loader
iqonic-blog

బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ధురంధర్ రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్ దాదాపు రూ.3,025 కోట్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ రూ.2,438 కోట్లు, సుకుమార్ ‘పుష్ప’ సిరీస్ రూ.2,092 కోట్లుగా ఉన్న రికార్డులను రణవీర్ సింగ్ మూవీ బ్రేక్ చేసింది. ఈ స్థాయిలో మార్క్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

iqonic-blog

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు పర్మినెంట్ జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 14న సమావేశమై ఈ మేరకు ఖరారు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ యారా రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమలదేవి, జస్టిస్ బీఆర్ మధుసూధనావు అదనపు జడ్జీలుగా కొనసాగుతున్నారు. వీరినే పర్మినెంట్ జడ్జీలుగా చేయాలని కోలీజియం నిర్ణయించింది. రాష్ట్రపతి అప్రూవల్ చేయడంతో అధికారికంగా గెజిట్ జారీ కానున్నది.

iqonic-blog

అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోమారు చర్చలు జరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. రాబోయే రెండు రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగవచ్చని డోనాల్డ్ ట్రంప్ ది న్యూయార్క్ పోస్టుకు తెలిపారు. ఈ చర్చలు పాకిస్తాన్‌లో జరగనున్నాయని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి జరిగే రెండో విడత ప్రత్యక్ష చర్చలు బహుశా ఐరోపాలో ఎక్కడో ఒకచోట జరుగుతాయని ట్రంప్ […]

iqonic-blog

లోక్‌సభ సీట్లను జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు . దీని ప్రకారం పెంచబోయే అదనపు సీట్లలో 50 శాతం సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి . మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం , సామాజిక అభివృద్ధి […]

iqonic-blog

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు సంభవించి, 9 మంది కార్మికులు మృతి చెందారు. శక్తి జిల్లా, సింగితరాయ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలుడు సంభవించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో తొమ్మిది మంది చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను […]

iqonic-blog

బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని తమ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేడీయూ కోటాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వారిలో ఒకరు నితీష్ కుమారుడు ఉండనున్నారు.

iqonic-blog

ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ’ని అత్యాధునిక సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు.ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ‘1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ’ని ప్రారంభించారు. గన్నవరంలోని మేధా టవర్స్ ఇక్కడ ఉన్న ‘1క్యూ క్వాంటం ఫెసిలిటీ’ని జాతికి అంకితం చేశారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్‌గా పనిచేస్తాయి. ఈ కొత్త సదుపాయాల వల్ల  క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై […]

iqonic-blog

విశాఖపట్నంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నైట్ ఫుడ్ కోర్ట్ పునఃప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సిఐటియు నేతల విన్నపాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వంశీకృష్ణ, ఆగ్రహంతో వినతిపత్రాన్ని కమ్యూనిస్టు నేతలపైకి విసిరికొట్టారు. గత కొన్ని రోజులుగా నైట్ ఫుడ్ కోర్టును మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన బాధితులు, వారికి మద్దతుగా సిఐటియు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ప్రజాప్రతినిధి ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON