loader
iqonic-blog

కులాల వారి గణనను నిలిపివేయాలనే ప్రజావ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన పిటిషనర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. పిటిషన్‌లో వాడిన పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అనుచిత భాష వాడారు. ఎవరు ఈ పిటిషన్ మీకు రాసి ఇచ్చారని ప్రదాన న్యాయమూర్తి నిలదీశారు. కులగణనకు సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంటూ పిటిషనర్ పిల్‌లో వాడిన పదాలు వివాదాస్పదం అయ్యాయి.

iqonic-blog

వన్యప్రాణుల సంరక్షణ, పశువైద్య శాస్త్రాలపై ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయాన్ని గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన వంతారా శుక్రవారం ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వంతారా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని జామ్‌నగర్‌లోని వంతారా ప్రాంగణంలో హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రాంగణంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ వైల్డ్‌లైఫ్ – వెటర్నరీ యూనివర్సిటీని నిర్మించనున్నారు. అట్టహాసంగా విశ్వవిద్యాలయం శంకుస్థాపన

iqonic-blog

హైదరాబాద్లో ఓ మహిళపై ఆమె భర్త, అతని తమ్ముళ్లు, స్నేహితులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆందోళనకరమైన నివేదికను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేసి బాధితురాలికి తగిన రక్షణ కల్పించేలా చూడాలని తెలంగాణ డీజీపీని ఛైర్పర్సన్ ఆదేశించారు. 7 రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదికను ఇవ్వాలని కోరింది. ఈ ఘటన సదరు మహిళ గౌరవానికి, శారీరక స్వేచ్ఛకు, వివాహ పవిత్రతకు తీవ్ర భంగం కలిగించడమేనని పేర్కొంది. […]

iqonic-blog

సింగరేణి సంస్థలో ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు సాధారణంగా పారదర్శకంగా, ముందస్తు నోటీసులతో నిర్వహించడం ఆనవాయితీ. కనీసం వారం రోజుల ముందు నోటీసు జారీ చేసి, ఆసక్తి గల ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేలా కౌన్సిలింగ్ జరపడం సర్వసాధారణం. అయితే, సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “జీఎం కార్యాలయంలో పనిచేసే వారికి ఒక న్యాయం, సాధారణ ఉద్యోగులకు మరో న్యాయమా?” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

iqonic-blog

హర్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న అత్యంత విలువైన అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైనదిగా పేరున్న ఎంక్యూ-4సి ట్రైటన్ శుక్రవారంనాడు హర్మూజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ ఈ డ్రోన్ మిషన్ తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే  ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ […]

iqonic-blog

ఏపీ రాజధాని అమరావతికి జగన్ పేరుతో ‘మావిగన్’ సరే.. పులివెందులకు అవినాశ్ పేరుతో ‘అవి గొడ్డలి’ అని పెట్టాల్సిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ‘ఎంతసేపూ నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి’ ఇదే వైకాపా సిద్ధాంతమని మండిపడ్డారు. మావిగన్ కు తక్కువ ఖర్చు అయితే.. మూడు రాజధానులు ఎందుకన్నారు? జగన్ ఐదేళ్లు నిద్రపోయారా? మావిగన్ మీద మా వైఖరి అడుగుతున్నారు. ఎవరైనా జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారు.. మా నవ్వే ‘మావిగన్’ మీదున్న అర్థం అని […]

iqonic-blog

అమరావతి నిర్మాణంపై వైసీపీ  కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన అమరావతి ప్రాజెక్టు వాస్తవానికి సాధ్యంకాని ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు అమరావతిలో సాధారణ ప్రజల కోసం కాకుండా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తుల కోసం విలాసవంతమైన బంగ్లాలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో భూమి ధరలు నిర్ణయించి ప్రజలు అక్కడ ఎలా నివసిస్తారని ప్రశ్నించారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు  భావితరాలపై […]

iqonic-blog

రాయలసీమ పేరును వైకాపా రాజకీయం కోసమే వాడుకుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టును చంపేసిన వైకాపా నాయకులు.. మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. మరోవైపు జగన్ నైజం చూసి.. బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. బొత్స అన్న మాటలు గుర్తు చేయడం అచ్చెన్నాయుడి తప్పా అని ప్రశ్నించారు. వైఎస్ మరణం, బాబాయ్ వివేకా హత్యలో అంతిమ లబ్దిదారు జగన్ కాదా? అని వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON