loader
iqonic-blog

న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని నరేంద్ర మోదీని 24వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యాకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ కూడా అంగీకరించారు.

iqonic-blog

గిరిజన బాలల కోసం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 25 అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపి.. సీఎస్ఆర్ పథకం కింద రూ.కోటి సమీకరించారు. వీటితో అంగన్వాడీ కేంద్రాలను అత్యాధునిక కేంద్రాలుగా చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు.

iqonic-blog

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు రెండు డీఏలు విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించాలని పేర్కొంది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1 నుంచి చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి, మే, జులైలో ఇవ్వనుంది. 2.73 శాతం డీఏను 2024 జులై 1 నుంచి చెల్లించనుంది. 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరులో జమ […]

iqonic-blog

2026-27 ఎక్సైజ్ పాలసీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల మంజూరు, ఫీజుల విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. మద్యం దుకాణాల సంఖ్యను పెంచకుండా… మొత్తం 3,396 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 340 దుకాణాలను కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసింది.

iqonic-blog

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో ఆధునిక విధానాలు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలబడే విద్యా పాలసీని తెస్తామని ప్రకటించారు. సామాజిక వెనుకబాటుతనానికి కారణం విద్య మాత్రమే కారణమని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో ప్రధాన విద్యా సంస్థలకు నెహ్రూ పునాది వేశారని సీఎం కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకో యూనివర్సిటీ వచ్చిందని గుర్తు చేశారు.

iqonic-blog

స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, పేర్ని నాని తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా ఉన్న న్యాయపరమైన వివాదాలు, కేసులన్నింటినీ ఈ నెల 30వ తేదీలోగా కొట్టేస్తానని ఒక ఉన్నత స్థాయి జడ్జి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారంటూ నాని వ్యాఖ్యానించారు. ఒక ఉన్నతాధికారి ద్వారా తమకు ఈ సమాచారం అందిందని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థను మరియు అధికారులను తమకు అనుకూలంగా మలచుకుంటూ కూటమి ప్రభుత్వం స్థానిక […]

iqonic-blog

హైదరాబాద్‌లో రాత్రిపూట ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘థర్డ్‌ షిఫ్ట్‌’ బస్సులకు భారీ స్పందన లభిస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆరు ప్రధాన రూట్లలో ప్రత్యేక నైట్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించారు. కోఠి–పటాన్‌చెరు, సికింద్రాబాద్‌–హయత్‌నగర్‌, బాచుపల్లి–వేవ్‌రాక్‌ , కొండాపూర్ – సికింద్రాబాద్  తదితర కీలక మార్గాల్లో సర్వీసులు నడుస్తున్నాయి.కోఠి నుంచి పటాన్‌చెరు వెళ్లే రూట్ నంబర్ 222A బస్సు కోసం నాలుగు బస్సులను కేటాయించి ఏకంగా […]

iqonic-blog

వినాయకుడి పండుగ దగ్గర పడుతుండటంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త రికార్డు నమోదైంది. IRCTC ప్రకారం.. సెప్టెంబర్ 7న మొత్తం 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఒక్క రోజులో 20 లక్షల టికెట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా బుకింగ్స్ భారీగానే కొనసాగాయి. ఆ రోజు 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ […]

iqonic-blog

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు చోరీకి గురైన కేసులో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి విక్రేతకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మల్లేష్ ఫాలో అవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఖాతాలో షాట్‌గన్స్, AK-47 తదితర […]

iqonic-blog

ఇంగ్లండ్‌లోని ఫేమస్ సిల్వర్‌స్టోన్ కార్ రేస్ ట్రాక్‌పై సెప్టెంబర్ 12న జరిగే మిచెలిన్ లీ మాన్స్ కప్‌ను తమిళనాడు సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అదే రేసులో అజిత్ కుమార్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. అంటే, విజయ్ జెండా ఊపగా… అజిత్ కారు నడపనున్నారు. కార్ రేసింగ్ ప్రపంచంలో సిల్వర్‌స్టోన్‌కు పెద్ద చరిత్ర ఉంది. అందుకే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ రేసును ప్రారంభించే ప్రత్యేక అవకాశం విజయ్‌కు దక్కింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON