loader

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు రాంపూర్ హాట్‌లోని తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఇటీవల ఉద్యోగం కోల్పోయారు. ఉద్యోగం పోవడంతో పాటు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమె గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఆందోళన (డిప్రెషన్), వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. రంగనాథ్ను తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. దీనిపై రంగనాథ్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ తరఫున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్టర్ వాదనలు […]

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం..

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. ఏజెన్సీలో వైద్య సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిర్లక్ష్యంతో పాటు వైద్య శాఖ […]

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విజయసాయిని సజ్జల కొట్టింది నిజమే. మంగళగిరిలో ప్లీనరీ జరిగేటప్పుడు వేదికపై ఎవరితో మాట్లాడించాలనే దానిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తి, మాటామాటా పెరిగి కొట్టింది వాస్తవమే. విజయసాయి రెడ్డి 72 అవమానాలు జరిగాయని చెప్పారు. నాకు ఒక్కడికే తెలిసి మరో ఘోర అవమానం జరిగింది. తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు.. కాకుపల్లి సెంటర్లో వంద వాహానాలతో ఘనంగా స్వాగతం పలికారు. దానిపై విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారు. ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను” అని […]

మోదీతో పుతిన్, జిన్‌పింగ్ భేటీ.. ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ

కిర్గిస్తాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ జరిగింది. చాలా కాలం తర్వాత ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ముగ్గురూ ఒకేసారి వేదికపై చేరి, ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ముగ్గురూ కొద్దిసేపు సంభాషించుకున్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో 26వ ఎస్‌సీవో సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలు పాల్గొంటున్నారు.

భువనగిరిలో ఉద్రిక్తత

భువనగిరిలో ఉద్రిక్తత వాతావర‌ణం నెల‌కొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అనంత‌రం భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు త‌లెత్తాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరో రోడ్డు ప్రమాదం : ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ టూ ఖాజాగూడ మెయిన్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారు.. రోడ్డు దాటుతున్న నందులాల్ ను ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న నందులాల్ ను.. తన కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యాక్సిడెంట్ జరిగింది. సందీప్ కారును.. మరో కారు ఢీకొట్టింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రినై 31 ఏళ్లు.. మీ రుణం తీర్చుకోలేను: సీఎం చంద్రబాబు

31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి ముఖ్యమంత్రినయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. “48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొగల్తూరుకు ఎన్నోసార్లు వచ్చా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఇవాళే. అంతకుముందు ఎన్నో రాజకీయ మార్పులు చూశా. నేను ఎన్ని జన్మలెత్తి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను” అని సీఎం చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు.

సచివాలయం వద్ద సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళన..

కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్ర పరిపాలనకు తలమానికంగా నిలిచే సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులు కదం తొక్కారు. సెక్రటేరియట్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా కలిసి బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది

నేపాల్ వరదలు: క్షేమంగా బయటపడ్డ నెలన్నర చిన్నారి!

నేపాల్ లోని రసువా ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల ధాటికి చిక్కుకుపోయిన ఒక నెలన్నర పసికందును రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ చిన్నారిని కాపాడి, ప్రస్తుతం సహాయ చర్యలు అందిస్తున్న రసువా ధంగే క్యాంప్కు చేర్చారు. వరద ముంపు ఉన్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందించి పసిపాపను కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON