రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మూడు సంవత్సరాల నిబంధన వల్ల జూనియర్ లెక్చరర్లకు తీరని అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మూడు సంవత్సరాల నిబంధన విధిస్తే, మరోసారి బదిలీలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా రెండేళ్ల సర్వీసు నిబంధనను అమలు చేసి, అర్హులైన వారందరికీ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

