సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో హిందూ మత పెద్దలు, చారిత్రక వ్యక్తులు మరియు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు, వీడియోలు పెట్టారనే ఆరోపణలపై జర్నలిస్ట్ కరిష్మా అజీజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యూఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ను ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. అజీజ్ ‘X’ అనే వెబ్ సైట్ లో హిందూ మత విశ్వాసాలను, ప్రముఖులను అవమానించే, చరిత్రను వక్రీకరించే, మత విద్వేషాలను, భారత్ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టే విధంగా వరుస పోస్టులు, వీడియోలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.