loader

అవి బీర్లా.. మంచి నీళ్లా.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..

తెలంగాణలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు దాదాపు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి. ఇది సాధారణ రోజుల కంటే రెట్టింపు. బీర్ల అమ్మకాలకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకమైనవి కావడంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా బీర్ల అమ్మకాలకు మరింత ఊతమిస్తున్నాయి. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత కనిపిస్తున్నారు. మ్యాచ్ చూస్తూ బీర్ తాగడానికి ఎక్కువ మంది […]

హైదరాబాద్‌లో జోరుగా కొత్త దందా.. వాట్సప్ గ్రూపులోనే మొత్తం యాపారం..

హైదరాబాద్ నగరంలో మరో కొత్త దందా ఊపందుకుంది. నగరంలో పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు సోదరులు ‘ఎస్ఐడీ’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు ఖాతాదారులుగా ఉన్న 13 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించగా.. ట్రాన్సాక్షన్ల ఆధారంగా 400 మందికి పైగా వినియోగదారులను గుర్తించే పనిలో పడ్డారు.

ఉద్యోగ భద్రత కల్పించండి

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్రవేశించి నిరసనలకు, సమ్మెకు అనుమతి లేదంటూ కాంట్రాక్ట్‌ అధ్యాపకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కేల్‌ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని అన్నారు.

10,500 కోట్లతో ఎఐ డేటా సెంటర్

జపాన్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రూ.11,062 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటీ డేటా, నెయిసాలు సంయుక్తంగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా, రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ రూ.562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ క్లస్టర్ ఏర్పా టు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం […]

జైకాను రుణ సాయం కోరిన సీఎం రేవంత్ రెడ్డి…

తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోరింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2 ప్రాజెక్ట్‌ కోసం జైకా నుంచి రూ. 11,693 కోట్ల రుణాన్ని కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. టోక్యోలోని జైకా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ […]

AI తో సినిమాలు…. కొత్త కంపెనీని ప్రారంభించిన దిల్ రాజు

ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు క్వాంటం AI గ్లోబల్‌తో చేతులు కలిపి కొత్త AI ప్రోడక్ట్ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి స్మార్ట్ టూల్స్ రూపొందించడంపై దృష్టి పెడుతుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సహాయం చేయడం, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, ప్రీ విజువలైజేష్, ఎడిటింగ్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సృజనాత్మక విధానంలో ప్రతి భాగానికి మద్దతు ఇవ్వడం దీని లక్ష్యం. కంపెనీ పేరు, ప్రోడక్ట్ లిస్టు, […]

థాంక్యూ ట్రంప్ .. హమ్మయ్యా ఆంధ్ర రొయ్యకు ఊపిరొచ్చింది..

ట్రంప్ దెబ్బకు అల్లాడిపోయిన రొయ్యల రైతులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాల అమలును వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు మళ్లీ ఊపిరి వచ్చింది. మొన్నటి వరకు  లిచిపోయిన రొయ్యల కంటైనర్లు మళ్లీ అమెరికాకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నాయి.. దీంతో గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నాయి. సుంకాల అమలుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో వాటిని అమెరికాకు ఎగుమతి చేయడానికి ద్ధమయ్యారు వ్యాపారులు. ఏపీ ప్రభుత్వం రొయ్యల ధరలపై ఏర్పాటు చేసిన ఆక్వా సలహా […]

ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్‌ రేటులో మూడు, డీజిల్‌ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ సమాధానాలు ఇచ్చింది.

9 కోట్ల మందికిపైగా ఐటీ రిటర్న్స్ దాఖలు..

ఆర్థిక సంవత్సరం 2024-25లో మార్చి 31 నాటికి భారతదేశంలో 9.19 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా రిటర్న్‌లు ఫైల్ కాగా, రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే అధిక సంఖ్యలో ఉన్నారు. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 3.24 లక్షల మంది కూడా రిటర్న్‌లు దాఖలు చేశారు.

ప్రముఖ కంపెనీ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్..

ప్రముఖ బేవరేజెస్ బ్రాండ్ కాంపా (Campa), తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను (Ram Charan) పేరును ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో, బ్రాండ్ ఒక ఉత్తేజకరమైన కొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తోందని రామ్ చరణ్‌తో కొలాబొరేట్ అవ్వడంతో కాంపా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాంపా బ్రాండ్ మార్చి 2023లో విజయవంతమైన అరంగేట్రంతో ప్రారంభమైంది. మార్కెట్‌లో అతి తక్కువ సమయంలోనే త్వరగా ఊపందుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON