loader

మై ఫ్రెండ్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పోస్ట్ వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ” హ్యాపీ బర్త్ డే టూ మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ..  ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా అలాగే విజయంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇటలీ- భారత్ మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారాలని కోరుకుంటున్నాను. ఇరు దేశాల భవిష్యత్తు తరాలకు సహకారం, సౌభాగ్యం అందించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను” అని తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేశారు.

రామ్ చరణ్ కీలక నిర్ణయం

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూనే, సమాజ హితం కోసం ఆయన చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో తాను కూడా భాగమవుతున్నట్లు ప్రకటించారు  ఈ సేవా సంకల్పంలో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో 1,000 మంది మహిళలకు ఉచితంగా   ఉపాధి నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) శిక్షణ అందించనున్నట్లు రామ్ చరణ్ ప్రతిజ్ఞ చేశారు.

మణిపూర్‌ సహాయ శిబిరాల్లో 25 మంది మృతి.. నివేదిక కోరిన సుప్రీంకోర్టు

మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం కలకలం రేపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే చాలా తక్కువగా పరిహారం ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మణిపూర్‌లో 2023లో జరిగిన జాతి హింసాకాండలో వందలాది మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సహాయ శిబిరాల్లో వారు తలదాచుకున్నారు. అయితే సహాయక శిబిరాల్లో నివసించే ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం ఆందోళన […]

పవర్ ప్లేలో రన్స్.. భారత్ కొత్త రికార్డు

టీ20 పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును అభిషేక్ శర్మ – సంజు శాంసన్ ద్వయం బద్దలుకొట్టింది. అఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మూడో టీ20లో తొలి ఆరు ఓవర్లలో ఓపెనింగ్ జోడీ 100 పరుగులు చేసింది. భారత టీ20 క్రికెట్లో ఇదే అత్యధికం. ఇప్పటికే 2025లో ఇంగ్లాండ్ పై చేసిన 95/1 మన టాప్ పవర్ ప్లే స్కోర్. ఓవరాల్ గా చూస్తే.. ఈ స్కోరు మూడో అత్యధికం. తొలి రెండు స్థానాల్లో 113/0 (AUSxSCO), 102/0 (SAxWI) ఉన్నాయి.

చంద్రబాబుపై జగన్ ఆగ్రహం.. కీలక ప్రకటన!

ఏపీలో తీవ్రంగా కరువు పరిస్థితులున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సిఎం వైఎస్ జగన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం  మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే వాతావరణ శాఖ హెచ్చరించినా.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు చేపట్టకపోవడమేంటన్నారు. 688 మండలాలు ఉంటే.. 628 మండలాల్లో కరువు ఉందన్నారు.332 మండలాల్లో పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయని వివరించారు.

30 బంతుల్లోనే సెంచ‌రీతో అరుదైన ఘనత

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108, 9 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 30 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకుని అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. టీమ్ ఇండియా తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

పంజాబ్‌ రైతుల రైల్‌ రోకో.. నిలిచిన పలు రైళ్లు, రాకపోకలకు అంతరాయం

గురువారం కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల కోసం పంజాబ్‌ రైతులు రాష్ట్రవ్యాప్తంగా రైల్‌ రోకో చేపట్టారు. పలు రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు నిలిచిపోగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, దానివల్ల రైతులకు కలిగే పరిణామాలపై స్పష్టత ఇవ్వాలని పంజాబ్‌ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  విద్యుత్ సవరణ చట్టంపై ప్రభుత్వ వైఖరి, ప్రతిపాదిత విత్తన చట్టం, సహకార కేంద్రాల […]

ఎర్రవెల్లి సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారితో రైతు వాగ్వాదం..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మా భూములు మేము సాగు చేసుకుంటుంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నారు అని వారిని నిలదీశారు. 325 ఎక్కడకు పోలేదు.. ఇక్కడే ఉంది..భూములు మావి ఎక్కడికి పోలేదు.. మంచిగనే ఉన్నయ్‌ సార్..  మరి దేనికోసం చేస్తున్నరని మాకు డౌట్‌ ఉంటది కదా అని రైతు అడిగారు.

మెల్‌బోర్న్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విశాఖ వాసులు మృతి

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖవాసులు మృతి చెందారు.విశాఖకు చెందిన జీటీ ప్రసాద్ తన భార్యతో కలిసి శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ భార్య, కోడలు మృతి చెందగా..    కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తన కళ్లెదుటే కారు ప్రమాదంలో భార్య, కోడలు నేహా మృతి చెందటంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జీటీ ప్రసాద్ గతంలో  వీడీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.

వైఎస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు

గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల వయో సడలింపు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులర్ గా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వయోపరిమితి దాటిపోయి లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకునేలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON