loader
iqonic-blog

అంతర్జాతీయ చెస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు; 1924లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) స్థాపించబడిన రోజు ఇదే. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు; చెస్ క్రీడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు  పొందిన పాలక మండలి అయిన FIDE ఏర్పాటును స్మరించుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను మొదట యునెస్కో (UNESCO) ప్రతిపాదించింది; FIDE దీనిని అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత, 1966 నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.

iqonic-blog

‘ఛలో పార్లమెంట్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో సోనమ్ వాంగ్‌చుక్ భార్య అన్మోగ్ గీతాంజలి కీలక వ్యాఖ్యలు చేశారు    దీక్షకు విరమణకు ప్రభుత్వానికి రెండు షరతులు విధించారు. భార్య అన్మోగ్ గీతాంజలి ద్వారా తన కండీషన్స్‌ను తెలియజెప్పారు సోనమ్.    ‘రాజకీయ నాయకులు  ఆస్పత్రికి వచ్చి ఆయనను కలవాలి. రెండోది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం గురించి చర్చించాలి’. ఈ రెండు డిమాండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సోనమ్ తన దీక్షను విరమిస్తారని గీతాంజలి […]

iqonic-blog

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంటూ పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.

iqonic-blog

ఇరాన్ ఆదివారం జోర్డాన్ వైపు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ పరిణామాలతో యుద్ధ ప్రభావం పొరుగు దేశాలకు మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పలు వారాల విరామం తర్వాత మళ్లీ వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. జోర్డాన్‌లోని కీలక నౌకాశ్రయ నగరం అకాబాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది.

iqonic-blog

జనగామ జిల్లా కలెక్టరేట్లో రూ.37.85 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంతర్గత విచారణలో తేలింది. ట్రెజరీ, పీఎఫ్ఎంఎస్ పరిధికి వెలుపల ఉన్న ప్రైవేట్ బ్యాంకు ఖాతా ద్వారా నకిలీ బిల్లులు సృష్టించి ఫర్నీచర్, కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు నమోదు చేసి.. ఈ నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.

iqonic-blog

కాక్రోచ్ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజీపీ తలపెట్టిన ‘ఛలో పార్లమెంట్‌’కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జూలై 20, సోమవారం నాడు ఛలో సంసద్ (ఛలో పార్లమెంట్‌) కోసం ఎవరూ తమ అనుమతి కోరలేదని, పోలీసులు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున సీజేపీ తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

iqonic-blog

జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. జానీ మాస్టర్, సుమలత వివరణతో సంతృప్తి చెందిన ఫెడరేషన్.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. రెండు రోజుల క్రితం జానీ మాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం పరిష్కారమైంది.

iqonic-blog

జాతీయ గేయం ‘వందేమాతరం’ ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజే (సోమవారం) ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026’ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

iqonic-blog

అమెరికా మహిళల బాక్సింగ్‌లో రాణిస్తున్న హన్నా రాప్ దుర్మరణం చెందింది. జూలై 18, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల హన్నా కన్నుమూసింది. టెక్సాస్‌లో సైకిల్ తొక్కుతుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దాంతో, తీవ్రంగా గాయపడిన హన్నా ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరు సైక్లిస్టులను దాటి హన్నా సైకిల్‌ను తాకింది. ప్రమాదం తీవ్రతకు రక్తమోడిన బాక్సర్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తీసకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హన్నా […]

iqonic-blog

బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గోవింద్ నగర్‌లోని గుజైని ప్రాంతంలో నివసించే 23 ఏళ్ల ఆనంద్ 2024లో బీటెక్ లో టాపర్‌గా నిలిచాడు. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల లేఖ కూడా పోలీసులకు లభించింది. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON