loader

జులై 3 నాటికి గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాణ్

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా సుకోవాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు శుక్రవారం(జూన్ 19) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఈ నెల 19 నుంచి 28 వరకు ఆన్‌లైన్ స్లాట్  బుకింగ్, ఈ నెల 22 నుంచి 29 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఈనెల 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 7వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు.

అరణ్య అర్బన్ పార్కును వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, తదితరులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

ఒకే నెలలో ఇద్దరి బలి.. పోలీసుల అరాచకం! – వైఎస్ జగన్

మే నెలలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల వేధింపులు తాళలేక క్రాంతికుమార్  అనే మరో యువకుడు సీఐ పేరును మరణవాంగ్మూలంలో  ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ గుర్తుచేశారు. మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లిన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తల్లిని కొడుకు ఫోటోకు దండ వేసుకో  అని సీఐ హేళన చేశారు.తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి కానీ,  పోలీసులే చేతుల్లోకి తీసుకుని గోళ్లు పీకి, చిత్రహింసలు పెట్టి చంపేస్తారా అని తీవ్ర […]

సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ మాత్రమే కాదు..సీపీ, డీజీపీలపై మర్డర్ కేసు పెట్టాలి- వైఎస్ జగన్

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ అనే రౌడీషీటర్ అదృశ్యం కావడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ దారుణ హత్య వెనుక కేవలం ష్ణలంక సీఐ మాత్రమే లేరని, విజయవాడ పోలీస్ కమిషనర్ , రాష్ట్ర డీజీపీకి కూడా ఇందులో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

మంత్రి బావమరిది సింగూరు జలాశయంలోనే భూ కబ్జా చేస్తున్నారు

సింగూరు జలాశయం కబ్జాకు గురవుతోందని, మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి సింగూరు జలాశయంలోనే భూ కబ్జా చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేత మాజీ ఎంఎల్‌ఎ చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. దీనిపై పిర్యాదు చేస్తే ఎకరం మాత్రమే కబ్జా అయిందని అధికారులు అంటున్నారని అన్నారు. కానీ, అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం దగ్గర ఫాం హౌస్ ఉందని చెప్పారు.నిజాం కాలంలో కట్టిన  కుంటలను లెవెల్ చేసి కబ్జా చేశారని, దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాధారాలను కలెక్టర్‌కు […]

మహిళను లైంగికంగా వేధించిన బాబా.. తన మూత్రాన్ని ఆమెతో తాగించాడు

పూణే వాఘోలిలోని ఉబాలే నగర్ ప్రాంతంలో రాధేశ్యామ్ మిశ్రా తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకుని ప్రాచుర్యం పొందాడు ఒక మహిళను మిశ్రా తనను తాను దైవ పురుషుడిగా నమ్మించాడు.ఆమె కుటుంబానికి దూరం చేసి లైంగికంగా వేధించాడు.తన మూత్రాన్ని తాగమని ఆమెను బలవంతం చేశాడు. విద్యుత్ షాక్‌లు ఇచ్చాడు. ఆ మహిళ అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేశాడు. బాబా ఆగడాలు భరించలేని ఆ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మిశ్రా సహా ఏడుగురు […]

ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీ మద్దతుదారు పరిమళ్ గెలుపు..

ఉత్కంఠగా సాగిన ఝార్ఖండ్ రెండు రాజ్యసభ సీట్లలో  ఒక స్థానం నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపొందారు. మరో సీటును జేఎంఎం సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి ప్రణవ్ ఝా.. పరిమళ్ చేతిలో ఓడిపోయారు. ఇండియా బ్లాక్ మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి, బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ గెలవడానికి క్రాస్ ఓటింగే కారణమని తెలుస్తోంది.

ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

IIT హైదరాబాద్‌లో CSE ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే రూ. 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ లో ఎడ్వర్డ్ రెండు నెలల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేశాడు. ఆరు వారాల ప్రాజెక్ట్ వర్క్‌లో అతని ప్రతిభను చూసి ఫిదా అయిన కంపెనీ మేనేజ్‌మెంట్.. క్యాంపస్ ఇంటర్వ్యూల కంటే ముందే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ […]

పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ‘జగన్ 2.0’ రూపంలో పార్టీ కార్యకర్తలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని, వారిని అందరికంటే మిన్నగా చూసుకుంటానని ఆయన పార్టీ నేతల అంతర్గత సమావేశంలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇకపై నేరుగా కార్యకర్తల చేతుల మీదుగానే ప్రజల్లోకి తీసుకెళ్తామని, తద్వారా క్షేత్రస్థాయిలో వారికి తగిన గుర్తింపు, ప్రజాదరణ దక్కేలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON