loader

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్..

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో  కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభిషేక్ మనుసింఘ్వీకి పార్టీ అధిష్టానం మరో అవకాశం ఇచ్చింది. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు ఇక రెండో స్థానం కోసం తెలంగాణ నుంచి రాజ్యసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసింది […]

10 ఫోర్లు, 8 సిక్స్​లతో ఫిన్ అలెన్ ఊచకోత

టిమ్ సైఫెర్ట్ (58 పరుగులు, 33 బంతుల్లో), ఫిన్ అలెన్ (100 పరుగులు, 33 బంతుల్లో- 10 ఫోర్లు, 8 సిక్స్​లు) విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్​కు 117 పరుగులు జోడించారు. టీ20 వరల్డ్​కప్​లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన క్రికెటర్​గా ఫిన్ అలెన్ రికార్డు సృష్టించాడు. అతడు కేవలం 33 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు.

ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి..87 మంది మృతి..వీడియో రిలీజ్ చేసిన US

శ్రీలంక దక్షిణ తీరం నుంచి వెళుతున్న ఒక ఇరాన్ యుద్ధ నౌక (IRIS Dena)పై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారని అమెరికా పేర్కొంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన యుద్ద నౌకపై తాము జరిపిన దాడికి సంబంధించిన వీడియోను అమెరికా సైన్యం విడుదల చేసింది. ఇరాన్ నౌక నుండి ప్రమాద సంకేతం అందిన వెంటనే, శ్రీలంక సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ 2026 ఫైనల్ కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్యంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఫైనల్ కు […]

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?

మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి, దేశవ్యాప్త విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

ఇరాన్‌లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సుమారు 131 నగరాలు లక్ష్యంగా అమెరికా బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాలను కూడా ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు మరియు 9 యుద్ధ నౌకలను […]

వేట్లపాలెం బాణసంచా ఘటన – 26కు చేరిన మృతుల సంఖ్య

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను (35), చిటికెల లక్షి (45) ఇద్దరు మృతి చెందారు. వేట్లపాలెం ఘటనకు సంబంధించి శాసనసభలో సీఎం చంద్రబాబు మృతులు 26 మంది అని ఈ ప్రమాదంలో మరణించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరణించిన వారికి సీఎం చంద్రబాబు, సభలోని సభ్యులు రెండు నిమిషాల పాటు తమ సంతాపాన్ని తెలియజేశారు.

విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ – మందన్నా ఫ్యామిలీలు

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఇవాళ (మార్చి 4వ తేదీన) హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్మికా మందన్నా తల్లిదండ్రులు మదన్ మందన్నా, సుమన్ మందన్నా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు – మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దేవరకొండ – మందన్నా ఫ్యామిలీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

చెలరేగిన యాన్సెన్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి సెమిఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు, న్యూజిలాండ్ కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. భారీ సిక్సులతో న్యూజిలాండ్ బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. కేవలం 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 […]

క్లాస్‌రూంలో గొడవ..టీచర్‌పై పదో తరగతి విద్యార్థి దాడి..

ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ నిలువరించే క్రమంలో దుర్భాషలాడిన టీచర్‌పై ఓ పదోతరగతి విద్యార్థి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి సదరు టీచర్‌పై పిడిగుద్దులు కురిపిస్తుండగా.. అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు అతన్ని అడ్డుకున్నారు. మా అమ్మను తిడతాడా..? అని ఆ విద్యార్థి అంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON