loader
iqonic-blog

సంగారెడ్డి జిల్లా కంగ్జి మండలం రాసోల్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న వసంత్ కుమారి అనే మహిళను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వేధించడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి వసంత్ కుమారి (అంగన్వాడీ టీచర్) భర్త తమను మోసం చేశాడంటూ కొంతమంది గ్రామస్తులు ఆరోపించారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని మహిళపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఆమెను బహిరంగంగా […]

iqonic-blog

తెలంగాణలో జనగణన 2027కు ప్రభుత్వం సిద్ధమైంది. హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సర్వే మే 11 నుంచి జూన్ 9 వరకు అదే విధంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం కల్పిస్తారు. ప్రజలు తమ వివరాలను ముందుగానే ఆన్‌లైన్ లో నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. జనగణనలో పూర్తి సహకారం అందించాలని ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి చేసింది. సెన్సస్ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వడం తప్పనిసరి, అడ్డంకులు కలిగిస్తే కఠిన […]

iqonic-blog

విండోస్ 10 సపోర్ట్ ముగిసిపోతుండటం, కోట్లాది కంప్యూటర్లు విండోస్ 11కు అప్‌గ్రేడ్ లేక ప్రపంచవ్యాప్తంగా పాత పీసీలని పడేయాల్సిన తరుణంలో టెక్ దిగ్గజం గూగుల్ ‘క్రోమ్ ఓఎస్ ఫ్లెక్స్ యూఎస్‌బీ కిట్’ను పరిచయం చేసింది. దీని ధర కేవలం సుమారు 250 రూపాయలు మాత్రమే. కానీ ఇందులో ఇన్‌స్టాల్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం పూర్తిగా ఉచితం. పర్యావరణ హితం కోసం ఈ కిట్‌ను మళ్ళీ మళ్ళీ వాడుకునేలా రూపొందించారు. కేవలం ఒక యూఎస్‌బీ ద్వారా మీ […]

iqonic-blog

స‌మాజ అభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. CSR(corporate social responsibility) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. కంపెనీలు త‌మ‌కు నచ్చిన రంగాన్ని ఎంచుకుని సీఎస్ఆర్ నిధులు వినియోగించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వ‌స‌తుల‌ను వినియోగించుకుంటున్నందున త‌మ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.

iqonic-blog

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నాదర్ గుల్ భూముల వ్యవహారంలో మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు ఆరోపిస్తున్న నాదర్‌గుల్ సర్వే నంబర్ 613లోని భూములకు సంబంధించి పొంగులేటి కీలక ఆధారాలను బయటపెట్టారు. ఆ భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడు ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు. 2016లో మ్యూటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారంలోనే ఉందని, అప్పుడు జరిగిన రిజిస్ట్రేషన్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమని ఆయన నిలదీశారు.

iqonic-blog

నారా లోకేష్ బుధవారం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పలువురు నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేడర్‌తో మీటింగ్‌లు, గ్రీవెన్స్ కార్యక్రమాలు వరుసగా నాలుగు వారాలు నిర్వహించని నేతలను నారా లోకేష్ మందలించినట్లు సమాచారం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పులివెందుల టీడీపీ  ఇంఛార్జి బీటెక్ రవి, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మీద నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

iqonic-blog

బనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భీకరంగా విరుచుకుపడ్డాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100 హిజ్బుల్లా స్థావరాలపై 160 బాంబులు కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ ఈ దాడులను ‘ఎటర్నల్ డార్క్‌నెస్’ అనే కోడ్ నేమ్‌తో నిర్వహించినట్లు సమాచారం. హిజ్బుల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

iqonic-blog

హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ స్పష్టంచేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. కాల్పుల విరమణ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ పంపిన 10 డిమాండ్లలో టోల్ ఫీజు వసూలు చేయడం కూడా ఉంది. రం ఒమన్ రవాణా శాఖ మంత్రి సయీద్ బిన్ హమూద్ బిన్ సయీద్ ఆల్ మాట్లాడుతూ.. నౌకలపై టోల్ ఫీజు విధించబోమని హామీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON