ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఎబోలా వైరస్కు టీకా అందుబాటులో లేదని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలోని తూర్పు ఇటూరి ప్రావిన్స్లో ఇటీవల ఎబోలా వైరస్ వ్యాప్తి చెందింది.కాంగోలో ఇప్పటి వరకు 246 ఎబోలా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. 80 మరణాలు నమోదయ్యాయి.

