loader
iqonic-blog

ఒక్క వివాహం చేసుకున్నవాళ్లు మాత్రమే రాష్ట్రంలో ఉంటారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో నివసించాలి అనుకునేవారు కేవలం ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుని ఉండాలని అన్నారు. ఈ మేరకు త్వరలోనే యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే ఈ కోడ్ ఉద్దేశమని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ […]

iqonic-blog

భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు వెళ్లే యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాత్ర […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించారు. కడప జిల్లాకు చెందిన నాలుగు నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా ఈ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.

iqonic-blog

72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా, యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తెలుగు నుంచి ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, ‘పుష్ప: ది రూల్’, ‘కల్కి 2898 ఏడీ’, ’35 చిన్న కథ కాదు’ చిత్రాలు కూడా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ […]

iqonic-blog

<span;>ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని, వారి ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానిస్తామని తెలిపారు.రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నట్లు. శిల్పారామం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించామని,

iqonic-blog

సోషల్ మీడియా చదువుపై ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిలిచింది నీట్ రీటెస్ట్ 2026లో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్.వైష్ణవి దాస్ తన విజయం వెనుక ఉన్న ముఖ్యమైన కారణాన్ని వెల్లడిస్తూ, తాను 11వ తరగతిలో ఉండగానే ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్ చేశానని తెలిపింది. “ఇన్‌స్టాగ్రామ్ వల్ల సమయం వృథా కావడం తప్ప ప్రత్యేకమైన లాభం ఏమీ లేదని గుర్తించాను. అందుకే దానిని పూర్తిగా దూరం పెట్టి చదువుపై దృష్టి […]

iqonic-blog

విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఉపా కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రావణ్ కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ పై నెల్లూరు జైల్లో ఉన్న రావణ్ ను ఇవాళ గన్నవరం కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు వర్చువల్ గా హాజరుపర్చారు. పోలీసులు రావణ్ రిమాండ్ పొడిగింపు కోరగా.. రావణ్ న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు మాత్రం రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

iqonic-blog

కర్నూలు జిల్లాలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు నుంచి శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై పెద్దపులి సంచరిస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికులు తమ వాహనాలను నిలిపివేసి దూరం నుంచి పులిని వీక్షించారు. కొంతసేపు రహదారిపై సంచరించిన పులి అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించే వారిలో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో […]

iqonic-blog

పోలవరం జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలవరం జిల్లా పరిధిలోని గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు శనివారం రోజువారీ జీవనోపాధిలో భాగంగా గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే నదిలో నీటి మట్టం, ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా ఎక్కువగా ఉండటంతో వారు నియంత్రణ కోల్పోయి నదీ గర్భంలోకి కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో ప్రత్యేక పడవలను రంగంలోకి దించి నదిలో గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలను ముమ్మరం […]

iqonic-blog

రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్తలేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే.. ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్గా ప్రారంభించారు. బాగా పని చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఇంట్లో ఎవరికి వారే.. తడి, పొడి చెత్తను వేరు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON