loader

45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించే 63 అంశాలతో ప్రతిదానికో ధరను నిర్ణయించారు. వాటి సైజు, విస్తీర్ణం ప్రకారంగా రేట్లను నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థి మున్సిపాలిటీలో రూ. లక్ష, కార్పొరేషన్లలో రూ.1.5 లక్షల్లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లో పూర్తిస్థాయిలో ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేస్తారు. ఓడిన అభ్యర్థులు  మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లోనైనా […]

బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య.. కాంగ్రెస్ వేధింపుల వల్లేనా? రాజకీయ దుమారం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న జరగబోతోంది. దానికి ముందు రోజు నారాయణపేట జిల్లా.. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు అంటే.. చందాపూర్ గ్రామంలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు. ది ఆత్మహత్య కాదనీ.. ఒక రకమైన హత్య అని మహాదేవ్ భార్య సత్తెమ్మ, కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రత్యర్థుల వేధింపులు, […]

ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

ఎంఐఎం అధినేత  అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్లు అయినా, రావులు అయినా మా దగ్గరకే రావాల్సిందే” అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, అవసరమైతే వాళ్లే తమ వద్దకు రావాలని ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ నిజంగా గెలిచిందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో స్పష్టంగా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగానికి హాజరు కానున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు .. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అనర్హత వేటు భయం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాప్రతినిధి అయినా సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. కనీసం ఒక్క రోజు హాజరై సంతకం చేయడం ద్వారా ఆ సాంకేతిక ఇబ్బందిని అధిగమించాలని ఈ […]

అంబటి రాంబాబుకు బెయిల్‌

వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ వచ్చింది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు సోమవారం గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న అంబటిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, మరో కేసులో అంబటి రాంబాబుకు ఫిబ్రబవరి 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది

మైకులు బంద్.. ముగిసిన ఎన్నికల ప్రచారం..

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారంతో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది నిలిచారు. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదు: కేటీఆర్ హెచ్చరిక

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేదిక వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానిస్తే సహించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాల్లో గౌరవం, సంస్కారం ఉండాలని ఆయన సూచించారు.

లోక్‌సభ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానానికి విపక్షాల యోచన

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఎంపీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పబ్లిష్ కాని ఎంఎం నరవణె పుస్తకంపై సభలో మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశాన్ని ఇచ్చేది లేదని ఓంబిర్లా తేల్చి చెప్పారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడే అవకాశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ కోల్పోయారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని […]

రేవంత్ రెడ్డి మెదక్‌కు వచ్చేందుకు భయపడుతున్నాడు.. దుబ్బాక ప్రచారంలో హరీశ్‌రావు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీశ్‌‌రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు.ఇక్కడ హరీశ్‌రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు,  గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడటం […]

మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత..

బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ మహిళను ఎందుకు అలా కొట్టాడో అన్నది తెలియలేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ వీడియో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON