ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్ను సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు పటమట హైస్కూల్ రోడ్డులోని రైతు బజార్ వద్ద ఉన్న క్యాంటీన్కు చేరుకున్న ఆయన, తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అక్కడ అల్పాహారం తీసుకున్నారు. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సతీమణి నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఒక రోజు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు.

