loader
iqonic-blog

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ద కల్పించే బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ సంతకం చేసి ఆమోదించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం’అని సీఎం చంద్రబాబు […]

iqonic-blog

పంచాయతీల పునర్వర్గీకరణ నేపథ్యంలో ప్రభుత్వం గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శుల వేతనాల్లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, వారి ప్రస్తుత పే-స్కేల్‌ను భారీగా తగ్గించారు. గతంలో వేతన నిబంధనల ప్రకారం వీరికి నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు పే-స్కేల్ అమలవుతుండగా, తాజా సవరణతో దానిని రూ.25,220 నుంచి రూ.80,910కు కుదించారు. ప్రారంభ వేతనంలోనే సుమారు రూ.3,000 పైగా వ్యత్యాసం కనిపిస్తోంది, ఇది వారి భవిష్యత్తు ఇంక్రిమెంట్లు మరియు ఇతర అలవెన్సులపై […]

iqonic-blog

రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు గుర్తించారన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని…  హింస రాజకీయ సంస్కృతి వల్ల బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు . పార్టీని తల్లిలా భావించే కార్యకర్తల […]

iqonic-blog

మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్‌లకు పంపించాయి. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అని కైరోలోని ఇరాన్ […]

iqonic-blog

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన విస్తృత సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 90 లక్షల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.  ఫిబ్రవరి 28న ప్రచురించిన తుది జాబితా నుంచి సుమారు 63 లక్షల పేర్లను తీసివేయగా.. విచారణ అనంతరం అదనంగా 27 లక్షల పేర్లను తొలగించారు. ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉన్న కేసులను ఈ ఎన్నికల జాబితాలో చేర్చబోమని, వాటిని తదుపరి ఎన్నికలలో […]

iqonic-blog

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వన్ నేషన్-వన్ ఎలెక్షన్ విధానం కింద దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశ ఆర్థిక వనరులు ఆదా అవుతాయని.. అలాగే నిరంతరం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆగిపోయే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని వివరించారు.

iqonic-blog

ఏపీపై జగన్ పగబట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాడికి మార్కెట్ యార్డ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో విమర్శించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్’గా మార్చేందుకు 1 లక్ష కోట్లు ఖర్చు చేస్తామని, అందులో ప్రభుత్వ వాటాగా 30 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. తాడిపత్రిలో రౌడీయిజానికి తావులేదని, అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి  ముఖ్యమంత్రికి రాజధాని  అమరావతి లోగోతో కూడిన ప్రత్యేక బ్యాడ్జ్‌ను బహుకరించారు.

iqonic-blog

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వచ్చి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON