loader
iqonic-blog

ప్రపంచ దూరప్రసార, సమాచార సొసైటీ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 17న నిర్వహించబడుతుంది. సాంకేతికత (టెక్నాలజీ) ద్వారా వచ్చే అవకాశాలపై అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. మొద‌టిసారిగా మే 17, 1968లో ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వం జ‌రుపుకున్నారు. మే 17న అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియ‌న్ స్థాపించారు. అలాగే మొద‌టి అంత‌ర్జాతీయ టెలిగ్రాఫ్‌ క‌న్వెన్షెన్‌ పై 1865 మే 17న పారిస్‌లో సంత‌కం చేశారు. అందువ‌ల్ల మే 17ను ప్ర‌పంచ టెలిక‌మ్యూనికేష‌న్ దినోత్స‌వంగా ప్ర‌క‌టించారు.

iqonic-blog

పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ లొంగిపోయారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ‘‘ఈరోజు నేను నా కుమారుడు బండీ భగీరథ్‌ను విచారణ నిమిత్తం ఒక న్యాయవాది ద్వారా పోలీసులకు అప్పగించాను… కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. పోలీసులు మాత్రం బండి భగరథ్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బండి భగీరథ్ లొంగిపోలేదని కూడా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.

iqonic-blog

పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ మళ్లీ ఒక శక్తివంతమైన ఎల్ నినో తుఫాను పరిస్థితులు రూపుదిద్దుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీని ప్రభావంతో ఒకవైపు కరువు పరిస్థితులు మరియు మరోవైపు ఊహించని భారీ వరదలు సంభవించి వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.

iqonic-blog

తన కుమారుడు అంశంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతోనే ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానని తెలిపారు. చట్టం ముందు సామాన్యులైనా, తన బిడ్డైనా అంతా సమానమే అని ఆయన తేల్చి చెప్పారు. తన బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. న్యాయపరమైన సలహాలు తీసుకోవడం వల్లే విచారణకు హాజరుకావడంలో కొంత జాప్యం […]

iqonic-blog

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అఖండ విజయం సాధించిన విజయ్‌కు కమల్ హాసన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీ అనంతరం కమల్ హాసన్ స్పందిస్తూ.. విజయ్ దేశంలోనే ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ, తన ముందు ఎంతో వినయపూర్వకంగా నడుచుకున్నారని కొనియాడారు. తమిళ సినీ పరిశ్రమ మనుగడకు, అభివృద్ధికి నూతన ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని పేర్కొంటూ కమల్ హాసన్ సీఎం విజయ్‌కు 6 ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

iqonic-blog

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయన్ను మంత్రివర్గం నుండి తొలగించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో ఉండొద్దని పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి కవిత లేఖ రాశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ పదవిలో ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు.

iqonic-blog

తెలంగాణతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసు కీలక మలుపు తిరిగింది. మధ్యంతర బెయిల్ ఈ దశలో ఇవ్వలేమని హైకోర్టు చెప్పడంతో బండి భగీరథ్ శనివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్‌బషీరా‌బాద్‌ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి ఎదుట సరెండెర్ అయ్యారు. మే 8వ తేదీన కేసు నమోదు అయినప్పటి నుంచి ఈ కేసు అనేక రకాల మలుపు తిరుగుతూనే ఉంది. అప్పటి నుంచి బండి భగీరథ్‌ పరారీలో ఉన్నారు

iqonic-blog

దేశంలో పెరుగుతున్న దిగుమతుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో వెండి దిగుమతులపై నిఘా పెంచేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. వెండి బార్లు, పూర్తిగా తయారవ్వని ముడి వెండి, పొడి రూపంలో ఉన్న వెండిని విదేశాల నుంచి తీసుకురావాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా స్వేచ్ఛగా వీటిని దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. కానీ తాజా ఆదేశాలతో వ్యాపారులు […]

iqonic-blog

కొందరిని తాను పరాన్నజీవులుగా లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్‌లు, బోగస్ డిగ్రీలతో మీడియాలోకి, న్యాయవ్యవస్థలోకి, ఇతర వృత్తుల్లోకి ప్రవేశించేవారిని ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా తోపాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నానని చెప్పారు. అలాంటి వారినే తాను పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు […]

iqonic-blog

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కే ముందు అమెరికా ప్రతినిధుల బృందం ప్రతి ఒక్కరూ తమకు చైనా నుంచి వచ్చిన జ్ఞాపికలు, మొబైల్ ఫోన్లను చెత్తబుట్టలో విసిరేశారు. చైనాకు చెందిన ఏ ఒక్క వస్తువును కూడా విమానంలోకి అనుమతించబోమని అధికారులు చాలా కఠినంగా వ్యవహరించిన్టు ఇండియా టూడే కథనం పేర్కొంది. డిజిటల్ నిఘా, గూఢచర్యం, డేటా చౌర్యంపై ఉన్న తీవ్రమైన భయాల వల్లే అమెరికా ఈ కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ను పాటించినట్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON