loader
iqonic-blog

తెలంగాణకు ప్రపంచస్థాయి విద్యాసంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం లండన్ యూనివర్సిటీని సందర్శించింది. తెలంగాణలో ఉన్న అవకాశాలపై ఆ వర్సిటీ ప్రతినిధులతో సీఎం బృందం చర్చించింది. హైదరాబాద్ లో క్యాంపస్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లుగా లండన్ వర్సిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.

iqonic-blog

హాకీ ప్రపంచకప్ లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు శనివారం పూల్-ఈలో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ కీలక మ్యాచ్ లో భారత్ 1-3తో పరాజయం చవిచూసింది. మ్యాచ్ లో భారత జట్టే అధిక సమయం బంతిని తన అధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో విఫలమైంది. మొదటి రెండు క్వార్టర్లలో ఇరుజట్లూ గోల్స్ చేయలేదు. రెండో అర్ధ భాగంలో నెదర్లాండ్స్ మూడు గోల్స్ చేసింది.

iqonic-blog

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేపై మహారాష్ట్రలోని లాటుర్ జిల్లాలో కేసు నమోదైంది. స్కూల్ ఠీక్ ఖరో కార్యక్రమంలో భాగంగా ఓ పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి.. టీచర్లను  బెదిరించారని  ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిప్కేతో పాటు పలువురు నిరసన కారులు అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించారని స్కూల్ యాజమాన్యం ఆరోపించింది. విద్యార్థుల మధ్యలో కూర్చుని వారు ఇబ్బంది పడేలా ప్రశ్నలు వేశారని ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

iqonic-blog

తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టిపిసిసి క్రమశిక్షణా కమిటి ఛైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు […]

iqonic-blog

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్ లో తొలి బంతికి నాలుగుసార్లు వికెట్ తీసిన తొలి బౌలర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. తొలి సెషన్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఆరంభించగా.. తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ ష్మాన్ ఇస్లాం.. కామెరూన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్తో మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ పెడ్రో కొలిన్స్ పేరిట […]

iqonic-blog

కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాను పక్కదారి పట్టించడానికి 39 సంవత్సరాల క్రితం చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడడం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. నా తండ్రిని ముమ్మాటికి చంపింది అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే..     సీతక్కను మా అమ్మ చేతులు పట్టుకున్నది. మా బాబాయి కూడా చేతులు పట్టుకొని బతిమిలాడారు. నా తండ్రితో మాట్లాడి పంపిస్తాం అని చెప్పి శవాన్ని […]

iqonic-blog

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందం బ్రిటన్ పర్యటనలో  భాగంగా ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో అత్యంత ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది.  రాష్ట్రంలో విద్యా, పరిశోధన రంగాల్లో ఉన్న అపారమైన భాగస్వామ్య అవకాశాలపై ఈ ఉన్నతస్థాయి భేటీలో కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో తెలంగాణ బృందం సుదీర్ఘంగా చర్చించింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి వారికి కూలంకషంగా వివరించారు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి దశ: 1,523 పోస్టులు, ఉన్నత విద్యాశాఖ ద్వారా మే 15నే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. రెండో దశ: 3,231 పోస్టులు సెప్టెంబర్ 15, 2026న నోటిఫికేషన్. గ్రూప్-1, మూడో దశ: 2,311 పోస్టులు అక్టోబర్ 15న నోటిఫికేషన్. గ్రూప్-2, నాలుగో దశ: 2,995 పోస్టులు […]

iqonic-blog

గచ్చిబౌలి‌లో భవన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఎలాంటి వెనుకంజ లేకుండా నేలమట్టం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం యాభై గజాల స్థలంలో ఏడంతస్తుల నిర్మాణం చేపట్టడమే ఈ పెను ప్రమాదం ముంచుకొచ్చిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనకు కారణమైన బిల్డర్ సాజిద్ చేపట్టిన నిర్మాణాలన్నీ అత్యంత నాసిరకరంగా ఉంటాయని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నట్లు […]

iqonic-blog

ఇటీవలే అర్జున పురస్కారాలకు ఎంపికైన భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. శనివారం మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో గాయత్రి జోడీ 21- 18, 13-21, 8-21తో లియు షెంగ్ట, టాన్ నింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో హవా అంతా చైనా జోడీదే. భారత ద్వయం కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ట్రీసా, గాయత్రి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON