loader

హార్మూజ్ జలసంధి వద్ద హైటెన్షన్

హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేసే దిశగా అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ నేవీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అవసరమైతే భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపుతామని […]

రాజస్థాన్ కు షాక్ ఇచ్చిన సన్ రైజర్స్

ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్రైజర్స్ షాక్ ఇచ్చింది. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనావన్ ఫెరీరా (69; 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు), రవీంద్ర జడేజా […]

తొలి మ్యాచ్‌లోనే ప్రఫుల్ హిస్టరీ.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!

ఐపీఎల్ (IPL) చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అరంగేట్ర మ్యాచ్లోనే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్ గా ప్రఫుల్ చరిత్ర సృష్టించాడు.వేసిన రెండో బంతికే వికెట్ల వేట మొదలుపెట్టి కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి మూడు ప్రధాన వికెట్లు కూల్చడం స్పోర్ట్స్ ఎనలిస్టులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. కీలక మార్పులు.. మే నుంచి అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు మే ఒకటో తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిజికల్ అప్లికేషన్లకు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి, మే ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ […]

ఒక్క మహిళనూ అధ్య‌క్షురాలిగా నియామించలేదు: సిఎం

భార‌తీయ జ‌న‌తా పార్టీ…అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6 బిజెపి ఏర్పాటైందని.. అప్పటి నుంచి మొత్తం 15 మంది బిజెపి అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగిందని.. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని విమర్శించారు. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం.అని పేర్కొన్నారు.

శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ రైలు ప్రారంభం

ఉత్తరాంధ్ర వాసులు శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా వెళ్లాలంటే విశాఖకు వెళ్లి, అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వెళ్లాల్సిన పరిస్ధితుల్లో రైల్వేశాఖ ఇవాళ్టి నుంచి డైరెక్ట్ రైలు హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య వారానికోసారి రాకపోకలు సాగించేలా రూపొందించిన ఈ రైలును ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో ఇవాళ్టి నుంచి ప్రతీ సోమవారం మధ్యాహ్నం […]

టీసీఎస్‌లో లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశించిన సంస్థ చైర్మన్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ (TCS Nashik) శాఖలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి పరిణామాలు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర ఆందోళనకరమైనవని, భాదాకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలపై నిజనిర్ధారణ చేయడానికి, బాధ్యులను గుర్తించడానికి టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసినట్లు ఆయన ప్రకటించారు. ిందితులైన ఉద్యోగులపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల విచారణకు కంపెనీ పూర్తిగా సహకరిస్తోందని స్పష్టం […]

ఇషాన్‌ కిషన్‌ సెంచరీ మిస్‌

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ (91; 44 బంతుల్లో) చెలరేగి ఆడాడు. ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో సెంచరీకి చేరువైన సమయంలో.. 13.2 ఓవర్‌లో సందీప్‌ శర్మ బౌలింగ్‌ ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 202/5. క్లాసెన్‌ (31*), నితీశ్‌కుమార్‌ రెడ్డి (1*) క్రీజులో ఉన్నారు.

బాంబులకు బెంగాలీలు ఓట్లతో జవాబిస్తారు: అమిత్ షా

బాంబులు, తూటాలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓట్లతో సమాధానం చెబుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యానికి ప్రజలు అంతం పలుకబోతున్నారని పరోక్షంగా టిఎంసిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సోమవారంనాడు బీర్బుమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు పాల్పడకుండా టిఎంసి గుండాలు ఇళ్లకే పరిమితం కావాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అమిత్ షా హెచ్చరించారు.

ఆస్పత్రి నుంచి మహిళా ఖైదీ పరార్

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళా ఖైదీ పరారైన సంఘటన పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. గంటసాల త్రివేణి(26) చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉంది. త్రివేణి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పేట్లబుర్జు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. సెక్యూరిటీగా ఎఆర్ కానిస్టేబుళ్లు వచ్చారు. సెక్యూరిటీ గార్డుల కళ్లు కప్పి త్రివేణి ఆస్పత్రి నుంచి పరారయ్యారు. పోలీసులు హుస్సేనీ ఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON