loader
iqonic-blog

ఐపిఎల్ సీజన్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

iqonic-blog

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో విన్నర్స్ అయ్యి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది గుజరాత్ టైటాన్స్ జట్టు..భారీ టార్గెట్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. టైటాన్స్ రన్ మెషిన్స్‌లా మారారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అద్భుత పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చెయ్యగా.. 215 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన గుజరాత్ […]

iqonic-blog

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ భారీ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర […]

iqonic-blog

సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఎస్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలపై సీఎం అధికారులతో శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధితులు సైబర్ వార్ రూమ్ కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి.. బ్యాంకులను అప్రమత్తం చేయాలన్నారు. దీని ద్వారా గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు […]

iqonic-blog

రాష్ట్రాల హైకోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా కేసులో తీర్పు రిజర్వు చేసిన తర్వాత మూడు నెలల్లో దానిని వెలువరించాలని సూచించింది. తీర్పు వెలువరించడంలో ఆలస్యం జరిగితే కక్షిదారులకు నష్టాన్ని తెచ్చిపెడుతుందని పేర్కొంది. తద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని సిజెఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల బాగ్చి, జస్టిస్ విపిన్ పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

iqonic-blog

ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. టీచర్ వృత్తిలో కొనసాగాలనుకునే వారికి టెట్‌లో అర్హత సాధించడానికి మరింత వెసులుబాటును కల్పించింది. టెట్ అర్హతకు గతంలో విధించిన గడువును సవరిస్తూ 2028 ఆగస్టు 31 వరకు దానిని పొడిగిస్తున్నట్లు శుక్రవారంనాడు న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగత ఉపాధ్యాయులు దాఖలు చేసిన 65కి పైగా రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన చేతగానితనంతో ‘మెగా డీఎస్సీ’ని కాస్తా ‘దగా డీఎస్సీ’గా మార్చేసిందని ప్రతిపక్ష YSRCP తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కూటమి నేతల ‘మెగా దోపిడీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, కూటమికి నేతలు నిరూపితం కాని పద్ధతుల్లో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని […]

iqonic-blog

ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే సూచనలు ఉన్నాయని, దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు అప్రమత్తత ప్రకటించాయి.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు […]

iqonic-blog

చంద్రబాబు శక్తుల నుంచి తెలంగాణ ను కాపాడు కోవలసిన బాధ్యత బీఆర్‌ఎస్‌ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలంగాణను అవమానించిన తెలంగాణ ద్రోహి బక్కని నరసింహులని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి , బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏనాటికైనా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ […]

iqonic-blog

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రవేశం వేళ మిశ్రమ వాతావరణ పరిస్ధితులు కొనసాగుతున్నాయి. పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా,గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45-46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందన్నారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON