loader
iqonic-blog

కొత్త త‌ర‌హా ఆయుధాన్ని డీఆర్డీవో ప‌రీక్షించింది. తారా గ్లైడ్ వెప‌న్ సిస్ట‌మ బాంబును ఒడిశా తీరంలో విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. తారా అంటే టాక్టిక‌ల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగుమెంటేష‌న్‌(టీఏఆర్ఏ). ఇదొక‌ర‌మైన బాంబు. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. సంప్ర‌దాయ‌క‌ర‌మైన వార్‌హెడ్స్‌తో ఈ సిస్ట‌మ్ ద్వారా క‌చ్చితమైన టార్గెట్ల‌ను ధ్వంసం చేయ‌వ‌చ్చు. డీఆర్డీవో, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ప‌రీక్ష నిర్వ‌హించాయి. త‌క్కువ ఖ‌ర్చుతో ఈ బాంబును రూపొందించారు.

iqonic-blog

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం అడోబ్ భారత్‌లో తన ఉనికిని మరింత విస్తరించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక భారీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది. నోయిడా సెక్టార్ 129లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్, భారతదేశంలో అడోబ్‌కు ఏడవ కార్యాలయం కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడవది.ఈ కొత్త క్యాంపస్‌ను ఆధునిక సాంకేతికతతో, ముఖ్యంగా ఏఐ (AI)-సిద్ధంగా ఉండేలా రూపొందించారు. ఈ కొత్త కార్యాలయం ద్వారా సుమారు 700 మందికి పైగా ఉద్యోగులు ఒకే గొడుగు కింద పనిచేయనున్నారు.

iqonic-blog

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయి. అజిత అనే పేరుతో విక్రయించిన విత్తనాలు అసలు మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సుమారు వంద ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఇప్పుడు పెట్టుబడి కూడా రాక లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాలను నమ్మి సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వ్యాపారి మోసం బయటపడింది.

iqonic-blog

ఇండోనేషియాలోని హల్మాహెరా ఐలాండ్‌లో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం ఇవాళ ఉదయం విస్ఫోటనం చెందింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:41 గంటలకు ఈ విస్ఫోటనం సంభవించింది. ఇది సుమారు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిదను ఆకాశంలోకి చిమ్మినట్లు ఇండోనేషియా వోల్కనోలాజికల్ సర్వే తెలిపింది.ఈ ఘటనతో పర్వతారోహణకు వెళ్లిన 20మంది గల్లంతయ్యారు. వారిలో సింగపూర్‌కు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించినట్లు సమాచారం

iqonic-blog

వరంగల్ జిల్లా పహాడ్ల అశోక్‌ నగర్‌లో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ భూమిలో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న కథనాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దట్టమైన పొదల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయి. అయితే, ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లుగానీ, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.

iqonic-blog

దేశానికే మోడల్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్‌లో రూ.110 కోట్లతో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్‌ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు మంత్రులు దామోదర, శ్రీహరిని నిద్ర పోనీయొద్దని చెప్పారు.

iqonic-blog

తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నివాసం లోక్‌ భవన్‌ వద్ద టీవీకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడినా గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం లోక్‌ భవన్‌ ఎదుటు నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని టీవీకే అభిమానులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు వామపక్షాలు, కాగ్రెస పార్టీ సైతం గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలక పిలుపునిచ్చారు

iqonic-blog

జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య సునందను నేపాలీ పని మనిషి హత్య చేసింది. భారీగా బంగారం ఎత్తికెళ్లింది. పని మనిషితో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న డీజీపీ సీవీ ఆనంద్‌, సీపీ సజ్జనార్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON