loader

2 రూపాయలు విడుదల చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ జీవో

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యవేక్షిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ నుంచి గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఈ 2 రెండు రూపాయలకు సంబంధించిన జీవో విడుదల చేశారు. అదేంటి ఇంతకీ కేవలం 2 రూపాయలకే జీవో జారీ చేయడమేంటని అనుకుంటున్నారా..? పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి నిపుణుల సూచన మేరకు ఈ రెండు రూపాయల జీవో జారీ చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వివరణ […]

కార్బన్ ఉద్గారాలు భారత్‌ కంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువ: మోదీ

నేటి ఆధునిక వాతావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందిస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశంలో తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువగా ఉంది.అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కర్బన ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని దిల్లీలో జరిగిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో […]

హెలికాప్టర్ టూర్స్.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

CM చంద్రబాబు,DCM పవన్, మంత్రి లోకేశ్ పర్యటనల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం  చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. DCM పవన్, మంత్రి లోకేశ్ అధికారిక పర్యటనలకు APACL నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని  అధికారులు స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి APACLకు రూ.54.63 కోట్ల బడ్జెట్‌ కేటాయించగా… తొలి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.30.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ప్రభుత్వ […]

పదవీ విరమణ వయస్సు పెంపు.. ఏపీ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో ఇంటర్ బోర్డులో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో పారితోషికాన్ని 25 శాతం పెంచాలని బోర్డు నిర్ణయించింది. 1978 నుంచి ఇప్పటివరకు బోర్డు జారీ చేసిన అన్ని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి, వాటి భద్రత కోసం బ్లాక్‌చైన్ […]

ఐఫోన్ 18 ప్రో కోసం భారీ క్యూ.. సోనూ సూద్ రియాక్షన్ వైరల్..

ఆపిల్ స్టోర్ ముందు క్యూలో నిలబడి ఉన్న కస్టమర్ల ఫొటోను షేర్ చేస్తూ.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కొత్త ఫోన్, కొత్త EMI… కానీ పాత బిల్లులే! మన ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మెరుగుపరిచే దిశగా ప్రజలు ఇలాంటి ఉత్సాహాన్ని చూపిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. నిజమైన అప్‌గ్రేడ్ అంటే… మెరుగైన సమాజం కోసం అడుగు వేయడం!” అంటూ రాసుకొచ్చారు సోనూ సూద్.

అది డిజె మోత కాదు… చావు డప్పుల మోత

గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డిజె శబ్ధాలకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డిజె శబ్ధానికి గుండెలు ఆగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఇ తాండ్రపాడు గ్రామంలో శివమ్మ(36) డిజె శబ్ధానికి గుండె ఆగి చనిపోయింది. డోన్‌లో కూడా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న యువకుడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు డ్యాన్స్ చేయడంతో అలసిపోవడంతో పాటు శబ్ధానికి గుండె ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు

కిట్ ఆలస్యం.. ఆసియా క్రీడల్లో మారిన భారత ఫ్లాగ్‌బేరర్‌

ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా స్టార్ షూటర్ మనూ బాకర్‌తో పాటు ఎంపికైన షాట్‌పుట్ ఆటగాడు తజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో కబడ్డీ ప్లేయర్ పవన్ షెరావత్ వచ్చాడు. తూర్ అఫీషియల్ కిట్ ఇంకా అతడికి చేరలేదు. దీంతో భారత పతాకధారిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో భారత పతాకధారులుగా మనూతో కలిసి పవన్ పాల్గొననున్నాడని చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ మీడియాకు వెల్లడించారు.

అండమాన్ లో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు.

వైట్ హౌస్ నుండి ప్రముఖ మీడియా సంస్థలపై వేటు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి ప్రముఖ మీడియా సంస్థలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మీడియా సంస్థలను వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో నిజాయితీతో కూడిన వార్తలు ప్రసారం కావలసిన అవసరం ఉందని, ఈ సంస్థలు ఏకపక్షంగా, అబద్ధాలతో కూడిన వార్తలను ప్రసారం చేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. భవిష్యత్తులో మరికొన్ని ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సంస్థలపై కూడా నిషేధం విధిస్తామని ఆయన హెచ్చరించారు.

శంషాబాద్ వద్ద ఇన్నోవా ప్రమాదం: నలుగురు దుర్మరణం

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన మెట్టుగడ్డ తండా వాసులు తమ స్వగ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం  ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తిరిగి శంషాబాద్ వైపు ఇన్నోవాలో వెళ్తోండగా పాలమాకుల సమీపంలో కారు అదుపు తప్పింది. బోల్తా కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON