సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్..!
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

