loader
iqonic-blog

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్‌లో నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది. రాజేష్ శర్మ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు ఇంకా ప్రమాదం తొలగిపోలేదని AICWA వెల్లడించింది. తాజా మెడికల్ అప్‌డేట్ ప్రకారం ఈ ఘటన తీవ్రత మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తెలంగాణ […]

iqonic-blog

 వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో కరోలినా ముచోవా సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఏడో సీడ్ కొకో గాఫ్‌ను చిత్తు చేసిన ముచోవా తొలిసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం హోరాహోరీగా  జరిగిన మ్యాచ్‌లో గాఫ్‌పై ఆధిపత్యం చెలాయించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో గెలుపొందింది. దాంతో, మొదటిసారి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న అమెరికా స్టార్ గాఫ్ కల చెదిరింది.

iqonic-blog

ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జి పై అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా-తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన భాగం. ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ […]

iqonic-blog

దివంగత హీరో శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి మృతిచెందారు. ఆమె వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక హీరో శోభన్‌బాబుతో శాంతకుమారి వివాహం 1958 సంవత్సరం మే 15న జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన శోభన్‌బాబు 2008లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచి శాంతకుమారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివసిస్తున్నారు. శోభన్ బాబు సతీమణి శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు […]

iqonic-blog

కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్య పేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేశ్, ఎరుపల్లి ప్రసాద్ అనే ఇద్దరు మత్స్యకారులు(జాలర్లు) తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందితో కలిసి సముద్రం లో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేటకు వీరు వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు బోటులో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి, పడవ మొత్తానికి వ్యాప్తి చెందాయి.వేరే బోటులో […]

iqonic-blog

పోక్సో కేసులో అరెస్టు అయిన బండి సాయిభగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయోద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8వ తేదీన పోక్సో కేసు నమోదు కావడంతో పరారయ్యాడు. సుచిత్రకు చెందిన మహిళ తన కూతురిపై సాయి భగీరథ్ లైంగికంగా హింసించాడన్న ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

iqonic-blog

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో.. ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా కొన్ని రిటర్న్ గిఫ్ట్ లను అందించింది. భారత్ కు చెందిన అపురూపమైన చారిత్రక విగ్రహాలు, పూజా సామాగ్రిని వెనక్కి ఇచ్చేసిందా దేశం. ఇందులో భద్రకాళి అమ్మవారి రూపంతో కూడిన లోహపు త్రిశూలం, పవిత్ర రాతి నంది విగ్రహం, షణ్ముఖ కార్తికేయుడి రాతి విగ్రహం ఉన్నాయి. ఈ కళాఖండాలు చోళులు, విజయనగర రాజుల కాలం నాటివి.

iqonic-blog

ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కాపులు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ తెలిపారు.ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి చేతులు మారుతూ వస్తోంది. జగన్, చంద్రబాబు కాపులను ముఖ్యమంత్రిగా అంగీకరించరని, వారు లేదా వారి వారసులను మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకుంటారని, కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే, […]

iqonic-blog

అర్జెంటీనా లోని టొలెడాలో ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా ఫ్లయింగ్ స్కూల్‌లో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న లియాండ్రో ఆండ్రెస్ .. ఓ విద్యార్థికి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా విమానం నుంచి దూకేశారు. ‘ఏం చేయాలో నీకు తెలుసు. ఆ ప్రకారమే నడుచుకో’ అంటూ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ తన హెడ్‌సెట్‌, సీట్‌బెల్ట్ తీస్తూ ఆ స్టూడెంట్‌కు చెప్పారు. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని ఆ యువకుడు తొలుత కంగుతిన్నా తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు.

iqonic-blog

టైప్-1, అడ్వాన్స్‌డ్ టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇకపై ప్రతిరోజూ సూదితో గుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా.. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే సరికొత్త ఇన్సులిన్ అవిక్లీని నోవో నార్డిస్క్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఏడాదికి తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య 365 నుండి కేవలం 52 కి పడిపోతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON