కేసీఆర్ ఇసుకపై ఇసుక మేడల్లా బ్యారేజీలు కట్టారు,తన మేదస్సుతోనే కాళేశ్వరాన్ని డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా డబ్బా కొట్టుకున్నారు. కాళేశ్వరం విధ్వంసంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చర్చకు రమ్మంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధం. స్పీకర్కు లేఖ రాసి తేదీ ఖరారు చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి […]
- Posted on
- By sagar.mbr
ఏపీకి చెందిన ఇద్దరు కాలేజీ విద్యార్థులు కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మల్లాళ్లి జలపాతంలో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సురక్షితంగా రక్షించారు. గణేష్, సంతోష్ స్నేహితులతో బారికేడ్లను దాటి వారు నీటిలోకి దిగారు. అదే సమయంలో ఎగువన ఉన్న పవర్ ప్లాంట్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ఆ ఇద్దరు యువకులు దాదాపు గంటకుపైగా నీటి మధ్యలో బండరాయిని పట్టుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడారు.
- Posted on
- By sagar.mbr
కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని.. అదే విరిగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్లానింగ్, డిజైన్, ఆపరేషన్స్ మొత్తం లోపాలే ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ నిర్మించిన ప్రాంతమంతా ఇసుకతో నిండిపోయి ఉందని, అక్కడ బ్యారేజీలు కడితే నిలవవన్నారు. అదే విషయాన్ని ఇంజినీర్లు చెప్పినా కేసీఆర్ వినిపించుకోకుండా కట్టేశారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చేస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందన్నారు.
- Posted on
- By sagar.mbr
ఓపెన్ఏఐకి చెందిన చాటిజీపీటీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఇమేజ్ జనరేషన్తో పాటు ఇతర సర్వీస్ ల్లోనూ సమస్య తలెత్తింది. ఇందుకు సంబంధించిన పోస్టులను యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై ఓపెన్ఏఐ స్పందించింది. తమ సేవల్లో సమస్య ఏర్పడిందని, పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొంది. అయితే, దీనిపై తమ ఇంజినీరింగ్ బృందం పనిచేస్తోందని, ఇప్పటికే చాటే జీపీటీ సేవలు పునురుద్ధరించినట్లు పేర్కొంది. ఇతర సర్వీస్లను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.
- Posted on
- By sagar.mbr
పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై అమెరికాలో మెటా మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల రూపకల్పన పిల్లలను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా ఉందని ఆరోపిస్తూ నాలుగు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా కోరాయి. ఈ డిమాండ్ మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండటంతో కేసు ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎండ్లెస్ ఫీడ్, నోటిఫికేషన్లు, లైక్లు, పిల్లల దృష్టిని నిలిపివేయడానికి […]
- Posted on
- By sagar.mbr
సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి రూ.40వేల కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు కానుంది. గ్రామకంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా రూ.10వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు ుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి ఈ మాఫీ అమలు అవుతుంది. →
- Posted on
- By sagar.mbr
ఆంధ్రప్రదేశ్ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఏపీ మెరైన్ పోలీసులు సముద్రంతో పాటు తీర ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో అత్యాధునిక పరికరాలు, పడవలు, నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో మత్స్యకారుల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్ అధికారులు ముగించినట్లు ప్రకటించారు. నివేదికను అధికారులు త్రిసభ్య కమిటీకి సమర్పించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలున్నాయి.
- Posted on
- By sagar.mbr
ఆంధ్రప్రదేశ్ లో 11 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,076.11 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 19వ ఎస్ఐపీబీ సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా పారిశ్రామికీకరణకు కృషి చేయాలని సూచించారు. ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం అందించాలని సూచించారు.100 టూరిస్ట్ స్పాట్ల దగ్గర ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటక రంగం నుంచి జీఎస్డీపీకి వాటా పెరిగేలా చూడాలి.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం స్పష్టం […]
- Posted on
- By sagar.mbr
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షుకు జిమ్లో ఇవాళ స్వల్ప గాయమైంది. అతడికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్రావు ఆస్పత్రికి చేరుకోగా.. మరికాసేపట్లో కేసీఆర్ కూడా ఆస్పత్రికి రానున్నట్లు సమాచారం.
- Posted on
- By sagar.mbr
రాష్ట్రంలో 2 లక్షల మందికిపైగా కళాకారులున్నారు. గ్లోబల్ మార్కెట్ కు అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకొస్తాం. డబ్బు సంపాదనే కాదు..పర్యావరణ పరిరక్షణ కూడా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హస్తకళా రంగం కూడా అభివృద్ధి చెందాలి. మారుమూల గ్రామంలోని కళాకారుడి కృషి.. ప్రపంచానికి చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.
- Posted on
- By sagar.mbr
- Business239
- District30
- Entertainment675
- General14166
- Health69
- Politics1810
- Sports492
- Technology293
- Uncategorized2
- World1352
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District