loader

ఎబోలా వైరస్ వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఎబోలా వైరస్‌కు టీకా అందుబాటులో లేదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని తూర్పు ఇటూరి ప్రావిన్స్‌లో ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది.కాంగోలో ఇప్పటి వరకు 246 ఎబోలా అనుమానిత కేసులు […]

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర రాజనర్సింహ

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఆసుపత్రిలో విజయవంతంగా వైద్య సేవల ట్రయల్ రన్ జరుగుతోందని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్ వెయ్యి పడకల ఆసుపత్రి అని, ఇందులో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఉంటాయని తెలిపారు

కోవిడ్ కంటే డేంజర్ వైరస్ .. ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO

హంతా వైరస్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ అలర్ట్ ప్రకటించింది. హంతా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, దీని నియంత్రణకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.  కోవిడ్‌తో పోలిస్తే దీని మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అశ్వగంధ ఆకులు వాడుతున్నారా? ఆయుర్వేద మూలికపై కొత్త రూల్

అశ్వగంధ వేర్లు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుకలో ఉన్నాయి. FSSAI తాజా అడ్వైజరీ ప్రకారం ఆహార ఉత్పత్తులలో కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన సారాన్ని మాత్రమే వాడాలి. కానీ ఆకులు, కాడలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుల్లో ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కాలేయంపై విషప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అశ్వగంధ ఆకుల వాడకంపై నిషేధం […]

తక్కువ ధరకే డయాబెటిస్ చికిత్స!

భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.ఇప్పటివరకు సెమాగ్లుటైడ్ ఔషధంపై విదేశీ కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉండటంతో, దీని ధర సామాన్య రోగులకు భారంగా ఉండేది. విదేశీ బ్రాండ్ల కంటే గణనీయమైన తక్కువ ధరకే ఇది లభించనుంది. ప్రతిరోజూ మందులు వాడే ఇబ్బంది లేకుండా, దీనిని వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేలా […]

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో 25 మంది వసతిగృహ విద్యార్థులు, సిబ్బందికి అస్వస్థత,3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులు 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో కొనసాగుతున్న చికిత్సడయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారుల నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతిగృహం, కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరణ

చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తిరుమల లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్యూలైన్‌లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చెప్పారు. ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని వివరించారు.

HPV Vaccine :తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను బాల్య దశలోనే అడ్డుకోవడానికి హెచ్‌పీవీ వ్యాక్సినేన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. టీకా వేయించుకునే పిల్లలు కచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని అన్నారు. ఖాళీ కడుపుతో రావద్దని సూచించారు. టీకా వేసుకున్న ఒక అరగంట పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుందని, జ్వరం కూడా రావచ్చని చెప్పారు. అలర్జీలు ఉన్నా, అనారోగ్యంతో […]

ఖరీదైన IVF గాంధీ ఆస్పత్రిలో ఉచితం.. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

పేదలకు వరంగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా ప్రారంభించారు. గాంధీ వైద్యులు అద్భుతం సృష్టించారు. ఐవీఎఫ్ చికిత్సను అందించి.. ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చేలా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా.. గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఉచితంగా చికిత్స అందించి మహిళ గర్భం దాల్చేలా చేశారు. తాజాగా గాందీ డాక్టర్ల బృందం విజయవంతంగా […]

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా.. సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారినపడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురయ్యారని ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు వెల్లడించారు. వారిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు. మరో 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఎంకు వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON