దేశ రాజధానిలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న అమర్ కాలనీలో ఒక ఉన్నతాధికారి కుమార్తె (22) విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. హై-ప్రొఫైల్ జోన్ అయిన అమర్ కాలనీలో నిరంతరం నిఘా మరియు భద్రతా సిబ్బంది ఉంటారు. నిందితులు మొబైల్ ఛార్జింగ్ వైరుతో యువతి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ముందు యువతిపై లైంగిక దాడి జరిగినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత రావడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

