిన కార్యనిర్వహాక ఉత్తర్వులను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. జన్మతః పౌరసత్వ  హక్కు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కేవలం ఒక సంతకంతో పుట్టుకతో వచ్చే పౌరసత్వం నిర్వచనాన్ని ట్రంప్ మార్చలేరని  న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దీంతో చట్టాన్ని రద్దుచేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గండిపడింది.

iqonic-blog

భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్‌ను నియమితులయయారు.  రక్షణ పరిశోధన రంగంలో 35 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన డాక్టర్ జగన్నాథ్ నాయక్, దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే అనేక  కీలక ప్రాజెక్టుల్లో తన ముద్ర వేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర  పోషించారు. అలాగే ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఫైబర్ […]

iqonic-blog

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ వివరాలు తీసుకున్నట్లు  తెలుస్తోంది. సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలపై ప్రధాని సమీక్షించారు. కేబినెట్ ప్రక్షాళన  ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం […]

iqonic-blog

విశాఖపట్నంలో మంగళవారం ఘనంగా జరిగిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (CTUAP) ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్యా, ఐటీ  శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రసంగం చేశారు. కేవలం పట్టాలు అందుకోవడం మాత్రమే విద్యకు అంతిమ లక్ష్యం కాదని, ప్రజల జీవితాల్లో  వెలుగులు నింపినప్పుడే చదువుకు సార్థకత చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి పౌరుడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందినప్పుడే ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్’ కల సాకారమవుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

iqonic-blog

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో 2,482.02 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ దఫా 44.28 లక్షల మంది రైతులు లబ్ధిదారులకు నిధులు అందజేయనున్నారు. అందరికీ ఒకేసారి కాకుండా తొలి రోజు ఒక ఎకరం భూమి కలిగి ఉన్న 14.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. తర్వాత  రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల […]

iqonic-blog

రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు  తక్కువ పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వివరించారు. అందుకే రైతులు ఈసారికి వర్షాధార పంటలు ఎక్కువ వేయొద్దని  సూచించారు. పంటమార్పిడి గురించి ఆలోచించాలని హితవుపలికారు. నిపుణుల సూచనల మేరకు పంటలు వేయాలని అందుకు తగ్గట్టు  విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON