loader

కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్ రెడ్డి : హరీష్ రావు

తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాలపై తాము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందని, బనకచర్ల ప్రాజెక్టు పేరు మారినా తెలంగాణకు ద్రోహం మారలేదని విమర్శించారు. ఢిల్లీలో జరిగేది.. పేరుకే జలవివాదాల మీటింగ్ అని.. త్తి ఎపి చంద్రబాబుది.. పొడుస్తున్నది సిఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు […]

జీవీఎంసీ కౌన్సిల్ తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తోసేసిన మేయర్

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మేయర్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. గీతం భూముల వ్యవహారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ పీలా శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను మేయర్ తోసేశారు. కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు బీభత్సం సృష్టించారు. 62వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి […]

విశాఖ భూ దోపిడీపై వైఎస్సార్సీపీ పోరాటం..

గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నిరసన దీక్ష అనంతరం గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోనుంది. గీతంకు భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్‌ విచారణ

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విచారణ ప్రారంభించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతరులు వేసిన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నది. పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత స్పీకర్‌ సాక్ష్యాలను నమోదు చేయనున్నారు. స్పీకర్‌ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ విచారణ చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న మూడు అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు […]

జగన్‌కు అధికారం సరికాదు – గతంలో ఇస్తే ఏం చేశారు: వైఎస్ షర్మిల

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. అధికారం కోసమే జగన్ పాట్లు అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహంచిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడుతూ అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జలయజ్ఞం పూర్తి చేయగలిగారా, నవరత్నాల్లో పెట్టిన హామీలను అమలు చేశారా, మద్యనిషేధం అమలు చేశారా అంటూ నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కి నోటీసులు.. రేపు సిట్ విచారణ

సిట్ బృందం.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం అయిన కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్.. నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. కేసీఆర్ పీఏకి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్.. పోలీస్ స్టేషన్‌కి రావాల్సిన అవసరం లేదనీ.. ఎక్కడికి రావాలో చెబితే.. తామే వస్తామని తెలిపారు. కానీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందనీ, సిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ టూర్ – అమిత్ షాతో చర్చలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర భద్రత ,శాంతిభద్రతల అంశాలతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుండి అందాల్సిన పూర్తి సహకారంపై ఆయన విన్నవించారు.  ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు సీ ప్రొటెక్షన్ వాల్ ప్రాజెక్టు గురించి పవన్ […]

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌‌తో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు పవన్. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ROB) నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరిన పవన్..

జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన: ఆర్ కే రోజా

మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన. క్యారెక్టర్ లేనివాళ్లతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నాయకులుంటే ప్రజలకు విలువ ఉండదు. మహిళకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయరు. రైల్వేకోడూరులో బాధితురాలికి న్యాయం చేయాలి. రాష్ట్ర హోంమంత్రిని సస్పెండ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.

అజిత్ పవార్ మృతి పట్ల చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ అకస్మాత్తుగా మరణించడం దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.  అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడంపై  ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర గురిచేసిందన్నారు. పవార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓం శాంతి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON