loader

తక్కువ ధరకే డయాబెటిస్ చికిత్స!

భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.ఇప్పటివరకు సెమాగ్లుటైడ్ ఔషధంపై విదేశీ కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉండటంతో, దీని ధర సామాన్య రోగులకు భారంగా ఉండేది. విదేశీ బ్రాండ్ల కంటే గణనీయమైన తక్కువ ధరకే ఇది లభించనుంది. ప్రతిరోజూ మందులు వాడే ఇబ్బంది లేకుండా, దీనిని వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేలా […]

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో 25 మంది వసతిగృహ విద్యార్థులు, సిబ్బందికి అస్వస్థత,3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులు 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో కొనసాగుతున్న చికిత్సడయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారుల నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతిగృహం, కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరణ

చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తిరుమల లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్యూలైన్‌లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చెప్పారు. ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని వివరించారు.

HPV Vaccine :తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్‌పీవీ వ్యాక్సినేన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. టీకా వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని అన్నారు. ఖాళీ కడుపుతో రావద్దని సూచించారు. టీకా వేసుకున్న ఒక అరగంట పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుందని, జ్వరం కూడా రావచ్చని చెప్పారు. అలర్జీలు ఉన్నా, అనారోగ్యంతో […]

ఖరీదైన IVF గాంధీ ఆస్పత్రిలో ఉచితం.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

పేదలకు వరంగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా ప్రారంభించారు. గాంధీ వైద్యులు అద్భుతం సృష్టించారు. ఐవీఎఫ్ చికిత్సను అందించి.. ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా.. గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఉచితంగా చికిత్స అందించి మహిళ గర్భం దాల్చేలా చేశారు. తాజాగా గాందీ డాక్టర్ల బృందం విజయవంతంగా […]

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా.. సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారినపడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురయ్యారని ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు వెల్లడించారు. వారిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు. మరో 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఎంకు వివరించారు.

క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించాలి: చిరంజీవి

శరీరం చెప్పే మాట అందరూ వినడంతో పాటు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్య ఉండకూడదని నటుడు చిరంజీవి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు ప్రసంగించారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించడంతో క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించగలుగుతామని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు తెలిపారు.

క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు అందరూ ముందుకు రావాలి : మంత్రి సత్యకుమార్

ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న కేసులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాథమిక పరీక్షలు, గుర్తించిన అంశాలు, తీసుకోబోతున్న చర్యలను మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్యసేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.  ప్రాథమిక పరిశీలన ద్వారా క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే అరికట్టవచ్చునని పేర్కొన్నారు.  2024-25 ఆర్ధిక సంవత్సరంలో 675.66 కోట్లను క్యాన్సర్ పీడితులకు వైద్యాన్ని […]

పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ కలకలం.. ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ (Nipah Virus) కేసుల కలకలంతో.. కొత్త కేసుల నిర్ధారణతో పాటు క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ వైరస్ వ్యాప్తితో పశ్చిమ బెంగాల్​ నుంచి విమానాలు వచ్చే విమానాశ్రయాల్లో అధికారులు స్క్రీనింగ్స్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి పశ్చిమ బెంగాల్​లో నిఫా వైరస్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. దీనిలో భాగంగానే ఎయిర్​పోర్ట్స్​లో స్క్రీనింగ్ చేస్తున్నారు.నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఒక జూనోటిక్ అనారోగ్యం.

పశ్చిమబెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు

పశ్చిమ బెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న ( జనవరి 11) కనుగొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతకం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ’(హెల్త్ ), లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ పరిస్థితిని సమీక్షించారు. వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON