loader

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఆ మెడిసిన్ వద్దు

చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫైనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కాంబినేషన్ ఔషధాల వినియోగంపై పరిమితి విధించింది. ఈ ఫార్ములేషన్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయం, పంపిణీపైనా ఆంక్షలు విధించింది. ఈ కాంబినేషన్ మెడిసిన్ ను నాలుగేళ్లలోపు చిన్నారులకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB), నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు..

రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీలో ఏకంగా 1777కు పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

క్యాన్సర్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్.. ట్రయల్స్‌లో అదిరిన ఫలితాలు!

క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మోడెర్నా, మెర్క్ సంస్థలు కలిసి తయారు చేస్తున్న వ్యక్తిగతీకరించిన ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్‌పై నిర్వహించిన కీలక దశ క్లినికల్ ట్రయల్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌ తగ్గించడంలో ఈ చికిత్స ఉపయోగపడే అవకాశాలు కనిపించాయి. ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి రోగి క్యాన్సర్‌కు అనుగుణంగా, రోగి నుంచి తొలగించిన ట్యూమర్‌ను పరిశీలించి, అందులోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటిని […]

నర్సింగ్ కళాశాలలో ‘రాసలీలలు’

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ఫ్లాట్స్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో అడ్మిన్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, ఆ కళాశాల మహిళ ప్రిన్సిపాల్‌తో కొంత కాలంగా కళాశాలోని అనైతిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ప్రవర్తన రోజు రోజుకు శృతిమించడంతో కార్యాలయంలో సిసి కెమెరాను ఏర్పాటు చేయడంతో వీరి భాగోతం బట్టబయలైంది. అయితే ఈ విషయం బయటికి పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇలాంటి కార్యకలాపాలు కళాశాలలో నిర్వహిస్తే పిల్లలకు ఏం […]

తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తికి డ్యూటీ .. డాక్టర్ సస్పెండ్!

సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ రమేష్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, తన స్థానంలో రవి అనే ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టి డ్యూటీ చేయిస్తున్న మాట వాస్తవమేనని తేలడంతో ప్రభుత్వం ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుడి స్థానంలో ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడనే వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని మంత్రి […]

22 మంది ప్రాణాలు తీసిన చండీపుర వైరస్..హెల్త్ డిపార్ట్‌మెంట్ అలర్ట్,

గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ వైరస్ సోకడం వల్ల చనిపోతున్న చిన్నారుల సంఖ్య అక్కడి ప్రజలతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల్ని భయపెడుతోంది. చండీపుర వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది పిల్లలు మరణించినట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు. నమోదైన 184 అనుమానిత కేసులలో 35 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఈ వైరస్ పిల్లల మెదడుపై దాడి చేస్తుందని వైద్యశాఖ నిర్ధారించింది. దీనివల్ల ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన సమయంలో […]

ఎపిలో కరోనా కేసుల విజృంభణ.. 49కి చేరిన కోరోనా కేసులు

ఎపిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదయింది. శనివారం ఒక్కరోజే ఎపిలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగుచూడగా, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ […]

ఏపీలో కరోనా కలకలం.. 4 మృతి, పలువురికి పాజిటివ్

దేశంలో కొన్నాళ్లపాటు ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అక్కడక్కడా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. కానీ ఏపీలో మాత్రం వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 20 రోజుల్లో రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కడపలో 8 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.

ఏపీలో కోవిడ్ మరణాలు: రాష్ట్రాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియంట్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఏపీలోని కడప జిల్లాలో ఇద్దరు కోవిడ్-19తో మృతిచెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2022 తర్వాత ఏపీలో కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. మరో 8 మందికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. వారిని పర్యవేక్షిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.అయితే ఈ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌కు వైరస్ రకం కారణమా అనే విషయంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఫుడ్, ప్లేస్ క్లీన్‌‌గా లేకుంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు.. FSSAI యాప్

 రెస్టారెంట్లు, హోటల్స్‌పై కొరడా ఝుళిపించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది.  దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అపరిశుభ్రమైన వంటశాలలు, సురక్షితం కాని ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించని ఆహార తయారీ కేంద్రాలు లేదా విక్రయ కేంద్రాలు కనిపిస్తే, వెంటనే తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పౌరులకు పిలుపునిచ్చింది. ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ యాప్ ద్వారా అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరుతోంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON