loader

ప్రియురాలితో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో…

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ముంబయ్‌లో జరిగిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ స్క్రీనింగ్ సందర్భంగా అమీర్ ఖాన్ స్వయంగా జూలై 5న తన నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆయన అధికారికంగా ధృవీకరించాడు. ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో చాలా సాదాసీదాగా జరగనుందని పేర్కొన్నాడు. తమను అందరూ ఆశీర్వదించాలని ఆయన ఈ […]

రికార్డ్ బ్రేక్ చేసిన తిరుమల శ్రీవారి లడ్డూ

తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదమైన ‘శ్రీవారి లడ్డూ’ విక్రయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, గడచిన వేసవి సీజన్‌లో లడ్డూల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు అమ్ముడవ్వగా, మే నెల నాటికి ఆ సంఖ్య 1,21,35,528కి చేరింది. ఇక జూన్ నెలలో ఏకంగా 1,26,81,805 లడ్డూలు విక్రయమై సరికొత్త రికార్డు సృష్టించింది.

ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు నాయుడు

కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ‘రాయలసీమకు పూర్వోదయ ప్రాజెక్టును తెస్తాం. యువత ఉద్యోగాలు చేయడమే కాదు.. ఉద్యోగాలిచ్చే స్థితికి చేరాలి. నైపుణ్యాలు పెంచుకుని.. వినూత్నంగా ఆలోచిస్తే యువత అభివృద్ధి సాధ్యమవుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు […]

గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ను కలిసిన పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్‌ను కలిసి పలు కీలక విషయాలపై ముచ్చటించారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా, సానుకూల వాతావరణంలో సాగిందని పవన్ కల్యాణ్ తన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొంటూ.. గవర్నర్ అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వానికి, ఆయన చూపిన […]

వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

కపిల్ దేవ్ మాట్లాడుతూ.. వైభవ్ ఎంతో ప్రతిభావంతుడని ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే అతని గురించి ఇప్పుడే చాలా పెద్దగా మాట్లాడకుండా, కొంత సమయం ఇవ్వడం మంచిదని చెప్పారు. అతను ఇంకా చిన్న వయసులో ఉన్నందున అన్ని విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. వైభవ్ లో కనిపిస్తున్న సహజ ప్రతిభను కపిల్ దేవ్ ప్రశంసించారు. ప్రతిభ పరంగా చూస్తే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల స్థాయిలో కనిపిస్తున్నాడని, టీ20ల్లో చూపిన ప్రతిభను మిగతా ఫార్మాట్లలో […]

ఫ్రాన్స్‌లో ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం!

సినిమాను కనిపెట్టిన లూమియర్‌ బ్రదర్స్‌ జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లియాన్‌ నగరంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘లూమియర్‌ మ్యూజియం’లో జక్కన్న పేరు ఇకపై చిరస్థాయిగా నిలిచిపోనుంది! మార్టిన్‌ స్కోర్సెసీ, క్లింట్‌ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్‌ టరంటినో లాంటి వరల్డ్‌ క్లాస్ లెజెండరీ డైరెక్టర్ల నేమ్‌ బోర్డులు ఉండే ప్రతిష్ఠాత్మక ‘మ్యూర్‌ డే సినియాస్ట్‌’.. అంటే ఫిల్మ్‌ మేకర్స్‌ వాల్‌ ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన “ఎస్‌ ఎస్‌ రాజమౌళి” అనే పేరు సగర్వంగా మెరిసిపోయింది! ఈ చారిత్రక క్షణాన్ని చూసి […]

న‌ల్ల‌గొండ‌ ‘నారాయణ హై స్కూల్’లో విద్యార్ధిపై దాష్టికం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్పోరేట్ విద్య సంస్థ ‘నారాయణ హై స్కూల్’లో 1వ తరగతి విద్యార్ధి శ్రేయన్స్‌ను టీచర్ విచక్షణ రహితంగా తల, ముఖంపై కొట్టడంతో బొడిపె వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అసలే బాబు ఆరోగ్యం సక్రమంగా లేదని ఇలా కొట్టడంతో పాఠశాల అంటే భయపడిపోతున్నాడ‌ని కన్నీటి పర్యంతమ‌య్యారు. ఇదే విషయంపై పాఠశాల యాజమన్యం వద్దకు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యహరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. అనంతరం నల్లగొండ టౌన్ పోలీసు స్టేషన్‌లో […]

మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం – జగన్

కడప జిల్లాసున్నపురాళ్లపల్లిలో ‘జిందాల్’ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మళ్లీ పునఃప్రారంభం కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగార స్థాపనకు అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, పరిశ్రమకు అవసరమైన వందలాది ఎకరాల భూమి, మౌలిక వసతుల కల్పన, తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని ఆయన వివరించారు. గతంలో తమ ప్రభుత్వం సుదీర్ఘ కృషి ఫలితంగానే ఈ రోజు రాయలసీమలో ఈ భారీ ఉక్కు కర్మాగార […]

​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం!

ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే, మీడియాతో మాట్లాడుతుండగా ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు బొత్స మధు దాడికి ట్రై చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో కొందరి పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని, తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు […]

బలూచిస్తాన్‌లో లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి.. 8 మందికి గాయాలు

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON