ఇరాన్ తన వ్యూహాత్మక ఒత్తిడిని పెంచేందుకు ఇప్పుడు ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా ఈ సముద్రగర్భ కేబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కంటే ఈ దక్షిణ గల్ఫ్ దేశాలే ఈ మార్గాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని, వీటిని దెబ్బతీస్తే ఆయా దేశాల కమ్యూనికేషన్ నెట్వర్క్ కుప్పకూలుతుందని IRGC అనుబంధ మీడియా తస్నిమ్ పరోక్షంగా హెచ్చరించింది.

