loader
iqonic-blog

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చగా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది పోరాటం వృధా అయింది.

iqonic-blog

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్‌గా The Paradise చిత్రం నుంచి ‘ఆయా షేర్’ పాటను విడుదల చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నాని స్టైలిష్ లుక్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అనిరుద్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం అందించారు. పాటలోని బీట్‌లు, నాని స్టెప్పులు, మాస్ స్టైల్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి.

iqonic-blog

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మరణం సంభవించింది  ఓ ఆరేళ్ల బాలుడు విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం సుమారుగా 315 మంది నుంచి శాంపిళ్లను సేకరించి. పరీక్షలకు పంపినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండియన్ వివరించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే […]

iqonic-blog

కేబినెట్ అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి బాగా వెళ్లాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. సందర్భాన్ని బట్టి తానూ, పవన్ కల్యాణ్ చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. శాఖల వారీ పద్దులపై జరిగే చర్చల్లో మంత్రులు బాగా ప్రిపేర్ అయి మాట్లాడాలని సీఎం తెలిపారు. మంత్రి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు అనుబంధంగా మాట్లాడేవారూ కంటెంట్ ప్రిపేర్ అయ్యేలా చూడాలని సూచించారు.

iqonic-blog

విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

iqonic-blog

సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు దారుణ ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అహ్మదాబాద్‌లో టీమిండియా ఓటమిలో కీలకమైన డేవిడ్ మిల్లర్ తో రీల్ చేసింది తను. మ్యాచ్ అనంతరం మిల్లర్‌తో మైదానంలో చేసిన రీల్‌ను సోషల్ మీడియలో పోస్ట్ చేసిన ప్రిన్సీ.. ‘మిల్లర్ అద్భుతమైన బ్యాటర్ కదా.. ’ అని క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది.. కొందరు అమెను ట్రోల్ చేస్తూ.. బెదిరింపులకు దిగారు. అత్యాచారం చేస్తామని, బొండంలా ఉన్నావని.. ఇలా బాడీషేమింగ్‌తో బాధ పెట్టారు. ఇవన్నీ […]

iqonic-blog

. “ఆజ్ యుగాబ్ద 5127, విక్రమ సంవత్సరం 2082, ఫాల్గుణ శుక్ల అష్టమి రోజు శుభ ముహూర్తాన సేవాతీర్థంలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం అవసరమైన అనేక అపూర్వమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యం ఆధారంగా నిర్మించిన సేవా తీర్థం జాతీయ సేవ అనే విధి ఆధారిత యుగాన్ని నిరంతరం నడిపిస్తుందని ఆశిస్తున్నా.అంటూ సేవా తీర్థంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశం గురించి ప్రధాని […]

iqonic-blog

బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు నాలుగు మరణాలను ధృవీకరించారు. ఖరీక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగరీ వంతెన సమీపంలో నేషనల్ హైవే 31పై అతివేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు పికప్ వ్యాన్​ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా పలు వాహనాలు ఒకదానికి ఒకటి తాడకంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON