loader

ప్రియురాలితో తిరుమ‌ల‌కు హార్థిక్ పాండ్యా

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఈ తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం శనివారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు.

ఎడారిలో ఘోర విమాన ప్రమాదం!

ప్రముఖ పర్యాటక దేశం పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన చారిత్రక నజ్యా లైన్స్ (Nazca Lines) సైట్ సీయింగ్ కోసం పర్యాటకులతో తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం ఉన్నట్టుండి నేలకూలింది. ఈ విషాదకర సంఘటనలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే ఉన్నట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.పిస్కో విమానాశ్రయం నుంచి ఈ టూర్ విమానం గాల్లోకి లేచింది. అయితే ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక […]

ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు..

సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస జాతర అత్యంత వైభవంగా మొదలైంది. ఆదివారం వేకువజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరై అమ్మవారికి తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Friendship Day

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.

వెదర్ రిపోర్టు.. ఆగస్టు, సెప్టెంబర్‌లో తగ్గనున్న వర్షాలు!

నైరుతి రుతుపవనాల ద్వితీయ భాగం(ఆగస్టు, సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తాజాగా విడుదల చేసిన ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ద్వితీయార్ధానికి చెందిన వాతావరణ నివేదికను శనివారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి.

సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్‌లకు స్వర్ణ పతకాలు

కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధింంచింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో మట్టికరిపించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇప్పటివరకు బాక్సింగ్ భారత్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. బాక్సింగ్ ఒక ఎడిషన్లో ఇన్ని […]

గ్రూప్స్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం..

భగీరథ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదిగొండ మండలంలో కలకలం రేపింది. సాయంత్రం సమయంలో నిరుద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌లో సూసైట్ నోట్ పోస్ట్ చేసి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత 5 సంవత్సరాలుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కసారి మాత్రమే గ్రూప్స్ రాశా. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్తాపానికి గురై తను ఆత్మహత్యాయత్నం చేశానని సూసైడ్ లేఖలో వేణు కుమార్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వేణు ఆరోగ్య […]

ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం – ఉద్యమ శంఖారావం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు , కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏపీ జేఏసీ మరోసారి పోరుబాట పట్టింది. బకాయిలు పడిపోయిన ఆర్థిక లబ్ధులు, నిలిచిపోయిన డీఏలు మరియు నూతన వేతన సవరణ సంఘం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే వచ్చే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, నిరవధిక సమ్మె దిశగా కార్యాచరణను ఉధృతం చేస్తామని […]

సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు అస్వస్థత

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు. రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని, విశ్రాంతి […]

ఏపీలో థింసా నృత్యంపై కాక్రోచ్ పార్టీ రియాక్ష‌న్‌!

కాక్రోచ్ జనతా పార్టీ ఏపీలో జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంపై స్పందించింది. థింసా నృత్యాన్ని ప్రదర్శించి మోదీకి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి రిప్లై ఇస్తూ కాక్రోచ్ పార్టీ మరో పోస్టు చేసింది. ఈ కార్యక్రమం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నిర్వహిస్తున్నారా? అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON