అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 226కు పైగా సీట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలపై సిఎం మమతా బెనర్జీ గురువారం వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్ గణాంకాలను బిజెపి కార్యాలయం నుంచి విడుదల చేశారని, తన మద్దతుదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే వాటిని సృష్టించారని మమత ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలపై విడుదలైన ఎగ్జిట్ పోల్ అంచనాలను దీదీ తీవ్రంగా విమర్శించారు.

