జమ్మూ కశ్మీర్ క్లౌడ్ బరస్ట్ తో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజౌరీ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దర్హాల్ నది ఉగ్రరూపం దాల్చింది. నది ఉధృతికి న్యూ బస్ స్టాండ్
బెల్లా ప్రాంతం పూర్తిగా జలమయమైంది. ఈ వరదల్లో ఓ మహిళ గల్లంతైనట్లు స్థానికులు చెప్తున్నారు. వరద నీరు ఒక్కసారిగా బస్ స్టాండ్ పార్కింగ్ ప్రాంతంలోకి దూసుకురావడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి, జనజీవనం
పూర్తిగా స్తంభించిపోయింది.