loader
iqonic-blog

ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో అమెరికా లో కర్నూలు యువకుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇరగనబోయిన చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పరిస్థితులు వల్ల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఖర్చుల కోసం మళ్ళీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తోందన్న భావన అతనిని మరింత కుంగదీసింది. ఆ ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన తట్టుకోలేక ఏప్రిల్ 28న తన గదిలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

iqonic-blog

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో ఈరోజు (శుక్రవారం) రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మేడే రోజే ఈ దుర్ఘటన జరగడం కార్మికులలో ఆందోళనను మరింత పెంచింది. పేరేపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా కంపెనీలోని బ్లాక్-3లో ఈరోజు ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్‌లో పని చేస్తున్న 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత […]

iqonic-blog

ఇరాన్ నాయకత్వంలో అంతర్యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆ దేశానికి నాయకత్వ సమస్య వేధిస్తుంది. ఇప్పుడు ఇరాన్‌ను నడిపిస్తున్న వారి మధ్య విబేధాలు కూడా మొదలయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ కోరుతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇరాన్ అధ్యక్షుడు, ఇతర నేతల్ని సంప్రదించడం లేదు. అలాగే, ఇరాన్ సైనిక సంస్థ అయిన ఐఆర్‌‌జీసీతో […]

iqonic-blog

ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన తమ సంస్థలో తలపెట్టిన ఉద్యోగ కోతలకు, ఏఐ (AI) కోసం పెరిగిన మూలధన వ్యయమే కారణమని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. గురువారం కంపెనీ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులతో మాట్లాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. సంస్థలోని ప్రతి ఒక్కరినీ ఏఐ (AI) సాధనాలను ఉపయోగించేలా చేయడం, పనిని మరింత సమర్థవంతంగా చేసేలా చూడటం వంటివి ఉద్యోగాల తొలగింపునకు కారణం కాదు,” అని […]

iqonic-blog

వైఎస్ఆర్ జిల్లా, మైలవరం మండలం, దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన, చిన్య లావణ్య (28) ఈమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది..నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. లావణ్య బీటెక్ పూర్తి చేసిన తర్వాత రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది.అనేక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది

iqonic-blog

అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ అడుగుపెట్టింది. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో నిర్మించనున్న ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి’ పనులను ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘనంగా ప్రారంభించారు. పేదలకు అత్యున్నత వైద్యం అందించడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 500 పడకల సామర్థ్యంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రూపుదిద్దుకోనుంది.

iqonic-blog

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పీ4 (P4) పథకం కింద 35 మంది భవన నిర్మాణ కార్మికులకు ముఖ్యమంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

iqonic-blog

వ్యాపారులకు, హోటల్ యజమానులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,071.5 కు చేరుకుంది. ముఖ్యంగా హోటళ్లు, క్యాంటీన్లలో భోజనం ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యుడి జేబుకు పరోక్షంగా చిల్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON