loader

మోదీతో పుతిన్, జిన్‌పింగ్ భేటీ.. ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ

కిర్గిస్తాన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సులో అరుదైన భేటీ జరిగింది. చాలా కాలం తర్వాత ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ముగ్గురూ ఒకేసారి వేదికపై చేరి, ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ముగ్గురూ కొద్దిసేపు సంభాషించుకున్నారు. కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో 26వ ఎస్‌సీవో సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో వివిధ దేశాధినేతలు పాల్గొంటున్నారు.

భువనగిరిలో ఉద్రిక్తత

భువనగిరిలో ఉద్రిక్తత వాతావర‌ణం నెల‌కొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. అనంత‌రం భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయంపై దాడి చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు త‌లెత్తాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరో రోడ్డు ప్రమాదం : ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ టూ ఖాజాగూడ మెయిన్ రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ కారు.. రోడ్డు దాటుతున్న నందులాల్ ను ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న నందులాల్ ను.. తన కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యాక్సిడెంట్ జరిగింది. సందీప్ కారును.. మరో కారు ఢీకొట్టింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రినై 31 ఏళ్లు.. మీ రుణం తీర్చుకోలేను: సీఎం చంద్రబాబు

31 ఏళ్ల క్రితం ఇదే రోజు తొలిసారి ముఖ్యమంత్రినయ్యానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. “48 ఏళ్ల నా రాజకీయ జీవితంలో మొగల్తూరుకు ఎన్నోసార్లు వచ్చా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఇవాళే. అంతకుముందు ఎన్నో రాజకీయ మార్పులు చూశా. నేను ఎన్ని జన్మలెత్తి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను” అని సీఎం చంద్రబాబు ప్రజలనుద్దేశించి అన్నారు.

సచివాలయం వద్ద సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళన..

కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్ర పరిపాలనకు తలమానికంగా నిలిచే సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులు కదం తొక్కారు. సెక్రటేరియట్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట నిరసనకు దిగారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులంతా కలిసి బాహుబలి ద్వారం ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది

నేపాల్ వరదలు: క్షేమంగా బయటపడ్డ నెలన్నర చిన్నారి!

నేపాల్ లోని రసువా ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల ధాటికి చిక్కుకుపోయిన ఒక నెలన్నర పసికందును రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ చిన్నారిని కాపాడి, ప్రస్తుతం సహాయ చర్యలు అందిస్తున్న రసువా ధంగే క్యాంప్కు చేర్చారు. వరద ముంపు ఉన్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందించి పసిపాపను కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. టీటీడీ అధికారులు ప్రకటించిన ఈ వేడుకల షెడ్యూల్ ప్రకారం భక్తులు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. సెప్టెంబర్ 19న అత్యంత విశేషమైన గరుడ సేవ జరుగుతుంది. సెప్టెంబర్ 20న స్వర్ణరథం, సెప్టెంబర్ 22న రథోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 23న చక్రస్నానం మరియు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా ఉండకూడదు : SCO సదస్సులో ప్రధాని మోదీ

ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇందులో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, యువతను నియమించుకోవడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అలాగే సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టాలని సూచించారు. కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) శిఖరాగ్ర సదస్సులో మోదీ ఈ వ్యాఖ్యలు […]

టైమ్స్ స్క్వేర్ ఘటన.. వెలుగులోకి భయానక దృశ్యాలు..

అమెరికాలోని న్యూయార్క్ సిటీలో టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ రెండు కత్తులతో జనంపై విరుచుకుపడింది. కత్తులతో హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళుతున్న జనంపై దాడికి పాల్పడింది. కత్తి పోట్ల కారణంగా ఓ వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మహిళను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను కాల్చి చంపారు. ఆ మహిళ పోలీసుల హెచ్చరికలను లెక్కచేయలేదు. ఎదురుగా ఉన్న పోలీసులపై కత్తులతో దాడి చేయడానికి […]

ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో ఊహించని మలుపు, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు తర్వాత ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మాధురి రాథోడ్ కేసు నమోదు కావడంతో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈశ్వర్ సాయి కోసం రెండు పోలీస్ బృందాలు గాలిస్తున్నారు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ రాసలీలలను భార్య శరణ్య బయటపెట్టడం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON