loader

అమెరికాలో ‘ఆపరేషన్ చెక్‌మేట్’.. 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ట్రక్కులు నడుపుతున్న విదేశీయులను లక్ష్యంగా చేసుకుని యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు నిర్వహించిన ‘ఆపరేషన్ చెక్‌మేట్’సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రత్యేక ఫెడరల్ ఆపరేషన్‌లో భాగంగా అరెస్టయిన వారిలో అత్యధికంగా 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు ఉండటం గమనార్హం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మొత్తం 52 మందిని అధికారులు ఈ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని క్షుణ్ణంగా విచారించగా, అందులో 36 మంది భారీ సెమీ-ట్రక్కులనునడుపుతున్న కమర్షియల్ డ్రైవర్లుగా […]

అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులే కారణం

అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇరాన్‌కు చెందిన తన్సిమ్ అనే మీడియా సంస్థ కొన్ని విషయాల్ని వెల్లడించింది. లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపనంతవరకు, వారి సూచనల్ని పరిగనణలోకి తీసుకోనంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.

ఇరాన్ -అమెరికా భీకర దాడులు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తిరిగి రగులుకుంది. సోమవారం అమెరికా సేనలు పలు ఇరాన్ సైనిక స్థావరాలను ఎంచుకుని బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన రాడార్, డ్రోన్ల స్థావరాలపై విరుచుకు పడ్డారు. శాంతి ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్న సమయంలోనే సోమవారం ఇరాన్ ఆదివారం అమెరికాకు చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా అమెరికా దాడులకు దిగింది. సోమవారం ఇరాన్ డ్రోన్లు కువైట్‌లో కొన్ని స్థావరాలను ఎంచుకుని దాడికి దిగాయి.

హ‌నిమూన్‌కు వెళ్తుండ‌గా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం… శిథిలాల కింద వ‌ధువు

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో డాస‌న్ విల్లేలో ద‌వే ఫిజి జంట పెళ్లి అనంతరం అట్లాంటాలో ఉన్న హోట‌ల్‌కు వెళుతుండగా వరుడు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు, వ‌ధువు సుమారు 5 గంట‌ల పాటు శిథిలాల కింద ఉన్న ఆమెను చివ‌ర‌కు ర‌క్షించారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన రాబిన్‌స‌న్ ఆర్66 హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో పైలెట్‌గా చేస్తున్న మ‌రో వ్య‌క్తి కూడా చ‌నిపోయాడు. రెస్క్యూ బృందాలు చేరుకునే వ‌ర‌కు 5 గంట‌ల పాటు శిథిలాల కిందే […]

భవనంలో భారీ పేలుడు.. 45 మంది మృతి.. 70 మందికి గాయాలు

ఈశాన్య మయన్మార్ లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ పేలుడు తీవ్రత వల్ల దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గనులు, క్వారీ తవ్వకాల కోసం ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ […]

కబళిస్తోన్న ఎబోలా: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మకాం.. !!

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని పొరుగున ఉన్న ఉగాండాలో ఎబోలా వైరస్ ప్రబలింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయెసస్ ప్రస్తుతం కాంగోలో పర్యటిస్తోన్నారు. ప్రత్యేకించి ఎబోలా వ్యాప్తికి కేంద్రబిందువు అయిన తూర్పు కాంగో ఇటూరి ప్రావిన్స్ లోని బునియాకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు.

వర్జీనియాలో బస్సు బీభత్సం: ఐదుగురు మృ తి… 34 మందికి గాయాలు

అమెరికాలోని వర్జీనియాలో బస్సు బీభత్సం సృష్టించింది. స్టాఫ్ ఫోర్డ్ కౌంటీలోని 95 ఇంటర్ స్టేట్ లో వాహనాలపైకి బస్సుదూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 34 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్ రహదారి నిర్మాణ పనులవల్ల ఆ మార్గంలో దక్షిణం వైపు వెళ్లే వాహనాలు తమ వేగాన్ని తగ్గించాయి. అయితే, వెనుక నుంచి వస్తున్న బస్సు ట్రాఫిక్‌ను గమనించి వేగాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. అతివేగంతో దూసుకొచ్చిన బస్సు వాహనాలను వరుసగా ఢీకొట్టుకుంటూ […]

ఇరాన్‌తో ఒప్పందం.. సంతకం చేయని ట్రంప్‌

ఇరాన్ తో ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్లో దాదాపు 2 గంటలపాటు చర్చించిన ట్రంప్.. ఈ డీల్ పై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, ఒప్పందం చివరి దశకు చేరుకుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇరాన్ కు నిధుల విడుదల, అణుకార్యక్రమానికి సంబంధించిన వివాదాలు మాత్రం సమసిపోలేదన్నారు.

కెనడాలో భారత విద్యార్థిని దారుణ హత్య..

కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌కు చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. ఈ నెల 15 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. విధి మేఘ కోసం వెతుకుతుండగా కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది.

సుదీర్ఘ అంతరాయం తర్వాత ఇంటర్నెట్‌ను పునరుద్ధరించిన ఇరాన్

పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఎదుర్కొన్న అత్యంత సుదీర్ఘమైన అంతరాయాలలో ఒకదాని తర్వాత, ఇరాన్ క్రమంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడం ప్రారంభించింది. ఇది ఒక ముఖ్యమైన పరిణామం. తీవ్రమైన షట్‌డౌన్ తర్వాత ఇంటర్నెట్ నెమ్మదిగా పునరుద్ధరణ ఈ దౌత్యపరమైన ఘర్షణల మధ్య, సమాచార, వాణిజ్యాన్ని స్తంభింపజేసిన నెలల తరబడి కొనసాగిన ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌ను ఇరాన్ సడలించడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాలలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ తిరిగి వస్తున్నట్లు కనిపించినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ మొబైల్ నెట్‌వర్క్‌ల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON