loader

ఆ ముస్లిం దేశాధినేత కోసం మోడీ ప్రోటోకాల్ బ్రేక్..! ఎయిర్ పోర్టుకెళ్లి, కౌగిలింతలతో..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాధినేత షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇవాళ దాదాపు రెండు గంటల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. దీంతో మన ప్రధానమంత్రి మోడీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. దౌత్యపరంగా భారత్ కు కీలకమైంది. రక్షణ, వాణిజ్యం, ఇంధనం మరియు ప్రాంతీయ భద్రతలో రెండు దేశాల మధ్య సహకారం విస్తరిస్తున్న నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది.

అమెరికాలో డ్ర‌గ్స్‌, వ్య‌భిచారం.. భార‌తీయ సంత‌తి జంట అరెస్టు

అమెరికాలోని నార్త‌ర్న్ వ‌ర్జీనియాలో డ్ర‌గ్స్ అమ్ముతూ, వ్య‌భిచార ముఠా నిర్వ‌హిస్తున్న భార‌తీయ సంత‌తి జంట‌ను అరెస్టు చేశారు. త‌మ స్వంత హోట‌ల్‌లో ఈ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు డాక్యుమెంట్ల‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కోశా శ‌ర్మ‌, ఆమె భ‌ర్త త‌రుణ్ శ‌ర్మ‌పై అభియోగాలు న‌మోదు చేశారు. 2023 మే నుంచి రెడ్ కార్పెట్ ఇన్‌ను శ‌ర్మ దంప‌తులు లీజ్‌కు తీసుకుని న‌డిపిన‌ట్లు తెలుస్తోంది. డ్ర‌గ్ సేల్స్‌, వ్య‌భిచార ముఠా ద్వారా వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు […]

గ్రీన్‌ల్యాండ్‌ వివాదం- ట్రంప్ను కలవనున్న రుట్టే- డెన్మార్క్‌కు యూరప్ సంపూర్ణ మద్దతు

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గ్రీన్‌ల్యాండ్‌, ఆర్కిటిక్ భద్రతా పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. ఈ వారం దావోస్‌లో ట్రంప్‌ను కలవనున్నట్లు తెలిపారు. “గ్రీన్‌ల్యాండ్‌, ఆర్కిటిక్ భద్రతపై అధ్యక్షుడితో మాట్లాడాను. ఈ అంశంపై కలిసి పని కొనసాగిస్తాం. దావోస్‌లో ఆయనను కలవడం కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రుట్టే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ట్రంప్ చేసిన హెచ్చరికలపై యూరప్ గట్టిగా స్పందిస్తోంది. డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాలు ఏకమయ్యాయి.

స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. 21 మంది మృతి.. వంద మందికి పైగా గాయాలు

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోర్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మృతి చెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మాడ్రిడ్ నుంచి హువెల్యాకు వెళ్తున్న రెన్ఫే రైలును.. మాలాగా నుంచి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఇర్యో హైస్పీడ్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కరాచీలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి, అంతకంతకూ పెరగుుతున్న మృతులు!

పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి (జనవరి 17, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా, కొంతమంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

నోబెల్ ప్రైజ్ పై తేల్చేసిన కమిటీ..! ట్రంప్-మచాడో డ్రామాపై.!

వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తనకు ఇచ్చిన ప్రైజ్ ను తీసుకెళ్లి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు కోసం ఆయనకు తిరిగి ప్రదానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నార్వేకు చెందిన నోబెల్ అవార్డుల ఫౌండేషన్ స్పందించింది. ప్రతీ నోబెల్ బహుమతిని ప్రదానం చేసే హక్కు ఎవరికి ఉందో అది నిర్దేశిస్తుందని ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అందువల్ల ఒక బహుమతిని, ఊహకు కూడా మరెవరికీ బదిలీ చేయలేము లేదా పునఃప్రదానం కూడా చేయలేమని తేల్చిచెప్పేసింది. తద్వారా […]

అదానీ సోలార్​కు అరుదైన ఘనత- భారత్​ నుంచి ఏకైక కంపెనీగా రికార్డ్!​

భారత్​కు చెందిన అదానీ సోలార్​ ప్రఖ్యాత అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి విభాగంలో ప్రఖ్యాత వుడ్ మెకెంజీ ర్యాకింగ్స్​లో చోటు దక్కించుకుంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంబంధించిన అదానీ సోలార్‌కు గ్రేడ్ Aతో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ మాడ్యూల్ తయారీదారులనను పరిశీలించి ర్యాంకింగ్‌ ఇవ్వగా, అందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీగా అదానీ సోలార్ నిలిచింది.

ట్రంప్‌ మమల్ని నట్టేట ముంచేశారు.. ఇరాన్‌లో జనాగ్రహం

ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా గళమెత్తిన వేల మంది ఇరాన్ ప్రజలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌‌లో ప్రభుత్వ మార్పుపై గంపెడాశ పెట్టుకున్న వారు ట్రంప్ తాజా ప్రకటనతో తాము నిస్సహాయులుగా మిగిలిపోయామని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు ట్రంప్‌ నుంచి ఊహించని ప్రకటన రావడంతో వారంతా హతాశులైపోయారు. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకోబోమని తనకు ఇరాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.

అస్సలు వెనక్కి తగ్గం​- ఆ బెదిరింపులు మమ్మల్ని ఏం చేయలేవ్​: మెక్రాన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీవ్రంగా స్పందించారు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించలేనివని స్పష్టం చేసిన మెక్రాన్, యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా, సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ ‘ఒక క్రిమినల్’ – వేలాది మంది మరణాలకు అమెరికాయే కారణం: సుప్రీం లీడర్ ఖమేనీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన కామెంట్స్ చేశారు. ట్రంప్ ‘ఒక నేరస్థుడు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో జరిగిన భారీ నిరసనలకు అమెరికా మద్దతు తెలపడంపై మండిపడ్డారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్‌లో ఖమేనీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న అశాంతికి అమెరికాయే కారణమని ఆరోపించారు. ఈ అల్లర్ల వల్ల జరిగిన ప్రాణనష్టానికి, ఆస్తి నష్టానికి గానూ మేము అమెరికా అధ్యక్షుడిని నేరస్థుడిగా పరిగణిస్తున్నాం” అని  ఖమేనీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON