loader
iqonic-blog

ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల విభాగంలో యువ షట్లర్ ఆయుశ్ శెట్టి కూడా ఓటమి పాలయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన అన్ సె యంగ్‌తో జరిగిన పోరులో సింధుకు చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌హరిహరణ్ జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. నువ్వానేనా అన్నట్టు సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 16-21,21-15,21-19తో మలేసియాకు చెందిన కాంగ్ ఖాయ్ […]

iqonic-blog

రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఎన్డీఏ సమావేశంలో స్పష్టత వచ్చింది. నాలుగు స్థానాల్లో టీడీపీ 3 సీట్లు, జనసేన 1 సీటు తీసుకోవాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ.. “టీడీపీ, జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకి ఉన్నట్టే” అని వ్యాఖ్యానించారు. కాగా, జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది త్వరలోనే తమ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (NDA) కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. వేడుకల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ రూపకల్పన, భవిష్యత్ వ్యూహాలపై నేతలు క్షుణ్ణంగా సమాలోచనలు జరిపారు.

iqonic-blog

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విషయంలో పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ మీపై కేసులు పెట్టమన్నారని నిరూపించగలరా? అంటూ పవన్ కల్యాణ్ కు కేవీపీ బహిరంగ లేఖ రాశారు. “వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. వైఎస్సారే కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. నిరూపిస్తే వైఎస్సార్ అభిమానులందరం కలిసి సీఎంఆర్ఎఫ్ కు రూ.10 కోట్లు […]

iqonic-blog

దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ నుండి తాయి తగాక్, మణిపూర్ నుండి శారదా దేవి, మధ్యప్రదేశ్ నుండి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ బరిలోకి దిగుతున్నారు. అలాగే రాజస్థాన్ నుండి అల్కా గుర్జర్, డా.సతీష్ పూనియాను పార్టీ ఎంపిక చేసింది. మరోవైపు గుజరాత్ రాష్ట్రం నుండి నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వారిలో రాజుభాయ్ శుక్లా, ముకేశ్బయ్ రాథా, మాన్ సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ భాయ్ కంజారియా ఉన్నారు.

iqonic-blog

అమీర్ పేట్ అగ్ని ప్రమాదంలో ఏ1043 నంబర్ మెట్రో పిల్లర్ కు అగ్ని సెగలు అంటుకున్నాయి. జేఎన్టీయూ నిపుణుల బృందం రంగంలోకి దిగి ప్రత్యేక డివైజ్లతో పిల్లర్ నాణ్యత, సామర్థ్య పరీక్షలను నిర్వహించింది. దీంతో మెట్రో పిల్లర్ కు పగుళ్లు వచ్చాయంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కేవలం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లరు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రకటన బోర్డు కాలి దాని లిక్విడ్ పిల్లరైపై […]

iqonic-blog

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లండన్ ఐ తరహాలోనే అమరావతిలో కృష్ణా నదీతీరంలో అమరావతి ఐ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు భవన బాహ్య సుందరీకరణ కోసం రూ. 547 కోట్లు, ఐఏఎస్ అధికారుల నివాసాల్లో ఆధునిక సౌకర్యాల కోసం […]

iqonic-blog

తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై రాజీనామా చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, అన్నామలై పార్టీకి రాజీనామా చేయబోరని, ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటూ కీలక ప్రకటన చేశారు. అన్నామలై పార్టీని వీడేందుకు అమిత్ షా అంగీకరించలేదని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నామలైని బుజ్జిగించిన అమిత్ షా.. ఆయన పెట్టిన షరతులు, డిమాండ్లకు అంగీకరించినట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ కావాలని, త్వరలో చేపట్టబోయే యాత్రకు మద్దతు కావాలని అడగగా, అమిత్ […]

iqonic-blog

పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం వచ్చిన ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. 1984 జూన్‌లో స్వర్ణ దేవాలయం నుండి ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ వార్షికోత్సవానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ బెదిరింపు రావడం గమనార్హం. ఈ ఈమెయిల్‌లో ఆనాటి వివాదాస్పద సైనిక చర్యకు సంబంధించిన అత్యంత రెచ్చగొట్టే అంశాలను ప్రస్తావించినట్లు అధికారులు వెల్లడించారు.

iqonic-blog

ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం వద్ద నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. నీటికుంట ఒడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. చిన్నారుల జాడ తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని చెరుకుపాలేనికి చెందిన ఇల్లా దినేశ్‌ (10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్‌ (12), కరేటి అభిరామ్‌ (14)గా గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON