loader
iqonic-blog

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశారు. హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు.

iqonic-blog

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్‌, పర్షియన్‌ నూతన సంవత్స నౌరుజ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

iqonic-blog

కోల్‌కతాలో నిర్వహించిన ఈద్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతలే అసలైన చొరబాటుదారులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు.ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద చొరబాటుదారులని మమతా బెనర్జీ విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

iqonic-blog

ఇరాన్ దేశంలోని అత్యంత సురక్షితమైన, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా భారీ బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ పేలుళ్ల శబ్ధం చాలా కిలోమీటర్ల వరకు వినిపించిందని..ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న నిరంతర పోరులో భాగంగానే ఈ తాజా సైనిక చర్య జరిగినట్లు తెలుస్తోంది.ప్రాథమిక విచారణలో అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదని ధ్రువీకరించారు

iqonic-blog

సీనియర్‌ అధికారి వేధింపులు తాళలేక ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఉరి వేసుకుని మరణించాడు. దీనికి ముందు ఒక వీడియో షేర్‌ చేశాడు. సీనియర్‌ అధికారి తనను వేధిస్తున్నట్లు ఆరోపించాడు. దేవుడు అతడ్ని శిక్షిస్తాడని పేర్కొన్నాడు.కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్, శుక్రవారం సాయంత్రం పావగడలోని ఆ శాఖ కార్యాలయంలో ఉరి వేసుకున్నాడు.

iqonic-blog

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఐటీ నిపుణులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త అందించింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో సాఫ్ట్‌వేర్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, ఐటీ ఆఫీసర్, మరియు రిస్క్ మేనేజర్ వంటి కీలకమైన స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేది మార్చి 23

iqonic-blog

భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.ఇప్పటివరకు సెమాగ్లుటైడ్ ఔషధంపై విదేశీ కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉండటంతో, దీని ధర సామాన్య రోగులకు భారంగా ఉండేది. విదేశీ బ్రాండ్ల కంటే గణనీయమైన తక్కువ ధరకే ఇది లభించనుంది. ప్రతిరోజూ మందులు వాడే ఇబ్బంది లేకుండా, దీనిని వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేలా […]

iqonic-blog

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ భీకర దాడులకు తెగబడింది. శనివారం (మార్చి 21) హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ల సైనిక స్థావరమైన డియెగో గార్సియాపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి జరిగిన వెంటనే దుబాయ్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్ భూభాగానికి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరంపై జరిగిన దాడుల్లో ఇది అతిపెద్దది. అత్యంత అరుదైనది.రెండు క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసినట్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON