loader

నేపాల్ వరదలు: క్షేమంగా బయటపడ్డ నెలన్నర చిన్నారి!

నేపాల్ లోని రసువా ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల ధాటికి చిక్కుకుపోయిన ఒక నెలన్నర పసికందును రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ చిన్నారిని కాపాడి, ప్రస్తుతం సహాయ చర్యలు అందిస్తున్న రసువా ధంగే క్యాంప్కు చేర్చారు. వరద ముంపు ఉన్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందించి పసిపాపను కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో వరదలు..20 మంది మృతి!

అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతాన్ని భారీ ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 19మంది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పార్కులోని లాడ్జీలు, హోటళ్లలో పర్యాటకులు రాత్రి బస చేయడానికి అనుమతి లేకుండా చేశారు. ఏడాది పొడవునా అక్కడే నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

ఆర్మేనియా ప్రధానితో పిఎం మోడీ భేటీ…

పిఎం మోడీ సోమవారం ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తోనూ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ‘బిష్కెక్‌లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది” అని మోడీ తెలిపారు. భారత్-ఆర్మేనియా సహకారం రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో మరింత విస్తరించనుందని మోడీ చెప్పారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కూడా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

ఎసీసీవో సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైన అనంతరం వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. “ఇరువురు నేతలు పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను సమీక్షించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారత వైఖరిని ప్రధాని చాటిచెప్పారు. శాంతిస్థాపనకు, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు” అని భారత విదేశాంగశాఖ తెలిపింది.

నేపాలీ వ‌ర‌ద‌ల్లో చిక్కిన బ్యాంకు.. కోటిన్న‌ర న‌గ‌దు, 50 కోట్ల బంగారం

నేపాల్‌లోని త్రిశూలీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న ఓ గ్రామీణ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో న‌గ‌లు, ఆభ‌ర‌ణాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర‌ద‌తో నిండిన వ‌ర‌ద పోటెత్తిన ఘ‌ట‌న‌లో.. త్రిశూలీ దుంగేలో ఉన్న‌ అగ్రిక‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ బ్యాంక్ బ్రాంచ్ ధ్వంస‌మైంది. బ్యాంకు నుంచి లాక‌ర్ల‌ను తీసేందుకు సుమారు 8 గంట‌ల ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. వివిధ లాక‌ర్ల‌లో ఉన్న సుమారు 1.5 కోట్ల న‌గ‌దు, సుమారు 50 కోట్ల విలువైన బంగార ఆభ‌ర‌ణాల‌ను బ్యాంకు ఆఫీస‌ర్లు స్వాధీనం […]

మా దేశానికి అండగా నిలవండి అంటూ మనీషా ఆవేదన

ఇటీవల సంభవించిన భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని సీనియర్ నటి మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదనతో అభ్యర్థించారు.ప్రకృతి విపత్తు నుంచి తేరుకోవడానికి నేపాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు అవసరమని మనీషా స్పష్టం చేశారు. ముఖ్యంగా భౌగోళికంగా, ఆర్థికంగా సహకారం అందించగల పొరుగు దేశాలైన భారత్ మరియు చైనాలు తమ దేశానికి కొండంత అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

267 మందితో వెళ్తున్న ఫెర్రీ బోల్తా..

సైప్రస్ తీరంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ (బోటు) బోల్తా పడింది. ఈ ఫెర్రీలో 267 మంది ఉండగా.. 100 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సైప్రస్‌లోని కిరెనియా (గిర్నె) పోర్టు నుంచి ఒక ఫెర్రీ టర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఉన్న టసుకు పోర్టుకు బయల్దేరింది. ఈ ఫెర్రీ బయల్దేరిన కొద్దిసేపటికే, తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే బోల్తాపడింది. దీంతో అందులోని ప్రయాణికులు నీళ్లలో కొట్టుకుపోయారు. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు […]

స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

స్విట్జర్లాండ్ లో దారుణం జరిగింది. ఆరావు ప్రాంతంలోని ఒక రేస్ కోర్సులో అరావు రేవ్ వాల్యూమ్ 7 పేరుతో ఒక స్విట్జర్లాండ్‌ ఈవెంట్ కంపెనీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఒక గుర్తు తెలియన వ్యక్తి వేకువఝామున ఈవెంట్‌లో పాల్గొన్న వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఘటన జరిగిన ప్రదేశం స్విట్జర్లాండ్ రాజధాని జ్యురిచ్‌కు 46 […]

నేపాల్‌ వరదలు.. 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడి

నేపాల్ వరదల్లో 97 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించారు. నువాకోట్ జిల్లా టుపే ప్రాంతంలోని ఓ సంరక్షణ గృహంలో గుణ మాయా బొహారా అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆమె ఉంటున్న భవనం కొట్టుకుపోయింది. మట్టి దిబ్బగా మారిన ఆ నివాసంలో అనేక మంది చనిపోగా.. మాయ మాత్రం బురదలో కూరుకుపోయి సజీవంగా కనిపించారు. నాలుగు గంటలపాటు శ్రమించిన రెస్క్యూ బృందాలు.. ఆమెను సురక్షితంగా కాపాడాయి.

విదేశాల రెస్క్యూ స‌హాయాన్ని తిర‌స్క‌రించిన నేపాల్‌

జ‌ల ప్ర‌ళ‌యంతో అత‌లాకుత‌ల‌మైన నేపాల్‌కు ప్ర‌పంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి. అయితే త‌మ‌కు ఎటువంటి స‌హాయం అవ‌స‌రం లేద‌ని నేపాల్ పేర్కొన్న‌ది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిర‌స్క‌రించింది.త‌మ స్వంత భ‌ద్ర‌తా బ‌ల‌గాలు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టే సామ‌ర్థ్యం ఉన్న‌ట్లు నేపాల్ వెల్ల‌డించింది.అయితే విదేశీ స‌హాయ బృందాల‌కు బ‌దులుగా .. ఆర్థిక‌సాయాన్ని నేపాల్ కోరుతోంది.పున‌ర్నిర్మాణ ద‌శ‌లోఅంత‌ర్జాతీయ స‌హాయాన్ని కోర‌నున్న‌ట్లు నేపాల్ చెప్పింది. నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృతుల సంఖ్య 469కి చేరుకున్న‌ది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON