ఒక్క వివాహం చేసుకున్నవాళ్లు మాత్రమే రాష్ట్రంలో ఉంటారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో నివసించాలి అనుకునేవారు కేవలం ఒక్క పెళ్లి మాత్రమే చేసుకుని ఉండాలని అన్నారు. ఈ మేరకు త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే ఈ కోడ్ ఉద్దేశమని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.