loader

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

స్విస్ బహుళజాతి పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ UBS బుధవారం హైదరాబాద్‌లో తన కొత్త గ్లోబల్ కెపెబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించింది. ఈ కేంద్రం UBSకు నగరంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మరియు భారతదేశం పట్ల తన దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటించడానికి కీలకమైన అడుగు అని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త కేంద్రం ప్రారంభంతో రాబోయే రెండేళ్లలో దాదాపు 3వేల మంది నిపుణులను UBS నియమించనుందని సంస్థ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు- ఐటీ షేర్లు కకావికలం!

భారత స్టాక్ మార్కెట్‌లో భారీగా నష్టపోయాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 465 పాయింట్లు పడిపోయింది, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 25,821 కంటే దిగువన ట్రేడవుతోంది. ట్రేడింగ్ రోజున ఐటి స్టాక్‌లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ స్టాక్‌లు నిఫ్టీలో 5 శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ కూడా ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్‌కు అనుకూలంగా లేదు. ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి.  హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ […]

గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్

బంగారం, వెండి ధరలు మళ్లీ భారీ షాక్ ఇచ్చాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1310 పెరిగింది. దీంతో తులం ధర రూ.1,57,910కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1200 పెరిగి తులం ధర రూ.1,44,750గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక్కరోజే కిలోకు రూ.15,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది.

తమిళనాడులో టీఎంపీవీ కొత్త తయారీ కేంద్రం ప్రారంభం..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (TMPV) లిమిటెడ్‌ తమిళనాడులో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను సోమవారం తెరిచారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ పాల్గొన్నారు. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌తోపాటు, దాని అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్ రోవర్ (JLR) కు చెందిన కార్లనూ ఇక్కడే తయారుచేస్తారు.

గోల్డ్, సిల్వర్ రేట్స్ సీన్ రివర్స్… ఇవాళ కూడా బంగారం, వెండి ధరల పతనం

బంగారం, వెండి ధరల ట్రెండ్ మారిపోయిందా? ప్రస్తుతం సీన్ అలాగే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ పడిపోయాయి. ఫిబ్రవరి 6న బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.2,070 తగ్గింది. రూ.1,54,350 నుంచి రూ.1,52,350కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,900 తగ్గింది. రూ.1,41,550 నుంచి రూ.1,39,650కి చేరింది. కిలో వెండిపై  రూ.20,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర […]

400 బిలియన్ డాలర్ల ఆదాయంతో గూగుల్ సరికొత్త రికార్డ్! ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే!

గూగుల్ తన Q4 ఎర్నింగ్స్‌లో మొదటిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించిందని రిపోర్ట్ చేసింది. ఈ ఫలితాలకు సంబంధించిన వివరాలను ఒక అద్భుతమైన త్రైమాసికంగా పేర్కొంటూ, CEO సుందర్ పిచాయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. “మా పార్ట్‌నర్స్ & ఉద్యోగులకు ధన్యవాదాలు, ఇది అద్భుతమైన త్రైమాసికం, మొదటిసారిగా వార్షిక ఆదాయం 400 బిలియన్ డాలర్లను దాటింది” అని పోస్టులో పేర్కొన్నాడు. “Well done ” అంటూ ఎలాన్ మస్క్ సుందర్ పిచాయ్‌ పోస్టుకు రిప్లై ఇచ్చారు

బంగారం, వెండి ధరల ఊగిసలాట… ఇవాళ భారీ పతనం

నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ఇవాళ కూడా అదే ట్రెండ్ ఉంటుందేమో అనుకున్నారు. కానీ  బంగారం, వెండి ధరలో మరోసారి భారీగా పతనం అయ్యాయి.ఫిబ్రవరి 5న బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.5,020 తగ్గింది. రూ.1,59,440 నుంచి రూ.1,54,420కి చేరింది. 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.4,600 తగ్గింది. రూ.1,46,150 నుంచి రూ.1,41,550కి తగ్గింది. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.20,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి […]

ప్రపంచాన్ని మించే వృద్ధితో భారత్ దూసుకెళ్తుంది- ముకేశ్ అంబానీ

భారత్ నిరంతరంగా 8 నుంచి 10 శాతం ఆర్థిక వృద్ధిని సాధించగలదని అవసరమైతే డబుల్ డిజిట్ వృద్ధిని కూడా దీర్ఘకాలంలో నిలకడగా కొనసాగించే సామర్థ్యం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. దేశ దీర్ఘకాలిక ఆర్థిక భవిష్యత్తుపై ఆయన ఆశావహ దృక్పథాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన జియోబ్లాక్‌రాక్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. “భారత్ ప్రపంచాన్ని మించి వృద్ధి సాధిస్తుందని నేను భావిస్తున్నాను,” అని ఆయన అన్నారు.

భారత్‌క శుభవార్త చెప్పిన ట్రంప్‌- టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గిస్తున్నట్లు వెల్లడి!

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శుభవార్త చెప్పారు. భారత్​పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయని అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తరువాత ఆయన మేరకు ట్రూత్ సోషల్​లో పోస్టు పెట్టారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడిన ట్రంప్​, రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తుందని అన్నారు. అంతేకాదు అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ […]

30 వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్

కంపెనీల AI డేటా-సెంటర్ విస్తరణకు అమెరికా బ్యాంకులు నిధులు సమకూర్చడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో.. టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యూహాత్మక వ్యయ నిర్మాణాన్ని తిరిగి సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే తమ వర్క్ ఫోర్స్ నుంచి 20 వేల నుంచి 30 వేల వరకు తగ్గించడానికి రెడీ అయింది. ఉద్యోగాల కోత ద్వారా ఒరాకిల్‌కు సుమారు 8 బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు ప్రవాహం సేవ్ కావచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON