loader

దక్షిణ చైనా సముద్రంపై క్వాడ్ తీవ్ర ఆందోళన

సముద్రంలో జరుగుతున్న పరిణామాలు క్వాడ్ దేశాలకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం ఒకటి. ఇక్కడ చైనా ఆక్రమణలు చేయడం సహా ఇతర దేశాల నావికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ‘9-డాష్ లైన్’ విధానాన్ని అమలు చేయడం, వివాదాస్పద దీవులను మిలిటరైజ్ చేయడం భారత్‌, క్వాడ్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

ఘనాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటించారు. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీకి ఘనా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డును ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని మోదీ […]

దలైలామా సంచలన ప్రకటన..చైనాకి షాక్

దలైలామా తన వారసుడి ఎంపికపై కీలక ప్రకటన చేస్తూ, భవిష్యత్‌ లో తన పునర్జన్మ (రిఇంకార్నేషన్)కు గుర్తింపు ఇచ్చే ఏకైక హక్కు తమ అధికారిక కార్యాలయమైన గదెన్ ఫోడ్రంగ్ ట్రస్ట్‌కే ఉందని స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటనతో చైనాకు నేరుగా సవాల్ విసిరారు. ఎందుకంటే, చైనా ఇప్పటికే దలైలామా వారసత్వం,  టిబెటియన్ బౌద్ధమతంపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా-టిబెట్ మధ్య మరో కొత్త ఘర్షణకు మెుదలు అవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి షాక్.. వీసా నిబంధనలు కఠినతరం

ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్లే భారతీయులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 22 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా వలసలను తగ్గించి, బ్రిటన్ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు వీసా నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ నిర్ణయం చాలా మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.

అమెరికాలో ఇస్కాన్ దేవాలయంపై కాల్పుల కలకలం

అమెరికా లో ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు కలకలం రేపాయి. అగ్రదేశంలోని శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్‌ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. ఆల‌యంలో భ‌క్తులు ఉన్న స‌మ‌యంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది. సుమారుగా 20 నుండి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్లు ఆల‌య గోడ‌ల్లో నుండి దూసుకువెళ్లాయి. బుల్లెట్లు తాక‌డంతో ఆల‌యం అద్దాలు కూడా ప‌గిలిపోయాయి.

భారత్ పై 500 శాతం టాక్స్..డొనాల్ట్ ట్రంప్‌

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ షాక్‌ ఇచ్చారు. రష్యా తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుతో యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెచ్చేందుకు రెడీ అవుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తామన్నారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు.

దుకాణం మూసేయాల్సిందే- ట్రంప్‌ కౌంటర్‌

ట్రంప్ ఎలాన్‌ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. మస్క్ కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ గవర్నమెంట్‌ సబ్సిడీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని చెప్పారు. ఈ సబ్సిడీలు లేకపోతే, మస్క్ ‘దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అన్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని, స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాలకు ముగింపు పలకాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

ఫోన్ కాల్ లీక్ ఎంత పనిచేసింది..థాయ్ ప్రధాని పదవి పోయిందిగా!

థాయ్‌లాండ్‌ యువ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్‌ షినవత్రా ను జూలై 1వ తేదీ నుంచి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. థాయిలాండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొరుగు దేశమైన కంబోడియా మాజీ ప్రధానమంత్రి హున్‌సేన్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. ఆ కాల్ లీక్ కావడంతో ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఫోన్ కాల్‌లో థాయిలాండ్ అంతర్గత పరిస్థితులతోపాటు ఆర్మీ కమాండర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది.

ట్రంప్ బిగ్ రిలీఫ్.. రెమిటెన్స్ టాక్స్ ఇక ఒక శాతమే..!

అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది నిజంగా శుభవార్త. వారు మన దేశంలోని తమ కుటుంబాలకు పంపే డబ్బుపై పన్ను భారం తగ్గింది. మొదట 5 శాతంగా ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ ఇప్పుడు కేవలం 1 శాతం మాత్రమే ఉండనుంది. ఈ పన్ను తగ్గింపు అందరికీ వర్తించదు. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో డబ్బు పంపేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్ వంటి పద్ధతుల ద్వారా పంపే డబ్బుకు మాత్రమే ఒక శాతం పన్ను […]

శాశ్వత నివాసంపై కెనడా కీలక నిర్ణయం

కెనడా ప్రభుత్వం విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శరణార్థులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్థిక వలసదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులు, ఫ్రెంచ్ మాట్లాడేవారికి దీని వల్ల అధిక ప్రాధాన్యత లభిస్తుంది. తాత్కాలిక వీసాల జారీలో భారతీయులు అధికంగా ఉండటం గమనార్హం. ఈ మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON