పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరుకున్న మొదటి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీతో ఇంగ్లాండ్ను విజయతీరాలకు చేర్చగా, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది పోరాటం వృధా అయింది.

