loader
iqonic-blog

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా 2.73 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, రూ. 99.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

iqonic-blog

నేరస్థులకు కులాలు అంటగట్టవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలోఆందోళన చేశాను. దీంతో అప్పటి వైకాపా ప్రభుత్వం సీబీఐకి తూతూమంత్రంగా లేఖ రాసింది. మేం వచ్చాక ఈ కేసును టేకప్ చేద్దామంటే.. వైకాపా హయాంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారు” అని పవన్ అన్నారు.

iqonic-blog

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాన్‌పిక్ (వాడరేవు-నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టుకు సంబంధించి అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులను విడుదల చేయాలంటూ గతంలో పీఎంఎల్‌ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన 9 సివిల్ మిస్సిలేనియస్ సెకండ్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది.

iqonic-blog

ఆహ్లాదం..ఆనందం..ప్రశాంతత అందించే ఆధ్యాత్మిక విశాఖపట్నం బీచ్ ప్రాంతాన్ని బీర్లు, మత్తు ప్రాంతంగా మార్చుతారా? ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా బీచ్ లో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. డ్రామా కోణంలో పసుపు చొక్కాలు వేసుకుని టిడిపి శ్రేణులతో బీచ్ రోడ్ లో బీర్లు, వైన్లు, చీకుళ్ళు దుకాణాలు పెట్టి అమ్ముతున్న వైనాన్ని ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులతో […]

iqonic-blog

పశ్చిమబెంగాల్ హుగ్లీజిల్లా తారకేశ్వర్‌లో శనివారం నిర్వహించిన పశ్చిమ్ బంగా దిబాస్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. గతంలో రక్తపాతాన్ని,  ప్రాణనష్టాన్ని చవిచూసినప్పటికీ బెంగాల్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బందీగా ఉన్న బెంగాల్.. సంకెళ్ల నుంచి విముక్తి పొందిందని ప్రధాని మోడీ అన్నారు. దేశ విభజన సమయంలో రాష్ట్రాన్ని భారత్ నుంచి విడదీయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు, టీఎంసీకి తగిన గుణపాఠం […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక  సూచించింది.పీఆర్సీ కమిటీతోపాటు,ఉద్యోగుల న్యాయబద్దమైన 10 డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు  వేయాలని కోరింది. లేని పక్షంలో ఉద్యమానికి గాని, ఐక్య ఉద్యమాలకు గాని వెనుకాడే ప్రసక్తి లేదని ఏపీ జేఏసీ ఉద్యోగుల ఐక్య పోరాట వేదిక హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరడం వైపు అడుగులు పడాలని ఏపీ జేఏసీ చైర్మన్ […]

iqonic-blog

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిధులు, విస్తరణ మంజూరు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన పొలిటికల్ వార్ కు దారితీసింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జూన్ 20, 2026 నాటి అధికారిక లేఖలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూనే ఉమ్మడి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపారు. జూన్ 22,23 తేదీల్లో తాను దిల్లీ పర్యటనలో ఉంటానని, ఈ లోపే కేంద్ర  రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉమ్మడి […]

iqonic-blog

ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరపడమే ఇందుకు కారణం. శనివారం కూడా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. అమెరికాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఇజ్రాయెల్ దాడులు చేసినందుకే హార్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది.

iqonic-blog

మెగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్. రామ్చరణ్, ఉపాసనల ముద్దుల బిడ్డ క్లీంకారను ఎపుడెపుడు చూస్తామా? అని ఎదురు చూసిన వారి కల నెరవేరింది. మూడో పుట్టినరోజు సందర్భంగా క్లీంకారకు శుభాకాంక్షలు చెబుతూ చిన్నారి ఫొటోను ఉపాసన సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. అటు ఉపాసన, అటు రామ్చరణ్ క్లీంకారను ఇరు వైపులా ఎత్తుకుని నిలబడగా, చిరునవ్వులు చిందిస్తూ చిన్నారి  కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.

iqonic-blog

రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వైకాపా హయాంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. అన్నదాతలకు ప్రతి విషయంలో అండగా ఉన్నాం. బటన్ నొక్కగానే 99.8 శాతం మంది  రైతులకు నిధులు జమయ్యాయి. గతంలో ధాన్యం కొని ఆరు నెలలైనా డబ్బులు వచ్చేవి కావు. మా ప్రభుత్వం 48 గంటల్లోనే డబ్బులు  ఇస్తోంది. ప్రజలను కష్టాల్లోకి నెట్టడం తప్ప గొడ్డలి పార్టీకి మరేమీ తెలియదని విమర్శించారు. రైతు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON