loader

సోమవారం స్కూల్స్, కాలేజీలకు సెలవు

సోమవారం అన్నీ స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించింది. పైగా సెలవు ప్రకటించింది ఎందుకో తెలుసా.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఉందని. షాక్ అవుతున్నారా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున ముగియనున్న ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆదేశాలు జారీ చేశారు.

ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా తన దాడులను తక్షణమే ఆపకపోతే కోలుకోలేని విధంగా బుద్ధి చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన శాంతి ఒప్పందానికి ఎలాంటి విలువ లేదని, అది నిష్ప్రయోజనమని కొట్టిపారేశారు. ఆ దేశంతో ఉన్న ఒప్పంద హామీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్, ఇరు దేశాల మధ్య శనివారం కూడా పరస్పర దాడులు కొనసాగాయి. ఈసారి వ్యూహాత్మక రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధితో పాటు మంచినీటి వనరులను […]

టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..హిస్టారికల్ విక్టరీ

తెలుగు తేజం పీవీ సింధు అద్భుత విజ‌యం సాధించింది. ప్ర‌తిష్టాత్మ‌క జ‌పాన్ ఓపెన్ ను కైవ‌సం చేసుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అకానే య‌మ‌గూచిని 21-17, 21-17 తేడాతో వ‌రుస గేమ్ ల్లో చిత్తు చేసింది. బ్యాడ్మింటన్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన వెరీ ఫస్ట్ ఇండియన్ గా సింధు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సింధు లాస్ట్ టైమ్ 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలవగా, ఆ తర్వాత […]

సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన

ముంబై ఛారిటీ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్‌ను చూసిన ఫ్యాన్స్ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయనకు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తారు. ఒకప్పుడు ఫిట్‌గా కనిపించే సల్మాన్, ఈసారి ముసలితనంగా ఎందుకు కనిపిస్తున్నారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయనకు గతంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కూడా ఫ్యాన్స్ భయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆయన లుక్‌ను చూసి ఆందోళన […]

అప్పటి వరకు నేతలు గాంధీభవన్‌కు రావొద్దు: రేవంత్‌

పదవుల కోసం గాంధీభవన్ కు వచ్చే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సర్ పై  నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్ కు రావొద్దన్నారు. కొందరు నేతలు హైదరాబాద్ లో కూర్చొని పనిచేయట్లేదని అసహనం వ్యక్తం చేశారు. సర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే […]

అర్ధరాత్రి వేళ నగ్నంగా వీధుల్లో యువతి పరుగులు…చెరువులో దూకి ఆత్మహత్య!

శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని.. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఫీర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తు దారి మధ్యలో బీరప్పగుడి వద్ద ఆగి మొక్కి.. అక్కడి నుంచి చీర, విగ్రహం తీసుకెళ్లడం గమనార్హం.<span;>తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల క్రితం జాబ్ మానేసి తల్లితో కలసి ఉంటుంది.

కశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ముంచెత్తుతున్న వరదలు!

జమ్మూ కశ్మీర్ క్లౌడ్ బరస్ట్ తో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజౌరీ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దర్హాల్ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఉధృతికి న్యూ బస్ స్టాండ్ బెల్లా ప్రాంతం పూర్తిగా జలమయమైంది. ఈ వరదల్లో ఓ మహిళ గల్లంతైనట్లు స్థానికులు చెప్తున్నారు. వరద నీరు ఒక్కసారిగా బస్ స్టాండ్ పార్కింగ్ ప్రాంతంలోకి దూసుకురావడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు […]

ఫిఫా ఫైనల్.. ‘గోల్డెన్ ఛాన్స్ కొట్టేదెవరో!

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఆదివారమే. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30కి మొదలయ్యే పోరులో అర్జెంటీనా, స్పెయిన్ అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలే కావడం.. మేటి జట్లను వెనక్కి నెట్టి ఫైనలు రావడంతో టైటిల్ పోరు హోరాహోరీగా, రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల కిందట మెస్సి చేతిలో ప్రపంచకప్ చూసి ఉప్పొంగిపోయిన అర్జెంటీనా అభిమానులు.. దిగ్గజ ఆటగాడికి మరో కప్పుతో వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నారు.

విశాఖలో లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

విశాఖపట్నంలోని ఆనందపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం-ఆనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు.ఒకరు తీవ్రంగా గాయపడడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేట ఎంఎల్ఎ పిఎ చంద్రశేఖర్ గా గుర్తించారు.పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి శ్రికాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON