loader

తమిళనాడులో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి విజయాన్ని కాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమిళ గడ్డపై సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు కోయంబత్తూర్, హోసూర్, చెన్నై,రెండవ రోజున మదురై ,శాత్తూరు నగరాల్లో పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.

తల్లికి క్యాన్సర్ అని.. ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసిన కేటుగాడు,బట్టబయలు చేసిన ప్రియురాలు

తన తల్లికి సర్వైకల్ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లు జయమ్మ అనే ప్రభుత్వ ఉద్యోగి కొడుకు చక్రపాణి నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కర్నూలు మెడికల్ బోర్డు పరీక్షల సమయంలో తన తల్లికి బదులుగా మరో మహిళను పంపి అనారోగ్య ధ్రువీకరణ పొంది ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందాడు. అయితే.. చక్రపాణికి అతని ప్రియురాలితో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. అతను తల్లి ఉద్యోగం కోసం చేసిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా సేకరించిన […]

రాముణ్ణి వెక్కరించలేదు…ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు- ప్రకాష్ రాజ్

శ్రీరామచంద్రుని మీద చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. తన మాటల్ని వక్రీకరించారని చెప్పిన ప్రకాష్ రాజ్… అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు రాముడిని వెటకారం చేసే అవసరం అయితే లేదని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. సో… […]

పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న క్రమంలో ప్రధాని మోదీ ఆయనతో స్వయంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్  శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ […]

అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

అమెరికాలోని ఉత్తర ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని టోర్నడో వణికించింది. లీనా పట్టణంలో సంభవించిన ఈ సుడిగాలి ధాటికి ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ లైన్లు తెగిపడి పట్టణం చీకటిమయమైంది. విస్కాన్సిన్, మిన్నెసోటా రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది.

అక్షయ తృతీయ

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది .

తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా చిత్తరంజన్ ను నియమించారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా చైతన్య రెడ్డి, జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా పండరీ చేతన్, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) గా విక్రాంత్ కుమార్ సింగ్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్, వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్ మీనా, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా మౌనిక, నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీగా […]

ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపించారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON