అర్ధరాత్రి వేళ నగ్నంగా వీధుల్లో యువతి పరుగులు…చెరువులో దూకి ఆత్మహత్య!
శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని.. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఫీర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తు దారి మధ్యలో బీరప్పగుడి వద్ద ఆగి మొక్కి.. అక్కడి నుంచి చీర, విగ్రహం తీసుకెళ్లడం గమనార్హం.<span;>తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసిది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల క్రితం జాబ్ మానేసి తల్లితో కలసి ఉంటుంది.
కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ముంచెత్తుతున్న వరదలు!
జమ్మూ కశ్మీర్ క్లౌడ్ బరస్ట్ తో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజౌరీ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దర్హాల్ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఉధృతికి న్యూ బస్ స్టాండ్ బెల్లా ప్రాంతం పూర్తిగా జలమయమైంది. ఈ వరదల్లో ఓ మహిళ గల్లంతైనట్లు స్థానికులు చెప్తున్నారు. వరద నీరు ఒక్కసారిగా బస్ స్టాండ్ పార్కింగ్ ప్రాంతంలోకి దూసుకురావడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు […]
ఫిఫా ఫైనల్.. ‘గోల్డెన్ ఛాన్స్ కొట్టేదెవరో!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఆదివారమే. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30కి మొదలయ్యే పోరులో అర్జెంటీనా, స్పెయిన్ అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలే కావడం.. మేటి జట్లను వెనక్కి నెట్టి ఫైనలు రావడంతో టైటిల్ పోరు హోరాహోరీగా, రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల కిందట మెస్సి చేతిలో ప్రపంచకప్ చూసి ఉప్పొంగిపోయిన అర్జెంటీనా అభిమానులు.. దిగ్గజ ఆటగాడికి మరో కప్పుతో వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నారు.
విశాఖలో లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి
విశాఖపట్నంలోని ఆనందపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం-ఆనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు.ఒకరు తీవ్రంగా గాయపడడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేట ఎంఎల్ఎ పిఎ చంద్రశేఖర్ గా గుర్తించారు.పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి శ్రికాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ఒక్క వివాహం చేసుకున్నవాళ్లే ఈ రాష్ట్రంలో ఉంటారు: సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒక్క వివాహం చేసుకున్నవాళ్లు మాత్రమే రాష్ట్రంలో ఉంటారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో నివసించాలి అనుకునేవారు కేవలం ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుని ఉండాలని అన్నారు. ఈ మేరకు త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే ఈ కోడ్ ఉద్దేశమని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ […]
భక్తులకు బిగ్ అలర్ట్..! అమర్నాథ్ యాత్ర రద్దు.. రెండు మార్గాలు మూసివేత..!
భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన తీవ్ర వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర గుహకు వెళ్లే యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాత్ర […]
ఏపీలో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు!
ఆంధ్రప్రదేశ్లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించారు. కడప జిల్లాకు చెందిన నాలుగు నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా ఈ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉపవంశాల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.
ధురంధర్ డైరెక్టర్ భార్యకు ఉత్తమ నటి అవార్డు..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా, యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తెలుగు నుంచి ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, ‘పుష్ప: ది రూల్’, ‘కల్కి 2898 ఏడీ’, ’35 చిన్న కథ కాదు’ చిత్రాలు కూడా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ […]

