loader
iqonic-blog

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులోని డైమన్ పార్క్ సమీపంలో సోమవారం ఉదయం ఓ భారీ ఎండిన చెట్టు రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అడ్డంగా ఉన్న ఈ భారీ చెట్టును పక్కకు తొలగించడానికి స్థానికులు, ప్రయాణికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

iqonic-blog

కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది ఇషా ఫౌండేషన్‌ సభ్యుల్లో హైదరాబాద్‌కు చెందిన తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని తెలిసింది ఆమె అమెరికా పౌరుడు, భారతీయ సంతతికి చెందిన దీపక్‌ దండు భార్య. . యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులోని గ్యిరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రం వద్ద ఈషా ఫౌండేషన్‌కు చెందిన బృందం ఉండగా భారీ వరద పోటెత్తింది.

iqonic-blog

2018లో ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటికే 4 ఎస్-400 స్క్వాడ్రన్లను అందుకోగా,   చివరి 5వ స్క్వాడ్రన్ నవంబర్ నాటికి రష్యా నుంచి మన దేశానికి చేరుకోనుంది.   భారత వైమానిక దళం (IAF) కోసం మరిన్ని ఎస్-400 క్షిపణి స్క్వాడ్రన్లను అందించే టెండర్   ప్రక్రియలో భాగంగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలతో కూడిన డ్రాఫ్ట్‌ను సమర్పించింది.   సుమారు రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ మెగా డీల్ ద్వారా భారత వైమానిక దళానికి […]

iqonic-blog

బెంగళూరు బీజేపీ నేత డా. రవిప్రకాష్ కిడ్నాప్ కు సంబంధించి మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పై బెంగళూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు. తన భర్తను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కిడ్నాప్ చేయించారని నాలుగు వాహనాల్లో వచ్చి తన భర్త రవిప్రకాశ్ ను పుట్టా సుధాకర్ అనుచరులు కిడ్నాప్ చేశారని బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్ లో రవిప్రకాష్ భార్య సబీనా ఫిర్యాదు చేశారు ఆయన కుమారుడు పుట్టా రవి కుమార్ పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

iqonic-blog

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి,  మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజాగా కనిపిస్తున్న గుండ్రటి డిజైన్‌ను చూస్తే అది వోర్టెక్స్ లేదా రిపుల్ తరహా తరంగాల నమూనాలా కనిపిస్తోంది. దీంతో ఇది మార్పు, పరిణామం లేదా జీవితంలో ముందుకు సాగడాన్ని సూచిస్తుందనే ఊహాగానాలు […]

iqonic-blog

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భారతీయ పౌరులు ఇకపై 30 రోజుల పాటు ఎలాంటి వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించే గొప్ప వెసులుబాటును ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ అధికారికంగా ప్రకటించారు.  ఆదివారం తాష్కెంట్‌లో ప్రధాని మోదీతో కలిసి నిర్వహించిన ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సరికొత్త వీసా రహిత విధానం వల్ల రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు […]

iqonic-blog

 చంద్రబాబు తాను చేయని దానిని చెప్పుకోవడంపై వైఎస్ జగన్ ప్రశ్నించారు. వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క […]

iqonic-blog

మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు X వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందన్నారు. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో 1996లో తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి సోమవారం ప్రారంభించే అవకాశం రావడం ఎంతో భావోద్వేగానికి, సంతోషానికి గురిచేస్తోందని సీఎం చంద్రబాబు […]

iqonic-blog

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిధిలోని ముచ్చెర్ల సమీపంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో అత్యంత భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, ఏకంగా 1.32 లక్షలకు పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందించాలని  ప్రతిపాదించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించనుండగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక నిధులను సమకూర్చి నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చర్చలు జరుగుతున్నాయి.

iqonic-blog

వైఎస్సార్‌సీపీలో ఎలాంటి కోటరీ లేదని, పార్టీలో నెంబర్ 2, 3 కూడా లేరని.. సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డికి జగన్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని తెలుసన్నారు. వైఎస్సార్ హయాంలోనే తిరుమలలో అన్యమతస్తుల ఉద్యోగాలపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నిజంగానే వైఎస్ కుటుంబానికి మతమార్పిడుల అజెండా ఉంటే దశాబ్దాలుగా వారితో ఉన్న సాయిరెడ్డికి కూడా మతమార్పిడి జరిగి ఉండేదని ఎద్దేవా చేశారు. కొత్త పార్టీ పెట్టుకునేందుకు జగన్‌పై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON