loader
iqonic-blog

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3శాతం తగ్గడం గమనార్హం. ఫలితాల్లో బాలికలదే పైచేయి. 88 శాతం బాలికలు, 82 శాతం బాలురు పాస్‌ అయ్యారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలతో https://cbseresults.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు

iqonic-blog

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత కోరారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఫొటోలు బయటపెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు కుమారుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బండి సంజయ్ ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం శోచనీయమని […]

iqonic-blog

మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 93 సార్లు పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్ అన్నారు. “బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్లోనే ఎక్కువగా పేపర్ లీకులు అవుతున్నాయి. ఫలితంగా 6 కోట్ల మంది యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏమాత్రం యాదృచ్ఛికం కాదు” అని స్పష్టం చేశారు.

iqonic-blog

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD – పొలిటికల్)గా నియమించిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఈ నియామకంపై మిత్రపక్షాలూ, ప్రతిపక్షాలూ వ్యతిరేకించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో ఓ జ్యోతిష్కుడికి ముఖ్యమైన పోస్ట్ ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

iqonic-blog

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. సోనియా గాంధీ గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. సోనియా గాంధీని మంగళవారం రాత్రి 10.22 గంటలకు ఆసుపత్రిలో చేర్చారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కూడా ఆస్పత్రికి చేరుకుని తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి […]

iqonic-blog

తమ వీసాలలోని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విభాగాన్ని దుర్వినియోగం చేస్తూ, అత్యంత అనుమానాస్పద యజమానుల వద్ద పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న, భారతదేశానికి చెందిన పలువురు విద్యార్థులతో సహా 10,000 మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) తెలిపింది. విద్యార్థి వీసాపై అమెరికాలోకి ప్రవేశించిన విదేశీ పౌరులు, 12 నెలలు లేదా 24 నెలల పాటు పనిచేయడానికి OPT అనుమతిస్తుంది. అలాగే, యజమానులు స్పాన్సర్ చేసే H-1B వీసాకు మారడానికి కూడా […]

iqonic-blog

పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరున్న ఎన్. రంగసామి మరోసారి అధికార పీఠాన్ని అధిష్టించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న విశేషాలు ఇక్కడ ఉన్నాయి. రంగసామి ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయి. గతంలో కాంగ్రెస్ తరపున రెండుసార్లు, తన సొంత పార్టీ ఏఐఎన్‌ఆర్‌‌సీ (AINRC) తరపున రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్డీఏ (NDA) కూటమిలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

iqonic-blog

ఐబొమ్మ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వెబ్‌సైట్ కూడా అందుబాటులో లేకుండా పోవడంతో, ఇక ఐబొమ్మ కథ ముగిసిందని సినీ ఇండస్ట్రీ భావించింది. కానీ, రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న అగ్ర హీరోల సినిమాలు, చిన్న చిత్రాలు సైతం ఈ వెబ్‌సైట్‌లో హెచ్‌డీ (HD) క్వాలిటీతో ప్రత్యక్షమవుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON