loader
iqonic-blog

కెన్యాలో ఓ బాలికల స్కూల్ హాస్టల్ డార్మెటరీలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది విద్యార్థులు సజీవ దహనం చెందారు. బోర్డింగ్ స్కూల్ విద్యార్థులకు ఈ డార్మెటరీ మృత్యుపాశం అయింది. తూర్పు ఆఫ్రికా దేశం అయిన కెన్యాలోని గిల్గిల్‌లో ఈ దారుణం జరిగింది. విద్యార్థినులు భోజనం చేసి ఉన్న దశలో మంటలు చెలరేగాయి. దీనితో వారు తప్పించుకునే వీలు లేక తగులబడ్డారు.పలువురికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన గురించి కెన్యా విద్యామంత్రి జులియస్ ఓగాంబా […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె. నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) టార్గెట్‌గా సిట్ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం విజయవాడలోని ఆయన నివాసంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మద్యం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసమే ఈ […]

iqonic-blog

మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ అనుమానస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ ఆమె అత్త మాజీ జిల్లా న్యాయమూర్తి గిరిబాలా సింగ్‌ను భోపాల్‌లో సీబీఐ అరెస్టు చేసింది. గిరిబాలాసింగ్‌ను 8 గంటల పాటు ప్రశ్నించిన తరువాత సీబీఐ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. ట్విషా శర్మకు మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి ఆమె పలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. తాను వేధింపులకు గురవుతున్నానని వాటిల్లో పేర్కొన్నట్లు […]

iqonic-blog

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాజీ సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ గానీ, లేదా ఇతర నేతలు గానీ ఈ స్థాయికి వచ్చేవాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, ఆయన నీడన బతికి ఈరోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడటం సరికాదని  ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ, ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి నకిలీ ఆలోచనలకు […]

iqonic-blog

హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారని.. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా నేను భయపడను, వెనక్కి తగ్గను అని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ పి.వి. నరసింహారావు వంటి నాయకులను అందిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని […]

iqonic-blog

గంటల వ్యవధిలో శాంతి ఒప్పందం ప్రచారం దశలోనే గల్ఫ్‌లో తిరిగి యుద్ధవాతావరణం రగులుకుంది. తమ గగనతలంలో క్షిపణి, డ్రోన్ల దాడులు జరిగాయని కువైట్ గురువారం తెలిపింది. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్ తరచూ సైనిక దాడులకు దిగుతోంది. ఇరాక్‌లో ఇరాన్ మద్దతు గల షియా మిలిటెంట్లు నుంచి కూడా కువైట్ పై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పూర్తిగా ఫలించి ఏ క్షణంలో అయినా ఒప్పందం కుదురుతుందనే వార్తల […]

iqonic-blog

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని కొడాలి నాని గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేస్తూ.. ముందు ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా సమావేశాలు పెట్టడం కాకుండా, దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం గుడివాడలో నానికి రాజకీయ స్థానం లేకుండా […]

iqonic-blog

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని మైత్రీవనం కూడలిలో ఆయన విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ కుమారులు మోహనకృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నటుడు మంచు మనోజ్ తో పాటు కాంగ్రెస్ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

iqonic-blog

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ జడివానకు తోడు ఈదురు గాలులు, గాలి దుమారం రేగడంతో పాటు వడగండ్ల వాన కూడా కురవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ గాలివాన బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడటంతో పాటు స్తంభాలు కూడా […]

iqonic-blog

వైకాపా హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్ బాగ్ ఈడీ కార్యాలయంలో ఏడున్నర గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలు, “కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్ చేసిన మొబైల్ ఫోన్లలోని వివరాలను సేకరించారు. ఈ కేసుతో నాకు సంబంధం లేదు. నేను ఎవరి పేర్లూ చెప్పలేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON