loader

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

“ఉగ్రవాద కార్యకలాపాలకు దోహదపడటం” ఆరోపణల నేపథ్యంలో పావెల్ దురోవ్  పై రష్యా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది రష్యా క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 205.1, పార్ట్ 1.1 కింద దురోవ్ పై నేరం పెట్టబడింది. ఈ కేసు “ఉగ్రవాద కార్యకలాపాలకు సహాయం”కు సంబంధించి దర్యాప్తు చేయబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ క్రియాశీల వినియోగదారులు టెలిగ్రామ్ ను ఉపయోగిస్తున్నారు. టెలిగ్రామ్ “తీవ్రవాద కంటెంట్”ను తొలగించడంలో విఫలమైందని, ఇది నేర కార్యకలాపాలకు ఉపయోగపడిందని రష్యా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఏఐతో ముప్పేమీ లేదు

కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్‌ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ స్మిత్‌ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్‌గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్‌ లక్ష్యమని ఆయన చెప్పారు.

‘ఏంటో విజయాలన్నీ మాకే దక్కుతున్నాయ్‌’.. ఎల్‌ మెంచో హతంపై ట్రంప్‌ సరదా పోస్ట్‌..!

మెక్సికో కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ నెమెసియో ఒసెగుయెరా అలియాస్‌ ‘ఎల్‌ మెంచో’ ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ఎల్‌ మెంచో అంతానికి పక్కా ప్లాన్‌ చేసింది అమెరికా కాదని, తమ స్పెషల్‌ ట్రూప్స్‌ అని చెబుతోంది. దీనిపై తాజాగా సోషల్‌ మీడియా ట్రూత్‌‌లో స్పందించారు. ‘ఏంటో అన్నింటిలో మేమే గెలుస్తున్నాం. ఇలా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు’ […]

దాడులు జరగొచ్చు.. ఇరాన్‌ను విడిచి వెళ్లండి: భారత్ కీలక ప్రకటన..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.. ఏ క్షణాన్నైనా ఇరు దాడులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఈ క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది. టెహ్రాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ను విడిచి వెళ్లాలని భారత్ పౌరులను కోరింది. రాబోయే రోజుల్లో అమెరికా దాడుల జరగొచ్చని.. దీని కారణంగా ఇరాన్‌లోని భారతీయులు.. దేశాన్ని విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. “వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని” పౌరులను కోరింది.

నేపాల్లో లోయలో పడిన బస్సు- 18 మంది మృతి

నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధాడింగ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. మృతుల్లో న్యూజిలాండ్కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో జపనీస్, డచ్ జాతీయురాలు ఉన్నట్లు చెప్పారు.

మోస్ట్‌ వాంటెండ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- మెక్సికోలో చెలరేగిన హింస

మెక్సికో మోస్ట్‌ వాంటెండ్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌ ఎల్‌ మెంచో మిలిటరీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. డ్రగ్స్‌ మాఫియా డాన్‌ ఎల్‌ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది. అతడి అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగులబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులకు ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మెక్సికోలని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎల్‌ మెంచోకు చెందిన జాలిస్కో న్యూజనరేషన్‌ కార్టెల్‌ సంస్థ అమెరికాకు […]

ఇరాన్‌ బోటును అడ్డుకున్న భారత కోస్ట్ గార్డ్.. రూ.5 కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం

ఇరాన్‌ బోటును భారత కోస్ట్ గార్డ్ అడ్డుకున్నది. రూ.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నది. ఆ బోటులో ఉన్న నలుగురు ఇరాన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నది. గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 21న ద్వారకాకు పశ్చిమాన సుమారు 115 నాటికల్‌ మైళ్ల దూరంలో అనుమానాస్పద విదేశీ పడవను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. అల్ ముఖ్తార్‌గా గుర్తించిన ఇరాన్‌ పడవ, అందులో ఉన్న నలుగురు సిబ్బందిని గుజరాత్‌లోని […]

అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు

పాక్ వాయుసేన శనివారం రాత్రి అఫ్గానిస్థాన్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. పాక్-అఫ్గాన్ సరిహద్దు వెంబడి పలు ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో సుమారు 17 మంది మృతి చెందారు. ఉగ్ర మూకలు దాక్కున్న ప్రాంతాలపై ఈ దాడులు చేశామని పాక్ తెలిపింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఏడు స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేసిందని తెలిపారు. పాక్ తాలిబాన్లు, వారి స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని చెప్పారు.

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్ సరిహద్దుల్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా లక్ష్యంగా జరిపిన భారీ వైమానిక దాడులు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ మెరుపు దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ఒక సీనియర్ ఫీల్డ్ కమాండర్‌తో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2024 నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద మరియు అత్యంత భీకరమైన దాడి […]

ఆంథ్రోపిక్ ఒక్క పోస్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్

కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON