అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 8 నెలల కాలం పూర్తి చేసుకున్న అమెరికా-రష్యా వ్యోమగాములు ఆదివారంనాడు సురక్షితంగా కజకిస్థాన్ భూభాగానికి చేరుకున్నారు. నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు సెర్గీ కుద్-స్వెర్చ్కోవ్, సెర్గీ మిఖాయేవ్లు సోయుజ్ ఎంఎస్-28 నౌక ద్వారా దిగారు. అంతరిక్షంలో 241 రోజలు పాటు వీరు గడిపారు. ఇది విలియమ్స్, విఖాయేవ్లకు తొలి అంతరిక్ష మిషన్ కాగా, కుద్-స్వెర్చ్కోవ్కు రెండవది.