loader
iqonic-blog

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భయానక స్థాయికి చేరింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్ తీవ్రంగా దెబ్బతింది. బాంబుల దాడిలో విమానాలు మంటల్లో చిక్కుకోగా, టెహ్రాన్ ఆకాశం పొగతో నిండిపోయింది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ అగ్రనేతలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ దాడులతో చమురు […]

iqonic-blog

రాజమండ్రి కల్తీ పాలు మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలను వెలువడించింది. పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఈజీ-ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత కెమికల్ కలిసినట్లు నిర్ధారించారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్ లీక్ అవ్వడంతో ఆ ప్రదేశంలో ఎం-సీల్‌తో అతికించాడు. పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ వ్యాపారి పాలను సరఫరా చేస్తూ ఉన్నాడు ఫ్రీజర్ నుంచి లీక్ అయిన రసాయనాలు పాలలో కలవడం వల్లే అవి విషంగా మారినట్లు దర్యాప్తులో స్పష్టంగా తేటతెల్లం […]

iqonic-blog

తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ప్రైవేట్ వ్యక్తులు విజయ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ ఫ్రాంచైజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల మార్కెట్లోకి నాణ్యత లేని ఉత్పత్తులు వస్తున్నాయని, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.విజయ బ్రాండ్ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక ఇచ్చిందని […]

iqonic-blog

అనేక రాష్ట్రాలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుంటే.. పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో అన్ని రకాల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. గృహ వినియోగానికి యూనిట్‌కు రూ.1.50 పైసలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు యూనిట్‌కు 79 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌కు 74 పైసలు తగ్గనుండగా.. ఇకపై ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్‌కు యూనిట్‌కు రూ.5 వసూలు చేస్తారు. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమలు కానుంది.

iqonic-blog

రాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది ఏడుగురు మాత్రమే అని డిజిపి చెప్పారు. లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రాప్రదేశ్, నలుగురు తెలంగాణకు చెందిన మావోయిస్టులని డిజిపి వెల్లడించారు. వీరందరికి మొత్తం రూ. 4.18 కోట్ల రూపాయల రివార్డు అందచేయనున్నామన్నారు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లోని అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అంతేకాక.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సిఎం కానీ, మంత్రుల నుంచి కానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ మమత ప్రభుత్వంపై ఎటువంటి ద్వేషం లేదని.. ఆమె తనకు సోదరితో సమానమని […]

iqonic-blog

ఏపీలో రాజకీయంగా వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.తిరుమల లడ్డూకు నెయ్యి కొనుగోళ్లపై సీఐడీ తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే లడ్డూపై చేసిన ఆరోపణల ద్వారా, అధిక ధరలకు నెయ్యిని టీటీడీ నుంచి కొనిపించి 200 కోట్ల పైన దోపిడీ చేశారని పేర్కొన్నారు. రూ.650 ఖర్చు చేస్తే నాణ్యమైన నెయ్యి అయిపోతుందా? అని, వైసీపీ హయాంలో ఉన్న అవే […]

iqonic-blog

పోలవరం జిల్లా మన్యంలోని అడ్డతీగల అటవీ ప్రాంతంలో పెద్దపులి పంట పొలాల్లో ఆవు దూడని దాడి చేసి మరీ చంపేసింది. ఏలేరు జలాశయం వెనక జలాల వైపు సంచరిస్తున్న పెద్దపులి శుక్రవారం గంగవరం మండలం ట్యాంకుబీడు నుంచి పయనించి అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని డి. కృష్ణవరం పొలాల్లో దాడి చేసి పులి ఆవూదూడను చంపేసింది. పులికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా కంబాలపాలెం, మర్రివీడ ప్రాంతంలో ఉన్నట్టు అటవీ అధికారులు గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON