కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ పై ఈడీ పట్టు బిగిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్టోబర్ 3న దాఖలైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం కోరుతూ డీకేకు ఈడీ నోటీసు జారీ చేసింది. నవంబర్ 29న జారీ చేసిన నోటీసులో శివకుమార్ డిసెంబర్ 19లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని, అభ్యర్థించిన సమాచారాన్ని అందించాలని కోరింది.

