loader
iqonic-blog

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యను స్మరించుకుంటూ, భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 21న ‘జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’ జరుపుకుంటారు. ఉగ్రవాదం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, హింసను నిరుత్సాహపరచడం మరియు ఉగ్రవాదంతో పోరాడుతూ తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులర్పించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

iqonic-blog

ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ఎమ్మెల్సీ కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని,ఎదుటివారికి సహాయం చేయడమే కానీ ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు అని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్‌లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు.

iqonic-blog

తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది. గురువారం ఏర్పడనున్న క్యాబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చేరబోతున్నట్లు వెల్లడించారు.

iqonic-blog

శంషాబాద్ అంతర్జాతీయ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 8.705 కేజీల గాంజా పట్టుకున్నట్లు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ గాంజా విలువ 3.05 కోట్లు ఉంటుందన్నారు. హైడ్రోపోనిక్ గాంజా తన లగేజీ బ్యాగేజ్ లో 24 వివిధ రకాల ప్యాకెట్లు, ఆహారపదార్థాల టిన్‌లలో ప్యాకింగ్ చేసి తీసుకురాగా డిఆర్‌ఐ ఆధికారులు పట్టుకున్నారు.

iqonic-blog

‘ఆ కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క నాటు మాస్ డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసిన సోషల్ మీడియా సంచలనం ‘కుర్చీ తాత’ ఇకలేరు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ వాసి అయిన మహ్మద్ పాషా బుధవారం కృష్ణ కాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో హఠాన్మరణం చెందారు. ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ […]

iqonic-blog

ఇటలీ ప్రధాని మెలోని ఇజ్రాయెల్‌ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ సామాజిక కార్యకర్తల పట్ల ఇజ్రాయెల్‌ వైఖరిని ఆమె తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ మంత్రి ఇటామర్  ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేశారు. అందులో గాజా వైపు పడవల్లో వెళ్తున్న సామాజిక కార్యకర్తలను ఇజ్రాయెల్‌ నౌకాదళం అదుపులోకి తీసుకుంది. వాళ్లను మోకాళ్లపై కూర్చొబెట్టి, తలలను నేలకు ఆనించి.. చేతులకు వెనుక నుంచి సంకెళ్లు వేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన ఇజ్రాయెల్‌ మంత్రి.. ‘వెల్‌కమ్‌ టు […]

iqonic-blog

సికింద్రాబాద్‌ బోయినపల్లి పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై నందిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో సహకారం అందించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై నందిత బాధితుడిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, “స్టేషన్‌లో అందరికీ వాటాలు ఇవ్వాలి” అంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు నేరుగా సోదాలు చేసి ఎస్సై నందితను అదుపులోకి తీసుకున్నారు.

iqonic-blog

కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే, సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారం అందించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంత్రితో కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్–II […]

iqonic-blog

దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం.అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తాం’అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

iqonic-blog

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా సినిమా ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ రిలీజ్ అయింది. మే 20 మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.ఈ మూవీ 1897 నుంచి 1922 మధ్య కాలంలో  స్వాతంత్రోద్యమం సమయంలో జరిగిన సంఘటనలతో డేవిడ్ రెడ్డి కథను దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి సిద్ధం చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇక డేవిడ్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను నమోదు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON