loader
iqonic-blog

నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు నేతృత్వం వహించన కాక్రోచ్‌ జనతా పార్టీ ( CJP ) భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. ఆగస్టు 5న సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. మహారాష్ట్రలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో జరిగే ఈ భేటీకి.. వాలంటీర్లు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి రావాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంతో పాటు విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లపై ప్రధానంగా […]

iqonic-blog

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ. 25 వేల కోట్లకు చేరాయని ఏపీ జేఏసీ నాయకులు వెల్లడించారు. తాము ఉచితాలు లేదా బోనస్‌లు అడగడం లేదని, చట్టబద్ధంగా రావలసిన బకాయిలనే డిమాండ్ చేస్తున్నామని రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను […]

iqonic-blog

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొరియన్ పాప్ సంస్కృతిలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన కొరియన్ ఫింగర్ హార్ట్ చూపిస్తూ ఫొటోను పంచుకున్న ఆయన, జెన్ జీ యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆయన పోస్ట్‌లో.. “నేను ఇంకా విద్యార్థినే. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. నేటి పాఠం.. ఇది స్నేహితుల దినోత్సవం, ఇది ఒక హార్ట్” అని పేర్కొన్నారు. “అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. ఎంతో ప్రేమతో” అంటూ తన […]

iqonic-blog

స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు చిరస్మరణీయ గౌరవం దక్కనుంది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద అల్లూరి సీతారామరాజు భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంగ్లేయులపై విల్లు ఎక్కుపెట్టి గర్జించిన ఆయన రౌద్ర రూపాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. విమానాశ్రయానికి వచ్చే దేశీ, విదేశీ ప్రయాణికులకు అల్లూరి త్యాగం, వీరత్వం మరియు తెలుగువారి పౌరుషం తెలిసేలా దీనిని […]

iqonic-blog

స్పెయిన్ సరిహద్దు నగరమైన సెయుటాలో చోటుచేసుకున్న తీవ్ర వలసల సంక్షోభం పై పోప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంజెలుస్ ప్రార్థనల అనంతరం మాట్లాడిన ఆయన, సెయుటాలో నెలకొన్న పరిస్థితులను “ఆందోళనకరమైనవి”గా వర్ణించారు. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించడం, తీవ్ర ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు న్యాయంతో కూడిన పరిష్కారాలు లభించాలని పోప్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ఆగాలని మరియు […]

iqonic-blog

దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరుతో సాగే 100 వారాల జాతీయస్థాయి కార్యక్రమాన్ని ఆదివారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశ యువత మాదకద్రవ్యాల వినియోగాన్ని వీడాలని, డ్రగ్ ఫ్రీ ఇండియా నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజల్ని […]

iqonic-blog

ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్ గూడాలో దారుణం చోటు చేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువులో ముంచి చంపేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

iqonic-blog

ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులు బిక్షమెత్తుకోవాలా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగ్రహంగా ప్రశ్నించారు. రంజాన్‌కు రూ. 33 కోట్లు కేటాయించి, బోనాలకు రూ. 20 కోట్లే కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏ […]

iqonic-blog

ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్‌ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు. ఏఐతో సాఫ్ట్‌వేర్‌ను మరింత వేగంగా ఉత్పత్తి చేస్తున్నాము. కానీ అసలు గ్లోబల్ మార్కెట్‌లో ఈ అదనపు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అవసరం ఉందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది’ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న యువ జనాభాకు ఏ రంగంలో ఉపాధి దొరుకుతుందన్నది ప్రస్తుతం కొంత అస్పష్టంగా ఉందని […]

iqonic-blog

మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు ఆదేశించింది. పెళ్లి, మతాన్ని స్వీకరించడం, నివాసం, భవిష్యత్ వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. దివ్యా భాటియా, అన్షు భాటియా అనే ఇద్దరు అక్కచెళ్లెల్లు.. ఇద్దరు ముస్లిం యువకులను ప్రేమించారు. వారి తండ్రి, ఆ ఇద్దరినీ తన ఇంట్లో బంధించారు.ఆ ఇద్దరినీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON