loader
iqonic-blog

మునుబోలు పోర్టు అడ్డరోడ్డు పై వంతెనపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నుంచి విజయవాడ వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్ బస్సు పోర్టు రోడ్డు సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో DSC నియామక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, అవకతవకలను ప్రశ్నిస్తున్నారనే నెపంతో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుల తరఫున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పలు ప్రముఖ మీడియా సంస్థల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా సాక్షి డిజిటల్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు బిగ్ టీవీ ఇన్‌స్టా ఖాతాలను భారతదేశంలో అందుబాటులో లేకుండా చేయించడం కూటమి ప్రభుత్వ భయానికి, అసహనానికి […]

iqonic-blog

ఆటో మీటర్ ఛార్జీల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆటో సంఘాల నుంచి వస్తున్న నిరంతర విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్, కొత్త ధరలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఆటో ఛార్జీల పునఃసమీక్ష కమిటీ ఒక కీలక నివేదికను రూపొందించింది. ఈ సిఫారసుల ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.20 కనీస ఛార్జీని ఏకంగా రూ.30కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, అదనపు కిలోమీటరుకు వసూలు చేసే ఛార్జీని రూ.11 నుంచి రూ.14కి సవరించాలని సూచించారు.

iqonic-blog

శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో త్రిస్సూర్ జిల్లా కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి 66పై తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులో ఎనిమిది మంది యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైవేపై నిర్మాణ పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన ఆపి ఉంచిన గూడ్స్ లారీని వారి కారు అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.దుర్ఘటనలో ఎనిమిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.దిండిగల్ ప్రాంతానికి చెందిన పీఎస్‌ఎన్ఏ […]

iqonic-blog

మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియాదేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.

iqonic-blog

ఉపాధ్యాయ దినోత్సవం ( Teachers’ Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము.

iqonic-blog

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరును ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉన్నత స్థాయి దౌత్య బృందం మాస్కో, కీవ్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్ శనివారం మాస్కోలో, ఆదివారం కీవ్‌లో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. ఈ రాయబార బృందం పర్యటన ప్రశాంతంగా సాగేందుకు వీలుగా రెండు దేశాలు […]

iqonic-blog

అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేర ఎత్తులో మార్పు, దాదాపు నాలుగు సెకన్ల పాటు విమానంపై నియంత్రణ కోల్పోయిన ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI2379 విమానానికి పైలట్‌గా వ్యవహరించిన కమాండర్‌పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. సైకోయాక్టివ్‌ (మానసిక ప్రభావం చూపే) పదార్థానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో పైలట్ ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. విమాన కమాండర్ నిర్ధారణ పరీక్షలోనూ సైకోయాక్టివ్ పదార్థం ఉన్నట్లు AAIB […]

iqonic-blog

మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? అంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అని తేలిపోతుంటే ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత రాజీనామా చేయించకుండా .. అబద్ధాలు చెప్తూ కొడుకును […]

iqonic-blog

ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. వివాదాల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ భార్య సుమలత ఈ సంచలన ఫిర్యాదు చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ (సొసైటీ) అధికారిక బ్యాంక్ ఖాతాను రఘు మాస్టర్ హ్యాక్ చేశారని ఆమె తన కంప్లైంట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. సుమలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు రఘు మాస్టర్‌ను నేరుగా స్టేషన్‌కు పిలిపించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON