loader
iqonic-blog

హర్ముజ్‌ జలసంధిని అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందన్న ట్రంప్ ప్రకటనకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఫుడ్‌ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్‌ తన సేఫ్టీ గురించి ఆలోచించాలని ఇబ్రహీం అజీజీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసారు. హర్ముజ్‌ను నియంత్రణలోకి తీసుకోవాలన్న అమెరికా కల కల్లగానే మిగిలిపోతుందని ట్రంప్‌ పిచ్చి కూతలు మానాలని ఇరాన్‌ సీనియర్‌ నేత హితవు పలికారు. హర్ముజ్ చుట్టూ యుద్ధనౌకలు మోహరించినంత మాత్రాన అమెరికాకు తాము బెదిరేది లేదని […]

iqonic-blog

టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగాల్ బీర్బూమ్ లోని రాంపూర్ హాట్ తన నివాసానికి సమీపంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆశిష్ బెనర్జీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు కీలక మంత్రిపదవులు చేపట్టారు. టీఎంసీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో TMCపార్టీ ఘోర పరాజయం తర్వాత ఆశిష్ బెనర్జీ బీర్బూమ్ జిల్లా కోర్ కమిటీ చైర్మన్ […]

iqonic-blog

ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్నట్లు.. సెప్టెంబర్‌ 15 – 26 వరకు మంగళగిరిలో డేఅండ్ నైట్ మ్యాచ్‌లు జరుగుతాయి భారత మహిళల మాజీ క్రికెట్‌ మిథాలీ రాజ్‌ ఆధ్వర్యంలో ఈ […]

iqonic-blog

హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన ఉత్తర్వుల ద్వారా విద్యార్థుల మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమించాలని కోరారు. లాయర్లు, అడ్వకేట్లుగా, జడ్జిలుగా, మరికొందరు అత్యున్నత స్థానాలు అధిరోహించే సామర్థ్యం ఉన్న వారని అందుకే, వారిని క్షమాపణ కోరడం అంటే ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని.. విద్యార్థుల ఆందోళనలకు విలువ ఇవ్వడమే అన్నారు.

iqonic-blog

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి. యుద్ధ ప్రభావం కారణంగా,ఇంధన సర్ఛార్జితో విమాన టికెట్ల ధరల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గతేడాది జూన్‌ నెలలో 4.42లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించగా, జూన్‌ నెలలో 4.30లక్షల మంది మాత్రమే ప్రయాణించడం గమనార్హం. మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో వృద్ధిరేటు మైనస్‌లలోకి పడిపోయింది. గతేడాది త్రైమాసికంలో 11.37లక్షల విదేశీ ప్రయాణికులు ప్రయాణిస్తే ఈ ఏడాది 11.20 లక్షలు […]

iqonic-blog

ఇండోనేసియాలో శనివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించి దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయ బృందాలు ఇప్పటివరకు 38 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశాయని వీటిలో సిక్కా, మాంగ్‌గరై, ఈస్ట్‌మాంగ్ గరై ప్రాంతాల నుంచే మృతదేహాలు ఎక్కువగా బయటపడ్డాయని, మాంగ్‌గరై లోని రియోక్ గ్రామంలో విరిగిపడిన కొండచరియ నుంచి 16 మృతదేహాలు బయటపడ్డాయని జాతీయ వైపరీత్యాల నిర్వహణ సంస్థ అధినేత సుహారియంతో వెల్లడించారు. నగేకియో రీజెన్సీ నుంచి 2000 […]

iqonic-blog

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొనడాన్ని కొందరు తప్పుబట్టారు. ఫరియా ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా, హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నావంటూ కొందరు,‘ఇస్లాం ద్రోహి’ అంటూ కొందరు కామెంట్లు చేయడం, దీంతో ఫరియా ఒక ఎమోషనల్ వీడియోను SMలో షేర్ చేసింది ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత హిందూ మతాన్ని, తండ్రి హిందూ కుటుంబంలో జన్మించి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన తండ్రి ఇస్లాంలోని మంచి విషయాలను […]

iqonic-blog

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమం ఎప్పటిలానే అత్యంత  వైభవంగా జరిగింది.శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చారు. వందేమాతరం, జాతీయ గీతం జనగణమన ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన నాయకుల్ని, విశిష్ట అతిథుల్ని ఆప్యాయంగా పలకరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ […]

iqonic-blog

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ లోకభవన్లలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమాలు ఆహ్లాదకర వాతావరణంలో  జరిగాయి. ఏపీలోని లోకభవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు దంపతులకు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ లిసా గిల్, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొనగా.. విచ్చేసిన అతిథులను గవర్నర్ స్వయంగా పలకరించారు. మరోవైపు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం […]

iqonic-blog

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పోల్ ట్రాకర్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్డీయే కంటే ఇండియా కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. యూపీలో ప్రాంతాల వారీగా పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలను ఇవాళ సాయంత్రం దశల వారీగా ఎక్స్ లో ట్వీట్లు చేస్తోంది. పూర్వాంచల్, అవథ్ ప్రాంతాల్లో ఇండియా కూటమికి 44-49 శాతం ఓట్లు, ఎన్డీయేకు 39-45 శాతం ఓట్లు లభిస్తున్నాయి. అలాగే పశ్చిమ యూపీ ప్రాంతంలోని 79 సీట్లలో ఇండియా కూటమికి 48 సీట్లు, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON