loader
iqonic-blog

ప్రతి సంవత్సరం ఆగస్టు 6 వ తేదీన హిరోషిమా దినోత్సవం (హిరోషిమా డే) జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 6న ఉదయం 8:15 గంటలకు జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును ప్రయోగించింది. ఈ పెను విధ్వంసంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.<span;>అణు యుద్ధాల వల్ల జరిగే భయంకరమైన నష్టాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తుంది.

iqonic-blog

తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తప్పకుండా తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేస్తారని, లేదా చంపొచ్చని.. అయినా తాను వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. షేక్ హసీనా రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. బుధవారం వర్చువల్‌గా మీడియాతో సమావేశమయ్యారు. తాము ఎన్నో ఏళ్లుగా నిర్మించిన బంగ్లాదేశ్ ఇబ్బందుల్లో ఉందని, దీనికోసమా 1972లో 30 లక్షల మంది త్యాగం చేశారు అంటూ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.

iqonic-blog

యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ విధించే అంశంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దాని నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, యూపీఐపై ఎండీఆర్‌ అంశం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ప్రభుత్వం చట్ట సవరణ ప్రక్రియలో ఉందని, తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు.

iqonic-blog

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.యాద్గిర్ జిల్లా కడేచూర్-బడియాలా పారిశ్రామిక ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులను విక్రమ్, సంజయ్, గణేష్‌గా గుర్తించారు. సంజయ్, విక్రమ్‌లది మధ్యప్రదేశ్‌‌లోని కత్ని జిల్లా కాగా.. గణేష్‌ది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా. అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ అనే మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

iqonic-blog

జార్ఖండ్‌లో ఇటీవల జరిగిన జేపీఎస్‌సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదుగురు విద్యార్థులు రాజధాని రాంచీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.ఈ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి నేతలతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది.

iqonic-blog

తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో కల్పించిన భద్రతా ఏర్పాట్లపై మాజీ మంత్రి అమర్‌నాథ్ పోలీసు యంత్రాంగం వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘జడ్ ప్లస్’ కేటగిరి భద్రత పొందాల్సిన మాజీ సీఎం హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు చేరుకున్నప్పటికీ, వారిని నియంత్రించేందుకు కనీస స్థాయిలో కూడా భద్రతా సిబ్బంది లేకపోవడం ప్రభుత్వ ముమ్మాటికీ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. సాయంత్రం వరకు ఉన్న పకడ్బందీ పోలీసు బందోబస్తు,  తెల్లవారేసరికి పూర్తిగా మాయమవడం వెనుక పెద్ద కుట్ర ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.

iqonic-blog

ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల నకిలీ ఎన్‌ఓసీల (NOC) స్కామ్‌కు సంబంధించి దర్యాప్తులో భాగంగా మరొక దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది ఏకంగా 8 కాలేజీలు ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ సంతకాలను ఫోర్జరీ పద్ధతిలో మరికొన్ని కాలేజీల యాజమాన్యాలు అగ్నిమాపక శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. అగ్నిమాపక శాఖలో నాగిరెడ్డి లేనప్పటికీ, ఆయన సంతకాలతో కూడిన ఫైర్ సర్టిఫికెట్లు రావడంపై అనుమానం వచ్చిన అధికారులు వెంటనే దీనిపై అంతర్గత విచారణ చేపట్టారు.

iqonic-blog

రష్యా సైన్యం ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఉపిర్ ఎఫ్‌పీవీ డ్రోన్లను తయారుచేసే ‘ఉరల్‌డ్రోన్‌జావోడ్’ కంపెనీ సీఈవో వ్లాదిమిర్ త్కాచుక్ లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది. యెకాటెరిన్‌బర్గ్ సమీపంలోని బోల్షోయే ఇస్తోక్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు వెళ్తుండగా ఈ విస్పోటనం జరిగింది. కారు కింద ముందే అమర్చిన పేలుడు పదార్థాలు పేలిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వ్లాదిమిర్ త్కాచుక్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

iqonic-blog

ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో అతడు అరెస్టయిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఉప్పరపల్లి కోర్టును  పోలీసులు కోరారు. దీంతో రెండ్రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.

iqonic-blog

మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) సీఈవో మార్క్ జుకన్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ (సీఎస్‌ఏఎం), ప్లాట్‌ఫామ్ నిర్వహణలో పొరపాట్లను అంగీకరించిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మెటా ప్రతినిధులు తమ నిర్వహణలో జరిగిన తప్పులను అంగీకరించి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON