loader
iqonic-blog

జనసేన పార్టీ.. ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ  తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.

iqonic-blog

ఇటీవల ఫ్రాన్స్ జీ7 శిఖరాగ్ర సదస్సు లో తనతో ఫొటో కోసం ఇటలీ ప్రధాని మెలోనీ ఒక్క ఫొటో కోసం  తనను అడుక్కుందని అమెరికా  అధ్యక్షుడు ట్రంప్  అన్నారు. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా సృష్టించినవి.. ఇందులో నిజం లేదు అని మండిపడ్డారు. ఏదేమైనా నేను ఒకటి చెప్పదలచుకున్నా.. నేను, ఇటలీ ఎప్పుడూ అడుక్కోదు..” అని ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

iqonic-blog

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలోనూ ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు.. విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యాశాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది’ అని రేవంత్ […]

iqonic-blog

ఎల్బీ స్టేడియం వేదికగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో కలిసి ప్రభుత్వ, గురుకుల విద్యార్థులకు యంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

iqonic-blog

NEET-UG రీ-ఎగ్జామ్‌కు జూన్ 20వ తేదీ శనివారం దేశవ్యాప్తంగా భారీ మాక్ డ్రిల్‌ను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగే ఈ కృత్రిమ పరీక్షా డ్రిల్ ద్వారా ప్రశ్నపత్రాల పంపిణీ మొదలుకొని జవాబు పత్రాల సేకరణ వరకు జరిగే ప్రతి దశను పరిశీలిస్తారు. భారతదేశ పరీక్షల చరిత్రలోనే ఇదొక అతిపెద్ద రక్షణ ఏర్పాటని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5,500కి పైగా పరీక్షా కేంద్రాలను అధికారులు హై-సెక్యూరిటీ జోన్లుగా మార్చారు.

iqonic-blog

అయోధ్య రాముడికి భక్తులు ఎన్నో రకాల అపురూపమైన కానుకలను సమర్పిస్తుంటారు. తాజాగా, రామ్‌లల్లాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపనీస్ రకం మియాజాకీ మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.5 లక్షల నుండి  రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక్కో పండు విలువ దాదాపు రూ. 1 లక్ష వరకు పలుకుతుంది. అయోధ్యకు చెందిన ఓంప్రకాష్ సింగ్ అనే స్థానిక రైతు తన సొంత […]

iqonic-blog

పశ్చిమాఫ్రికా దేశం నైజర్‌లో తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడికి దిగారు. మారణహోమం సృష్టించారు. వారి దాడులలో 35 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికులు సైనికులు. కొందరు పౌరులు కూడా బలి అయ్యారని అధికారులు తెలిపారు. రాజధాని నియామేలో ప్రధాన ఎయిర్‌పోర్టు డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయమంపై ఉన్నట్లుండి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. చాలా గంటల పాటు భీకర  స్థాయిలో కాల్పుల మోతలు విన్పించాయి. ఈ దాడికి దిగింది తామే అని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ […]

iqonic-blog

‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ కు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా  నిలుస్తుందని తెలిపారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా   ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు  బలాన్ని చేకూరుస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ,  భారత సైన్యం అందిస్తున్న సహకారం  పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్‌ […]

iqonic-blog

ఇరాన్‌కు చెందిన యువ కళాకారిణి పరాస్తూ అహ్మదీ 29 ఏళ్లు. 2024 డిసెంబర్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌లో హిజాబ్‌ లేకుండా  పాట పాడి ప్రదర్శన ఇచ్చారు. దీనిని అహ్మదీ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక కోర్టు పరాస్తూ  అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు సమాచారం. అహ్మదితో పాటు ఆ కన్సర్ట్‌లో భాగమైన మరో ఎనిమిది మందికి కూడా ఇదే శిక్ష పడింది. రెండేళ్లపాటు ఎలాంటి […]

iqonic-blog

సుమన్ ఝా,  సుప్రియా ఢిల్లీలోఇద్దరు యువ పరిశోధకులు ఫెలోషిప్‌లో భాగంగా నిర్వహించిన ఎక్స్‌పోజర్ విజిట్ ముగించుకుని కలహండి జిల్లాలోని తుఆముల్ రాంపూర్ వైపు స్కూటీపై గూగుల్ మ్యాప్‌లో వచ్చిన తప్పు మార్గంలో గిరిజన ప్రాంతంలోకి వెళ్లిపోయారు,స్థానిక భాష తెలియక హిందీలో మాట్లాడుతుండటంతో గ్రామస్తులు వారిని చిన్నారులను ఎత్తుకెళ్లే వ్యక్తులుగా అనుమానించి వారిపై దారుణంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. వ్యక్తులు వారిపై దాడి చేయడమే కాకుండా యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON