loader

ఫుడ్, ప్లేస్ క్లీన్‌‌గా లేకుంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు.. FSSAI యాప్

 రెస్టారెంట్లు, హోటల్స్‌పై కొరడా ఝుళిపించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సిద్ధమైంది.  దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అపరిశుభ్రమైన వంటశాలలు, సురక్షితం కాని ఆహార పదార్థాలు, పరిశుభ్రత నిబంధనలు పాటించని ఆహార తయారీ కేంద్రాలు లేదా విక్రయ కేంద్రాలు కనిపిస్తే, వెంటనే తమ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పౌరులకు పిలుపునిచ్చింది. ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ యాప్ ద్వారా అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరుతోంది

డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం

NPPA విడుదల చేసిన జాబితాలో High BP చికిత్సలో ఉపయోగించే Amlodipine+ Bisoprolol+ Telmisartan టాబ్లెట్ రిటైల్ ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.14.74 గా నిర్ణయించారు. కంటి సర్జరీల ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే Nepafenac+ Moxifloxacin Ophthalmic Solution మెడిసిన్ ధరను రూ.68.64 గా, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇచ్చే Clopidogrel+ Aspirin+ Atorvastatin ధరను ఒక్కో క్యాప్సూల్‌కు రూ6.37 గా, గుండెపోటు చికిత్సలో వినియోగించే ఈ ఇంజెక్షన్ రిటైల్ ధరను ఒక్కో వయల్ (Vial) కు రూ.60,238.27 గా నిర్ణయించారు.

రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో అమానుషం..

రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.మానసికంగా సమస్యతో ఉన్న వ్యక్తి నేలపై పడిపోయి ఉండగా, ఓ  మహిళా వార్డ్ ఇన్‌చార్జ్ అతడిని కాలితో ముఖంపై తన్నుతూ దుర్భాషలాడింది. ఒక మనిషిని ఇంతగా ముఖంపై, వీపుపై చెప్పుతో తన్నడం ఎంత దారుణం అంటూ కామెంట్లు వస్తున్నాయి. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నప్పటికీ ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం తీవ్ర విమర్శలకు  దారితీస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డయాబెటిస్‌ను జయించి, 20 కేజీల బరువు తగ్గిన అమిత్‌షా!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, దానిని అధిగమించాలనే లక్ష్యంతో తన జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.శరీరానికి కావాల్సిన సరైన నిద్ర, నీళ్లు, డైట్, రొటీన్ ఎక్సర్‌సైజ్ నాకు ఎంతో సహాయం చేశాయి. ఈ రోజు ఎలాంటి అల్లోపతి, మెడిసిన్, ఇన్సులిన్ వాడకుండా ఉన్నాను. దేశ అభివృద్ధి కోసం యువత రోజుకు కనీసం 2 గంటలు వ్యాయామం, మెదడు ఆరోగ్యం కోసం ఆరు గంటలు నిద్ర […]

బసవతారకం ఆసుపత్రి పేదవర్గాలకు నిజమైన గుండె ధైర్యం: సీఎం

బసవతారకం ఆసుపత్రిని ఎంతోమంది క్యాన్సర్ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. బసవతారకం ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. “క్యాన్సర్తో భార్య చనిపోయాక ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. అలాంటి రోగులకు అండగా  ఉండాలని కోరుకున్నారు. బసవతారకం ఆసుపత్రిని అప్పటి ప్రధాని వాజ్ పేయీ ప్రారంభించారు. కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా  ముందుకొచ్చి ఇలాంటి ఆసుపత్రులు పెట్టాలి”అని […]

క్యాన్సర్ రోగుల చిరునవ్వే మా నిజమైన విజయం.. బాలకృష్ణ భావోద్వేగం

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద ప్రారంభమైన ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఆస్పత్రి చైర్మన్, నందమూరి బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థను నేడు దేశంలోనే నెంబర్ వన్ క్యాన్సర్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడం గర్వకారణంగా ఉందన్నారు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే తమకు నిజమైన పురస్కారమని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.

దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై తక్షణ నిషేధం..

రెండు లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్ (ఔషధాల మిశ్రమం) ఒకే మోతాదులో (సింగిల్ టాబ్లెట్ లేదా సిరప్ రూపంలో) కలిపి తయారు చేసే వాటిని ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్’ (FDC) మందులు అంటారు. ఈ తరహా ఔషధాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’ కమిటీ మార్కెట్లో ఉన్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి.. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు, వైద్యపరమైన సమర్థన లేని, హానికరమైన 16 కాంబినేషన్లను గుర్తించి బ్లాక్ లిస్టులో […]

ఎబోలా వైరస్ వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఎబోలా వైరస్‌కు టీకా అందుబాటులో లేదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని తూర్పు ఇటూరి ప్రావిన్స్‌లో ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది.కాంగోలో ఇప్పటి వరకు 246 ఎబోలా అనుమానిత కేసులు […]

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు

కోవిడ్ కంటే డేంజర్ వైరస్ .. ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO

హంతా వైరస్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ అలర్ట్ ప్రకటించింది. హంతా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, దీని నియంత్రణకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.  కోవిడ్‌తో పోలిస్తే దీని మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON