loader

కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చంద్రబాబు అంత తేలిగ్గా వదలరు: పయ్యావుల కేశవ్

తిరుమల శ్రీవారినే ప్రధానంగా నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలరని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. కల్తీ లడ్డూ వ్యవహారాన్ని అంతిమంగా నడిపించిన వారెవరో తేలాల్సిందే అన్నారు. కుప్పం పర్యటన ముగించుకుని వచ్చాక కల్తీ లడ్డూ వ్యవహారంపై సీరియస్ చర్యలే తీసుకుంటారని తెలిపారు. తిరుమలలో ప్రక్షాళన కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో ఇంకా చాలా అంశాలు బయటకు రావాల్సి ఉందని వెల్లడించారు. సీఎం చర్యలు ఎలా ఉంటాయో […]

అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి యత్నం

కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు.. గోరంట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయన కారును అడ్డుకున్నారు. అనంతరం, రాడ్లు, కర్రలతో టీడీపీ నేతలు రాంబాబుపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు.ప్లాన్ ప్రకారమే నాపై దాడి యత్నం జరిగింది పోలీసులు ఏం చేస్తున్నారు’ అని […]

తెలంగాణ సాధకుడు కెసిఆర్ పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంది?: కెటిఆర్

తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ మండిపడ్డారు. “స్వయంగా కెసిఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు” అని కెటిఆర్ అన్నారు.

మున్సిపల్ పోరులో 28వేల నామినేషన్లు- సూర్యాపేట లో కల్నల్ సంతోష్‌ తల్లి పోటీ

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28, 456 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి రెండు రోజుల్లో కేవలం 9, 276 నామినేషన్లు మాత్రమే రాగా , చివరి రోజు ఒక్క రోజే ఏకంగా 19180 నామినేషన్లు దాఖలు అయ్యాయి.  2020లో గల్వాన్‌ లోయలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు కల్నల్‌ సంతోష్‌ బాబు మాతృమూర్తి మంజుల సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో దిగారు. బీఆర్‌ఎస్ తరఫున 44 వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

మోదీ పాలనలో ప్రశ్నిస్తే నేరమా?..అశ్వమిత్‌పై వేధింపులకు అర్ధమేంటో ప్రధాని చెప్పాలి?

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే యువ గొంతులను అణిచివేసే ప్రమాదకర ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి తీవ్రంగా విమర్శించారు. “నేటి భారతదేశంలో ప్రశ్నించడం నేరంగా మారుతోంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం కప్పి ఉంచబడుతున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ లక్నోకు చెందిన 14 ఏళ్ల యువ కార్యకర్త అశ్వమిత్ గౌతమ్‌పై కొనసాగుతున్న వేధింపులను ఖండించిన డా. రేఖ.. ఆ యువకుడు ఎవరిని దుర్భాషలాడలేదని, హింసకు […]

పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అని అభ్యర్థిస్తూ కౌశిక్ […]

పగ్గాలు చేపట్టనున్న సునేత్ర పవార్- శనివారమే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం?

మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎన్​సీపీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఎన్​సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆమెను తమ నేతగా ఎన్నుకోనున్నట్లు మంత్రి ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. శనివారమే ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా తమకు అభ్యంతరం లేదని సీఎం దేవేంద్ర ఫడణవీస్​ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

వైఎస్సార్సీపీ నేతల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి: మంత్రి లోకేశ్

టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ పాల్గొన్నారు. పార్టీ క్యాడర్ సమన్వయంతో పాటు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని లోకేశ్​ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టడంతో పాటు వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా విడదీయడం ఎవరి తరం […]

టికెట్ దక్కలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో “ఆల్ ఈజ్ వెల్” అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఆత్మహత్యాయత్నం చేసిన వేణు చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సంసిద్ధం కాగా బీ-ఫామ్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు.

అప్పుడు మనోభావాలు …ఇప్పుడు కల్తీ నెయ్యి: మంత్రి వాసం

తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఐదు కొండలంటూ గతంలో తిరుమల భక్తులను మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON