loader
iqonic-blog

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బొలెరో వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా రైల్వే పనుల కోసం వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అరకు నుండి ఎస్.కోట వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి లోయలోకి […]

iqonic-blog

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఆయన ఎండగట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సమయాన్ని వృథా చేయడం వల్ల ప్రాజెక్టు అనాథగా మారింది. కేవలం రాజకీయ స్వార్థం కోసం ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టారు” […]

iqonic-blog

తమ వద్ద ఆత్మాహుతి బోట్స్ ఉన్నాయని ఇరాన్ సైనిక దళం తాజాగా హెచ్చరించింది. భూగర్భ సొరంగాల్లో దాచి ఉంచిన రకరకాల డ్రోన్స్, నౌకలను ధ్వంసం చేయగలిగిన మిసైల్స్, నీళ్లల్లో అమర్చే మైన్స్ వంటివి ఉన్న వీడియోను అక్కడి మీడియా విడుదల చేసింది. అయితే, ఈ ఫుటేజీ ఎప్పటిదనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. పర్షియన్ గల్ఫ్‌లో చమురు రవాణా నౌకలపై దాడుల కోసం ఈ పడవలనే వాడినట్టు తెలుస్తోంది.

iqonic-blog

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులపై అదనపు ‘ఫ్యూయల్ సర్‌చార్జ్’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 14 (శనివారం) అర్థరాత్రి 12:01 గంటల నుండి అమలులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి.

iqonic-blog

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మళ్లీ ఆందోళన జ్వాలలు మొదలయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. సంస్థ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు అందజేసిన నేతలు, అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత సమ్మె తేదీని అధికారికంగా ప్రకటిస్తామని జేఏసీ స్పష్టం చేసింది.

iqonic-blog

గల్ఫ్‌లో ఇరాన్ తీవ్రదాడుల సమయంలోనే శుక్రవారం టెహరాన్‌లోని టెహరాన్ స్కేర్‌లో బారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇక్కడ దాడులకు దిగినట్లు వెల్లడైంది. టెహరాన్ యూనివర్శిటీ దగ్గరిలోని ఇంగెలాబ్ స్ట్రీట్ వద్ద ఉన్న టెహరాన్ ఫిరదౌసి స్వేర్ వద్ద వరుసగా భీకర పేలుళ్లు జరిగాయి. చిన్నారులను చంపివేయడాన్ని నిరసిస్తూ జనం పెద్ద ఎత్తున గుమికూడిన దశలోనే దాడులు జరిగాయి. పేలుళ్లు జరుగుతున్నప్పటికీ జనం వస్తూనే ఉన్నారని వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చావు తప్పదని నినదించారు.

iqonic-blog

మూసీ నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు ప్రణాళికలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘మూసీ ఇన్వైట్స్‌’ పేరిట హైదరాబాద్ తాజ్‌కృష్ణలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు ఆవశ్యకతపై మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ నరసింహారెడ్డి ప్రజెంటేషన్‌ ఇస్తున్నారు.

iqonic-blog

అన్నదాతల ఆర్థిక అవసరాలకు పెట్టుబడి సాయంగా నిలిచే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులను విడుదల చేసింది. 22వ విడత నిధులను నేడు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మార్చి 13 శుక్రవారం నాడు అసోంలోని గువాహటి వేదికగా జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బటన్ నొక్కి ఈ డబ్బులను పంపిణీ చేశారు. స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు మూడు విడతల్లో రూ.2 వేలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON