loader
iqonic-blog

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరంలో జూన్ 9, 2026 (మంగళవారం) అర్ధరాత్రి వేళ అత్యంత భయానక విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. టొయోటా క్వాంటం మినిబస్‌లో వచ్చిన 10 మందికి పైగా సాయుధ దుండగులు వేర్వేరు లొకేషన్లలో ఉన్న స్థానికులపై ఏకధాటిగా తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా సాగుతున్న అక్రమ మైనింగ్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు లేదా స్థానిక గ్యాంగ్ వార్లే ఈ […]

iqonic-blog

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని “సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు విషెస్ తెలిపారు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు

iqonic-blog

తృణ‌మాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ రాజ్య‌స‌భ ఎంపీ సుష్మితా దేవ్ ఆ పార్టీని వీడారు. పార్టీకి చెందిన అన్ని పోస్టుల‌కు ఆమె రాజీనామా చేశారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆమె చైర్మెన్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు లేఖ రాశారు. గ‌త వారం రోజుల్లోనే ఆ పార్టీకి చెందిన రెండో ఎంపీ రాజీనామా చేశారు. 53 ఏళ్ల సుష్మితా దేవ్ గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఆమె 2021లో తృణ‌మూల్ పార్టీలో చేరారు. ప్ర‌జా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొద‌లు పెడుతున్న‌ట్లు […]

iqonic-blog

ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్, ఖోస్ట్, పక్తికా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సేనలు ఈ దాడులకు తెగబడ్డాయి. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే అమాయక పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘోర కలియుగంలో మరణించిన 19 మందిలో 11 మంది చిన్న పిల్లలు ఉండటం అత్యంత విచారకరం. మొదట మృతుల సంఖ్య 13గా ఉన్నప్పటికీ.. శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది.

iqonic-blog

 నెహ్రూ దేశ ప్రధాన మంత్రిగా4398 రోజులు కంటిన్యూగా పనిచేశారు. ఆయన రికార్డును  తాజాగా ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిగిమించారు. 2014, 2019, 2024లలో వరుసగా మూడు సార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన తొలి కాంగ్రెసేతర నేతగా రికార్డు క్రియేట్ చేశారు. నేటితో ఆయన నెహ్రూ పాలించిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. నేటితో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ 4399 రోజులు అవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి..ఆపై ప్రధాన మంత్రిగా 24 యేళ్లు పూర్తిఅయి 25వ యేట అడుగుపెట్టారు.

iqonic-blog

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు అందించే  సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్రం భారీగా తగ్గించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద కుటుంబాలు, మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మేలు చేయాల్సిన పథకాలను కేంద్రం క్రమంగా నీరుగారుస్తోందని విమర్శించారు.

iqonic-blog

మల్కాజ్‌గిరిలో అరుణ్ అనే వ్యక్తికి ఓ మహిళతో పెళ్లయ్యింది.అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది. మొదటి భార్య సొంత చెల్లెలు ఉషారాణిని వివాహం చేసుకున్నాడు ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని, చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకొని ఇవాళ మాట్లాడుకుందాం రమ్మని ఇంటికి పిలిచి తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ తగలడంలో ఉషారాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

iqonic-blog

తృణ‌మూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, బిదాన్‌న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మాజీ చైర్మెన్ స‌బ్య‌సాచి ద‌త్త‌పై కోడిగుళ్ల‌తో అటాక్ చేశారు. బిదాన్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.బెదిరింపుల కేసులో ఆ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి సుమారు కోటి రూపాయ‌లు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కోర్టుకు తీసుకెళ్తున్న స‌మ‌యంలో ద‌త్త‌పై గుడ్లు, ఆవుపేడ‌, ట‌మోటాల‌తో అటాక్ చేశారు.కోర్టు వ‌ద్ద మ‌రో గ్రూపు కూడా దొంగ దొంగ అంటూ కేక‌లు వేశారు.

iqonic-blog

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడి రాజు బుధవారం చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. ఈ నెల 8న సాయంత్రం విశాఖ ప్లాంట్లో ఉక్కు ద్రవం కార్మికులపై పడటంతో 8 మంది మృతి చెందారు.

iqonic-blog

భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీరాజా మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆయ‌న‌కు ఘన నివాళులర్పించారు. చెన్నైలోని దర్శకుడి నివాసానికి చేరుకున్న సీఎం విజయ్, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON