loader

గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

పశ్చిమాసియా లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ బద్ధశత్రువైన అమెరికా సైనిక కార్యకలాపాలకు, మిలిటరీ బేస్‌లకు ఏ రకమైన ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చినా.. సదరు దేశాలను ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణిస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది. అమెరికా సైన్యానికి సహకరించడాన్ని నేరుగా “ఇరాన్‌పై యుద్ధం ప్రకటన” గానే తాము భావిస్తామని పేర్కొంది. లాజిస్టిక్,ఇంటెలిజెన్స్ సహాయం చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.

ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ మొత్తం ఒకేసారి బదిలీ..

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం AO శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిదే హత్య చేశాడు. అయితే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.. జూన్ 15 న ఘటన జరగగా ఈనెల 6 న అనుమానం ఉన్నట్లు బార్య లావణ్య జిల్లా ఎస్పి అజిత్ వేజెండ్లకు పిర్యాదు చేయగా సీఐ శ్రీనివాస రావు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పి సీరియస్ అయ్యారు.. సీఐ తో పాటు SI సహా 23 మందిని ఒక్క […]

పడవ మునిగి తొమ్మిదిమంది మత్స్యకారులు మృతి.. ఆరుగురు గల్లంతు

పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన పడవ మునిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. మృతులను ఒడిశా, పశ్చిమబెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు… జులై 4 తర్వాత ఆ బోటులో ఉన్నవారితో సంబంధాలు తెగిపోయినట్లు సహచర మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మత్స్యకారులతో కలిసి గాలింపు చేపట్టిన పోలీసులు.. అతికష్టం మీద పడవను ఒడ్డుకు తీసుకొచ్చి పరిశీలించగా.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తొమ్మిది మృతదేహాలు […]

టెహ్రాన్ చేరుకున్న రష్యా అణు కమాండ్ విమానం..ఉలిక్కిపడ్డ ప్రపంచం!

ఇరాన్‌కు మద్దతుగా రష్యా నేరుగా రంగంలోకి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాకు చెందిన Tu-214PU అనేది టుపోలెవ్ విమాన శ్రేణిలో అత్యంత అధునాతన గగనతల కమాండ్ పోస్ట్ వెర్షన్. దీనిని రక్షణ రంగ నిపుణులు ‘డూమ్స్‌డే ప్లేన్’ (యుగాంతపు విమానం) అని కూడా పిలుస్తారు. తీవ్రమైన అణుయుద్ధం లేదా అంతర్జాతీయ అత్యవసర సంక్షోభ సమయాల్లో దేశ అత్యున్నత నాయకత్వం మరియు వ్యూహాత్మక వైమానిక దళం గాల్లో ప్రయాణిస్తూనే.. క్షిపణి ప్రయోగాలు, సైనిక బలగాల నియంత్రణను పర్యవేక్షించేలా […]

లార్డ్స్‌లో రికార్డ్.. ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం

లార్డ్స్ భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలి మహిళల టెస్టులో ఇంగ్లండ్ 270 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. నాలుగో రోజు విజయానికి నాలుగు వికెట్లు మాత్రమే అవసరమైన భారత్… ఇంగ్లండ్ ను 186 పరుగులకు ఆలౌట్ చేసింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. ఇంగ్లండ్ చేత భారత్ కు చివరి ఓటమి 1995లో ఎదురైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ […]

ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ

షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కొత్తూరు వద్ద రైల్వే పట్టాలపై స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్‌ దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు రాజ్‌కుమారు. మూడు రోజుల తర్వాత ఆరుగురిని హత్య చేసిన హంతకుడు రాజ్‌కుమార్ తన మేనమామ ఊరిలో చనిపోయి కనిపించాడు. కొత్తూరు మండలం పంజర్లలో డెడ్‌బాడీ, పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తేల్చారు.

అమ్మాయి కుటుంబం మోసం చేసింది – షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్

షాబాద్ ఆరుగురి హత్యల కేసులో నిందితుడు ఫోన్‌లో అత్యంత షాకింగ్ వీడియో ఒకటి లభ్యమైంది. ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మి సర్వస్వం కోల్పోయానని, తన దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, తనను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి, చివరికి కన్న పిల్లలకు చేతిలో పైసా, ఉండడానికి కాస్త భూమి కూడా లేకుండా రోడ్డున పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపాలని సదరు వ్యక్తులు కుట్రలు పన్నారని, భరించలేకే మారణహోమానికి, […]

భారీ పేలుడు.. భారత జవాన్ మృతి, నలుగురికి గాయాలు!

నాగాలాండ్‌లోని చుమౌకెడిమా పరిధిలో గల సుఖోయ్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ సమీపంలో శక్తివంతమైన అనుమానిత పేలుడు పదార్థం (IED) పేలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘోర పేలుడులో ఒక సైనికుడు వీరమరణం పొందగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు తమ వాహనాల్లో సుఖోయ్ ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా, రహదారి పక్కన అమర్చిన ఐఈడీ ఒక్కసారిగా పేలిపోయింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.ముంబయిలోని కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని సోమవారం సాయంత్రం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అర్హత సాధించారా లేదా అనే వివరాలతో కూడిన స్కోర్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రిజల్ట్స్ కోసం https://tgtet.aptonline.in

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON