దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మార్చి 8)తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని ఈ నెల 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
- Posted on
- By Admin
యాసిడ్ దాడి బాధితుల జీవితాలను గౌరవంగా నిలబెట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యంకాకపోతే, వారి జీవనాధారం కోసం ప్రత్యేక భత్యం అందించే విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది.ఇలాంటి దారుణాలకు పాల్పడే నేరగాళ్లకు మరింత కఠినమైన శిక్షలు విధించేలా చట్టాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
- Posted on
- By Admin
పోలీసు అకాడమీలో పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో వివిధ అంశాలపై సీనియర్ పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. పోలీసింగ్ను మరింత మెరుగుపర్చేందుకు వివిధ అంశాలపై, సాంకేతికత ఆధారంగా పెరుగుతున్న కొత్త తరహా నేరాల గురించి చర్చించారు. టెక్నాలజీలో మార్పుల వల్ల నేరాల స్వభావం కూడా మారిపోయిందని చెప్పారు, భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదని, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్గ్రేడ్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
- Posted on
- By Admin
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడుల సంఘటనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారు’ అని అన్నారు.
- Posted on
- By Admin
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని విమర్శించారు. సంవత్సరానికి రూ. 1,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి ఈసారి కూడా రైతుబంధును ఎగ్గొట్టాడని మండిపడ్డారు.
- Posted on
- By Admin
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ పోటీలకు దూరమైంది. మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న తెలుగు తేజం ఇంకా కుదురుకోలేదు. దాంతో.. వెంటనే కోర్టులోకి దిగేందుకు ఆమె సిద్ధంగా లేదు. సో.. స్విట్జర్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సింధు నిర్ణయించుకుంది. రెండోసారి కూడా ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కంగుతిన్న లక్ష్య సేన్ సైతం ఈ పోటీల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
- Posted on
- By Admin
కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీకి మద్దతుగా సోమవారం వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్లోని సెంట్రల్ స్క్వేర్కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఇరాన్పై విస్తృత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దాడుల నడుమే సుప్రీం లీడర్ను ఎన్నుకునే అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ కౌన్సిల్ రహస్యంగా సమావేశమై.. మోజ్తాబాను పేరును ఖరారు చేసింది.
- Posted on
- By Admin
రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్తింది. దీనిపై సభలో ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ యుద్ధంపై, పెరుగుతున్న చమురు ధరలపై చర్చించాలని, అలాగే ఇరాన్ సహా గల్ఫ్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించాలని కోరుతూ […]
- Posted on
- By Admin
- Business195
- District27
- Entertainment558
- General10205
- Health59
- Politics1458
- Sports380
- Technology250
- Uncategorized2
- World1088
Recent Posts
- నీట్ యుజి దరఖాస్తు గడువు పెంపు
- యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం
- కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్గ్రేడ్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
- ఈశాన్య ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదు’.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో ‘ రాహుల్ బంధు’ పథకం : కేటీఆర్ఎద్దేవా
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District

