loader

తేజస్వి యాదవ్ హెచ్చరిక.. అదే జరిగితే ఎన్నికల్లో పోటీ చేయను

బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. సీట్ల పంపకం పూర్తయిన వెంటనే సీఎం అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై సీఎం రమేష్ ఫిర్యాదు..

మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిశోర్ (Gadari Kishore news) తనపై దూషణలకు దిగారని సీఎమ్ రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిశోర్‌కు నోటీసులు […]

భద్రతా వైఫల్యం.. విజయ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి

తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కజగం చీఫ్‌ విజయ్ ఇంట్లో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్‌పై తిరుగుతూ కనిపించాడు. భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అరుణ్(24) అని.. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కు కేంద్ర హోం శాఖ ఇటీవల […]

ఓటు దోపిడీకి చెక్ పెడదాం.. సంతకాల సేకరణ ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే నిజమైన దేశభక్తి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు రక్షణ కోసం ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వోట్ చోరీపై సంతకాల సేకరణ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల హక్కులు, ప్రతి ఓటు విలువను కాపాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఉద్యమానికి నాయికత్వం వహిస్తూ, దేశ ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. మీ ఓటు మాత్రమే కాదు, […]

శశికళ బినామీ ఆస్తుల కేసులో ఉచ్చు బిగుస్తున్నఉచ్చు బిగుస్తున్న ఈడీ

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళకు సంబంధించిన బినామీ ఆస్తులు, మనీలాండరింగ్ కేసులో ED దర్యాప్తును వేగవంతం చేసింది. శశికళకు బినామీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గ్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జీఆర్‌కే రెడ్డి నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. చెన్నై మరియు హైదరాబాద్‌లోని సుమారు పది ప్రదేశాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తనిఖీలు చేపట్టారు.

కొడుకు వివాహ రిసెప్షన్ డబ్బు రైతులకు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ కోసం కేటాయించిన మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 2 కోట్ల చెక్‌ను అందజేసిన బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం… ఈ మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని అభ్యర్థించారు.

3 ద‌శ‌ల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు !

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ తొలి వారంలో తొలి ద‌శ ఉండ‌నున్న‌ది. ఎన్నిక‌ల సంఘం డ్రాఫ్ట్ ప్ర‌పోజ‌ల్ ద్వారా ఓ మీడియా సంస్థ ఈ అంచ‌నా వేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఈసీ ప్ర‌క‌టించ‌నున్న‌ది. ఛాత్ పూజా సంబ‌రాలు ముగిసిన త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఈసీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మూడు ద‌శ‌ల్లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ఈసీ ప్ర‌ణాళిక వేసిన‌ట్లు […]

ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. చంద్రబాబు, వెంకయ్య నాయుడిపై లక్ష్మీపార్వతి ధ్వజం

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లిందని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డారు.

పాట్నా హైకోర్టు ఆదేశం.. మోదీ తల్లి వీడియో తొలగించాలని కాంగ్రెస్‌కు ఆదేశం

కాంగ్రెస్ పార్టీ బిహార్ యూనిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఏఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో పాట్నా హైకోర్ట బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను తక్షణమే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీబీ బజంతరి ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏఐ వీడియో బిహార్ కాంగ్రెస్ యూనిట్ అధికారిక సోషల్ మీడియా […]

టీటీడీ వ్యవహారంలో భూమన అరెస్టుకు రంగం సిద్ధం!

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ వెల్లడించారు. కొంతకాలంగా టీటీడీ పాల‌క మండ‌లికి, కూట‌మి ప్రభుత్వానికి కంట‌గింపుగా మారిన భూమ‌న క‌రుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్ధమైన‌ట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. భూమన అక్రమ అరెస్టుతో వైసీపీ నోళ్లు మూయించలేరని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON