loader
iqonic-blog

పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్‌ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్‌ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.

iqonic-blog

రంజాన్, లేదా రమదాన్ ఇస్లామీయ చంద్రమాస పంచాంగంలో తొమ్మిదవ నెల.ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని అంటారు. “సౌమ్” అని అరబ్బీ లో పిలుస్తారు

iqonic-blog

చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళితే పవన్ కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కాపులకు సీఎం పదవి కావాలని ఇది వారి ఎన్నో ఏళ్ల కోరిక అని గుర్తుచేశారు. ఆంధ్రా రాజకీయాల్లో కాపు సామాజికవర్గం చాలా బలమైనదని తోట త్రిమూర్తులు గుర్తు చేశారు.చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారని…అసెంబ్లీ సీట్లు తక్కువ తీసుకున్నారు అని గుర్తు చేశారు.

iqonic-blog

జెన్-జీ నిరసనల తరువాత గురువారం (మార్చ్ 5) తొలిసారిగా నేపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగాయి. నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్‌లో నూతన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి (ఆర్‌ఎస్‌పీ) విజయం దాదాపుగా ఖరారైనట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ సింగర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ 165 స్థానాలకు గాను 94 సీట్లల్లో ముందు వరుసలో ఉంది. ఇక నేపాలీ కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించగా పది స్థానాల్లో లీడ్‌లో ఉంది. సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ […]

iqonic-blog

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జార్ఖండ్‌లోని సిమ్‌దేగా జిల్లాలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురికి వెళ్తూ  ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కుర్దేగ్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని గోడాంబా గ్రామం సమీపంలోని రహదారిలో దిగువకు వస్తుంది. ఇంతలో బస్సు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. తరువాత బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో దాదాపు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

iqonic-blog

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లొంగిపోవడం తప్ప ఇరాన్‌కు వేరే మార్గం లేదన్నారు. లొంగిపోయిన తరువాత ఇరాన్‌తో చర్చల విషయం ఆలోచిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం తీసుకొస్తామని, నాయకత్వాన్ని మార్చిన తరువాత ఇరాన్‌ను సమర్ధవంతమైన దేశంగా మారుస్తామని ప్రకటించారు. ఇరాన్‌ భవిష్యత్‌ చాలా బాగుంటుందని, ఆదేశ గౌరవాన్ని తిరిగి కాపాడుతామని ట్రంప్‌ అన్నారు.

iqonic-blog

ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని,సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి తెలంగాణలోని హైదరాబాద్ లో,మహారాష్ట్రలోనూ పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.

iqonic-blog

మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరికుడు పాత్రలు ఇష్టం. కర్ణుడిలా నేనూ మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డాను. నేను కూడా బార్బరికుడిలా బలహీనులైన మాదిగల కోసం కొట్లాడా. మాదిగ, మాదిగ ఉపకులాల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON