loader
iqonic-blog

” ఈ నిరసనల్లో పాల్గొని విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ ముందుగా అనుకున్న పనుల కారణంగా రాలేకపోయాను. కానీ నేను ఆ ఉద్యమం గురించే ఆలోచిస్తున్నాను. కాక్రోచ్ లు రాకింగ్ గా నిరసనను విజయవంతం చేశారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను. విద్యా వ్యవస్థపై ఉద్యమం అంటే మీ కంటే ఇంకా ఎవరు బాగా చేయగలరు..?” అని ప్రకాశ్ రాజ్ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ […]

iqonic-blog

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్న వేళ అనసూయ చేసిన పోస్టు ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా కల్పిత కథ. మంచి, చెడు నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకుడిపైనే ఉంటుంది. చిత్రాలు చూసి పిల్లలు చెడిపోవడం అన్నది సరికాదు. దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యతా ముఖ్యమే. ఇకనైనా క్రియేటర్లు బాధ్యతాయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నా.. అని పేర్కొన్నారు.

iqonic-blog

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన ఆరోపణలపై కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు. “జనసేనతో పెట్టుకున్నావ్.. రేవంత్ రెడ్డి, నిన్ను బలి ఇస్తాం” అంటూ నేరుగా ప్రాణభీతి కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు.

iqonic-blog

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా సాగుతోంది. అదే విధంగా విద్యార్థులకు కూడా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్టు శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్, భోజనం పెడుతున్నామని చెప్పారు.

iqonic-blog

రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్‌ 18లో సుమారు రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడిని పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.

iqonic-blog

లింగమనేని రమేష్‌ను జనసేన పార్టీ తన రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లింగమనేని రమేష్ అధికారిక బి-ఫామ్’ అందుకున్నారు తనపై నమ్మకంతో ఈ అరుదైన అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు లింగమనేనిరమేష్.

iqonic-blog

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ రుతుపవనాల రాకతో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భానుడి భగభగలు, ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారనుంది. ప్రస్తుతం ఈ నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతంతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

iqonic-blog

సీఎం చంద్రబాబు పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ లతో సమావేశం అయ్యారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు… రాదు అని ధీమాగా చెప్పిన చంద్రబాబు…ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని, తేడాగా ఉన్నవాళ్లని వదిలించుకుంటానని.. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏం ప్రచారం చేశారో… అవన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు. పార్టీ పదవులు మొదలుకుని టిక్కెట్ల కేటాయింపుల వరకు నిరంతరం […]

iqonic-blog

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు.

iqonic-blog

నీట్ పేపర్ లీకేజీ, ఎల్ పిజి , పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, సిబిఎస్ఇ వైఫల్యం, రూపాయి పతనంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్ బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడంతో వారు ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON