loader
iqonic-blog

ఐపీఎల్ నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా, పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. తన తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు కూపర్ కానలీ, పంజాబ్‌పై అర్ధ సెంచరీ సాధించాడు.

iqonic-blog

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.తాజాగా అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థలపై ఏప్రిల్ 1 నుండి దాడులు చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) తాజాగా హెచ్చరించింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం ఉండనున్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 దిగ్గజ కంపెనీలను ఐఆర్‌జీసీ తన లిస్టులో పేర్కొంది.

iqonic-blog

పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళవారం సాయంత్రం సాంకేతిక కారణాలతో లఖ్‌నవూ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం గాలిలో ఉండగానే పొగలు రావడంతో పైలట్ ‘మేడే కాల్’ సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే లఖ్‌నవూలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 148 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

iqonic-blog

ఎన్నికల ప్రచార సభలో సిఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బిజెపిపై మాటల దాడి చేశారు. బిజెపి ఒక అనాగరిక పార్టీ అంటూ ధ్వజమెత్తారు. బిజెపి.. దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బెంగాల్ నుండి వలస వచ్చిన వారిని వేధిస్తున్నారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను పక్కనపెట్టి, తన నాయకత్వానికి మద్దతుగా నిలవాలని బెనర్జీ ప్రజలను కోరారు.

iqonic-blog

తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటనతో వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఈ సంస్థలో ఉన్న హాస్టల్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సమక్క-సారలమ్మగర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి వేళల్లో ఎలుకలు హాస్టల్ గదుల్లోకి చేరి స్వైర విహారం చేస్తూ నిద్రిస్తున్న విద్యార్థినులను కరిచిన ఘటనలో ఏకంగా 11 మంది విద్యార్థినులు ఎలుకల దాడికి గురవడం […]

iqonic-blog

దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  దళిత క్రైస్తవుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ […]

iqonic-blog

తిరుపతిలో సోమవారం సాయంత్రం చనిపోయిన బాలిక కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక రీల్స్ చేస్తూ భవనం పైనుంచి కిందపడి చనిపోలేదని.. బాలికది ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. అన్న వరుస అయ్యే వ్యక్తిని బాలిక ప్రేమించిందని.. ఈ విషయం తెలిసి తల్లి మందలించటంతో మనస్తాపంతో ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు వెల్లడించారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుందంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే అందరూ అనుకున్నట్లుగా బాలిక రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోలేదని పోలీసుల […]

iqonic-blog

అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పహిల్వాన్‌ భాష మాట్లడుతున్నడని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌ డొల్ల అని, అందుకే దానికి సంబంధించిన పత్రాలను చించివేశామని హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నదని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఆ హామీలను ఈ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు. కోటి మంది మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని మాటతప్పారని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON