loader

కాశ్మీర్‌పై అమెరికా కొత్త వివాదం..భారత సరిహద్దులను మార్చేసిన మ్యాప్!

2018 నుంచి అమల్లో ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరును తిరిగి యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చింది. జూన్ 16న విడుదల చేసిన అధికారిక సమాచారంలో ఉపయోగించిన మ్యాప్‌లో భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించారని భారతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ పటంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ప్రధాన భారత భూభాగం నుంచి వేరుగా కనిపించగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పాకిస్తాన్‌లో భాగంగా చూపించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జూన్​ 30లోపు గ్యాస్​ సిలిండర్ కేవైసీ డెడ్​లైన్! – లేదంటే

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎల్​పీజీ గ్యాస్​ను వాడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు సిలిండర్లు కూడా ఉంటున్నాయి. అయితే, అందులో సక్రమంగా ఉన్నవి ఎన్ని? అక్రమంగా ఉన్నవి ఎన్ని? అనేది తేలకుండా ఉంది. ఈ అక్రమాలకు చెక్​ పెట్టేందుకే కేవైసీని ప్రవేశపెట్టారు. ఏడాది గడిచినా కానీ, ఇప్పటికీ చాలా మంది కేవైసీ కంప్లీట్ చేయలేదు. పౌరసరఫరాల శాఖ జూన్​ 30వ తేదీ లోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే […]

ఈడీ ఆఫీస్‌కి కేరళ మాజీ సీఎం కూతురు.. ఆర్ధిక లావాదేవీలపై ఆరా

కేరళ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ కుమార్తె టి. వీణా, సీఎంఆర్ఎల్-ఎక్సాలాజిక్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చి ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. నిబంధనల ప్రకారం మాత్రమే వీణాను లోపలికి అనుమతించారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించలేదు. సీఎంఆర్ఎల్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. నిన్న ఈ కేసులో శశిధరన్ కర్త భార్య జయ కర్త, శరణ్ ఎస్ కర్తలు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి వీణా ఈడీ ఎదుట […]

ఫిఫ్టీల‌తో చెల‌రేగిన బ్యాట‌ర్లు.. ఇండియా-ఏ భారీ స్కోరు

ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గానిస్తాన్లో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షి ఆర్య (58), కెప్టెన్ తిలక్ వర్మ (59), కుమార్ కుషాగ్ర (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్లో మరోసారి విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ […]

అభిమానితో పవన్ సెల్ఫీ… హనుమకొండకు శ్రీవారి వస్త్రాలు, ప్రసాదంతో జనసేనాని

అరుదైన జన్యుపరమైన వ్యాధితో (DMD) బాధ పడుతూ, కొన్నేళ్లుగా మంచానికి పరిమితమైన అభిమాని నిరంజన్‌ను ఆత్మీయంగా పరామర్శించిన పవన్,తిరుమల నుంచి తెప్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను, పవిత్ర వస్త్రాన్ని, కళ్యాణ అక్షతలను స్వయంగా అందజేశారు పవన్. అభిమాని నిరంజన్ తో పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకున్నారు. నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు హనుమకొండలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని జనసేన తెలంగాణ నాయకులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

12వ త‌ర‌గ‌తిలో టాప‌ర్‌.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని

ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఐ ల‌వ్ యూ అంటూ ఆమె త‌న పేరెంట్స్‌కు సూసైడ్ లేఖ రాసింది. 1999 కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె ఆమె. చ‌దువుల్లో విజ‌యం సాధించ‌క‌పోవ‌డం వ‌ల్లే మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన‌ట్లు పోలీసు అధికారి తెలిపారు. 12వ త‌ర‌గ‌తిలో ఆమె 97 శాతం మార్కుల‌తో స్కూల్ టాప‌ర్‌గా నిలిచింద‌న్నారు. అయితే జూన్ 21వ తేదీన జ‌ర‌గ‌నున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఆమె ప్రిపేర‌వుతున్న‌ది.

పంట అమ్ముడుపోలేదని కొనుగోలు కేంద్రంలోనే పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్‌ జిల్లాలో సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగురే పాండురంగ్‌ (48) అనే రైతు జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా, అధికారులు ఇప్పటివరకు ఆ జొన్న లోడ్‌ను మిల్లులకు లేదా గోదాములకు తరలించలేదు. తన పంట ఎక్కడ పాడైపోతుందోనని, చేతికి డబ్బులు అందడం లేదని పాండురంగ్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

డీఎస్సీపై చర్చకు వస్తావా ? జగన్ కు మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్

గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం తాము కాదన్నారు. ఏపీ మెగా డీఎస్సీ (DSC) నిర్వహణ, టీచర్ పోస్టుల నియామకాలపై ప్రతిపక్షాలకు ఎలాంటి అనుమానాలున్నా, వాటికి సమాధానం చెప్పేందుకు తానే స్వయంగా సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా ఏపీలో డీఎస్సీ నియామకాలను ఆపలేరని నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలా ‘సాక్షి క్యాలెండర్’ కాకుండా, తాము నిరుద్యోగుల కోసం నిజమైన జాబ్ క్యాలెండర్‌ను […]

రూ.1,167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు నారా లోకేశ్‌ శంకుస్థాపన!

రాజధాని ప్రాంతమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశాబ్దాల నాటి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి రూ.1,167.50 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులకు తాడేపల్లిలో శంకుస్థాపన చేశారు. రాజధాని కోర్ పరిధిలోకి వచ్చే నవులూరు, యర్రబాలెం, బేతపూడి, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా MTMC పరిధిలోని మిగిలిన అన్ని పట్టణ, విలీన ప్రాంతాలకు […]

సిగరెట్ మానేశానని చెప్పిన జార్జియా మెలనీ.. జీ7 సదస్సులో ఆసక్తికర సంభాషణ

జీ7 సదస్సులో ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలతో జార్జియా మాట్లాడుతూ.. తాను నిద్రలేవాలంటే కనీసం మూడు కప్పుల కాఫీ తాగాల్సిందేనని స్పష్టం చేశారు. జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందించారు. సిగరెట్ కూడా కావాలా? అని అడిగారు. ఇందుకు మెలనీ తాను నెల రోజుల కింద సిగరెట్ మానేశానని చెప్పుకొచ్చారు. జీ7 సదస్సులో ప్రధాని మోదీని కలిసిన మెలోనీ సరదాగా పలకరించారు. మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ఫేమస్ అని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON