loader

మేం మాట్లాడితే తట్టుకోరు.. కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె భర్త కొండా మురళీ స్పందించారు. ‘ఇదేం కొత్త కాదు, ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడితే ఎవరూ తట్టుకోరు. ఇవాళ మేం, రేపు ఎవరో. పదవులున్నా లేకున్నా మా గౌరవం మాకు ఉంటుంది. మేము ప్రతిదానికీ స్పందిచకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాం. అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్న రాజకీయ దాడులకు గట్టిగా నిలబడుతాం. మొండిగా ఎదురు వెళ్లగలం’ అని […]

ఇక మాజీ మంత్రి.. కొండా సురేఖ బర్తరఫ్ కు ఆమోదం

కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ఫైల్ పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంతకం చేశారు. తనను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుటే గవర్నర్ సంతకం చేయడం గమనార్హం. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తూ..అధికారిక ప్రక్రియ పూర్తయినట్లయింది. దీంతో ఇక ఆమె మాజీ మంత్రిగా మారిపోయారు. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ ససేమిరా అన్నారు. దీంతో మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ […]

బెదిరిస్తే భయపడను: సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లో ఎవరి బెదిరింపులకూ తాను భయపడే ప్రసక్తే లేదని, కేవలం స్నేహంతో మాత్రమే తనను గెలవగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంచల్‌గూడ-సంతోష్‌నగర్‌ మధ్య నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్నేహం కోసం తాను ఏదైనా చేయగలనని, కానీ హెచ్చరికలకు లేదా బెదిరింపులకు మాత్రం తలవంచే వ్యక్తిని కానని పునరుద్ఘాటించారు. ఎన్నికలు రావడం, పోవడం, గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు.

సీఎం విజయ్ డీప్ ఫేక్ వీడియో వైరల్

ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తారని, అందుకోసం నిర్దిష్టమైన వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నట్లుగా ఉన్న ఒక AI ఆధారిత డీప్‌ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. నిజమైన వీడియోలా కనిపించేలా సృష్టించిన ఈ వీడియో ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేసింది. ముమ్మర విచారణ చేపట్టిన అధికారులు, మోసపూరితంగా సృష్టించిన ఆ డీప్‌ఫేక్ వీడియోను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించారు.వాట్సాప్ సందేశాలను, వీడియోలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

123 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

2026 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారాలకు 123 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. శనివారం(సెప్టెంబర్ 5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిసింది. మొత్తం 52 మంది ఉపాధ్యాయులకు, 11 మంది జూనియర్ లెక్చరర్లకు, ముగ్గురు పాలిటెక్నిక్ అధ్యాపకులకు అవార్డులను ప్రకటించారు

ఉద్యమాల ఖిల్లా నుంచే.. గులాబీ గర్జన

సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు నీటి విడుదల షెడ్యూల్‌ను ఈ నెల 14లోపు ప్రకటించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువులోగా షెడ్యూల్ ప్రకటించకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతానని గురువారం మిర్యాలగూడలో బిఆర్‌ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.

ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రూ.624.88 లక్షల విలువైన 78 వరద నష్ట పునరుద్ధరణ పనులకు, 2026–27 మార్కెటింగ్ సీజన్‌లో తోతాపురి మామిడికి మద్దతు ధర అమలు చేసేందుకు, కిలోకు రూ.10 చొప్పున పొగాకు రైతులకు నేరుగా నగదు బదిలీ ద్వారా అందించేందుకు ప్రతిపాదనకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. వెలిగొండ ప్రాజెక్టులోని పనులకు రూ.11.63 కోట్ల వ్యయం చేయడానికి అనుమతి మంజూరు చేసింది. “అమరావతి సంఘమం” నిర్మాణానికి రూ.759.793 కోట్ల అంచనా వ్యయానికి క్యాబినేట్ ఆమోదం […]

ఘోర పడవ ప్రమాదం.. 83 మంది కార్మికులు మృతి?

స్పెయిన్ సమీపంలోని అట్లాంటిక్ మాహా సముద్రంలో ఉన్న కేనరీ ఐలాండ్స్ వద్ద ఘోర పడవ ప్రమాదం జరిగింది. వెస్ట్ ఆఫ్రికా నుంచి వస్తున్న వలస కార్మికుల పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 83 మంది కార్మికులు మృతి చెందినట్లు మైగ్రాంట్ రైట్స్ వ్యవస్థాపకుడు హెలీనా మలేనో తెలిపారు. మా ఫుడ్, వాటర్ సరఫరా పూర్తిగా అయిపోయింది. దాంతో మాకు బలవంతంగా సముద్రం నీళ్లు తాగిపించారు. ఈ జర్నీలో మార్గ మధ్యలో చనిపోయిన వారిని సముద్రంలోకి […]

సీఎంను శ‌పించిన‌ కొండా సుస్మిత..!

తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె శాపనార్థాలు పెట్టారు. తల్లి బర్తరఫ్‌పై స్పందించిన సుస్మిత “నా తల్లికి అన్యాయం జరిగింది. ఆమెపట్ల అనుసరించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు. నేను రేవంత్ […]

అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు.. నారా లోకేశ్ కీలక ప్రకటన

స్థానిక ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించి, తద్వారా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయేలా చేసి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయాలని వైఎస్సార్‌సీపీ కుట్రలు పన్నుతోందని లోకేశ్ మండిపడ్డారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. కోర్టుల్లో ఉన్న పెండింగ్ అంశాలను చట్టబద్ధంగా పరిష్కరిస్తున్నామని, ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు క్రమపద్ధతిలో నిర్వహిస్తామని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON