loader
iqonic-blog

రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషమిచ్చి చంపేశారని ఐదు యూరోపియన్ దేశాలు పేర్కొన్నాయి. ఆయనకు అత్యంత ప్రమాదకర ప్రాణాంతక టాక్సిన్ శరీరంలోకి పంపించారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రులు ఆరోపించారు. నవన్లీ మృతదేహం అవశేషాల నమూనాలను విశ్లేషించగా ఆయనకు దక్షిణ అమెరికాలో దొరికే టాక్సిన్ ఎక్కించినట్లు వెల్లడైందని,ఈ దారుణ చర్యకు దిగింది రష్యా ప్రభుత్వమే అని ఈ నేతలు తమ ప్రకటనలో తెలిపారు.

iqonic-blog

కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పదవి సిపిఐకి వరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ నేతలు శనివారం కలిసి చర్చించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహా ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించారు. మేయర్ పదవి సిపిఐకి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఖరారయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యధిక వార్డుల్లో సిపిఐ విజయం […]

iqonic-blog

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు.కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు.

iqonic-blog

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి […]

iqonic-blog

ప్రియురాలు బ్రేకప్‌ చెప్పడంతో ప్రియుడు మనస్థాపం చెందాడు. ప్రేమికుల దినోత్సవం రోజున రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రియురాలు, ఆమె స్నేహితుడు కలిసి అతడ్ని హత్య చేసినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల అమన్ గిరి ఇంటర్‌ చదువుతున్నాడు. ఎన్డీఏ పరీక్ష కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఎన్డీయే కోచింగ్‌కు వస్తున్న యువతి అతడికి పరిచయమైంది. దీంతో ఎనిమిది నెలలుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.

iqonic-blog

కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్‌ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఒక కుటుంబం తీర్థయాత్ర కోసం కారులో బయలుదేరింది. ఫిబ్రవరి 13న ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని వారు దర్శించారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్ జీ ఆలయానికి కారులో ప్రయాణమయ్యారు.

iqonic-blog

ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవిలోకి అడుగుపెడుతున్న సమయంలో మళ్లీ వర్షసూచనలు వెలువడ్డాయి. ఈ నెలలోనే ఒకటి కాదు రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని… వీటి ప్రభావంతో వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకపై ఈ అల్పపీడనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON