loader
iqonic-blog

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడి జరిపింది. రష్యా ఏకంగా 700 డ్రోన్లు, అత్యంత వేగంగా దూసుకెళ్లే అధునాతన ‘ఓరేష్నిక్’ హైపర్సోనిక్ క్షిపణులతో సహా 50 కి పైగా క్రూయిజ్ క్షిపణులను కీవ్ నగరంపైకి ప్రయోగించింది. నివాస భవనాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గిడ్డంగులు ఈ దాడుల్లో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాంబుల పేలుళ్ల శబ్దాలతో రాజధాని నగరం దద్దరిల్లిపోవడంతో ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు మెట్రో స్టేషన్లు, భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందారు.

iqonic-blog

ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది . ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్ (16 పాయింట్లు).. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ అర్హత సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 […]

iqonic-blog

ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే నిరంతరం వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఎన్నడూ ఓడిపోయిన చరిత్ర లేదని ఆయన గుర్తుచేశారు.

iqonic-blog

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి పీ. విశ్వనాథన్ కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీ.విశ్వనాథన్ ను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన స్వగృహంలో పీ. విశ్వనాథ్ కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఆయను ఘనంగా సత్కరించారు. తమిళనాడు టీవీకే ప్రభుత్వంలో పీ.విశ్వనాథ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన […]

iqonic-blog

ఏపీలో ఒక్కసారిగా వాతవరణం మారింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరట కలిగిస్తూ రాష్ట్రంలో వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు కాస్త ఊరట చెందారు. ఇదిలాఉంటే ద్రోణి ప్రభావంతో కాసేపట్లో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ […]

iqonic-blog

‘‘నిన్న ఇద్దరు యువ మిత్రులు సేవా తీర్థ్ (ప్రధానమంత్రి అధికారిక నివాసం)కు వచ్చారు’’ అని మోదీ పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడు కొడుకు, కూతురితో సరదాగా గడిపిన ఫొటోలను షేర్ చేశారు. వివరాలు… కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం రోజున ప్రధాని మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడు వెంట ఆయన సతీమణి శ్రావ్య, తల్లి, కొడుకు, కుమార్తె […]

iqonic-blog

నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి..కల్పన వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. నర్సుగా పనిచేస్తున్న కల్పనకు.. పండరి అలియాస్ చింటూతో పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. తమ సంబంధానికి భర్త ముత్యం రెడ్డి అడ్డుగా ఉన్నాడని ముత్యం రెడ్డిని హత్య చేసిన నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో జేసీబీతో పెద్ద గొయ్యి తీయించారు. అనంతరం మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టి.. […]

iqonic-blog

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ అకాల వర్షం కురవడంతో భారీ వేగంతో వీచిన ఈదురు గాలుల ధాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు, భారీ కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడం, దానికితోడు చెట్లు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ […]

iqonic-blog

ఢిల్లీలో కలకలం రేపిన కారు బాంబు పేలుడు కేసులో నిందితుడు జాసిర్ బిలాల్ వానీకి మిగతా ముఠా సభ్యులు పొటాషియం నైట్రేట్, షుగర్ పౌడర్ వంటి ఐఈడీ (IED) తయారీ సామగ్రిని సరఫరా చేశారు. అయితే, వీటిని పేలుడు పదార్థాలుగా ఎలా మార్చాలనే సాంకేతిక ప్రక్రియ కోసం నిందితుడు ఏకంగా యూట్యూబ్ వీడియోలను, చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఆధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రాకెట్ ఐఈడీలను తయారు చేయడం,కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అత్యంత […]

iqonic-blog

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపుర(తట్టే హక్కలు) నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. నదిలో గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దాంతో వాళ్లంతా నదిలో గల్లంతయ్యారు.పోలీసులు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో ఏడుగురు మహిళలే కావడం షాకింగ్..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON