loader
iqonic-blog

ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు.  తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు […]

iqonic-blog

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. మహారాష్ట్ర లోని భివాండీ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని 2014లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆరెస్సెస్‌ కేసు వేసింది. మహారాష్ట్రలోని భివాండీ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ జరిగిన విచారణకు రాహుల్‌గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.

iqonic-blog

వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని,  దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.

iqonic-blog

మార్చి 31 లోగా దేశం నుంచి న‌క్స‌లిజాన్న నిర్మూలించనున్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే ప‌రేడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో సీఆర్పీఎఫ్ ద‌ళాలు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆయన చెప్పారు. అక్క‌డ రాళ్లు రువ్వే ఘ‌ట‌న‌లు సున్నాకు ప‌డిపోయిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌ణిపూర్‌లోనూ వ‌ర్గ హింస‌ను ఆ ద‌ళాలు క‌ట్ట‌డి చేసిన‌ట్లు చెప్పారు. కేవ‌లం మూడేళ్ల‌లో మావోయిస్టుల వెన్ను విరిచిన‌ట్లు సీఆర్పీఎఫ్‌ను మంత్రి షా కీర్తించారు.

iqonic-blog

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ  2026  10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు  ఉదయం ఫిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాగనుంది.  ఏప్రిల్‌ 28 నుంచి మే 5వ తేదీ వరకు […]

iqonic-blog

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బెంగళూరులో కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘AMB సినిమాస్’ ను ఆయన స్వయంగా సందర్శించారు. ఈ స్క్రీన్‌పై సినిమా చూసిన మహేశ్ బాబు ఆ అనుభూతి అద్భుతంగా ఉందని కొనియాడారు. “సౌత్ ఇండియాలోనే మొదటి డాల్బీ విజన్‌ను మా ఏఎంబీ సినిమాస్ బెంగళూరులో చూడడం చాలా ప్రత్యేకంగా అనిపించింది” అని ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

iqonic-blog

భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ఆయన ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. అమెరికా ప్రాంతంలో భారత్‌కు బ్రెజిలే అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల మార్కును సునాయాసంగా అధిగమిస్తుందన్న […]

iqonic-blog

ఎఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇవాళ సోషల్ మీడియా ఖాతాలో జగన్ పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ తీరు మనందరిని సిగ్గుపడేలా చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని, రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా దేశాన్ని ఎవరూ కించపరచకూడదని తెలిపారు. ఇండియా కృత్రిమ మేధ ఇంఫాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5 వద్ద యూత్ కాంగ్రెస్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON