loader

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సీఎం రేవంత్. ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ సీజన్-2 ప్రారంభం

ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్-2 ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎమ్‌సి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్‌గా ISRL గుర్తింపు పొందింది. ఈ లీగ్‌లో 20 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ రైడర్లు పోటీ […]

అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం- ఇదే ఇండియా మోడల్​: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా మందగమనం నెలకొన్న వేళ భారతదేశం ఆర్థికాభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన 8.2% వృద్ధి ప్రపంచానికి మనమే చోదక శక్తి అని నిరూపిస్తోందన్నారు. భారత్‌ తనదైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని లీడర్‌షిప్‌ సమ్మిట్​లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3%,సగటు వృద్ధిని నమోదు చేస్తున్న సమయంలో భారత్‌ తనదైన రీతిలో దూసుకెళుతోందని మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025:తరలి వస్తున్న 44 దేశాల ప్రముఖులు

ఈ నెల 8, 9 తారీఖుల్లోతెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోందని ఉపముఖ్య‌మంత్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 స‌మ్మిట్‌ను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ ప్రారంభిస్తారని ఆయ‌న చెప్పారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్  […]

త్వరలో భారత్‌కు 40వేల ఇజ్రాయెల్‌ గన్స్‌- అర్బెల్‌ టెక్నాలజీ కూడా!

దేశ సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. లైట్‌ మెషిన్‌ గన్స్‌తోపాటు కార్బైన్లను ఇజ్రాయెల్‌ సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌ ‘అర్బెల్‌ టెక్నాలజీ’ని త్వరలోనే మన సైన్యానికి ఇజ్రాయెల్‌ తయారీ లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. మొదటి విడతలో 40వేల లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వాటిని సరఫరా చేయనున్నట్లు రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఇప్పటికే వాటి పరీక్షలు పూర్తయ్యాయని ఉత్పత్తి కోసం లైసెన్స్‌ పొందినట్లు వెల్లడించింది.

తిరుపతిలో దారుణం.. ఫస్టియర్‌ విద్యార్థినిని గర్భవతి చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

తిరుపతి నేషనల్‌ సాంస్కృతిక యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఓ యువతి ఫస్టియర్‌ చదువుతోంది. ఆమెపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌కుమార్‌ కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధించిన ప్రొఫెసర్.. కొంతకాలం మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థి గర్భం కూడా దాల్చింది. కాగా, ఇటీవల ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన విద్యార్థిని.. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన వీసీ.. ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

సౌతాఫ్రికాపై ‘రివెంజ్’ తీర్చుకున్న టీమిండియా! వైజాగ్ వన్డేలో ఘన విజయం..

టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాభవానికి కొద్దిగా బదులు తీర్చుకుంది భారత జట్టు. వైజాగ్ వన్డేలో 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది భారత జట్టు. ఈ విజయంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది భారత జట్టు. . రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కి 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, 113 బంతుల్లో వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ అందుకున్నాడు..

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంది…సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్‌ను ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో నంబర్‌ 1 గా ఉన్న తెలంగాణను భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కాల్పులతో దద్దరిల్లిన దక్షిణాఫ్రికా.. 11 మంది మృతి, 14 మందికి గాయాలు

కాల్పులతో దక్షిణాఫ్రికా దద్దరిల్లింది. హాస్టల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. 11 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రిటోరియాలోని సాల్స్‌విల్లేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

ఫైట్ టిక్కెట్ రేట్లపై కేంద్రం నియంత్రణ-గరిష్ట చార్జీల నిర్ణయం

ఇండిగో విమానయాన సంక్షోభం మధ్య ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచడంపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) తీవ్రంగా స్పందించింది. ఫ్లైట్ ఫేర్ పై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విమానయాన సంస్థలకు ఈ ఆదేశాలు పాటించాలని ఆదేశించింది. ప్రయాణికులను  ఇలాంటి ధరల నుంచి రక్షించడానికి రెగ్యులేటరీ పవర్లను ఉపయోగించి, అన్ని ప్రభావిత రూట్లలో న్యాయమైన ధరలు నిర్ధారించామని తెలిపింది. 500కి.మీ వరకు గరిష్ఠ ఫేర్ రూ.7500, 500–1000కి.మీ-రూ.12,000, 1000–500కి.మీ-రూ.15,000

హిట్‌మ్యాన్ దర్బార్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 రన్స్ పూర్తి..

భారత జట్టుకు చెందిన పవర్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో, తన ఇన్నింగ్స్‌లో 27వ పరుగును పూర్తి చేయడం ద్వారా ఆయన 20,000 అంతర్జాతీయ పరుగుల మార్కును అధిగమించారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే 14వ ఆటగాడిగా, నాల్గవ భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. 

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON