loader

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి ఉంటున్నారు. శుక్రవారం అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు విద్యార్థులిద్దరూ తీవ్రంగా గాయపడ్డంతో అగ్నిమాపక సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం 9,292 ఎకరాల భూకేటాయింపు అంశంపై సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించాలని, పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి […]

ఎలాన్ మస్క్​కు భారీ షాక్- ఎక్స్​కు రూ.12,570 కోట్లు ఫైన్

దిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు ఈయూ ఆన్ లైన్ కంటెంట్ నియమాలను ఉల్లంఘించినందుకు ఎక్స్​కు 120 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.12,570 కోట్లు) ఫైన్ వేసింది. డిజిటల్  సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ) కింద ఎక్స్​కు ఈ ఫైన్​ను ఈయూ విధించింది. ఈ చట్టం కింద పడిన తొలి జరిమానా ఇదే కావడం గమనార్హం. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్​పై  నియమాలను ఎక్స్ ఉల్లంఘించినట్లు తేలడంతో, రెండేళ్ల దర్యాప్తు అనంతరం యూరోపియన్ కమిషన్  జరిమానాను […]

పవన్‌ను విమర్శించను- జగన్ అసెంబ్లీకి వెళ్లాలి- మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పటి పరిస్థితుల వల్ల పవన్ పై అలా వ్యాఖ్యలు చేశానని..నేను ఇప్పుడు ఎవర్నీ విమర్శించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అసెంబ్లీకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని .. అసెంబ్లీలో ప్రతిపక్షానికే బాధ్యత ఉంటుందన్నారు

ఎసిబి వలలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్

హనుమకొండ కార్యాలయంలో వెంకట్‌రెడ్డి అనే  వ్యక్తి గత రెండేళ్ల నుంచి అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  ఇటీవల హనమకొండ డిఇఓ బదిలీపై వెళ్లడంతో   ఇన్చార్జి డిఇఒగా అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఒక ఫైల్ క్లియరెన్స్  అడిషనల్ కలెక్టర్ ఛాంబర్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

గిరిజన గ్రామం నుంచి ప్రపంచకప్ వేదిక వరకు.. అంధ క్రికెటర్ కరుణ కుమారికి ఘన స్వాగతం..!

 శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన తొలి మహిళా   అంధుల టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయకేతనం  ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించింది కరుణ కుమారి.  ఈ గిరిజన యువతికి విశాఖలో ఘన స్వాగతం లభించింది.  తోటి అంధ విద్యార్థులతో కలిసి ఆమె భారీ  విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కరుణకు శాలువాతో  ఘనంగా సత్కరించి, లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేశారు.

మమ్మల్ని క్షమించండి.. డిసెంబర్ 10 నుంచి యథావిధిగా సర్వీస్‌లు..!

 ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ఇప్పట్లో   సమసిపోయేలా లేదు. వందల సంఖ్యలో సర్వీస్‌ల రద్దుతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్న వేళ..   ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ (Pieter Elbers) కీలక ప్రకటన చేశారు.  ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరిన ఆయన..  ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు నా తరఫున,  మా సంస్థ ఇండిగో తరఫున మీఅందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా.  ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం  పది రోజులు పట్టేలా ఉంది. డిసెంబర్ […]

ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే- మంత్రి పొంగులేటి

 హిల్ట్ పాల‌సీపై విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తిప్పికొట్టారు.  గ‌త ప్ర‌భుత్వంలో కోకాపేట‌, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారు,  హిల్ట్‌ను దోపిడీ పాల‌సీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా అని మండిపడ్డారు.  ఓఆర్ ఆర్ నిర్వ‌హ‌ణ‌ను కూడా వేలం వేశారు.  ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా  వారి ద‌గ్గ‌ర ముడుపులు తీసుకొని భూముల‌ను క‌న్వ‌ర్ష‌న్ చేశారని,   ఎల్‌బి న‌గ‌ర్‌లోని40 ఎక‌రాల స్ధ‌లాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వ‌డం జ‌రిగింది.   ఈ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీని […]

రాష్ట్రపతి విందుకు రాహుల్‌, ఖర్గేలకు అందని ఆహ్వానం.. కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..

 భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఆయన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సంబంధించి  ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లిఖార్జున ఖర్గేకు ఈ విందుకు ఆహ్వానం అందలేదు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు మాత్రం   రాష్ట్రపతి భవన్ నుండి విందుకు ఆహ్వానం అందింది.  ఈ ఆహ్వానంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా […]

భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు..ప్రయాణికుల గగ్గోలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడం. మిగతా విమానయాన సంస్థలకు తమ టికెట్ ధరలను భారీగా పెంచేందుకు ఒక అవకాశంగా మారింది. కొన్ని ప్రధాన రూట్ల ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు, హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో  సాధారణంగా రూ. 6,000 నుంచి రూ. 7,000 మధ్య  ఉండే విమాన టికెట్ ధర ఏకంగా రూ. 40,000కు చేరింది. అదే విధంగా, హైదరాబాద్-ముంబై రూట్‌లో కూడా టికెట్ ధర రూ. 37,000గా ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON