loader

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. ముగిసిన పోలింగ్ ప్ర‌క్రియ‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌కు సంబంధించిన పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 6 గంట‌ల‌కు ముగిసింది. పోలింగ్ స‌మ‌యం ముగిసే నాటికి క్యూలైన్ల‌లో నిల్చున్న వారంద‌రికీ ఓటేసేందుకు అధికారులు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. యూసుఫ్‌గూడ మ‌హ‌బూబ్ ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దొంగ ఓట్ల విష‌యంలో నిల‌దీసిన బీఆర్ఎస్ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి.. ఇరు పార్టీల నేత‌ల‌కు స‌ర్దిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జ‌న్యాల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి […]

పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్ల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది. పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి, ఓటింగ్ శాతం కేవలం 9.2% వద్ద నిలిచింది, ఇది ఆశించిన 18% కంటే చాలా తక్కువ. జూబ్లీహిల్స్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది, ఉప ఎన్నిక కావడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. విద్యావంతులైన ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఉచిత ఆటోలు, క్యాబ్‌లు, రాపిడో వెహికిల్స్ ఏర్పాటు చేసినా ఓటర్లు కదలడం లేదని […]

కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, BRS అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడ నవోదయ కాలనీలో ఆమె కుమారుడు,  ఇద్దరు కుమార్తెలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.  గోపీనాథ్ ఆకస్మికంగా మృతిచెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. మాగంటి గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చారు.

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..

బీహార్‌ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారునెల 14 అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

నా గొంతు కోసినా.. ఎస్ఐఆర్‌పై మమత ఆగ్రహం

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం, ఎన్నికల కమిషన్‌‌పై విమర్శలు గుప్పించారు. డీమోనిటైజేషన్, ఎస్ఐఆర్ డ్రైవ్‌ను ఒకేగాట కడుతూ మొదటిది ‘నోట్‌బందీ’ అయితే, రెండవది ‘ఓట్‌బందీ’ అని అన్నారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు. ఎస్ఐఆర్‌ను విమర్శించినందుకు బీజేపీ తనను జైలుకు పంపినా, గొంతు కోసినా ప్రజల ఓటు హక్కులను మాత్రం ఊడలాక్కోలేరని అన్నారు.

కమ్మ, కాపు వేరు వేరు కాదు.. కులాలకు కొత్త భాష్యం చెప్పిన ఎమ్మెల్యే వసంత

టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కామెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైలవరంలో కాపు వన సమారాధన వేదికగా ఆయన కులాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సన్నిహితులంతా కాపువారేనన్నారు వసంతకృష్ణప్రసాద్‌. తన కంపెనీలను చూసుకుంటున్నది కూడా కాపులే అని చెప్పారు. తక్కువ పొలాలుంటే కాపువారని.. ఎక్కువ పొలాలుంటే కమ్మవారని అనేవారని చెప్పారు వసంతకృష్ణప్రసాద్‌. కాపు కమ్యూనిటీ భవనానికి విరాళంగా 10లక్షలు ప్రకటించారు వసంతకృష్ణప్రసాద్‌. కాపులు, కమ్మ అనే భేదం వద్దన్నారు. కమ్మ, కాపు కలిసి పనిచేస్తే అద్భుత […]

తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన కేటీఆర్.

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మూడు నెలల్లోపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ… ఆయన ఎటువంటి చర్యు తీసుకోలేదని కేటీఆర్ తన పిటిషన్‌‌లో పేర్కొన్నారు.  కేటీఆర్‌ పిటిషన్‌పై ఈ నెల 17న విచారణ జరిగే అవకాశం […]

వారికి అవగాహన కల్పించండి.. మంత్రులతో లోకేష్

తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అన్నారు. సీనియర్లు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరమన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని కీలక సూచనలు చేశారు.

జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలువబోతున్నాం: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓట్ల చోరీ విషయంలో మోదీ, అమిత్ ​షా ఎక్కడికెళ్లినా​ దొరికిపోతారు: రాహుల్​ గాంధీ

ఓట్ల చోరీ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ ​షాలు​ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చివరకు దొరికిపోతారని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్​లోని కిషన్​గంజ్​లో జరిగిన ర్యాలీలో అన్నారు. బిహార్​లో 100శాతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఓట్ల చోరీపై ఆధారాలు చూపించామని కానీ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON