loader

రూ.1కే కిలో అరటిపళ్లు.. అనంత రైతు కన్నీళ్లు

అనంతపురం జిల్లాలోని అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.  బహిరంగ మార్కెట్‌లో డజను అరటిపళ్లు రూ.40 రూ.60 వరకు  అమ్ముడవుతున్నప్పటికీ, రైతులకు కిలోకు  రూ.1 మాత్రమే లభిస్తోంది.  లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు   పెట్టుబడి రాక కన్నీరు పెడుతున్నారు. టన్ను అరటికి కేవలం రూ.1,000 నుంచి 2,000 మాత్రమే  ధర పలకడంతో రవాణా ఖర్చు  కూడా గిట్టుబాటు కాక రైతులు పొలాల్లోనే పంటను మహారాష్ట్ర నుంచి అధిక దిగుమతి  మరియు దళారుల దోపిడీ కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.

పనులు చేశాం.. డబ్బుల్లేవు.. రూ.400 కోట్ల బకాయిలతో జీవీఎంసీ

జీవీఎంసీ పరిధిలో తీవ్ర అవ్యవస్థలు వెలుగులోకి వస్తున్నాయి.  నగరంలో రహదారులు, పార్కులు, డ్రైనేజీలు,  ఇతర మౌలిక సదుపాయాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఏడాదిన్నరగా తమకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.400 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని వాపోతున్నారు. జీవీఎంసీలో  పనులు పూర్తిగా ఆపేయాలని టూల్‌డౌన్‌కు సిద్ధమవుతున్నారు. జీవీఎంసీలో కొందరు కార్పొరేటర్లు పర్సంటేజీల  పేరుతో దండుకుంటున్నారని, శంకుస్థాపన రాయి పడేలోపే కమీషన్ డబ్బులు ఖాతాల్లో  జమ చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ – ఏపీలో పెట్టుబడులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును   అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీల  కలిశారు. ప్రత్యేక  విమానంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన అయన  అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.  అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణంలో  అదానీ గ్రూపు పాలు పంచుకుంటోంది. ఈ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం చంద్రబాబు భరోసా

దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని..   ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను    రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.   దివ్యాంగులపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్ ఇదని పేర్కొన్నారు.    విభిన్న ప్రతిభావంతులు కాబట్టే… అనేక రంగాల్లో    రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.   ఇవాళ(బుధవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో   విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు,   పలువురు దివ్యాంగులను సన్మానించారు.

నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం,    కంసాన్‌పల్లి గ్రామంలో    గ్రామంలోని 4వ వార్డు మెంబర్‌గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో    ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే,   నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు.   విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు.    ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం   అర్ధరాత్రి షాద్‌నగర్ […]

‘ఆ 32 వేల నియామకాలు చెల్లుతాయ్’‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ   నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.    ఈ కేసుతో ముడిపడి ఉన్న 32 వేల ప్రైమరీ టీచర్ల నియామకాలు    రద్దుచేస్తూ సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.    తొమ్మిదేళ్లుగా సర్వీసులో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే వారి    కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది.  సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసిన ఆ 32 వేల మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని […]

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బై ఎలక్షన్స్‌.. ఎవరికి ఎన్ని సీట్లంటే..!

 ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో    ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP)    అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా,   ప్రతిపక్ష ఆప్‌ (AAP) 3 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో  మాత్రమే విజయం సాధించింది.    ఇక మిగిలిన 12వ స్థానాన్ని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB) తన ఖాతాలో వేసుకుంది.   మొత్తం 250 స్థానాలకుగాను బీజేపీకి 122 ,  ఆప్‌కు 102 . […]

ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం వరకు రాయితీ ఇస్తున్నారంటూ

సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలపై  హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం అని..  ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 13న ట్రాఫిక్  చలాన్లపై 100 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు.  ఈ రాయితీలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి గానీ..  ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గానీ అధికారిక ప్రకటన గానీ, సమాచారం గానీ రాలేదని పేర్కొన్నారు.

రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి

 త్వరలో మరో 40,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యంత్రి శంకుస్థాపన చేశారు.  సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ హుస్నాబాద్‌ నుంచే బహుజన దండు కట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే  60,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రజాపాలన  రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రుతురాజ్, కోహ్లీ అద్భుత సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకుపోతోంది. రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి వన్డే శతకం. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON