ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్రైజర్స్ షాక్ ఇచ్చింది. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనావన్ ఫెరీరా (69; 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు), రవీంద్ర జడేజా (45; 32 బంతుల్లో) పోరాడారు.

