loader

అక్రమసంబంధం పెట్టుకోవాలని వివాహితను బెదిరించిన ప్రజాప్రతినిధి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో కంచర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఓ వివాహితను అక్రమ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు బెదిరించాడు. డబ్బులు, నగలు ఆశ చూపి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటానని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. కేసు నమోదు చేసి […]

ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు: అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి

ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడికి ప్రతిస్పందనగా, ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికా బలగాలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) డ్రోన్‌లను ప్రయోగించిందని స్థానిక మీడియా సోమవారం నివేదించింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా దళాలు ఒక ఇరాన్ నౌకను లక్ష్యంగా చేసుకున్నాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఐఆర్‌జిసి నావికా దళాల “సకాలంలో రాక, వేగవంతమైన ప్రతిస్పందన” కారణంగా అమెరికా దళాలు వెనుదిరగవలసి వచ్చిందని అది పేర్కొంది.

ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటూ ఖరీదైన కార్లు, పబ్‌లలో దిగిన ఫొటోలను చూపిస్తూ తాను రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని నమ్మించి చాటింగ్ ద్వారా ప్రేమ పేరుతో లోబరుచుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 మందికి పైగా యువతులను అర్జున్ మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధిత యువతుల […]

పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్

తుపాకీతో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. ధనరాజు అనే కానిస్టేబుల్ కాకినాడ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా రైఫిల్‌తో కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది అతడు తీవ్రంగా గాయపడడంతో కాకినాడ జిజిహెచ్‌కి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరాన్‌లో ఐఆర్‌జీసీ ఆధిపత్యం: మితవాద దౌత్యానికి చెక్!

ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఇరాన్ విదేశాంగ విధానాన్ని శాసించే మితవాద నాయకులను పక్కకు నెట్టి, అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పట్టు సాధించింది. IRGC కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిది, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఘర్ జోల్ఘాదర్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తాబ్ కలిసి ఒక శక్తివంతమైన వర్గంగా ఏర్పడ్డారు. వీరు మితవాద విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రభావాన్ని […]

భారీ భూ కుంభకోణం..సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ యజమాని..భార్యపై కేసు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నగరంలోని వివాదాస్పద భూములను అమ్ముతామని నమ్మించి, ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థను రూ.14.85 కోట్లకు ముంచిన ఆరోపణలపై సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ యజమాని శరణాల శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్యలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) కేసు నమోదు చేసింది. తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరినందుకు నిందితులు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు క్రిమినల్ […]

అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్ వద్ద ఉన్న క్యాంటీన్‌కు చేరుకున్న ఆయన, తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అక్కడ అల్పాహారం తీసుకున్నారు. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఒక రోజు ఉచిత […]

రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్

సైబర్‌ మోసాల భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేధించారు నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు,  సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కైన ఆయా బ్యాంకుల అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు అకౌంట్స్‌ తెరిచి.. వాటిని మ్యూల్ అకౌంట్స్‌గా వాడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు గుర్తించారు. ఈ అకౌంట్స్‌కు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్‌ […]

కొండపైనుంచి బస్సు బోల్తా.. 15 మంది మృతి!

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి కొండపై నుంచి దొర్లుతూ కిందకు పడిపోయిన ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ బస్సు ఓ మారుమూల గ్రామం నుంచి ఉధంపుర్‌కు వెళ్తుండగా.. కాగోర్ట్ గ్రామ సమీపంలోని కొండ మార్గంలో మలుపు దాటుతుండగా ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ – మామయ్య గారు అంటూ…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ‘ఏపీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మామయ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని… అదే అంకిత భావంతో దార్శనికతతో మన ప్రజలకు నాయకత్వం వహించి, సేవ చేసే శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని… నిరంతరం స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON