రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Posted on
- By Admin
యునైటెడ్ కింగ్డమ్ నాలుగు దేశాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. యూకే నియంత్రణ నుంచి బయటకు వచ్చే ఉద్దేశాన్ని ప్రకటిస్తూ.. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు సోమవారం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్లంతా యూకే నుంచి స్వాతంత్య్రం పొందడానికి కట్టుబడి ఉండటం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెస్ట్మినిస్టర్ (యూకే పార్లమెంట్) టైం ముగియబోతుందని ప్రపంచానికి అర్థం కావడానికి ఇంతకంటే స్పష్టమైన సంకేతం మరొకటి ఉండదు అని […]
- Posted on
- By Admin
తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి వేదికపై చేసిన కొన్ని వ్యాఖ్యలే ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. “ఆలోచించకుండా హామీలు ఇవ్వడం, సమస్యల నుంచి పారిపోవడం, ప్రతిదానికీ ప్రతిపక్షాలను నిందించడం సరైన నాయకుడి లక్షణం కాదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు CM విజయ్ను ఉద్దేశించి చేసినవేనని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతిపై, షో నిర్వాహకులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
- Posted on
- By Admin
న్యూయార్క్ నగరంలో పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. లోయర్ మన్హటన్ లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
- Posted on
- By Admin
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సోమవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం వద్ద పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్ను విజయ్ నిలదీయడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ బాషా గన్మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. విజయ్ ఇంటి వద్ద మూడు వాహనాలను పుష్పనాథ్ వర్గీయులు ధ్వంసం చేశారు.
- Posted on
- By Admin
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
- Posted on
- By Admin
ఏపీపీఎస్సీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్ సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం 163 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ రానుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానుంది.
- Posted on
- By Admin
విజయవాడలో నరసరావుపేట నుంచి విజయవాడ వచ్చిన ఓ బస్సులో ఒక బ్యాగులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు లభ్యమవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ అతడికి వచ్చింది. ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల గాలింపు చర్యలు చేపట్టారు
- Posted on
- By Admin
తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుంపు దాడులు కేవలం హత్యలతోనే ప్రారంభం కావని, పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే యూనిఫాం ధరించిన అధికారుల ముందే పథకం ప్రకారం జరిగే దాడులతో కూడా మొదలవుతాయని ఆయన అన్నారు. తన పీఆర్ మహేష్ మణిక్యాల, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపలే దాడి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రస్తుతం అరాచకత్వ అంచున నిలిచిందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందని.. రాహుల్ గాంధీని ట్యాగ్ […]
- Posted on
- By Admin
చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు, వ్యాపారులకు ఆర్థిక భార తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుపిఐ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డుల ద్వారా రూ.2,000 వరకు జరిపే పేమెంట్స్పై బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే UPI లేదా రూపే లావాదేవీల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి […]
- Posted on
- By Admin
- Business265
- District30
- Entertainment733
- General16238
- Health81
- Politics2015
- Sports537
- Technology308
- Uncategorized2
- World1512
Recent Post
Tags
- Adilabad District
- AlluriSitaramaraju District
- Anantapur District
- Annamayya District
- Bapatla District
- Bhadradrikothagudem District
- Chittoor District
- EastGodavari District
- Eluru District
- Guntur District
- Hanamkonda District
- Hyderabad
- Jagitial District
- JogulambaGadwal District
- Kakinada District
- Karimnagar District
- Khammam District
- Krishna District
- KumuramBheemAsifabad District
- Kurnool District
- Mahabubabad District
- Mahabubnagar District
- Medak District
- MedchalMalkajgiri District
- Nagarkurnool District
- Nalgonda District
- Narayanpet District
- Nirmal District
- Nizamabad District
- Ntr District
- Palnadu District
- ParvathipuramManyam District
- Peddapalli District
- Prakasam District
- RangaReddy District
- SPSR Nellore District
- SriSathyaSai District
- Suryapet District
- Tirupati District
- Vikarabad District
- Visakhapatnam District
- Wanaparthy District
- Warangal District
- YadadriBhuvanagiri District
- YSRkadapa District