loader
iqonic-blog

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ బ్రాండ్ వివిధ రోగాలను పూర్తిగా నివారిస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అభ్యంతరకరమైన ప్రకటనలు జారీ చేస్తున్నారనే ఆరోపణలతో FDA అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.73.24 లక్షల విలువైన ఆయుర్వేద, అల్లోపతి మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హరిద్వార్‌లోని ‘దివ్య ఫార్మసీ’ సంస్థ తయారు చేసి, పతంజలి బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఔషధాలను ఈ దాడుల్లో ప్రధానంగా స్వాధీనం చేసుకున్నారు.

iqonic-blog

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు. ఒక జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.

iqonic-blog

కర్ణాటక ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ తన క్యాబినెట్‌లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనకు నో చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఆయన అధిష్ఠానానికి తెలియజేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్లు ఉన్నందున కొందరిని మాత్రమే ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంవల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి తలెత్తవచ్చని పార్టీకి ఆయన వివరించినట్టు తెలుస్తోంది.

iqonic-blog

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ జూన్ 3వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు లోక్భవన్ ప్రకటన విడుదల చేసింది. లోక్ భవన్ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ తనకు రాసిన లేఖ అందిందని గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో డీకే. శివకుమార్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యనే ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం […]

iqonic-blog

చెత్త నుంచి సంపదను సృష్టించే మార్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసే ప్రక్రియను, బాయిలర్లలో చెత్తను మండించే విధానాన్ని ఆసాంతం పరిశీలించారు. అనంతరం ప్లాంట్ అధికారులతో మాట్లాడి, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ ఉత్పాదనపై క్షుణ్నంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

iqonic-blog

BRSకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తే.. తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. తాము ఉచిత విద్యుత్ కొనసాగిస్తే.. బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని సవాల్ విసిరారు. రైతుల ముసుగులో కేసీఆర్ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని భాజపా సర్కారు వడ్లు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో 32 శాతం ధాన్యం మాత్రమే కొంటోంది. భాజపా నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం […]

iqonic-blog

ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది. మెగా డీఎస్సీపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెరిట్ ఆధారంగానే డీఎస్సీలో నియామకాలు జరిగాయని టాటా ఆయన్ ఆధ్వర్యంలో, మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీతో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీటీ విధానంలో మెగా డీఎస్సీ నిర్వహణతో, ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేదని […]

iqonic-blog

గోదావరిజిల్లాల శివారుప్రాంతం రంపచోడవరం గిరిజన గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వన్యప్రాణులను వేటాడే విల్లు (బాణం) తన సొంత అన్నయ్య పై తమ్ముడు వేశాడు. దీంతో ఛాతి ఎదురభాగం నుంచి వెనకాల భాగంకు ఈ బాణం దూసుకెళ్లడంతో.. దెబ్బతిన్న అన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనిషి చాతిని రెండుగా చీల్చి లోపలికి వెళ్ళిన ఆ ఇనప బాణమును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు.

iqonic-blog

పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు సోనార్‌పుర్ వెళ్లిన ఆయనపై స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు ఆయనపై చేయి చేసుకున్నారు. అభిషేక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం చిరిగిన చొక్కాతో […]

iqonic-blog

మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు ఇవాళ 8 మంది వెళ్లారు. ఐతే.. వారు నదిలో నీరు ఎక్కువగా ఉందనీ, ఎక్కువ లోతు ఉంటుందని అంచనా వెయ్యలే 8 మందిలో ఐదుగురు మిస్సింగ్ అయ్యారు. మంత్రాలయం దగ్గర బంధువుల ఇంట్లో పూజ కోసం వీరంతా వచ్చారని తెలిసింది. ప్రస్తుతం నదిలో నీరు కొంత తక్కువగానే ఉంది. అందుకే వారు.. నదిలో లోతు పెద్దగా ఉండదు అనుకున్నారు. నీటిలో దిగి, గల్లంతైన వారిలో ఐదేళ్ల పిల్లాడు కూడా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON