loader

విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత

కృష్ణా జిల్లాకేంద్రం మచిలీపట్నంలో టిడిపి, బిజెపి విగ్రహాల విషయంలో వివాదం తలెత్తింది. ఎన్టీఆర్, వాజ్ పేయీ పేర్ల వివాదం తలెత్తింది. అయితే పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని బిజెపీ నిర్ణయించింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ లో ఆ విగ్రహం తీసేసి వాజ్ పేయ్ విగ్రహం తయారు చేయించి పెట్టాలని భావించారు. ఇందుకోసం వాజ్ పేయ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపనకు ప్లాన్ చేశారు. దీన్ని చివరి నిమిషంలో టిడిపి […]

పుదుచ్చేరిలో విజయ్‌ బహిరంగ సభకు అనుమతి..అయితే కొన్ని షరతులు..!

పుదుచ్చేరిలో టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్‌ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి మంజూరు చేశారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్‌ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.

ఆమెను మెంటల్‌ హస్పిటల్‌ చేర్పించండి.. నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యలకు డీకే శివకుమార్‌ కౌంటర్‌..!

పంజాబ్‌కు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి పదవి కోసం రూ.500 కోట్లు ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డీకే స్పందిస్తూ ‘ఆమెను మంచి మానసిక ఆసుపత్రిలో చేర్చాలి’ అన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. రూ.500 కోట్ల సూట్‌కేస్‌ ఇచ్చినవారు మాత్రమే సీఎం అవుతారనడంలో అర్థం లేదన్నారు. ఆమె […]

‘నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క’..సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్లు   పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు.   “నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి ‘ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ‘  తర్వాత మరో లెక్క” అంటూ రాష్ట్ర భవిష్యత్తుపై తమ మహా సంకల్పాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఓటుతో అధికారం చేపట్టిన తర్వాత తమ ప్రస్థానం జాతి కోసం.. జనహితం కోసం సాగిందని సీఎం రేవంత్ రెడ్డి […]

టీటీడీపై జగన్ వ్యాఖ్యలు దుర్మార్గం – మంత్రి ఆనం

పరకామణి చోరీ జగన్​కు చిన్న అంశమైతే, తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా  జగనే చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీ (TTD)ని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నాడని దుయ్యబట్టారు.రూ.70 వేలు దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. పరకామణి చోరీలో ఒక రోజు సీసీ కెమెరాల్లో మాత్రమే ఆ దొంగ […]

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి నోటీస్!

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ పై ఈడీ పట్టు బిగిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్టోబర్ 3న దాఖలైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం కోరుతూ డీకేకు ఈడీ నోటీసు జారీ చేసింది. నవంబర్ 29న జారీ చేసిన నోటీసులో శివకుమార్ డిసెంబర్ 19లోగా  వ్యక్తిగతంగా హాజరు కావాలని, అభ్యర్థించిన సమాచారాన్ని అందించాలని కోరింది.

రాష్ట్రపతి విందుకు రాహుల్‌, ఖర్గేలకు అందని ఆహ్వానం.. కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..

 భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఆయన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సంబంధించి  ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లిఖార్జున ఖర్గేకు ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం   రాష్ట్రపతి భవన్ నుండి విందుకు ఆహ్వానం అందింది.  ఈ ఆహ్వానంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా […]

ఓటర్లకు బిందెలు పంచుతూ అడ్డంగా దొరికిన సర్పంచ్ అభ్యర్థి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో  పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు  పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం  చేసుకున్నారు.  అభ్యర్థులు ఎవరైనా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని,  చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని […]

ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలి : కెటిఆర్

పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ లోని షాపూర్లో హమాలీలతో కెటిఆర్ మాట్లాడారు. భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడు: కెటిఆర్

జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON