loader
iqonic-blog

పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులపైనా ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా, సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యార్థి వీసా రుసుములు 524 పౌండ్ల నుంచి 558 (రూ.69,814) పౌండ్లకు పెరగనున్నాయి. మూడేళ్ల స్కిల్డ్ వర్కర్ (కార్మిక) వీసా 769 పౌండ్ల నుంచి 819 […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పర్వదినాన విడుదల చేసిన జాబ్ క్యాలెండర్  నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం కేవలం 10,060 పోస్టులనే భర్తీ చేస్తామనడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారిని పచ్చిగా మోసం చేసిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

iqonic-blog

‘ధురంధర్ 2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా టాలీవుడ్ టాప్ హీరోలు పోస్ట్‌లు పెట్టడంపై ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. ఉత్తరాదిలో తరచుగా వినిపించే “ఒత్తిడి రాజకీయాలు” ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చిందని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఈ సినిమాపై వ‌స్తున్న ప్ర‌శంస‌లు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

iqonic-blog

ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె జూ యే యుద్ధ ట్యాంక్‌ను న‌డిపింది. ఫోటోల‌ను ప్ర‌భుత్వం మీడియా రిలీజ్ చేసింది. జూ యే ఆర్మీ ట్యాంక్‌ను డ్రైవ్ చేస్తుండ‌గా.. ఆమె ప‌క్క‌నే కిమ్ జాంగ్ కూర్చున్నారు. ఆ ట్యాంక‌ర్‌పై మ‌రికొంత మంది సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఉత్త‌ర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆ ఫోటోల‌ను రిలీజ్ చేసింది.  ఆ అమ్మాయిని భ‌విష్య‌త్తు దేశాధినేత‌గా కిమ్ తీర్చిదిద్దుతున్నారేమో అన్న ఊహాగానాలు […]

iqonic-blog

భ‌ద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి ఐదుగురు యువకులు భద్రాచలం వచ్చారు. అనంతరం పట్టణ శివారులోని వేలేరు ప్రాంతంలో ఉన్న గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. నది ప్రవాహం లోతుగా ఉండటంతో ఒక్కసారిగా ఐదుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి వివరాలు సతీశ్‌, నవదీప్, తేజజ్ఞ, అభిరామ్, శ్రీకర్ గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మిగతా ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడి సమాచారాన్ని అందించారు.  స్థానిక గజ ఈతగాళ్లు నదిలో యువకుల కోసం గాలిస్తున్నారు

iqonic-blog

ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. ఈ ఘటనపై ఇరాన్ మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 19 ఏళ్ల రెజ్లర్ అయిన సలేహ్ మొహమ్మది, సయీద్ దావోది, మెహ్ది ఘసెమి అనే ముగ్గురు వ్యక్తులు ఘర్షణల సందర్భంగా ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు ప్రభుత్వం ఆరోపించింది.ప్రభుత్వానికి ఎదురుతిరగడం అంటే దేవుడిని ఎదిరించినట్లే అని అక్కడి […]

iqonic-blog

ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో ని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికిఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి”ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”నునూతనంగా ప్రవేశపెడ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన లేదు. కాగా.. పెన్షన్లను రూ 4 వేలకు,మహిళలకు నెలకు రూ 2,500 ఇస్తామని ఇచ్చిన హామీ, ఈ బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న ఈ రెండు హామీ ల గురించి ఎలాంటి […]

iqonic-blog

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా మోసమని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మండిపడింది. బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు బడ్జెట్‌ ప్రతులను చింపిపారేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభ నుంచి బయటికి వచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON