loader
iqonic-blog

సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు వాదించడానికి కోర్ట్ హాల్ కు వచ్చాడు. వాదన వినిపించే క్రమంలో సదరు వ్యక్తి పూర్తిగా కంట్రోల్ తప్పాడు. ఏసీపీపై వెంటనే కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులనే ఆదేశించాడు. సదరు వ్యక్తి మాట్లాడుతూ సీజేఐపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పేపర్లను గాల్లోకి విసిరేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు లాయర్లు […]

iqonic-blog

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో అరుదైన ఘనత సాధించింది. ‘లాంగ్ మార్చ్-10బీ’ క్యారియర్ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత, ఫస్ట్ స్టేజ్ బూస్టర్‌ను సముద్రంలో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై నెట్ ద్వారా సురక్షితంగా భూమికి వెనక్కి తీసుకొచ్చింది. ఈ కంట్రోల్డ్ రికవరీ సక్సెస్ అవ్వడం చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి. రాకెట్లను మళ్లీ వాడుకునే రీయూజబుల్ టెక్నాలజీలో ఆ దేశానికి ఇది చాలా పెద్ద ముందడుగు. 2015లో ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ మొదటిసారిగా రాకెట్ బూస్టర్‌ను […]

iqonic-blog

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మైదానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో కలిసి మోడీ మెల్‌బోర్న్ గ్రౌండ్‌ను తిలకించారు. ఈ క్రమంలో ఎంసిజిలో శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లతో సరదగా ముచ్చటించారు. అంతేగాక వారి సాధన గురించి అడిగి తెలుసుకున్నారు.

iqonic-blog

కేంద్రం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)ను ఏ రూపంలో ఉన్నా తమిళనాడు ఆమోదించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ టివికె ఆవిర్భావం నుంచి కూడా డిలిమిటేషన్‌ను వ్యతిరేకించిందని, డిలిమిటేషన్‌తో తమిళనాడు లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గుతుంది. కేంద్ర నిధులకు కూడా గండిపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే ప్రతిపాదిత డిలిమిటేషన్‌ను వెనకకు తీసుకోవాలి. కాదు కూడదనుకుని ముందుకు సాగితే తమిళనాడు తరఫున తమ తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ఈ సభలో […]

iqonic-blog

అక్రమాస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో సోదాల్లో భాగంగా ACB అధికారులు ఆయన డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఆయన ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోకి రూ.3 కోట్లు అప్పు ఇచ్చినట్లు రాసుకున్నట్లు గుర్తించారు. ఈ హీరోతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారని సమాచారం. హీరో ఎవరై ఉంటారా […]

iqonic-blog

ఏపీ కేబినెట్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఉత్తుత్తి సమావేశాలు ఎందుకని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోర్టులు, భూములు తమ వారికి కట్టబెట్టడానికే చంద్రబాబు కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సాయికృష్ణ లాకప్‌డెత్‌, క్రాంతికుమార్‌ ఆత్మహత్య, ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్‌పై టీడీపీ కార్యకర్తల దాడి గురించి ఎందుకు చర్చించ లేదని ప్రశ్నించారు. కేబినెట్‌ సమావేశానికి డీజీపీ వెళ్లి సోషల్‌ మీడియా కట్టడిపై మాట్లాడడం విచిత్రమని వెల్లడించారు.

iqonic-blog

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ అరుదైన ఘనతను సాధించింది. అంతర్జాతీయంగా అతి పిన్న వయస్సులో 300 మ్యాచులు ఆడిన బ్యాటర్ నిలిచింది. 29ఏళ్ల స్మృతి ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తం 10వేలకు పైగా పరుగులు చేసింది. ఇందులో 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున 2013లో స్మృతి మంధాన అరంగేట్రం చేసింది.

iqonic-blog

విశాఖపట్నంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటునకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్‌ల నిర్వహణ, కాన్సర్ట్‌లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు రాష్ట్రమంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఎస్‌ఐపీబీ సిఫార్సులతో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన సంస్థలకు భూకేటాయింపులకు […]

iqonic-blog

కల్వకుంట్ల కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడో.. లేదో చెప్పాలన్నారు. ఆయన బీజేపీతో టచ్ ఉన్నాడని.. కాదని రాముడి మీద ఒట్టేసి చెప్పగలరా.. అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకులకే స్పష్టత లేదని, ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయని, ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.AP కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు వందల కోట్ల రూపాయలు ఆరోపణలు […]

iqonic-blog

అమరావతిలో రెండో విడత భూములిచ్చే రైతుల సాగు రుణమాఫీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమి సమీకరించే 7 గ్రామాల రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుంది. భూములిచ్చిన, ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్ట రైతులకు రూ.40 వేలు, జరీబు రైతులకు రూ.60 వేలు కౌలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON