loader
iqonic-blog

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. యూఏఈపై దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. జాతీయ ఐక్యత, భద్రత, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు యూఏఈ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

iqonic-blog

హయత్ నగర్ కొహెడలో నివాసముండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని సరిత అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా అతడిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక బిడ్డ పుట్టగా ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయంలో గోవర్ధన్ సరితను ఎన్ని సార్లు బతిమాలినా తనతో వచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతొ తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదని పోలీసులు తెలిపారు.

iqonic-blog

భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుప‌వ‌నాల మే 26వ తేదీ వ‌ర‌కు కేర‌ళ‌లో ప్ర‌వేశించ‌నున్న‌ట్లు ఐడీఎం తెలిపింది. సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ చేరుకుంటాయి. ఆ రుతుప‌వ‌నాలు కేర‌ళ చేరుకోవ‌డంతో భార‌త్‌లో వ‌ర్షాకాలం మొద‌లువుతుంది. గ‌త ఏడాది మే 24వ తేదీన కేర‌ళ‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేసింది.

iqonic-blog

ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. మోదీని యూఏఈ ప్రత్యేకంగా స్వాగతించింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం శుక్రవారం మధ్యాహ్నం యూఏఈ గగతనలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చింది. తమ వాయుసేన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ విమానం ఎఫ్‌-16 బ్లాక్‌ 60 ‘డెజర్ట్ ఫాల్కన్‌’ను పంపింది. అబుదాబిలో ప్రధాని విమానం ల్యాండ్ అయ్యేవరకు వెంటే వచ్చింది.

iqonic-blog

ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా భారత్-యూఏఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ ఒప్పందాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన రూపరేఖలపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యూహాత్మక చమురు నిల్వలు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాకు సంబంధించిన ఒప్పందాలపై కూడా సంతకాలు జరిగాయి. వడినార్‌లో షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం […]

iqonic-blog

ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలు పుట్టపర్తికి తెచ్చిన వ్యక్తి సీబీఎన్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. “1991లో సత్యసాయిబాబా ఎయిర్ పోర్టు నిర్మిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన విజన్ ఇప్పుడు చూస్తున్నాం. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు.. ముగ్గురికీ 75 ఏళ్లు అయినా 25 ఏళ్ల కుర్రాళ్లలా […]

iqonic-blog

యూఏఈ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రెసిడెన్షియల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ఘనమైన అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అబుదాబిలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల్లో ప్రధాని మోదీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య యూఏఈపై జరిగిన ఇటీవలి ఇరాన్ దాడులను ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా చూసుకుందని ఆయన […]

iqonic-blog

రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పబ్లిక్‌, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. యుద్ధ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది. 8 డ్రోన్‌ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్‌ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక నుంచి కర్నూలును […]

iqonic-blog

భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాల .. ఇప్పుడు ఒక తల్లిగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంటున్నారు. తన బిడ్డకు పాలిస్తూనే.. ఆ భాగ్యం లేని అనాథలు, అనారోగ్యంతో ఉన్న పసిపాపల ఆకలి తీర్చి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తన బాబు పుట్టిన మొదటి ఏడాదిలో సుమారు 60 లీటర్ల తల్లిపాలను హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రులలోని మిల్క్ బ్యాంక్‌లకు ఆమె విరాళంగా ఇచ్చారు. కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు,కిలో బరువున్న పసిబిడ్డకు కొన్ని […]

iqonic-blog

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న వేళ తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ప్రజలను అగ్ర, నిమ్న కులాల పేరుతో విభజించే వ్యవస్థను మాత్రమే నిర్మూలించాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరూ ఆలయాలకు వెళ్లొద్దు అని చెప్పడం తన ఉద్దేశం కాదని వివరించారు. ఆలయాలతో పాటు సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON